Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP worker was brutally Assassinated by TDP political faction
గూండారాజ్‌.. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

మాటలకందని మహా క్రౌర్యం.. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపుగూండాలు పేట్రేగిపోతున్నారు.. పల్నాడులో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాల బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ–ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పచ్చముఠాలకు సెల్యూట్‌ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతబట్టి కాలకేయుల్లా దాడులకు తెగబడుతున్నారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఏపీ ముఖచిత్రం... రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: తొలి ఏకాదశి పర్వదినం.. ఎటు చూసినా కోలాహలం.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం.. బందోబస్తు విధుల్లో వందల మంది పోలీసులు.. స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ.. బుధవారం రాత్రి 7.30 గంటల సమయం.. రాజకీయ కక్షలతో ఒక్కసారిగా పచ్చ ముఠాల ఉన్మాదం పురి విప్పింది! వినుకొండ నడిబొడ్డున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కొబ్బరిబొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. వందలాది మంది చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే ముండ్లమూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొబ్బరిబొండాల కత్తితో మాటు వేసి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ (27) రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్‌కె.జానీ తమ్ముడైన జిలానీ మరో ఇద్దరితో కలసి ముండ్లమూరు బస్టాండ్‌ సెంటర్‌లో మాటు వేశాడు. రషీద్‌ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్‌ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కిందపడిపోయిన రషీద్‌పై కూర్చుని విచక్షణా రహితంగా నరుకుతూనే ఉన్నాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. ఈ పాశవిక ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్‌ను పోలీసులు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్తెనపల్లిలో.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్‌ కాలనీలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీకీ చెందిన ఓ మహిళ కుటుంబంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఘటనలో గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఒక్కసారిగా మళ్లీ పల్నాడులో దాడులు మొదలు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా అయిపోలేదని, ఇంకా ఉందంటూ టీడీపీ నేతలు బరి తెగించి హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.కొత్త ఎస్పీ రాగానే మళ్లీ మొదలు..సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల రోజు దాడులు, విధ్వంసాలకు సంబంధించి అప్పటి ఎస్పీ బిందుమాధవ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది. ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వ హత్యలే: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ హత్య, సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ కార్యకర్తల దాడులను చూస్తుంటే జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే హింసకు తెగబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ హింసాకాండను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ సర్కారు హత్యలే. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహించాలి.నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వంరాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వినుకొండలో వైఎస్సార్‌సీపీ నేత రషీద్‌ హత్యే ఇందుకు నిదర్శనం. రషీద్‌ హత్యోదంతాన్ని సోషల్‌ మీడియాలో చూడలేకపోయాం. టీడీపీ నేతలు కిరాతకంగా చంపేశారు. రోజుకో దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా కత్తులతో దాడి చేసి రోడ్లపై చంపేస్తుంటే ప్రజలు రోడ్లపై ఎలా తిరుగుతారు. చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే ఈ హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. – అంజాద్‌ బాషా, మాజీ మంత్రిటీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి పల్నాడు జిల్లాలో టీడీపీ హత్యా రాజకీయాలనే నమ్ముకుంటోంది. పోలింగ్‌ రోజు, ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టార్గెట్‌ చేస్తు­న్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజ­కీయాలకు చోటుండకూడదు. వినుకొండ పట్టణ నడిబొడ్డున అతి కిరాతకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హత్య చేయడం అమానుషం. టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట.– అంబటి రాంబాబు, మాజీ మంత్రిచూస్తూ ఊరుకోంవినుకొండలో ప్రజలంతా తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చంపి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. టీడీపీ హత్యారాజకీయాలకు ఓ ముస్లిం యువకుడు బలైపోయాడు. దీనికి చంద్రబాబు, లోకేశ్, జీవీ ఆంజనేయులే కారణం. వారిపై కేసులు నమోదు చేయాలి. కొత్త ఎస్పీ రాగానే టీడీపీ రౌడీలు పేట్రేగిపోయారు. టీడీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోం.– బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యేశాంతి భద్రతలు లోపించాయిఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ పాలన అందించాం. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పల్నాడులో శాంతి భద్రతలు లోపించాయి. ఫలితాలొచ్చిన రోజే జిల్లాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన వేలాది కుటుంబాలు జిల్లాను వదిలి వెళ్లిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ హత్యారా­జకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్‌ పురుడుపోసుకొనేలా ఉంది. కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లాలో టీడీపీ రౌడీ మూకలను కట్టడి చేయాలి.– కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యేక్రూరంగా చంపేశారువైఎస్సార్‌సీపీ నాయకుడు రషీద్‌ను రెండు చేతులు నరికి క్రూరంగా చంపేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. లోకేశ్‌ రెడ్‌బుక్‌ ప్రకారం హత్యా రాజకీయాలు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న ఒక్కొక్కరిని హత్య చేస్తూ వస్తున్నారు. తన అనుంగు పోలీసు అధికారులకు కీలకమైన పోస్టింగ్‌లు ఇచ్చి వారి ఆధ్వర్యంలో రెడ్‌ బుక్‌ను అమలు చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు.– ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషా, మర్రి రాజశేఖర్‌కిరాతకం రాజ్యమేలుతోందికూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోంది. వినుకొండలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రషీద్‌ను టీడీపీ వ్యక్తులు ఎంత కిరా­తకంగా చంపారో యావత్‌ ప్రపంచం చూసింది. ఆటవికంగా రెండు చేతులు నరికి క్రూరంగా చంపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రెడ్‌బుక్‌కి సెల్యూట్‌ చేస్తున్నారు. రషీద్‌ హత్యోదంతానికి కారకులు చంద్రబాబు, లోకేశ్‌లే. ఎన్నికల తర్వాత పల్నాడులో ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి.– ఖాదర్‌బాషా, అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం

Sakshi Guest Column On BRICS countries Parliament
‘బ్రిక్స్‌’ పార్లమెంట్‌ రానున్నదా?

ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ బ్రిక్స్‌ పార్లమెంట్‌ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్‌ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్‌ బ్యాంక్‌ ఏర్పడింది. బ్రిక్స్‌ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్‌ డాలర్‌ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్‌ పార్లమెంట్‌ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్‌’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్‌’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్‌’ పార్లమెంట్‌ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్‌ పార్లమెంట్‌ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్‌’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్‌ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్‌’ అనే సంస్థ మొదట ‘బ్రిక్‌’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్‌ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్‌’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్‌’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్‌ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్‌ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్‌ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్‌ లక్ష్యాలే బ్రిక్స్‌ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్‌ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్‌ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్‌ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్‌ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్‌ అమెరికాలో సదరన్‌ కామన్‌ మార్కెట్‌ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్‌ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్‌ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్‌ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్‌ బ్యాంక్‌ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్‌ డాలర్‌ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్‌ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్‌ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్‌ చెయిన్‌ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్‌ డాలర్‌ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్‌ బ్రిడ్జ్‌ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్‌ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్‌ పార్లమెంట్‌ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్‌ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్‌ చెప్తున్నారు. టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Doubts over reduction in Loan waiver funds number of farmers getting exemption
మాఫీ ‘లెక్క’ మారిందా?

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్‌ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్‌ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. గత సర్కారు రుణమాఫీ లెక్కలతో.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్‌ఎస్‌ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్‌ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్‌ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్‌ నిబంధనలు, పాస్‌బుక్కులు, రేషన్‌కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్‌ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్‌కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రుణాల మొత్తం భారీగా పెరిగినా.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్‌ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది.

Rohit Sharma Prefer Suryakumar Yadav For Team India T20I Captaincy Says Reports
Team India Captaincy: రోహిత్‌ ఓటు సూర్యకే..?

రోహిత్‌ శర్మ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక టీమిండియా కెప్టెన్‌ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్‌ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్‌ తరుచూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్‌ అప్‌డేట్‌ అందింది. సూర్యకుమార్‌కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్‌కప్‌ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్‌ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్‌ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్‌.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది.

Joe Biden Says Kamala Harris Could Be President Of US
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్‌.. హింట్‌ ఇచ్చిన బైడెన్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్‌ తప్పుకోవాలనే డిమాండ్‌ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌.. అ‍ధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్స్‌(NAACP) అన్వాల్‌ కన్వేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. కమలా హారీస్‌ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్‌ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్‌ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్‌ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్‌ పార్టీకి భవిష్యత్‌ అని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్‌.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్‌ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓ‍డిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్‌ తేలిపోయాలి. దీంతో, బైడెన్‌ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్‌ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్‌ చేశారు. బైడెన్‌ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్‌ బెటర్‌ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్‌ఎన్‌ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్‌ వచ్చింది.

Bse mid and small cap index is up 30 percent this 2024-25 Year
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు

కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్‌ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్‌ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్‌ఈ ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్‌ పెయింట్స్‌ లాభం డౌన్‌ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్‌ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్‌ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్‌ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్‌ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్‌ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్‌ బిజినెస్‌ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్‌టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్‌ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్‌ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్‌ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్‌టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్‌టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సేవల సంస్థ మేక్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు రాజేష్‌ మగోవ్‌ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్‌ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్‌ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్‌ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ (వెస్టర్న్‌ ఇండియా) ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ శెట్టి పేర్కొన్నారు.బుల్‌ మార్కెట్‌ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ లిమిటెడ్‌ ఎండీ సునీల్‌ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు(పీఎంఎస్‌), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్‌) బుల్‌ ట్రెండ్‌లో మార్కెట్‌ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్‌ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్‌ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్‌ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్‌ క్యాప్స్‌ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్‌ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్‌ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్‌ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్‌ గూడ్స్‌ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అరి్వందర్‌ సింగ్‌ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్‌ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్‌ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్‌ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్‌ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్‌ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

HYLENR world first cold fusion technology to generate clean energy
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి

కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్‌!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్‌ ఫ్యూజన్‌ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ దొరై రాజన్‌! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్‌ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్‌’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్స్‌లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక‌్షన్స్‌ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్‌ బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్‌ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్‌! టి-హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్‌ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్‌ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్‌ ఫైష్‌మాన్‌, స్టాన్లీ పాన్స్‌ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్‌ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్‌ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్‌ ఇన్నొవేటింగ్‌ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్‌ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్‌ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక‌్షన్‌ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్‌ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్‌ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!!

 Never followed a diet syas Deepika Padukone
Deepika Padukone: డైట్‌ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు

‘‘డైట్‌’ అనే పదం చుట్టూ చాలా అ΄ోహలు ఉన్నాయని నాకనిపిస్తోంది. డైట్‌ అంటే కడుపు మాడ్చుకోవడం, తక్కువ తినడం, కష్టంగా నచ్చనవి తినడం అని మనందరం అనుకుంటాం. కానీ డైట్‌ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే ΄ానీయాలు. నిజానికి డైట్‌ అనే పదం గ్రీకు పదం ‘డైటా’ నుంచి వచ్చింది. డైటా అంటే జీవన విధానం అని అర్థం’’ అన్నారు దీపికా పదుకోన్‌. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా ఫలానా డైట్‌ని ఫాలో అవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రచారంలో ఉన్నవి నమ్మవద్దంటూ దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను బాగా తింటాను. కాబట్టి సరిగ్గా తిననని వస్తున్న వార్తలను నమ్మొద్దు. డైట్‌ అంటే క్రమం తప్పకుండా తినడం, మన శరీరాన్ని అర్థం చేసుకోవడం.. ఫాడ్‌ డైట్‌ (త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక)ని ఫాలో కాను. శుభ్రంగా తినడానికే ఇష్టపడతాను. నా డైట్‌లో ఇవి ఉన్నాయని ఆశ్చర్య΄ోతున్నారా?’’ అంటూ కేక్స్, సమోసా వంటి వాటి ఫొటోలను కూడా షేర్‌ చేశారు దీపికా పదుకోన్‌. ఇక సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ మధ్య దీపికా, ఆమె భర్త–హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Sanofi Investing Big In India Global Capacity Center
సనోఫీ హెల్త్‌కేర్‌ భారీ పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్‌ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మ్యాడలిన్‌ రోచ్‌ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

title
టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

title
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all