![Lok Nayak Foundation Award Ceremony On The 18th - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/01/17/Lok-Nayak.jpg.webp?itok=hySbhCzl)
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 18న లోక్నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డుకు దూపాటి విజయ్కుమార్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, అధ్యక్షులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అత్మీయ అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ప్రముఖ సినీనటుడు మోహన్బాబు హాజరవుతారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.