హైదరాబాద్: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రైల్వే కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణంగా ప్యాసింజర్ రైలు ఆగిపోయింది. రైల్వే స్టేషన్లో చేయి తగిలిందనే కారణంగా హనుమంతు అనే కానిస్టేబుల్ ఓ ప్రయాణికుడిని చితకబాదాడు. కానిస్టేబుల్ దురుసుతనంపై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో మాచర్ల ప్యాసింజర్ స్టేషన్లో ఆగిపోయింది.