Top Stories
ప్రధాన వార్తలు
![YSRCP worker was brutally Assassinated by TDP political faction](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/Untitled-5_7.jpg.webp?itok=CX3t5gae)
గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
మాటలకందని మహా క్రౌర్యం.. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపుగూండాలు పేట్రేగిపోతున్నారు.. పల్నాడులో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాల బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న ‘రెడ్బుక్ రాజ్యాంగం’ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ–ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పచ్చముఠాలకు సెల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతబట్టి కాలకేయుల్లా దాడులకు తెగబడుతున్నారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఏపీ ముఖచిత్రం... రెడ్బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: తొలి ఏకాదశి పర్వదినం.. ఎటు చూసినా కోలాహలం.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం.. బందోబస్తు విధుల్లో వందల మంది పోలీసులు.. స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ.. బుధవారం రాత్రి 7.30 గంటల సమయం.. రాజకీయ కక్షలతో ఒక్కసారిగా పచ్చ ముఠాల ఉన్మాదం పురి విప్పింది! వినుకొండ నడిబొడ్డున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కొబ్బరిబొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. వందలాది మంది చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొబ్బరిబొండాల కత్తితో మాటు వేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ (27) రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కె.జానీ తమ్ముడైన జిలానీ మరో ఇద్దరితో కలసి ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో మాటు వేశాడు. రషీద్ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కిందపడిపోయిన రషీద్పై కూర్చుని విచక్షణా రహితంగా నరుకుతూనే ఉన్నాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. ఈ పాశవిక ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్ను పోలీసులు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్తెనపల్లిలో.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీకీ చెందిన ఓ మహిళ కుటుంబంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఘటనలో గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఒక్కసారిగా మళ్లీ పల్నాడులో దాడులు మొదలు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా అయిపోలేదని, ఇంకా ఉందంటూ టీడీపీ నేతలు బరి తెగించి హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.కొత్త ఎస్పీ రాగానే మళ్లీ మొదలు..సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల రోజు దాడులు, విధ్వంసాలకు సంబంధించి అప్పటి ఎస్పీ బిందుమాధవ్తో పాటు పలువురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది. ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వ హత్యలే: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ హత్య, సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ కార్యకర్తల దాడులను చూస్తుంటే జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే హింసకు తెగబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ హింసాకాండను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ సర్కారు హత్యలే. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలి.నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వంరాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వినుకొండలో వైఎస్సార్సీపీ నేత రషీద్ హత్యే ఇందుకు నిదర్శనం. రషీద్ హత్యోదంతాన్ని సోషల్ మీడియాలో చూడలేకపోయాం. టీడీపీ నేతలు కిరాతకంగా చంపేశారు. రోజుకో దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా కత్తులతో దాడి చేసి రోడ్లపై చంపేస్తుంటే ప్రజలు రోడ్లపై ఎలా తిరుగుతారు. చంద్రబాబు, లోకేశ్ ప్రోద్బలంతోనే ఈ హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. – అంజాద్ బాషా, మాజీ మంత్రిటీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి పల్నాడు జిల్లాలో టీడీపీ హత్యా రాజకీయాలనే నమ్ముకుంటోంది. పోలింగ్ రోజు, ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు చోటుండకూడదు. వినుకొండ పట్టణ నడిబొడ్డున అతి కిరాతకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్య చేయడం అమానుషం. టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట.– అంబటి రాంబాబు, మాజీ మంత్రిచూస్తూ ఊరుకోంవినుకొండలో ప్రజలంతా తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైఎస్సార్సీపీ కార్యకర్తను చంపి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. టీడీపీ హత్యారాజకీయాలకు ఓ ముస్లిం యువకుడు బలైపోయాడు. దీనికి చంద్రబాబు, లోకేశ్, జీవీ ఆంజనేయులే కారణం. వారిపై కేసులు నమోదు చేయాలి. కొత్త ఎస్పీ రాగానే టీడీపీ రౌడీలు పేట్రేగిపోయారు. టీడీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోం.– బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యేశాంతి భద్రతలు లోపించాయిఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ పాలన అందించాం. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పల్నాడులో శాంతి భద్రతలు లోపించాయి. ఫలితాలొచ్చిన రోజే జిల్లాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వేలాది కుటుంబాలు జిల్లాను వదిలి వెళ్లిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ హత్యారాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడుపోసుకొనేలా ఉంది. కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లాలో టీడీపీ రౌడీ మూకలను కట్టడి చేయాలి.– కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యేక్రూరంగా చంపేశారువైఎస్సార్సీపీ నాయకుడు రషీద్ను రెండు చేతులు నరికి క్రూరంగా చంపేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. లోకేశ్ రెడ్బుక్ ప్రకారం హత్యా రాజకీయాలు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. రెడ్బుక్లో పేర్లు ఉన్న ఒక్కొక్కరిని హత్య చేస్తూ వస్తున్నారు. తన అనుంగు పోలీసు అధికారులకు కీలకమైన పోస్టింగ్లు ఇచ్చి వారి ఆధ్వర్యంలో రెడ్ బుక్ను అమలు చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు.– ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మర్రి రాజశేఖర్కిరాతకం రాజ్యమేలుతోందికూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోంది. వినుకొండలో వైఎస్సార్సీపీ నాయకుడు రషీద్ను టీడీపీ వ్యక్తులు ఎంత కిరాతకంగా చంపారో యావత్ ప్రపంచం చూసింది. ఆటవికంగా రెండు చేతులు నరికి క్రూరంగా చంపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రెడ్బుక్కి సెల్యూట్ చేస్తున్నారు. రషీద్ హత్యోదంతానికి కారకులు చంద్రబాబు, లోకేశ్లే. ఎన్నికల తర్వాత పల్నాడులో ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి.– ఖాదర్బాషా, అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం
![Sakshi Guest Column On BRICS countries Parliament](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/RTSMUKBS.jpg.webp?itok=P-73UsQW)
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
![Doubts over reduction in Loan waiver funds number of farmers getting exemption](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/PRAJA-1.jpg.webp?itok=K8mLRWDx)
మాఫీ ‘లెక్క’ మారిందా?
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. గత సర్కారు రుణమాఫీ లెక్కలతో.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్ఎస్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్ నిబంధనలు, పాస్బుక్కులు, రేషన్కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్ కార్పొరేషన్ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రుణాల మొత్తం భారీగా పెరిగినా.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్ 9వ తేదీని కటాఫ్గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది.
![Rohit Sharma Prefer Suryakumar Yadav For Team India T20I Captaincy Says Reports](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/zxa.jpg.webp?itok=OcKE1i3J)
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందింది. సూర్యకుమార్కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.
![Joe Biden Says Kamala Harris Could Be President Of US](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Biden_0.jpg.webp?itok=2pHSnfC5)
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేల్లో కమలా హారీస్కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది.
![Bse mid and small cap index is up 30 percent this 2024-25 Year](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/BSE-BUILDING.jpg.webp?itok=oLr1lfAV)
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
![HYLENR world first cold fusion technology to generate clean energy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/HYLENR.jpg.webp?itok=VUZ_QqD8)
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!!
![Never followed a diet syas Deepika Padukone](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/deepika-pregnent.jpg.webp?itok=eB_vxBJ-)
Deepika Padukone: డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు
‘‘డైట్’ అనే పదం చుట్టూ చాలా అ΄ోహలు ఉన్నాయని నాకనిపిస్తోంది. డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం, తక్కువ తినడం, కష్టంగా నచ్చనవి తినడం అని మనందరం అనుకుంటాం. కానీ డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే ΄ానీయాలు. నిజానికి డైట్ అనే పదం గ్రీకు పదం ‘డైటా’ నుంచి వచ్చింది. డైటా అంటే జీవన విధానం అని అర్థం’’ అన్నారు దీపికా పదుకోన్. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా ఫలానా డైట్ని ఫాలో అవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రచారంలో ఉన్నవి నమ్మవద్దంటూ దీపికా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను బాగా తింటాను. కాబట్టి సరిగ్గా తిననని వస్తున్న వార్తలను నమ్మొద్దు. డైట్ అంటే క్రమం తప్పకుండా తినడం, మన శరీరాన్ని అర్థం చేసుకోవడం.. ఫాడ్ డైట్ (త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక)ని ఫాలో కాను. శుభ్రంగా తినడానికే ఇష్టపడతాను. నా డైట్లో ఇవి ఉన్నాయని ఆశ్చర్య΄ోతున్నారా?’’ అంటూ కేక్స్, సమోసా వంటి వాటి ఫొటోలను కూడా షేర్ చేశారు దీపికా పదుకోన్. ఇక సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ మధ్య దీపికా, ఆమె భర్త–హీరో రణ్వీర్ సింగ్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
![Sanofi Investing Big In India Global Capacity Center](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/SANOFI-HEALTHCARE.jpg.webp?itok=nR6wkj1D)
సనోఫీ హెల్త్కేర్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
సాక్షి కార్టూన్ 18-07-2024
సనోఫీ హెల్త్కేర్ భారీ పెట్టుబడులు
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
భవనమ్లో థ్రిల్
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
Deepika Padukone: డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు
varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
టీడీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ‘కుల’ కౌంటర్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
సర్దార్ 2 సెట్స్లో ప్రమాదం.. ఒకరి మృతి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
అజిత్ పవార్కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్కు టచ్లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
సాక్షి కార్టూన్ 18-07-2024
సనోఫీ హెల్త్కేర్ భారీ పెట్టుబడులు
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
భవనమ్లో థ్రిల్
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
Deepika Padukone: డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు
varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
టీడీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ‘కుల’ కౌంటర్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
సర్దార్ 2 సెట్స్లో ప్రమాదం.. ఒకరి మృతి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
అజిత్ పవార్కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్కు టచ్లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
సినిమా
![Thandel Team Celebrates Sai Pallavi Victory in Filmfare South Awards](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/sai-pallavi.jpg.webp?itok=7w7mG30E)
సాయిపల్లవికి తండేల్ టీమ్ సన్మానం.. ఎందుకో తెలుసా?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తండేల్ టీమ్ ఘనంగా సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతో కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సెట్లోని వారంతా ఆరు సింబల్స్ చూపించారు. అవును.. సాయిపల్లవికి ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. అందులో భాగంగానే తన విజయాలను ఇలా సెలబ్రేట్ చేశారు. ఎన్ని అవార్డులంటే?కాగా సాయిపల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ మూవీకి గానూ బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు గెలుచుకుంది. ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలకు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి మరోసారి సత్తా చాటింది. గార్గి, విరాటపర్వం (క్రిటిక్స్ విభాగంలో) చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుంది. వీటితో కలిపి సాయిపల్లవి అందుకున్న ఫిలింఫేర్ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా ఈ బ్యూటీ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసింది.తండేల్ సంగతులు..తండేల్ విషయానికి వస్తే.. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో చై, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Team #Thandel celebrated the twin wins of @Sai_Pallavi92 at the Filmfare Awards on the sets of the film ❤️🔥'Satya' from #Thandel will be another memorable role from the talented actor ✨#Dhullakotteyala 💥💥Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/4qdrMUtaqH— Geetha Arts (@GeethaArts) July 17, 2024 చదవండి: కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో
![Allu Arjun trimmed beard Fans worried about Pushpa 2 The Rule Release](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/4_3_0.jpg.webp?itok=ryb3gImC)
వెకేషన్లో ఐకాన్ స్టార్.. బన్నీ- సుకుమార్ మధ్య అసలేం జరుగుతోంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడింది. అయితే కొంత షూటింగ్ పెండింగ్లో ఉండడ, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణాంగానే పోస్ట్పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల చేస్తామని కొత్త తేదీని కూడా ప్రకటించారు.ఇదిలా ఉంటే టాలీవుడ్లో తాజాగా ఊహించని టాక్ నడుస్తోంది. పుష్ప-2 మిగిలిన షూటింగ్ షెడ్యూల్ విషయంలో బన్నీ, సుకుమార్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బన్నీ విదేశీ టూర్కు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అంతేకాకుండా బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నట్లుగా విమానంలో వెళ్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పంచుకున్నారు. కాగా..2020 నుంచి ఇప్పటివరకు తన గడ్డాన్ని అలాగే మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. దీంతో పుష్ప-2 మరోసారి వాయిదా పడనుందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ సైతం యూఎస్ వెకేషన్ నుంచి ఇంటికి తిరిగొచ్చారు. తాజాగా అల్లు అర్జున్ మరోసారి హాలీడే ట్రిప్కు వెళ్లడంతో మళ్లీ వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై బన్నీ టీం స్పందించింది. ఎలాంటి ఆందోళన వద్దని ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చింది. చిత్ర బృందం నుంచి అప్డేట్లు రాకపోవడం.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు అంటూ వస్తున్న రూమర్స్పై వివరణ ఇచ్చింది.క్లారిటీ ఇచ్చిన టీమ్..పుష్ప-2 విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అల్లు అర్జున్ టీమ్ వెల్లడించింది. ఆ వీడియో ఇటీవలే తీశారని.. గడ్డం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఆయనకు ఇప్పటికే పొడవాటి జుట్టు, గడ్డం ఉన్నాయని తెలిపారు. గడ్డాన్ని కొద్దిగా మాత్రమే ట్రిమ్ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. మరోసారి వాయిదా వేసే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. Beard Ravataniki 1 Month, Balance Shoot 1 Month+ Post Production, Promotions....😔 Haha Malli Postpone Haa 💔😭 @alluarjun#Pushpa2TheRule @PushpaMoviepic.twitter.com/n3ubZDrDxb— CD ™ (@CoolDude__18) July 16, 2024Ee beard tho manage cheyalera??? https://t.co/jekutiqf1C pic.twitter.com/30bkzEqnL4— Tony (@tonygaaaadu) July 16, 2024
![Priyadarshi Pulikonda Talk About Darling Movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/priyadarshi.jpg.webp?itok=rmJQAAvr)
ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్’ ఉంటుంది: ప్రియదర్శి
ఏడాదికి వందకు పైగా కామెడీ సినిమాలు వస్తే.. థియేటర్స్లో చూసి గుర్తు పెట్టుకునే సినిమాలు నాలుగైదు మించి ఉండవు. వాటిలో ఈ ఏడాది ‘డార్లింగ్’ కూడా ఉంటుంది. ఇందులో కావాల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు హీరో ప్రియదర్శి . ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్. ఆశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే... ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.→ డార్లింగ్ సినిమాలో విమన్ క్యారెక్టర్కి స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.→ నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.→ డైరెక్టర్ అశ్విన్ రామ్ని సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.→ డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేశాను. నేను కూడా డాన్స్ చేస్తానాని నాకే తెలియదు(నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది. → ఆగస్ట్ 15న నేను నటించిన 35 ‘చిన్న కథ కాదు’ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా ఉంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి.
![Actress Malobika Banerjee Apologizes To Hero Vijay Deverakonda](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Actress-Malobika.jpg.webp?itok=Rvc5Oal2)
విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
నా మాటలను వక్రీకరించారు. నా వ్యాఖ్యలను ఇష్టమొచ్చినట్లుగా మార్చేసి నెగెటివ్గా రాశారు. దాన్నే అందరూ నిజమని నమ్ముతున్నారు. ఇదంతాచూస్తుంటే నా బుర్ర వేడెక్కుతోంది అంటోంది బెంగాలీ నటి మలోబిక బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముందుగా హీరో విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.ఆయనకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పాను. దాన్ని మీడియాలో దారుణంగా చిత్రీకరించారు. హిందీ అంటేనే తనకు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని రాస్తున్నారు. నేనసలు అలా చెప్పనేలేదు. అయినా ఎంతో దారుణంగా ఇష్టమొచ్చినట్లుగా రాస్తున్నారు. దీనివల్ల మంచి మిత్రుడికి దూరమయ్యాను. నేను చాలా సరదాగా అన్న మాటలను సీరియస్గా రాశారు. అది చదివాక విజయ్ నాతో టచ్లోనే లేకుండా పోయాడు. నేనేదో సరదాగా అన్నానే తప్ప ఆయన్ను ఇరికించాలనో, తప్పు పట్టాలనో పనిగట్టుకు చెప్పలేదు' అని పేర్కొంది.కాగా మలోబిక దిల్బర్, ప్రెట్టీ గర్ల్ వంటి ప్రైవేట్ సాంగ్స్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. దానికంటే ముందు బెంగాలీ, ఒరియా భాషల్లో అనేక సినిమాలు చేసింది. బంగ్లా బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. విజయ్ దేవరకొండతో.. నీ వెనకాలే నడిచి అనే ప్రైవేట్ సాంగ్లో నటించింది. చదవండి: కుడి కాలు, చేయి ఫ్రాక్చర్.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్ పొలిశెట్టి
క్రీడలు
![Cricket Ireland Announced Their Squad For One Off Test Against Zimbabwe](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/afs.jpg.webp?itok=RTVEmtg2)
జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
స్వదేశంలో జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. 22 ఏళ్ల అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ గావిన్ హోయ్ జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. ఈ ఒక్క ఎంపిక మినహా మిగతా జట్టంతా ఊహించిన విధంగానే ఉంది. సొంతగడ్డపై ఐర్లాండ్కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడింది. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఈ నెల 25-29 మధ్యలో బెల్ఫాస్ట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం జింబాబ్వే జట్టును ఇదివరకే ప్రకటించారు. జింబాబ్వే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారథ్యం వహించనున్నాడు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్కు ఐర్లాండ్ జట్టు..ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గావిన్ హోయ్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, ఆండీ మెక్బ్రైన్, బారీ మెక్కార్తీ, జేమ్స్ మెక్కొల్లమ్, పిజె మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్జింబాబ్వే జట్టు..డియోన్ మైర్స్, జోనాథన్ క్యాంప్బెల్, ప్రిన్స్ మస్వౌర్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, రాయ్ కయా, బ్రియాన్ బెన్నెట్, జాయ్లార్డ్ గుంబీ, క్లైవ్ మదండే, టనకా చివంగ, టెండాయ్ చటారా, బ్లెస్సింగ్ ముజరబాని, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాయుచి
![Unluckiest Dismissal, Batter Gets Out As Ball Deflects Off Non-Striker's Body](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/w_0_0.jpg.webp?itok=GsJcAgj4)
'అన్ లక్కీ' బ్యాటర్.. పాపం ఎలా ఔటయ్యాడో చూడండి..!
ఓ బ్యాటర్ ఊహించని రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోని చూస్తే.. బ్యాటర్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా అని అనిపిస్తుంది. బౌండరీకి వెళ్లాల్సిన బంతి ఊహించని రీతిలో బౌలర్ చేతిలోకి వచ్చి పడటంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Unluckiest dismissal for a batter. 😄 pic.twitter.com/KosmygSPVX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2024యార్క్షైర్ సెకెండ్ ఎలెవెన్, సోమర్సెట్ సెకెండ్ ఎలెవెన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. యార్క్షైర్ బౌలర్ బెన్ క్లిఫ్ బౌలింగ్లో సోమర్సెట్ బ్యాటర్ నెడ్ లియోనార్డ్ స్ట్రయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న క్యాసే అల్డ్రిడ్జ్ భుజానికి తాకి బౌలర్ చేతుల్లో పడింది. బ్యాటర్ వంగి బంతిని బౌండరీకి మళ్లించే ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. యార్క్షైర్పై సోమర్సెట్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా,. ఛేదనలో చేతులెత్తేసిన యార్క్షైర్ 125 పరుగులకు ఆలౌటైంది.
![Eng Vs WI: James Anderson Returns To England Squad As Bowling Mentor](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/andeson2.jpg.webp?itok=nxFE-UUC)
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
![MLC 2024: Travis Head, Andries Gous, Jasdeep Singh Shines.. Washington Freedom Crush MI New York By 94 Runs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/CAS.jpg.webp?itok=SnZwag3e)
హెడ్ మెరుపులు.. 88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్లో) నిలిచింది.హెడ్, గౌస్, రచిన్ మెరుపులు..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (8), మ్యాక్స్వెల్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, కీరన్ పోలార్డ్ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టారు.88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. వాషింగ్టన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్దీప్ సింగ్ 3.. మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్వెల్ తలో 2.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో రొమారియో షెపర్డ్ (25), ట్రెంట్ బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బిజినెస్
![Gold and Silver Price Today 17 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/gold-.jpg.webp?itok=drOIZMKo)
బాబోయ్ బంగారం.. వామ్మో వెండి! కొత్త మార్కులకు ధరలు
దేశంలో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు బుధవారం (జూలై 17) భారీగా పెరిగాయి. మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ.75వేల మార్కును తాకింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర ఏకంగా రూ.900 ఎగిసింది. దీంతో రూ. 75,000లను తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.980 ఎగిసి రూ.68,750 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.68,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 పెరిగి రూ.75,150 వద్దకు ఎగిశాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.900 పెరిగి రూ.69,200 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 ఎగిసి రూ.75,490 లకు చేరుకుంది.ఎగిసిన వెండి ధరలుదేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలతో పాటు వెండి రేటు భారీగా ఎగిసింది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
![Reddit user from Bengalore shared a scary situation of Uber driver in a viral post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/uber01.jpg.webp?itok=izzRQ0Rk)
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్లు వేయడం, సడన్ యాక్సిలరేషన్తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
![Paytm gets SEBI warning over related party transactions with payment](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/665.jpg.webp?itok=mtWczI0A)
పేటీఎమ్కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది.
![GVK Power and Infrastructure Faces Insolvency Proceedings, Stock Hits 5% Lower Circuit](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/123_2.jpg.webp?itok=HDFBAbw5)
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆదేశం మొత్తం బకాయిలు రూ.15,576 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ చెల్లింపుల్లో విఫలమైనందున జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్)పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు ఇచి్చంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్పై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఫైలింగ్ ప్రకారం సతీష్ కుమార్ గుప్తాను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్గా (ఐఆర్పీ) ఎన్సీఎల్టీ నియమించింది. గ్యారెంటర్గా ఉన్నందుకే.. వాస్తవానికి ఈ రుణాన్ని దశాబ్దం క్రితం జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్ పొందింది,. దీనికి జీవీకేపీఐఎల్ గ్యారెంటర్గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2022లో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై దివాలా చర్యలకు ఆదేశిస్తూ జూలై 12న ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశాలు జారీచేస్తే, ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచి్చంది. 1.84 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ‘‘కార్పొరేట్ రుణగ్రహీత తన రుణ బాధ్యతలను అంగీకరించారు. 2018–19, 2019–20, 2020 –21 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలలో ఈ విషయాన్ని అంగీకరించారు. జూన్ 13, 2022 నాటికి రుణగ్రహీత 1.84 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మొత్తంలో 1.13 బిలియన్ డాలర్లు అసలు, 731.57 మిలియన్ డాలర్లు వడ్డీ, 1,44,000 డాలర్ల ఏజెన్సీ ఫీజు ఉన్నాయి’’(ఉత్తర్వు ప్రకారం రూ. 9,463 కోట్లు అసలు, రూ. 6,113 కోట్లు వడ్డీ, రూ. 1.23 కోట్ల ఏజెన్సీ ఫీజులు) అని ఎన్సీఎల్టీ ఉత్తర్వు పేర్కొన్నట్లు జీవీకేపీఐఎల్ తెలిపింది. మొదటి డిఫాల్ట్ 2017 ఫిబ్రవరి.. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది కే. వివేక్ రెడ్డి వాదనల ప్రకారం, మొదటి డిఫాల్ట్ ఫిబ్రవరి 2017లో సంభవించింది. అప్పటి నుంచి రుణ చెల్లింపులు జరగలేదు. జీవీకే కోల్ తీసుకున్న రుణానికి జీవీకేపీఎల్ బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కేసులో విచారణ జరిపిన లండన్ కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవీకే చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి చర్య అవుతుంది. ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకు రుణం ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకుగాను జీవీకే కోల్కు సెప్టెంబరు 2011లో ఐసీఐసీఐ బ్యాంక్ (దుబాయ్, బహ్రెయిన్, సింగపూర్ శాఖ లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రస్ అల్ ఖైమా), బ్యాంక్ ఆఫ్ ఇండియా (లండన్, సింగపూర్), కెనరా బ్యాంక్ (లండన్) రూ.8,356 కోట్ల టర్మ్ లోన్, అలాగే రూ.292 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ను మంజూరు చేశాయి. ఇతర బ్యాంకులు 367 కోట్ల రూపాయల అదనపు టర్మ్ లోన్లను మార్చి 2014లో మంజూరు చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 2,089 కోట్ల రూపాయలకు పెంచాయి.విచారణాంశాలు.. రుణ మంజూరు సమయంలో చేసుకున్న అవగాహనలను ఉల్లంఘిస్తూ, రుణదాత అనుమతి లేకుండానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో జీవీకే గ్రూప్ తన వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు మార్చి 2016లో ఐసీఐసీఐ బ్యాంక్ గుర్తించింది. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే తన వాటాను విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 2016లో లండన్ కోర్టులో బ్యాంకులు ఇంజక్షన్ దావా వేశాయి. రుణం చెల్లించని కారణంగా, ఫెసిలిటీ అగ్రిమెంట్–1 కింద రూ. 5,915 కోట్లు, ఫెసిలిటీ అగ్రిమెంట్–2 కింద రూ. 1,236 కోట్ల కోసం బ్యాంకులు లండన్ కోర్టులో క్లెయిమ్ పిటిషన్లు వేశాయి. అసలు, వడ్డీకి సంబంధించి రూ. 5,000 కోట్లను డిమాండ్ చేస్తూ 2020 నవంబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ తన కార్పొరేట్ గ్యారెంటీ అమలుకు చర్యలు తీసుకుంది. రుణ చెల్లింపుల్లో తన వైఫల్యాన్ని అంగీకరించిన జీవీకేపీఐఎల్, రుణ చెల్లింపులకు కట్టుబడి ఉన్నానని అప్పటి వరకూ చర్యను నిలుపుచేయాలని బ్యాంకర్లను కోరింది. ముంబై జీవీకే ఎయిర్పోర్ట్ కొనుగోలు విషయంలో అదానీ గ్రూప్తో ఒక పరిష్కారానికి వచి్చన తరువాత రుణ చెల్లింపులు జరుపుతామని హామీ ఇచి్చంది. అయితే రుణ చెల్లింపులకు చర్యలు కనిపించకపోవడంతో బకాయిల కోసం 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించింది.
ఫ్యామిలీ
![Whats Different About Food In Space](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/space.jpg.webp?itok=9C07t-Dq)
స్పేస్లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!
తినడం అనేది దృష్టి, వాసన, రుచి, వినికిడి స్పర్శతో కూడిన బహుళ-ఇంద్రియ అనుభవం. భూమిపై అద్భుతమైన రుచి కలిగిన ఆహారం కక్ష్యలోకి వెళ్లగానే టేస్ట్ మారిపోతుంది. వ్యోమగాములు తినేందుకు చాలా కష్టపడతారు. అక్కడ భోజనం బోరింగ్గా, టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందట. అంతేగాదు తరుచుగా చాలామంది వ్యోమగాములు అంతరిక్షంలో తినే ఆనందం పోతుందని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి వాసన,ఆహార అనుభవాన్ని అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన ఫలితాలు భవిష్యత్తులో స్పేస్ మెనూలను రూపొందించడంలో సహాయపడతాయట. ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్ష యాత్రికులు రుచిని భిన్నంగా ఎందుకు అనుభవిస్తారు అనేదానిపై అధ్యయనం చేయగా.. అందుకు కారణం గురత్వాకర్షణ లేకపోవడమని గుర్తించారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడంతో స్పేస్లో ఉండే వ్యోమగాములు శరీరంలోని ద్రవాలు పాదాల వైపుకి గాకుండా రివర్స్లో తల వైపుకి ఒత్తడిని చూపిస్తాయి. ఫలితంగా ముక్కు మూసుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అచ్చం జలుబు చేసినప్పుడు మనం ఎలా అయితే వాసనను కోల్పోతామో అలా ఉంటుంది మన పరిస్థితి. అందులోనూ అంతరిక్షం మన భూమ్మీద ఉండే పర్యావరణం మాదిరిగా ఉండదు, ఆహారం పట్ల అవగాహనను ఇవ్వగలిగేది కూడా కాదు. పైగా స్పేస్క్రాఫ్ట్ పరిమిత పరికరాలతో చుట్టుముట్టబడిన గాలి చొరబడిన కంటైనర్లో తినడం తదితర కారణాల వల్ల రుచిగా ఉండదని అంటున్నారు పరిశోధకులు. చెప్పాలంటే మనం ఇంటి వద్ద ప్రశాంతంగా అమ్మ వడ్డిస్తే హాయిగా తింటున్న దానికి..ఆఫీస్లో డెస్క్ వద్ద హడావిడిగా తిన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలానే ఇది కూడా అని వివరించారు పరిశోధకులు. అందుకోసం అని దాదాపు 54 మందికి భూమ్మీదే వీఆర్ సెటప్ ద్వారా అంతరిక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఆ స్పేస్ వాతారణంలో వివిధ సువాసనలను ఎలా గుర్తిస్తున్నారనేది గమనించారు. అంతరిక్షం లాంటి వాతావరణంలో నిర్దిష్ట సుగంధ సమ్మేళనాలు మాత్రమే విభిన్నంగా గుర్తించబడతాయని అధ్యయనంలో తేలింది. ప్రతిఒక్కరి అభి రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి వారందరి అనుభవాల ద్వారా రుచికరంగా భోజనాన్ని ఎలా అందించాలి, వారిని ఇష్టంగా ఎలా తినమని ప్రొత్సహించచ్చో తెలుస్తుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలు భూమిపై నివశించే వ్యక్తులకు, నర్సింగ్ హోమ్లో ఉండేవాళ్లకు, ఆర్మీలో ఉండేవాళ్లకు, జలాంతర్గామి సిబ్బందికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమయ్యింది. (చదవండి: అనంత్ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..)
![Deepika Padukone Reveals She Eats Well, Hates Fad Diet; Check Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/deepika%20padukone_dieplan.jpg.webp?itok=m7I_kmF6)
డైట్ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్ సీక్రెట్స్
తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాడ్ డైట్ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్నెస్ సీక్రెట్స్పై తన ఫ్యాన్స్తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్కు సంబంధించి పిక్స్ షేర్ చేసింది. తన బాలెన్స్డ్ డైట్ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్ కూడా పెట్టింది. ఇందులో డైట్ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్గా కనిపించింది. సెప్టెంబర్లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్ సింగ్ గతంలో ప్రకటించారు.
![Queen Of Box Office Deepika Padukone Pregnancy Glow Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Deepika-Padukone.jpg.webp?itok=d8LOGe36)
ప్రెగ్నెన్సీ గ్లో : పుట్టబోయే బిడ్డకోసం రోజులు లెక్కపెడుతున్న దీపికా (ఫొటోలు)
![Happy World Emoji Day check Some Amazing Facts About Emojis](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/World%20Emojiday_2024.jpg.webp?itok=NW24Rcxv)
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్లు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్. మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట.
ఫొటోలు
![Ashada Masam Devotees Huge Crowd To Durga Temple In Vijayawada Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Ashada%20Masam%20Devotees%20Huge%20Crowd%20To%20Durga%20Temple%20In%20Vijayawada%20Photos%20%2810%29.jpg.webp?itok=nrWrfGMx)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Ashada%20Masam%20Devotees%20Huge%20Crowd%20To%20Durga%20Temple%20In%20Vijayawada%20Photos%20%2810%29.jpg.webp?itok=nrWrfGMx)
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
![TV Actress Anjali daughter Chandamama birthday celebrations Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/TV%20Actress%20Anjali%20daughter%20Chandamama%20birthday%20celebrations%20Photos%20%2817%29.jpg.webp?itok=OGWG8Jmg)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/TV%20Actress%20Anjali%20daughter%20Chandamama%20birthday%20celebrations%20Photos%20%2817%29.jpg.webp?itok=OGWG8Jmg)
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
![Genelia Deshmukh New Latest Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Genelia%20Deshmukh%20New%20Latest%20Stunning%20Photos%20%2815%29.jpg.webp?itok=8WtSwuUD)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Genelia%20Deshmukh%20New%20Latest%20Stunning%20Photos%20%2815%29.jpg.webp?itok=8WtSwuUD)
Genelia Deshmukh: కొత్త ట్రెండ్స్ వద్దు క్లాసిక్ లుక్కే ముద్దు అంటున్న బ్యూటీ (ఫోటోలు)
![Royal Enfield Guerrilla 450 launched Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Royal%20Enfield%20Guerrilla%20450%20launched%20Photos%20%281%29.jpg.webp?itok=WXNfjT3Y)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Royal%20Enfield%20Guerrilla%20450%20launched%20Photos%20%281%29.jpg.webp?itok=WXNfjT3Y)
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
![Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Actress%20Rambha%20meets%20Thalapathy%20Vijay%20along%20with%20her%20family%20Phots%20%281%29.jpg.webp?itok=REj4kh12)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Actress%20Rambha%20meets%20Thalapathy%20Vijay%20along%20with%20her%20family%20Phots%20%281%29.jpg.webp?itok=REj4kh12)
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
International View all
![title](/sites/default/files/article_images/2024/07/18/trump_0.jpg)
Iran: ట్రంప్పై దాడిలో మా ప్రమేయం లేదు
టెహ్రాన్: అమెరికా ఎన్నికల ప్రచారంవేళ మాజీ దేశాధ్యక్షుడు డొ
![title](/sites/default/files/article_images/2024/07/17/Biden_0.jpg)
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుక
![title](/sites/default/files/article_images/2024/07/17/Dubai_Princess_Triple_Talaq.jpg)
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు.
![title](/sites/default/files/article_images/2024/07/17/Bangla_protests.jpg)
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ
![title](/sites/default/files/article_images/2024/07/17/World%20Emojiday_2024.jpg)
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు.
National View all
![title](/sites/default/files/article_images/2024/07/18/yogi.jpg)
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంత
![title](/sites/default/files/article_images/2024/07/18/rottela.jpg)
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే.
![title](/sites/default/files/article_images/2024/07/18/Sradhanjali-DSC_8022.jpg)
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి.
![title](/sites/default/files/article_images/2024/07/17/cm_0.jpg)
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ
![title](/sites/default/files/article_images/2024/07/17/heartattack2.jpg)
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్మీడియాలో వైర
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/16/YSR_75_Jayanthi.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
![title](/sites/default/files/article_images/2024/07/15/intel01.jpg)
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.
![title](/sites/default/files/article_images/2024/07/13/labour.jpg)
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి
![title](/sites/default/files/article_images/2024/07/13/Bonalu_London_News.jpg)
టాక్ ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా బోనాల వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర
![title](/sites/default/files/article_images/2024/07/11/ukkk.jpg)
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్
క్రైమ్
![Three Persons Died After Fell Into quarry Pond Suryapet athmakur](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Suryapet-athmakur.jpg.webp?itok=5M1C1Pz7)
విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![18 people remanded in drug case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/1455.jpg.webp?itok=ptKYpLh_)
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
మణికొండ: నైజీరియా నుంచి గోవా, ముంబై, ఢిల్లీల మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న 18 మంది సభ్యుల ముఠాను నార్సింగి, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్ఓటీ, మాదకద్రవ్యాల నిరోధక శాఖల పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. సోమవారం వారిని నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్, విశాల్నగర్ కాలనీలోని జెనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువ చేసే 199.10 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మంగళవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని వచి్చంది. అనంతరం నిందితులను రాజేంద్రనగర్లోని కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ సరఫరా దారులు వీరే... డ్రగ్స్ కేసులో ఏ1గా అనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ, ఏ2గా నిజాం కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న అజీజ్ నోహీమ్ అడేషోలా, ఏ3గా బెంగుళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, ఏ4గా బోరబండకు చెందిన సానబోయిన వరుణ్కుమార్, ఏ5గా ఈవెంట్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారని, వీరంతా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా, సినీహీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్సింగ్, ఫిల్మ్నగర్కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్కు చెందిన అని, గచి్చబౌలికి చెందిన యశ్వంత్ గాడె, జూబ్లీహిల్స్కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్కు చెందిన ప్రసాద్, ఫిల్మ్నగర్కు చెందిన హృతిక్కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ ధావన్, గచి్చ»ౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారని తెలిపారు. వీరి పేర్లను ఏ6 నుంచి ఏ18 వరకు కేసులో పొందుపరిచారు. వీరి నుంచి 10 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఓ పాస్పోర్టును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
![Atrocities against girls are increasing day by day](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/crime_2.jpg.webp?itok=bYCs3mMG)
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్పై పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్స్టేషన్కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
![Wildlife hunt for likes on insta](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/arrest.jpg.webp?itok=EAWFw9tl)
ఇన్స్టాలో లైక్ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్స్ట్రాగామ్లో లైక్ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్వో సందీప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు.
వీడియోలు
![Red Soil Dunes Illegal Mining In Bheemili](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/do_0.jpg.webp?itok=pk3-OyMV)
![Red Soil Dunes Illegal Mining In Bheemili](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/do_0.jpg.webp?itok=pk3-OyMV)
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.
![Janasena Activists Raise Questions Over SERP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/pw.jpg.webp?itok=ZtYtX7-b)
![Janasena Activists Raise Questions Over SERP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/pw.jpg.webp?itok=ZtYtX7-b)
పవన్ శాఖలో చీలిక.. !
![Peerla Panduga Celebrations 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/tan.jpg.webp?itok=l-SlLAKm)
![Peerla Panduga Celebrations 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/tan.jpg.webp?itok=l-SlLAKm)
త్యాగానికి ప్రతీక
![CM Revanth Reddy To Hold Key Meeting With TPCC Leaders At Praja Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/hg.jpg.webp?itok=AwwZkAkr)
![CM Revanth Reddy To Hold Key Meeting With TPCC Leaders At Praja Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/hg.jpg.webp?itok=AwwZkAkr)
కాసేపట్లో ప్రజా భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
![Nandyal SP Adhiraj Singh Rana Face to Face Over Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/po_3.jpg.webp?itok=xv0oBee4)
![Nandyal SP Adhiraj Singh Rana Face to Face Over Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/po_3.jpg.webp?itok=xv0oBee4)
ఆ దారుణంలో ముగ్గురి పిల్లల తల్లిదండ్రుల హస్తం..
![Public Reaction On Street Dogs Attack On Child Incident In Jawahar Nagar](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/st.jpg.webp?itok=OcONOGA7)
![Public Reaction On Street Dogs Attack On Child Incident In Jawahar Nagar](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/st.jpg.webp?itok=OcONOGA7)
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
![Tomato Price Reached 100 Per Kilo](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ta_0.jpg.webp?itok=sJsxy0xk)
![Tomato Price Reached 100 Per Kilo](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ta_0.jpg.webp?itok=sJsxy0xk)
సెంచరీ కొట్టిన టమాటా..
![Minister Ponnam Prabhakar about Rythu Runa Mafi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ru.jpg.webp?itok=2H3pXxEt)
![Minister Ponnam Prabhakar about Rythu Runa Mafi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ru.jpg.webp?itok=2H3pXxEt)
రేపటి నుంచి రైతు రుణ మాఫీ -మంత్రి పొన్నం
![Maharashtra Politics Four Top Leaders Resigned](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/mla.jpg.webp?itok=P5AP8eSN)
![Maharashtra Politics Four Top Leaders Resigned](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/mla.jpg.webp?itok=P5AP8eSN)
అజిత్ పవార్ NCPకి షాక్
![Harish Rao Fires on MLA Gudem Mahipal Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ha_0.jpg.webp?itok=YFes7fMC)
![Harish Rao Fires on MLA Gudem Mahipal Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ha_0.jpg.webp?itok=YFes7fMC)
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్