-
తనికెళ్ల భరణికి లోక్నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్లను కూడా సత్కరించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు. -
తనికెళ్ల భరణికి ‘లోక్నాయక్’ పురస్కారం
ఏయూ క్యాంపస్: లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కళాభారతిలో లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలో తనికెళ్ల భరణికి పురస్కారం, రూ.2లక్షలు నగదు బహుమతి అందిస్తామని వివరించారు. తెలుగు సంస్కృతి, భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు 18 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తుది వరకు వెన్నంటి ఉన్న వ్యక్తులను కూడా గౌరవిస్తూ సన్మానిస్తామని చెప్పారు. ఎన్టీఆర్కు ప్రత్యేక అధికారిగా పనిచేసిన జి.రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, కారు డ్రైవర్ లక్ష్మణ్ను సన్మానించి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సినీనటుడు మోహన్బాబు, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ, విజ్ఞాన్ విద్యా సంస్థల కార్యదర్శి లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు హాజరవుతారని తెలిపారు. -
18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 18న లోక్నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డుకు దూపాటి విజయ్కుమార్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, అధ్యక్షులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అత్మీయ అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ప్రముఖ సినీనటుడు మోహన్బాబు హాజరవుతారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. -
కవిత చెలికాడు.. పాట విలుకాడు
విశ్లేషణ ‘‘వెంకన్న పాటను వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవించడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు. రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు. అక్షరాల కూర్పు అకారణంగా జరగదు. ఒక లక్ష్యం అంగాంగాన్ని విహంగం చేసి నప్పుడే అది సాధ్యమవుతుంది. ఉత్సాహం కళని తోడువేసుకుని మనిషిని ఉరకలేయి స్తుంది. అప్పుడు నిజమైన ఉద్యమం ఊపిరై శ్వాసిస్తుంది. నేడు అదే ధ్యాసలో నిమగ్నమై జీవిస్తున్నవాడు ప్రజాకవి ‘గోరటి వెంకన్న’. ప్రకృతి, పల్లె జీవితంలోని స్థితిగతుల్ని, మార్పుల్ని, వైరుధ్యాల్ని పాటల్లో చెబు తున్నాడు. తెలుగుపల్లె ప్రజల జీవనగాధలను తన సైద్ధాంతిక భూమిక మీద నిటారుగా నిలబడి ఆలపిస్తున్నాడు. ఈ ఆలాపన కూనిరాగం కాదు. ఒక మహోన్నత గర్జన. అతడే పాటకు పదనిసలు నేర్పించినట్టుంది. గజ్జెకు కాళ్ళను కట్టించినట్టు కనిపిస్తుంది. మహా కవి శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యశక్తితో ‘పల్లె కన్నీరు’ మీద పాట కట్టి జనసంతకం చేయించినట్టుంటుంది. అందుకే ‘కుబుసం’ దర్శకుడు ఎల్.శ్రీనా«ద్ వెంకన్న పాట కోసమే సినిమా తీశానన్నాడు. ‘‘వాడు మట్టికి మాటలు నేర్పిన వాగ్గేయకారుడు’’ అన్నారు జూలూరి గౌరీ శంకర్. ఏ కాలానికి చెందిన పదజాలాన్ని ఆ కాలం పాటలో అమరు స్తున్నాడు ఆయన. గల్లీని సిన్నది చేసి గరీబోల్ల కధను పెద్దది చేసి దీనజన పక్షం వహించాడు. అందుకే వర్తమానాన్ని నర్తింపజేసే ఆట గాడయ్యాడు వెంకన్న. అందుకే ‘‘వెంకన్న పాటలో పల్లె అందాలే కాదు. ప్రపంచ రాజకీయాలూ పలుకుతాయి’’ అంటారు ఓల్గా. బైరాగి ఆలాపన, తాత్వికుని తలంపులు, వాగ్గేయకారుల ఆగ్రహం వెంకన్న పల్లవిలో అమరిపోయి, చరణాలై చిందేస్తున్నాయి. నేడు అభినందనల పల్లకిలో ఊరేగుతున్నాయి. అనేక అవార్డులను అక్కున చేర్చుకొని సాఫల్య పురస్కారాలను సరసన చేర్చుకున్న వెంకన్నను నేడు ‘లోక్ నాయక్ పౌండేషన్’ పురస్కారం వరించింది. పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షు లుగా నిర్వహిస్తున్న ఈ సంస్ధ రెండు దశాబ్దాలుగా సాహితీ ప్రముఖు లకు ఘనసత్కారాలను అందిస్తూ వస్తోంది. ఆచార్య వైఎల్పి ‘సత్తా’ ఉంటే తప్ప ‘సానుభూతి’తో ఎవర్నీ గుర్తించరు. అందుకే ఆయన ఈ పురస్కారాన్ని తెలుగు జ్ఞానపీuŠ‡ అవార్డుగా ఖ్యాతికెక్కించగలిగారు. అలాంటి సత్కారమే నేడు వెంకన్నకు దక్కింది. సాహిత్యప్రక్రియల్లో కీలకస్థానాన్ని ఆక్రమించుకున్న ‘పాట’కు పాఠకుడు, శ్రోత, ప్రేక్షకుడు ముగ్గురు మిత్రులయితే .. పాటను పాడుతూ .. ఆడుతూ.. జనచైతన్యాన్ని సాధించిన గోరటి వెంకన్నకు మాత్రం లోకమంతా అభిమానులే అయ్యారు. ‘గోరటి’ పాటను సామాన్యులు విని, వీక్షించి ఆనందిస్తారు. పాలకులు తెలుసుకొని ఆలోచిస్తారు. ఉద్యమకారులు కెరటాలై కదంతొక్కుతూ ఉప్పొంగే తరంగాలవుతారు. అందుకే.. ‘‘వెంకన్న పాటను, వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవిం చడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు. రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు. వామపక్షం నుంచి దళితతత్త్వం వైపు పయనం సాగించాడు. అక్కడితో ఆగలేదు. ప్రపంచీకరణ పర్యవసానాల మీద గేయ చిత్రాలు గొంతెత్తి గీశాడు. ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘అలచంద్రవంక’, ‘పూసిన పువ్వు’ మెుదలైన ప్రచురణలను పాఠకలోకానికి అందించాడు. కొన్ని ఆల్బమ్లు వచ్చాయి. ఇప్పటికే ప్రజల సినిమాలకు పాటలు రాశాడు. తెలిసినవారి కోసం తెరకెక్కాడు. నచ్చిన సినిమాకు నృత్యం చేశాడు. గోరటి వెంకన్న కవిత్వంలో... దోపిడీకి గురవుతున్న జనం ఆవేదనల్నీ, ఆత్మ స్థైర్యాల్నీ, అనుభూతుల్నీ, ఆవేశాల్నీ, ఆగ్రహాల్నీ, ఆనం దాల్నీ ఆయా దేశాల జానపదపాటలతో పోల్చి చూడాలని, ఆపై అతని ప్రతిభకి అక్షరరూపం ఇవ్వాలనే శివారెడ్డి వాఖ్య సమర్థనీయం. నాజర్, సుద్దాల హనుమంతు, గద్దర్, వంగపండు మెుదలయిన ప్రజావాగ్గేయకారులు జనజీవనానుభవాల్నీ వ్యక్తీకరించారు. వెంక న్నది అదే దారి అయినా కొన్ని ప్రత్యేక ఆకర్షణలను సాధించారు. సాంప్రదాయ భక్తి కవుల్లో, కీర్తన పదకవుల్లోని, శతక కవుల్లో గల ధిక్కారం, అవహేళన, అపహాస్యం వెంకన్న కవితలోనూ, గేయం లోనూ వున్నాయి. అంతకు మించి సాంçస్కృతికాంశాలు, ప్రకృతి పరమైన అంశాల మీద శ్రద్ధ కనబరిచారు. ఖాదర్ మెుహియుద్దీన్ మాటల్లో .. ‘‘గోరటి వెంకన్న కవిత్వం కేవలం మానవ కేంద్రం కాదు. ప్రధానంగా అది ప్రకృతి కేంద్రకం. మనిషి అశాశ్వతం, ప్రకృతి శాశ్వతం.’’ అందుకే వెంకన్న సాహిత్యంలో గ్రామీణ జనజీవన సౌందర్యం తేలియాడుతుంది. అందుకే గోరటి వెంకన్నను పర్యావ రణ జ్ఞానకవిగా వాస్తవీకరించారు విమర్శకుడు సీతారాం. ‘‘ఈ సమస్త ప్రకృతిని పర్యావరణ పరిరక్షణ కోణం నుంచి కాపాడేందుకు ఊగుతూ, ఊరేగుతూ, పాడుతూ, ఆడుతూ, ఎగురుతూ రంజింప జేస్తున్నాడు.’’అన్నారు. అందుకే యాకూబ్ కవి ‘‘వెంకన్న జీవించిన కాలంలో నేను కూడా జీవిస్తుండటం నేను చేసుకున్న గొప్ప అదృష్టం’’ అంటాడు. ‘‘వెంకన్న çహృదయ కవితానేత్రం దృష్టిలో పడని వస్తువులేదు..అతని గొంతులో పలికేSజీర లక్షలాది ప్రజల కన్నీటిధారలా అనిపిస్తుంది’’ అన్నారు సుద్దాల అశోక్తేజ. వెంకన్న అక్షరాలు తూనీగల మేల్కొలుపులా ఉంటాయి. అతనికి పాట పూనకం, కవిత కలవరం, గేయమే అతని విజయం. తొలి సారిగా సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ ‘ననుగన్న నా తల్లి రాయలసీమ’ పాట సీమ ప్రజలను ఆకట్టుకున్న సంఘటన నన్నెంతో ఉత్తేజపరిచింది. సినిమా రంగం వెంకన్న పాట లను ఎంతగానో ఉపయోగించుకోవలసి ఉంది అన్నారు. గోరటి వెంకన్న ఆంధ్రనాట ‘అన్నపూర్ణమ్మ’నూ కీర్తించారు. గోదావరిని స్తుతించడమంటే అన్నపూర్ణమ్మను గుర్తు చేసుకోవడ మేనని భావించారు. ఆపై వానమ్మను కృష్ణమ్మ ఒడికి చేర్చాడు. ఇదే సందర్భంలో మూసీ నది దుస్థితిని పాలకులకు గుర్తు చేయటాన్ని తాను మర్చిపోనేలేదు. విశ్వరమణీయాల వింత జలచక్రం జీవితం అనే అతని ఆకాంక్షకు... పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయవలసిందే.(నేడు లోక్నాయక్ పౌండేషన్ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు ప్రదానం చేస్తున్న సందర్భంగా...) డాక్టర్ జీకేడీ ప్రసాద్ యూజీసీ పోస్ట్ డాక్టరల్ ఫెలో, జర్నలిజం విభాగం, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ‘ 93931 11740
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement