stop
-
కన్ఫర్మ్ కాని టికెట్తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్తో రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్లోని కౌంటర్కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్తో రిజర్వ్ డ్ కోచ్లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
తాజ్ మహల్ను తేజో మహల్ అంటూ కావడియాత్రకు మహిళ
‘అది తాజ్ మహల్ కాదు.. తేజో మహల్.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్మహల్ దగ్గరకు చేరుకుని నానా హంగామా చేసింది.తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన జనం ఆ మహిళను చూసేందుకు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను తాజ్ మహల్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది.ఈ ఘటన నేటి ఉదయం(సోమవారం) ఉదయం తాజ్ మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు మీనా రాథోడ్. ఆమె.. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని మీడియాకు తెలిపింది. ఆ మహిళ తన భుజాలపై కావడి పెట్టుకుని తాజ్మహల్ చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు తాజ్లోనికి కావడి తీసుకువెళ్లకూడదంటూ అడ్డుకున్నారు.అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది. రెండు రోజుల క్రితం భోలేనాథుడు తనకు కలలో కనిపించాడని, తేజోమహల్ ఒక దేవాలయం అని, అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. అమె తాజ్మహల్ లోనికి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు.. సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె మరో మార్గంలేక కావడితో సహా ఇంటిదారి పట్టింది. -
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
సాక్షి,హైదరాబాద్: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. -
నేటితో ప్రచారం సమాప్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రలోభాలపై దృష్టి పోలింగ్కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి. -
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్లో 43 శాతం, డీజిల్లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్ను హెచ్పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్పీసీఎల్వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
‘కృత్రిమ మేథ’తో రసాయన దాడులు? ‘ఛాలెంజ్’ స్వీకరించిన ‘ఓపెన్ ఏఐ’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది. అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది. కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది. ఇది కూడా చదవండి: ఖతార్లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు? -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు..
ఢిల్లీ: హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీతో సహా చుట్టపక్కల రాష్ట్రాల్లో దాదాపు 30 వరకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే ఉన్న అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ర్యాలీలకు అనుమతించవద్దంటూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అదనపు బలగాలను మోహరించాలని నోటీసుల్లో పేర్కొంది. ర్యాలీలపై పిటీషన్ దాఖలు.. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్లు ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నుహ్, గుర్గ్రామ్లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ నిలిపివేసింది. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
జడ్జిగారూ.. వందే భారత్ ఆగేలా ఆదేశించండి
ఢిల్లీ: భారత సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ గురించి దేశంలో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒకదాని తర్వాత మరో సర్వీస్ పట్టాలెక్కుతుండడంతో.. ఇతర రైళ్లపైనా ఈ ప్రభావం పడుతోంది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో వందేభారత్ గురించి ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. వందేభారత్ రైలును తమ ఊరి స్టేషన్లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఓ యువ లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో పిటిషనర్ పీటీ షీజీష్ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పిటిషనర్కు బెంచ్ సూచించింది. ఇక పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వందేభారత్ రైలు.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్కు మాత్రం వందేభారత్ స్టాప్ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్ రైల్వేస్టేషన్లో వందేభారత్కు స్టాప్ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్ షోర్నూర్కు స్టాప్ మంజూరు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు పిటిషనర్. అయితే.. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్పై స్టాప్లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్లు ఏర్పాటు చేస్తే, ఎక్స్ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. -
రద్దయిన పలు రైళ్లు .. ప్రయాణికుల తిప్పలు
-
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
నన్నెవరూ ఆపలేరు.. ‘సత్యమేవ జయతే’ రోడ్డు షోలో రాహుల్..
తిరువనంతపురం: భయభ్రాంతులకు గురి చేసినా, ఎంపీ పదవి నుంచి తొలగించినా వయనాడ్ లోక్సభ స్థానం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తననెవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. కల్పెట్టాలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్డు షో నిర్వహించారు. తనను జైలులో పెట్టినప్పటికీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానన్నారు. 'నాపైకి పోలీసులను పంపిస్తే, నా ఇంటిని లాక్కుంటే భయపడే ప్రసక్తే లేదు. అదానీ గురించి, ఆయనతో ప్రధాని మోదీకి సంబంధాల గురించి నా ప్రశ్నలను తట్టుకోలేకే లోక్సభ నుంచి పంపించారు' అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్పై బీజేపీ ప్రభుత్వం క్రూరంగా మాటల దాడికి పాల్పడిందని ఆయన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అబద్ధాలు చెప్పేవారికి, దు్రష్పచారం చేసేవారికి నిజాలు చేదుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చదవండి: 300 పైగా సీట్లతో బీజేపీ గెలుపు.. మోదీనే మూడోసారి ప్రధాని: అమిత్ షా -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లో హర్దోయ్లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. ►ఎయిర్పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్పోర్టుకు నడిపే క్యాబ్లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ►ఎయిర్పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచాలి.. ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు.. డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె -
తప్పుడు ప్రకటనలపై గూగుల్ కీలక నిర్ణయం
లండన్: వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను తమ ప్లాట్ఫామ్పై ప్రోత్సహించకూడదని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ నిర్ణయించింది. తన ప్లాట్ఫామ్స్పై శీతోష్ణస్థితి మార్పుపై తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించడం, అలాంటి సమాచారాన్ని ఇతరులు ఆర్జనకు ఉపయోగించుకోకుండా నిలిపివేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్కు చెందిన యూట్యూబ్కు కూడా తాజా నిర్ణయం వర్తింస్తుందని కంపెనీ వెల్లడించింది. శాస్త్రీయాధా రితం కాని శీతోష్ణస్థితి మార్పు సమాచారాన్ని ఇతర ప్రకటనకర్తలు తమ ప్రకటనల పక్కన కనిపించాలని కోరుకోరని తెలిపింది. శీతోష్ణస్థితి మార్పు అనేది లేదని చెపుతూ సొమ్ము చేసుకునే వీడియోలను యూట్యూబ్లో ఉంచమని పేర్కొంది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పు లేదా గ్రీన్హౌస్ వాయువుల వల్ల ప్రమాదం అనేవి నిజాలు కావని కొందరు ప్రచారం ఆరంభించిన సంగతి తెలిసిందే! వీరు తమ వాదనలకు అనుకూలంగా వీడియోలను, ప్రకటనలను రూపొందిస్తున్నారు. ఇలాంటివాటిని నిరోధిం చాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్ టూల్స్ను ఉపయో గించనుంది. పర్యావరణ హితకారులైన కొన్ని విధానాలను ఇటీవల గూగుల్ ప్రవేశపెట్టింది. అయితే తాజా మార్పులను కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక సమాచారం సరైనదా? కాదా? ఎలా గూగుల్ నిర్ణయిస్తుందని వాతావరణ పరిశోధకురాలు లీసా షిప్పర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కంపెనీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు. -
బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..!
ప్రముఖ అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్లో తన ఉత్పత్తి నిలిపివేస్తు కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలు క్రితం 2017లో జనరల్మోటార్స్ కూడా భారత్ను వీడింది. పలు విదేశీ కంపెనీలు తట్టబుట్టా సర్దుకుని భారత్ను వీడుతున్నాయి. ఒక్కసారిగా భారత్ను వీడటంతో ఆయా కంపెనీల డీలర్లపై భారీ ప్రభావం పడనుంది. అంతేకాకుండా కంపెనీల ఉద్యోగుల జీవితాలు ఆగమ్యాగోచరం కానుంది.. హ్యూందాయ్ మినహా మిగిలిన విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు భారత్ ఆటోమొబైల్ రంగంలో కేవలం ఆరుశాతం వాటాను మాత్రమే కల్గిఉన్నాయి. భారత మార్కెట్లో ఫోర్డ్ 2 శాతం కంటే తక్కువ , ఫోక్స్వ్యాగన్ ఒక శాతం మేర మాత్రమే వాటాలను కల్గి ఉంది. ప్రపంచమార్కెట్లో అత్యంత విజయంతమైన టయోటా కూడా భారత్లో కేవలం 3 శాతం వాటానే కల్గి ఉంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం పన్నుల భారమే కారణమా..! అధిక పన్నుల భారం వలనే పలు విదేశీ కంపెనీలు భారత్ నుంచి బయటకు వెళ్తున్నట్లు బిజినెస్ స్టాండర్ట్ లిమిటెడ్ చైర్మన్ టీఎన్ టీనన్ అభిప్రాయపడ్డారు. టయోటా గతంలో భారీ పన్నుల భారం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టయోటా భారత మార్కెట్ల నుంచి ఎటియోస్, కరోలా ఆల్టిస్ మోడళ్లను నిలిపివేసింది. విదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలు భారత మార్కెట్లో సుస్థిర స్థానాలను నిలుపుకోవడానికి ఎంతగా ప్రయత్నించిన పలు కంపెనీలు నిలవలేకపోయాయి. కొద్ది రోజుల ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్లోకి వచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలను విన్నవించిన విషయం తెలిసిందే. విదేశీ కార్లపై ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్వ్యాగన్ కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. విదేశీ కంపెనీల కార్లపై ప్రభుత్వం సుమారు 100 శాతం మేర ట్యాక్స్లను వసూలు చేస్తోంది. భారత్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యం..! భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలుదారులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో నడిచే తక్కువ ధర కలిగిన కార్లపై ఎక్కువ మోజు చూపుతారు. తక్కువ ఖర్చుతో వచ్చే వాహనాలు విదేశీ కంపెనీల దగ్గర సరిపోయే మోడల్స్ లేవు. భారత మార్కెట్లో మారుతి, హ్యుందాయ్ మాత్రమే విజయవంతమైన ప్రవేశ-స్థాయి కార్ మోడళ్లను కలిగి ఉన్నాయి. ఫోర్డ్, టయోటా , ఫోక్స్వ్యాగన్, వంటి కంపెనీల నుంచి భారత్లో అత్యధికంగా అమ్ముడైన మారుతి ఆల్టోతో పోటీ పడే కార్లు ఆయా విదేశీ ఆటోమొబైల్ కంపెనీల వద్ద లేవు. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ మార్కెట్లో రూ.3 లక్షల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇంతా తక్కువ ఖర్చులో భారత వాహన ప్రియులకు తయారుచేయడం బడాబడా కంపెనీలకు అంతగా తెలియదు. హ్యూందాయ్ లాంటి కంపెనీలు భారత ప్రజలకు తగ్గట్టుగా బహిరంగ మార్కెట్లోకి వాహనాలను తీసుకురావడంతో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటుంది. వాహన కొనుగోలు దారుల కొనుగోలు స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు మారుతి 800సీసీ కారు నుంచి రూ. 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. హ్యుందాయ్ నుంచి ఐ20, సుజుకి నుంచి స్విఫ్ట్ బాలెనో, టాటా మోటార్స్ కు చెందిన టియాగో, ఆల్ట్రోజ్ వంటి కార్లపై ఎక్కువగా ఆదరణను పొందాయి. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
నేటి నుంచి ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల జారీ బంద్..!
ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్కార్డ్ నేటి నుంచి కొత్త డెబిట్/క్రెడిట్ కార్డులను జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్కార్డ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్బీఐ పేర్కొంది. మాస్టర్కార్డ్ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్ కార్డ్ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్గా మాస్టర్కార్డ్ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్ విషయంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ భారత్లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్కార్డు డెబిట్/ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
-
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు. అడ్డుకోవడం దారుణం... పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు. -
తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అంబులెన్స్లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. పంచలింగాల టోల్గేట్ వద్ద.. కర్నూలు: పంచలింగాల టోల్గేట్ తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ అంబులెన్స్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబులెన్స్ అపివేయటంతో చికిత్స అందక ఒకరు మృతి చెందారు. ఆర్టీఏ బోర్డర్ వద్ద మరికొన్ని అంబులెన్స్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులతో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడారు. అంబులెన్స్లను పంపించేందుకు అధికారులతో కూడా ఎమ్మెల్యే చర్చలు జరిపారు. దీంతో అంబులెన్స్ను అనుమతించారు. కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. చదవండి: ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి లాక్డౌన్: సరిహద్దులు దిగ్బంధం.. -
274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 3,328 పంచాయతీల్లో రేపు (ఈ నెల 13న), మూడో విడతలో 3,221 పంచాయతీల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఈనెల 21న నిర్వహించే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయనివి 274 పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడంలేదు. నోటిఫికేషన్ జారీ అయినా జరగనివి మరికొన్ని ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్ జారీచేసినా సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీల్లోను మూడుచోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్శాఖ అధికారులు తెలిపారు. మూడో విడత ఉపసంహరణకు, నాలుగో విడత నామినేషన్ల దాఖలుకు నేడు గడువు మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
12 ఏళ్లలో మొదటిసారి...
నిఫ్టీ, సెన్సెక్స్లు 10 శాతం లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకడంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఇలా సర్క్యూట్ బ్రేకర్ కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ సంగతేంటో చూద్దాం... ► స్టాక్ మార్కెట్లో అధిక స్థాయిల్లో నెలకొనే ఒడిదుడుకులను నివారించే ఉద్దేశంతో సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని అనుసరిస్తారు. సెన్సెక్స్, నిఫ్టీలు 10, 15, 20 శాతం... ఈ మూడు స్థాయిల్లో పెరిగినా, పతనమైనా, సర్క్యూట్ బ్రేకర్లు వర్తిస్తాయి. ► 10 శాతం: ఉదయం సెషన్లో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు ఆపేస్తారు. ఒంటి గంట నుంచి గం.2.30 ని. మధ్య అయితే 15 నిమిషాల పాటు ట్రేడింగ్ను నిలిపేస్తారు. గం.2.30.ని. తర్వాత ట్రేడింగ్ నిలిపివేత ఉండదు. ► 15 శాతం: మధ్యాహ్నం ఒంటి గంటకు ముందు ట్రేడింగ్ను గం.1.45 నిమిషాలు నిలిపేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య అయితే 45 నిమిషాల పాటు ట్రేడింగ్ను ఆపేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే ఆ రోజుకు పూర్తిగా ట్రేడింగ్ను నిలిపేస్తారు. ► 20 శాతం ఉంటే...: ట్రేడింగ్ను ఆ రోజుకు పూర్తిగా ఆపేస్తారు. ► 2008, జనవరి 22: సర్క్యూట్ బ్రేకర్ల కారణంగా ట్రేడింగ్ నిలిచిపోయింది. లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో సెన్సెక్స్ 1,408 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనం కావడం ఇదే మొదటిసారి. ► 2009, మే 18:∙యూపీఏ ప్రభుత్వం రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సెన్సెక్స్ 17 శాతం (2,111 పాయింట్లు) లాభపడి 14,284 పాయింట్లకు ఎగసింది. ఆ ఒక్క రోజే రెండు సార్లు సెన్సెక్స్ సర్క్యూట్ బ్రేకర్లను తాకింది. 1992, మార్చి 2న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఉదార ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడంతో సెన్సెక్స్ 21 శాతం ఎగసింది. ఈ సందర్భంలో కూడా ట్రేడింగ్ను నిలిపేశారు. -
మందుల ప్రకటనలు ఇక బంద్!
సాక్షి, హైదరాబాద్: టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, ఆడియో, వీడియో తదితర పద్ధతుల్లో ఇచ్చే ఔషధ ప్రకటనల ప్రచారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఆ బిల్లును మంగళవారం ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ప్రచారం చేయకూడదన్న నిబంధన ఉండగా, తాజాగా మరికొన్నింటినీ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 78 రకాల జబ్బులకు ఫలానా మందు వాడితే తగ్గుతుందంటూ ప్రకటనలు చేయకూడదని, ఆ మేరకు ముసాయిదా బిల్లులో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఆ జబ్బులకు మందులను సూచిస్తూ ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది. మళ్లీ అదే తప్పు చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనను కేంద్రం ముసాయిదాలో ప్రవేశపెట్టింది. ఈ జబ్బుల జాబితాలో ఎయిడ్స్, క్యాన్సర్, డయాబెటిస్, డిజార్డర్స్, హెర్నియా, హైడ్రోసిల్, బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచడం, లుకేమియా, స్థూలకాయం, పక్షవాతం, పార్కిన్సన్, పైల్స్, గుండె జబ్బులు, లైంగిక సామర్థ్యం, కిడ్నీలో రాళ్లు, లెప్రసీ, ప్లేగ్, న్యుమోనియా, టీబీ, టైఫాయిడ్ ఫీవర్, అపెండిసైటిస్, అంధత్వం, బ్లడ్ పాయిజనింగ్, చెవుడు, స్కిన్ ఫెయిర్నెస్, కంటి చూపు పెంపుదల, కామెర్లు, స్పాండిలైటిస్, మహిళలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు, అల్సర్లు తదితర జబ్బులకు మందులు సూచించకూడదని ముసాయిదా తెలిపింది. ఇలాంటి ప్రకటనల వల్ల చాలామంది డాక్టర్లను సంప్రదించకుండానే నే రుగా మందుల షాపుల్లో కొని వాడుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. -
ఉగ్రవాదాన్ని వీడకుంటే పాక్ ముక్కలే
సూరత్: ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం పాకిస్తాన్ విడనాడాలని, లేకుంటే ఆ దేశం ముక్కలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నేలకొరిగిన 122 మంది అమర సైనికుల కుటుంబాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ను వేరే ఎవరూ విడదీయాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆ దేశం తనంత తానే ముక్కలవుతుంది’అని వ్యాఖ్యానించారు. భారత్లో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..ఉంటారు అని స్పష్టం చేశారు. మతం, కులం ప్రాతిపదికన దేశం చీలిపోదని తెలిపారు. మన సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉందని, నియంత్రణ రేఖను దాటి వచ్చే పాక్ సైనికులు మళ్లీ తిరిగి వెళ్లలేరని స్పష్టం చేశారు. అందుకే పాక్ ప్రధాని ఇమ్రాన్ తమ ప్రజలను ఎల్వోసీ దాటి వెళ్లవద్దని హెచ్చరించారన్నారు. శుక్రవారం ముజఫరాబాద్లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..‘నేను చెప్పే వరకు ఎల్వోసీ దాటి వెళ్లకండి’అంటూ ప్రజలను కోరడంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ ఐరాసను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిందని, అయితే ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం నమ్మబోదన్నారు. అనంతరం మంత్రి రాజ్నాథ్..మారుతీ వీర్ జవాన్ ట్రస్ట్ తరఫున ఒక్కో వీర సైనికుని కుటుంబానికి రూ.2.5 లక్షల సాయం అందజేశారు. -
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్ష విరమణ
-
పోలవరం పనులు బహిష్కరించిన ట్రాన్స్ట్రాయ్ సిబ్బంది
-
బదిలీలను నిలుపుదల చేయించాలి
జీజీహెచ్ సూపరింటెండెంట్ను కోరిన నర్సులు కాకినాడ వైద్యం : ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమ బదిలీలను నిలుపుదల చేయించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రి హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావును సోమవారం కలుసుకుని విపతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనూరాధ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని జేడీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్లో జీజీహెచ్కు చెందిన 76 మంది హెడ్, స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయన్నారు. భార్యాభర్తల ఉద్యోగం, అనారోగ్యం వంటి అంశాల్లో బదిలీల నిబంధనలకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను సైతం అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సూపర్ స్పెషాలిటీస్ సేవలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి బదిలీల్లో ప్రభుత్వం కొన్నిరకాల మినహాయింపులు ఇచ్చిందని వాటిని సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారణకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి నర్సులకు మినహాయింపు ఇవ్వలేదని వాపోయారు. స్టాఫ్,హెడ్ నర్సుల కోసం గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కి విజ్ఞప్తి చేశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమకు బదిలీలో మినహాయింపు ఇవ్వాలని కోరినా కౌన్సెలింగ్ అధికారులు పట్టించుకోలేదని ఓ స్టాఫ్ నర్సు కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దృష్టికి తీసుకెళతానని సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గవర్నమెంట్ నర్సుల యూనియన్ సభ్యులు ఆనీ, నర్సింగ్ సూపరింటెండెంట్లు జెసు ప్రియ, అక్కమ్మ, పలువురు ఏపీఎన్జీవో నేతలు పాల్గొన్నారు. -
ఆగిపోయిన పోలవరం పనులు
-
ఇదేం సాధికారత ?
-
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి
పెడదోవ పడుతున్న కళాశాలల యువత గంజాయి నియంత్రణకు వివిధ శాఖలకు ప్రత్యేక నిధులు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారుల సమావేశంలో డీజీపీ సాంబశివరావు రాజమహేంద్రవరం క్రైం :దేశాన్ని టెర్రరిజంలా పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని లాహస్పిన్ హోటల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వినియోగించిన యువత పెడదోవ పడుతోందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో మారకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. విశాఖ రూరల్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం గంజాయి అక్రమ సాగు, రవాణా జరుగుతోందని దీనిని అరికట్టేందుకు రైళ్లలో కట్టుదిట్టమైన గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ఏజన్సీలో గంజాయి సాగు గుర్తించేందుకు ఆధునిక పరిశోధన సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాల ఆధారంగా గంజాయి సాగుపై చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ సీహెచ్ ద్వారాకా తిరుమల రావు, అడిషనల్ డీజీపీ రైల్వేస్ కె.ఆర్.ఎం కిషోర్ కుమార్, అడిషినల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ హరీష్ కుమార్ గుప్త, నార్త్ కోస్టల్ జోన్ ఐజీపీ కుమార్ విశ్వజిత్, ఐజీపీ సీఐడి (ఇఓడబ్లు్య) అమిత్ గార్గ్, విశాఖ సీపీ టి.యోగానంద్, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు, డీఐజీ విశాఖ రేంజ్ సిహెచ్ శ్రీకాంత్, డీఐజీ ఏలూరు రేంజ్ పీవీఎస్ రామకృష్ణ, రాజమహేంద్రవరం ఎస్పీ బి.రాజకుమారి, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్, విజయవాడ రైల్వే ఎస్పీ సిముషిబాజ్పై, గుంతకల్లు రైల్వే ఎస్పీ ఎం.సుబ్బారావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్శర్మ, విజయనగరం ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ కె. విజయ్ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ 16వ తేదీ జగన్ సభను విజయవంతం చేయాలి చిలకలూరిపేటటౌన్: టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఈ నెల 16వతేదీన మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కుమారుడు మహేష్రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో నిర్వహించే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సభను విజయవంతం చేసేందుకు చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకుల, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ రోజురోజకు టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అడ్డుకొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాత నోట్లు కేంద్రప్రభుత్వం రద్దు చేశాక అవే పాత నోట్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన అనుచరులతో భారీగా పత్తి కొనుగోళ్లు చేపట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను కార్యకర్తలను పచ్చకండువా కప్పుకోవాలని అధికారం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో తమ పార్టీకి చెందిన సాంబిరెడ్డి అతని సోదరుల ఇళ్లను హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయపోరాటంతోపాటు ధర్నాలు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 16వ తేదీన నరసరావుపేటలో జగన్మోహనరెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలని కోరారు. రాజన్న పాలన కోసం భేషరుతుగా.... కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో రాజన్నపాలన తెచ్చేందుకు భేషరుతుగా పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తొలగి పోవాలంటే మరో రెండేళ్లు జగన్ స్ఫూర్తితో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజల్లో మమేకమై పోరాడుతున్న జగన్ స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. జగన్ నాయకత్వంలో ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం తెచ్చుకుందామని పేర్కొన్నారు. పార్టీలో చేరుతున్న తనకు ఆశీస్సులు అందజేయాలని కోరారు. నియంతృత్వ పాలనకు పరాకాష్ట ... పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్ బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే నేడు టీడీపీ మనుగడలోనే ఉండేది కాదని చెప్పారు. దుర్మార్గానికి పరాకాష్టగా నియంతృత్వ తరహా పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని మండిపడ్డారు. పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క ముస్లింకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబా మాట్లాడుతూ గిన్నిస్బుక్ రికార్డు స్థాయిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీబీఐ విచారణ నిర్వహిస్తే ప్రత్తిపాటి ఇంటి గోడల్లో అవినీతి డబ్బు బయట పడుతుందన్నారు. బీసీ విభాగం జిల్లా అ««ధ్యక్షుడు సునీల్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుబాని, యడ్లపాడు , నాదెండ్ల పార్టీ అధ్యక్షులు కల్లూరి విజయకుమార్, గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు నాయుడు శ్రీనివాసరావు, డిప్యూటి ఫ్లోర్లీడర్ షేక్అబ్దుల్రౌఫ్, నాయకులు కంజుల వీరారెడ్డి, షేక్ అల్లీమియా, బైరా వెంకటకోటి, జరీనాసుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
హెచ్చెల్సీకి నీరు బంద్
► ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు దించేసిన ► పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు నీళ్లు అవసరం ► చివర్లో చేతులెత్తేసిన ప్రభుత్వంపై రైతన్నల ఆగ్రహం కణేకల్లు : కేటాయించిన నీటి వాటా పూర్తి కావడంతో తుంగభద్ర జలాశయం అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిపేశారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి మొత్తం 10.50 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీవాహక ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తుంగభద్రకు నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఆ మేరకు హెచ్చెల్సీ వాటాగా 10 టీఎంసీల నీరు కేటాయించారు. కేసీ కెనాల్ నుంచి 1 టీఎంసీ నీరు డైవర్ష¯ŒS చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోవడంతో హెచ్ఎల్ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ పంటలను కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు నుంచి కణేకల్లు మార్గమధ్యంలో హెచ్చెల్సీకి రెండు చోట్ల ఉన్న క్రాస్ షట్టర్లను పూర్తిగా దించేసి కాల్వలో నీరు నిల్వ చేసుకున్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ తర్వాత ఉన్న కురువళ్లి డిస్టిబ్య్రూటరీ, 1వ డిస్టిబ్య్రూటరీలోని పంటలను కాపాడేందుకు నాగాలాపురం వద్ద రైతులు షట్టర్లను దించేశారు. దీనివల్ల ఈ రెండు డిస్టిబ్య్రూటరీలకు మూడురోజులు నీరందే అవకాశముంది. 2, 2ఏ, 3, 4వ డిస్టిబ్య్రూటరీల రైతులు అంబాపురం వద్ద హెచ్చెల్సీకున్న షట్టర్లను దించారు. దీంతో ఈ నాలుగు డిస్టిబ్య్రూటరీలకు రెండు రోజుల పాటు నీరందుతుంది. హెచ్ఎల్ఎంసీ పరిధిలో 36 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 25 వేల ఎకరాల్లో రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలాఖరు, జనవరి మొదటి వారం వరకు ఆయకట్టుకు సాగునీరు అందించేవారు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా రెండవవారంలోనే హెచ్చెల్సీకి నీరు బంద్ కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి, జొన్న, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలు బతకాలంటే డిసెంబర్ వరకు నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని రైతులు ఏదోక విధంగా పంటలను కాపాడుతామని చెప్పి చివరికి చేతులెత్తేసిని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు హెచ్చెల్సీకి నీరు తీసుకోవాలని అధికారులు అనుకున్నప్పటికీ డ్యామ్లో హెచ్చెల్సీ హెడ్కు నీరు పూర్తి స్థాయిలో అందకపోవడం, వస్తున్న కొద్దిపాటి నీరునూ కర్ణాటక వారు వాడుకుంటూ ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు ఆపేశారు. ప్రస్తుతం డ్యామ్లో 11.368 టీఎంసీల నీరుంది. 300 క్యూసెక్కులు వస్తున్నాయి ఈ నెల 15 వరకు పూర్తిస్థాయిలో నీరు తీసుకోవాలని అనుకొన్నాం. డ్యామ్లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. 1,591 అడుగుల వరకే నీరుండటంతో హెచ్చెల్సీ హెడ్ కు కావాల్సినంత నీరు అందడం లేదు. అరకొరగా వస్తున్న నీటిని కర్ణాటక వాళ్లే వాడుకుని 300 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఈ రోజు రాత్రికో, సోమవారం ఉదయానికో ఆ నీరు కూడా పూర్తిగా ఆగిపోతుంది. పంటలను సంరక్షించుకునేందుకు రైతులు నాగాలాపు రం, అంబాపురం వద్ద షట్టర్లను దించుకున్నారు. కణేకల్లు చెరువు కింద సాగులో ఉన్న పంటల కోసం చెరువు షట్టర్లను కూడా క్లోజ్ చేశారు. – వెంకట సంజన్న, డీఈఈ -
అటకెక్కిన కాకినాడ కెనాల్ రోడ్డు విస్తరణ
-
వర్గీకరణ అడ్డుకునేందుకు సిద్ధం కావాలి
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్కుమార్ పిఠాపురం టౌన్ : ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, వీటిని అడ్డుకునేందుకు సిద్ధం కావాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పిలుపు ఇచ్చారు. స్థానిక చెలికాని భావనరావు సభాసదన్లో బు««దlవారం నిర్వహించిన మాలమహానాడు పునర్ నిర్మాణసభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కన్వీనర్ కొంగు నూకరాజు అధ్యక్షత జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2004లో పీవీ రావు నాయకత్వంలో అప్పటి అధికార పార్టీలకు బుద్ధి చెప్పిన మాదిరిగా ఇప్పుడూ చెప్పాలని కోరారు. బలమైన కమిటీలను ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని, దళితులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎదిరించడానికి సన్నద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు కాకుండా నిజమైన పేద దళితులకు అందాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు పేరుతో కొంతమంది చేస్తున్న దందాలు, సెటిల్మెంట్లు.. పీపీ రావు స్థాపించిన మాలమహానాడుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ఎస్సీ వర్గీకరణకు తీసుకువచ్చిన జీఓను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాగ్లాగ్ పోస్టులను భర్తీచేయాలని, చంద్రబాబు అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడ భర్తీ చేయలేదని విమర్శించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మారెల్ల సోమరాజు, నాయకులు పి.పరశురాముడు, మహిళా విభాగం కన్వీనర్ ఎం.సుశీల, బత్తిన శామ్యూల్, కె.చంద్రశేఖర్, మాతా అబ్బులు, ఎడ్ల లక్ష్మీపతి, ఎద్దు నానిబాబు, ఇజ్జిన చలపతిరావు, దారా ప్రభాకరరావు, బొండాడ వీరరాఘవులు, బందిలి నాగేశ్వరరావు మాట్లాడారు. నియోజకవర్గ కమిటీతో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు, మండలాల కమిటీలను ఎంపిక చేశారు. -
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్
కొత్త జిల్లాల ఏర్పాటుతో నిలిచిన పంపిణీ కార్డులపై పాత జిల్లాల పేర్లే కారణం ముందు చూపులేక కోట్లాది నిధులు వృథా.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరా ల శాఖ అధికారులకు ముందు చూపులేకపోవడంతో రెండేళ్ల తరువాత చేతిదాక వచ్చిన కొత్త రేషన్ కార్డులు చేజారే పరిస్థి తి ఏర్పడింది. కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతో కొత్త రేషన్ కార్డులకు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి వేరే జిల్లాలను ఏర్పాటు చేయనుండడంతో రేషన్కార్డుల్లో లబ్ధిదారుల జిల్లా, మండలం పేర్లు మారనున్నాయి. దీంతో రేషన్ కార్డుల పంపిణీ పక్రియకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బ్రేక్ వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత రేషన్ కార్డులను తొల గించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి నేటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది జిల్లాలకు కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఆయా జిల్లాలకు పంపింది. ఇందుకు వీటి ముద్రణ కోసం ప్రభుత్వం ఓ సంస్థకు టెండర్లు అప్పగించింది. దాదాపు రూ.7 కో ట్ల వరకు నిధులు వెచ్చించి, కొత్త రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు వారి పేర్లను, ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలను సైతం ముద్రించింది. ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు వచ్చిన రేషన్ కార్డులను మండలాలు, మున్సిపాలిటీల వారీగా వేరు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా ల చిక్కు వచ్చి పడడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కొద్ది రోజులు అగితే... రూ.7 కోట్లు మిగిలేవి.... కాంట్రాక్టర్లకు ఆహార భద్రతా కార్డుల ముద్రణ బాధ్యత అప్పగించే సమయానికి కొత్త జిల్లాల పునర్విభజన పక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను దసరాకే ప్రారంభిస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ రేషన్ కార్డులను ఈ సమయంలో ముద్రిస్తే అవి ఉపయోగపడవని అధికారులు ఆలోచించలేకపోయారు. రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయడంలో దాదాపు రెండేళ్ల పాటు జాప్యం చేసిన సర్కారు మరి కొన్ని రోజులు ఆగి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎంచక్కా కొత్త జిల్లాలు, మండలాల పేర్లతో ముద్రణ జరిగేదంటున్నా రు. ఒకటి కాదు రెండు కాదు పది జిల్లాలకు సంబంధించిన లక్షల కొద్దీ రేషన్ కార్డులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనికి రాకుండా పోనున్నాయి. ఇటు వీటి ముద్రణ కోసం ఖర్చు చేసిన దాదాపు రూ.7 కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు లాగా అయ్యింది. మళ్లీ కొత్తవి ముద్రిస్తారా...? కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ముద్రించిన కార్డుల స్థానంలో జిల్లా, మండలం పేర్లు మార్పు చేసి మళ్లీ కొత్త కార్డులను ముద్రిస్తారా..? లేదా ముద్రించిన కార్డులపైనే స్టిక్కర్లు అతి కించి వాటినే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. కొత్త ముద్రణ జరిగితే మాత్రం ప్రభుత్వ నిధుల వృథాతో పాటు మరో ఆరు నెలల పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తప్పవు. ఇటు ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తమకు మాత్రం రాష్ట్ర అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, తాత్కాలికంగా రేషన్ కార్డుల పంపిణీ చేయకుండా నిలిపివేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
బలవంతపు భూసేకరణ మానుకోవాలి
ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి న్యూశాయంపేట : టెక్స్టైల్ పార్కుపేరుతో జిల్లాలో పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టే బలవంతపు భూసేకరణ మానుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం కార్యాలయంలో రైతు సంఘం రాష్ట్ర నా యకులు మోర్తాల చందర్రావు, కూసం రా జ మౌళిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవరిస్తూ రైతుల్ని కూలను నిరాశ్రయుల్ని చేయుటకు భూముల్ని లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి జిల్లాలో వేలాది ఎకరాలు బీడుగా ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా రెండు పంటలు పండే సారవంతమైన భూముల సేకరణకు పూనుకోవడం అన్యాయమన్నారు. గీసుకొం డ, సంగెం మండలాల్లోని రైతుల్ని మభ్యపెడు తూ, వినకపోతే భయపెడుతూ అంగీకార ప త్రాలపై సంతకాలు చేయించుకోవడం దారుణమన్నారు. న్యాయపరంగా 2013 చట్టం అమలయ్యేంత వరకు నిర్వాసితుల పక్షాన పో రాటం కొనసాగుతుందన్నారు. కౌలు రైతు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దారపు రమేష్, రం గయ్య, వీరన్న రవీందర్గౌడ్, రాము, కుమారస్వామి, రాజన్న శ్రీనివాస్, పాల్గొన్నారు. -
రీజియన్లో 510 బస్సులు నిలిపివేత
* రూ.80 లక్షలకుపైగా నష్టం * హైదరాబాద్కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు * పరిస్థితిని సమీక్షించిన ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి పట్నంబజారు: భారీ వర్షాలకు ఆర్టీసీ రీజయన్ పరిధిలోని పలు సర్వీసులను రద్దు చేశారు. సుమారు 510పైగా బస్సులు రీజయన్ వ్యాప్తంగా ఆయా డిపోల్లో నిలిచిపోయాయి. మాచర్ల – పిడుగురాళ్ల, మాచర్ల– చిలకలూరిపేట, సత్తెనపల్లి– నర్సరావుపేట, సత్తెనపల్లి– మాదిపాడు, సత్తెనపల్లి– గుంటూరు, సత్తెనపల్లి– పిడుగురాళ్ల, చిలకలూరిపేట– నర్సరావుపేట, నర్సరావుపేట– గుంటూరు రూట్లలో పూర్తిస్థాయిలో సర్వీసులు రద్దయ్యాయి. గురజాల, రెడ్డిగూడెం, పిడుగురాళ్ల మొదలగు ప్రాంతాల్లో పరిస్థితిని ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పర్యవేక్షించి అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెడ్డిగూడెం వద్ద ఆగిపోయిన పల్నాడు ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను పిడుగురాళ్ల డిపో నుంచి ప్రత్యేకంగా 10 బస్సులు, బెల్లకొండ వద్ద నిలిచిన ఫలక్నామా ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను 20 బస్సుల్లో తరలించారు. రెడ్డిగూడెం, మాచర్ల, బెల్లకొండల నుంచి హైదరాబాద్కు 40 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీహరి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అధికారులతో చర్చించి అదనంగా బస్సుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామన్నారు. వరదల కారణంగా గురువారం ఒక్క రోజే రూ.80 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. -
పొల్లూరు 2,4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేత
మోతుగూడెం : సీలేరు కాంప్లెక్స్లోని పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో రెండు, నాలుగు యూనిట్లలో ఎర్త్ సమస్య తలెత్తింది. దీంతో సోమ, మంగళవారాల్లో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా, మూడో యూనిట్లో నెల రోజుల కిందటే విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు 2, 4 యూనిట్లలో కూడా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు యూనిట్లు పనిచేయకపోవడంతో మొత్తం 460 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేవలం 115 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో అధికంగా ఉత్పత్తి చేయాల్సిన సమయంలో మూడు యూనిట్లు మొరాయించడంతో జెన్కోకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. -
మా ఫోన్ల వాడకం ఆపండి..!
-
మా ఫోన్ల వాడకం ఆపండి..!
సియోల్ : దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ వినియెగదారులకు క్షమాపణలు చెప్పింది. శాంసంగ్ జెంబో స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వాడకం పై శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాటరీ పేలుతున్న ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఫోన్లను రీకాల్ చేస్తున్న సంస్థ చివరికి తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల వాడకాన్ని నిలిపివేయాలని ప్రకటించింది. దక్షిణకొరియాలోని వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 ఫోన్లను వినియోగించవద్దంటూ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. తాత్కాలిక వినియోగం కోసం అద్దె ఫోన్లను తమ కంపెనీ సేవాకేంద్రాలనుంచి పొందొచ్చని స్థానిక వినియోగదారులకు సూచించింది. అలాగే కొత్త బ్యాటరీలతో సెప్టెంబర్ 19 నుంచి ఫోన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. తన ఉత్పత్తులకు విలువనిచ్చే వినియోగదారులకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసింది. అమెరికా యూజర్లకు కూడా ఇదే సూచనలు జారీ చేసింది. కాగా ఆగస్ట్ 19 న అట్టహాసంగా విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు పేలుతున్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. దాదాపు 35 ప్రమాదాలు సంభవించాయని స్వయంగా సంస్థ ధృవీకరించింది. లిథియం రీచార్జబుల్ బ్యాటరీలో లోపాన్ని కనుక్కున్నట్టు, వీటిని తమకు అందించిన సంస్థ తప్పిదమని తెలిపింది. దీంతో గ్లోబల్ గా కొన్ని విమాన యాన సంస్థలు నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
పాపికొండల పర్యాటకానికి బ్రేక్
దేవీపట్నం : గోదావరి నదిపై పాపికొండల పర్యటనకు వెళ్లే పర్యాటక బోట్లకు బ్రేక్ పడింది. ఆదివారం సాయంత్రం పాపికొండల నుంచి తిరిగొస్తూ పోశమ్మగండి వద్ద రాయి తగలడంతో బోటుకు రంధ్రం పడి నీరు చేరిన విషయం విదితమే. అంతకుముందే పర్యాటకులు బోటు నుంచి దిగడంతో పెనుముప్పు తప్పింది. ఈ నేపథ్యంలో సంఘటన ప్రాంతాన్ని సోమవారం బోటు సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్ సందర్శించారు. దెబ్బతిన్న బోటును పరిశీలించారు. కేవలం బోటు డ్రైవరు అజాగ్రత్త కారణంగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం నుంచి పాపికొండల పర్యటనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గోదావరిపై విహరించే 21 టూరిజం బోట్లకు గాను ఐదింటికి ఫిట్నెస్ లేకపోవడంతో లైసెన్సు రద్దు చేశామని తెలిపారు. వీటిలో ఆరు చెక్క బోట్లు ఉండగా, వాటిని కూడా గోదావరి విహారానికి అనుమతించబోమని పేర్కొన్నారు. బోట్లలో సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నా, లైసెన్సులు లేని డ్రైవర్లు బోట్లను నడిపినా, నిబంధనలను పూర్తిగా పాటించని బోట్ల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. -
వాట్సాప్ నెంబర్ల షేరింగ్ను ఆపివేయొచ్చట!
వినియోగదారులు రహస్యాన్ని తుంగలో తొక్కుతూ వాట్సాప్ తన యూజర్ల నెంబర్ల సమాచారం పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో షేర్ చేసే కొత్త పాలసీ నుంచి యూజర్లు బయటపడేందుకు మార్గాలు ఉన్నాయట. వాట్సాప్ యూజర్లు తమ సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకోకుండా చేసుకోవచ్చట. సమాచారాన్ని తెలుపకుండే ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్ బాక్స్లో అన్టిక్ సదుపాయాన్ని కల్పించినట్టు వాట్సాప్ చెబుతోంది. ఆ ఫీచర్ ద్వారా యూజర్లు సమాచారాన్ని పంచుకోకుండా అన్ చెక్ చేసుకోవచ్చట. ఈ ఫీచర్ల గురించి యూజర్లకు సరియైన అవగాహన లేకపోవడంతో యూజర్లు గుడ్డిగా కొత్త పాలసీలను అగ్రి చేస్తున్నారట. అలా యాప్ కొత్త విధానాలను గుడ్డిగా సమ్మతించకుండా.. కింద ఉన్న "రీడ్ మోర్" ఆప్షన్ను క్లిక్ చేస్తే చాలట. ఫేస్బుక్తో తమ సమాచారాన్ని వాట్సాప్ షేర్ చేయకుండా ఆపివేయొచ్చట. ఒకవేళ మీరు ఆ కొత్త పాలసీలను యూజర్లు అగ్రి చేసినా..సమాచార షేరింగ్ నుంచి వైదొలగడానికి ఇంకా 30 రోజుల సమయాన్ని యూజర్లు సద్వినియోగం చేసుకోవచ్చట. యాప్ సెట్టింగ్స్ మెనూకి వెళ్లి, అకౌంట్ ట్యాబ్ను ప్రెస్ చేయాల్సి ఉంటుది. "షేర్ మై అకౌంట్ ఇన్ఫో" ను అన్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫేస్బుక్తో సమాచారాన్ని షేర్ చేసే ఎంపికను యూజర్లు ఆపివేయవచ్చని వాట్సాప్ పేర్కొంటోంది.. -
సీపీఎస్ విధానంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
జన్నారం : ఉద్యోగులకు నష్టం కలిగించే కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు కోరుతూ ఆ విధానం అమలు చేసిన రోజు సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైనట్లు సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ విధానం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం, ఉద్యోగి మరణించినా వారి కుటుంబాలకు పెన్షన్ లేకపోవడం, సీపీఎస్ విధానం షేర్ మార్కెట్తో ముడిపడి ఉండటం వల్ల ఈ సంక్లిష్టమైన సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు తీసి తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వడం, డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవోలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆదివారం హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి అన్ని జిల్లాల బాధ్యులు హాజరు కావాలని కోరారు. -
సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు
కాసిపేట : కేకే ఓపెన్కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో చేపడుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల గణనను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థలం చూపించిన తరువాత సర్వేలు చేయాలని డిమాండ్ చేశారు. గతం నుంచి సర్వేలను అడ్డుకోగా గ్రామస్తులను ఒప్పించి పునరావాసానికి అనువైన స్థలం చూపిస్తామని చెప్పి అధికారులు కాలం గడుపుతున్నారన్నారు. గ్రామస్తులకు ఇష్టమైన స్థలం చూసుకోమని కోరగా మందమర్రి మంచిర్యాల మధ్యలో అందుగులపల్లి సమీపంలో చూశామన్నారు. ఈ స్థలంపై ఏం చెప్పకుండా సర్వేల పేరుతో రెవెన్యూ అధికారులు గ్రామాలకు రావద్దని, స్థలం సమస్య పరిష్కరించి సర్వేలు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. తహసీల్దార్ కవిత నచ్చచెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వినలేదు. దీంతో అధికారులు సర్వే నిలిపివేసి వెనుతిరిగారు. సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు, serve, dubbagudem, stop -
దుబ్బగూడెంలో సర్వే అడ్డగింత
స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో ఓపెన్కాస్టు ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా రెవెన్యూ అధికారులు బుధవారం ప్రారంభించిన సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు భూమి ఎక్కడ కేటాయిస్తారు..పరిహారం ఏ విధంగా చెల్లిస్తారో చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. మొదట ఇళ్ల సర్వే పూర్తిచేసి వివరాలన్ని చెబుతామని..గ్రామస్తుల ఇష్టం మేరకే నడుచుకుంటామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని నిలదీశారు. మెుదల స్థలం, ప్యాకేజీ తేలాలే సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సర్వే అనంతరం మాట్లాడుతామని తహశీల్దార్ కవితlనచ్చచెప్పినా వినకుండా సర్వేకు వచ్చిన డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే, షరీప్, ఎంఆర్ఐ కమల్సింగ్ను తిరిగిపంపించారు. అనంతరం గ్రామస్తులంతా ఆలయం వద్ద సమావేశమై ప్రస్తుతం ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించాలని నిర్ణయించారు. అన్యాయం జరిగితే అంతా ఏకమై పోరాడాలని తీర్మానం చేశారు. -
హిల్లరీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుపాకి లైసెన్స్ కలిగివున్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హోస్ కు చేరకుండా ఆపగలరని వ్యాఖ్యనించారు. దీంతో ట్రంప్ హిల్లరీని కాల్చిచంపాలని సూచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ 'సెకండ్ అమెండ్ మెంట్'ను తొలగిస్తారని ట్రంప్ విల్మింగ్ టన్ ప్రచారకార్యక్రమంలో అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు హిల్లరీని చంపాలన్న సందేశం ఇచ్చేట్టుగా ఉన్నాయని యూఎస్ లా మేకర్స్ పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రచారకార్యక్రమ నిర్వాహకులు ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న వార్తలను ఖండించారు. నిజాయితీ లేని మీడియా ట్రంప్ ప్రచారంపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు. వారిని ఆకర్షించడానికే ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారే తప్ప మరేం కాదని తెలిపారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆ వ్యాఖ్యలపై ఇంటర్వూ ఇచ్చిన ట్రంప్.. హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. సెకండ్ అమెండ్ మెంట్ బిల్లును సుప్రీం కోర్టు ద్వారా రూపుమాపుతానని అన్నారు. గన్ లైసెన్స్ కలిగివున్న వాళ్లందరిలో అఖండ శక్తి ఉందని.. వారికి ఎవరికి ఓటువేయాలో బాగా తెలుసునని చెప్పారు. -
ఆదివాసీలపై దాడులు ఆపాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎంఎల్) ధర్నా ముకరంపుర : ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపి వారి హక్కులు కాపాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్నుంచి కలెక్టరేట్వరకు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హరితహారం పేరిట ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు పోలీసుల అండతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో పోలీసులు ఆదివాసీలను నిర్బంధిస్తున్నారని, అరెస్టులు చేస్తూ.. ఆస్తులు ధ్వంసం చేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాల పోడుభూమి గుర్తించి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేవీ.చలపతిరావు, నాయకులు రాజమ్మ, రాజు, నరేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, రాములు తదితరులున్నారు. -
వైద్యుడి పై టీడీపీ రాజకీయ కక్ష
-
నారాయణ.. ‘నారాయణ’!
మంత్రి ఫోన్తో నిలిచిపోయిన టాస్క్ఫోర్స్ తనిఖీలు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నిలిపివేత అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు నిల్ సాక్షి, గుంటూరు: హలో... ఎక్కడున్నారు.. ఎక్కడున్నా సరే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసి వెనక్కి రండి.. ఇది ఫోన్లో డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) నుంచి రెస్క్యూటీమ్ అధికారులకు వచ్చిన ఆదేశాలు. ఆరంభ శూరత్వంలో తమకు సాటి లేరని రాష్ట్రప్రభుత్వ పెద్దలు మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు తరహాలో గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటాం... ఇందుకోసం నాలుగు ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి నారాయణ, రాష్ట్ర పట్టణప్రణాళికాధికారులు నగరంలోని టీడీపీ నాయకుల ముందు తమ ఆదేశాలు ఏమాత్రం చెల్లవని అంగీకరించక తప్పలేదు. పరిశీలన ఊసే లేదు.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కొంతమంది అధికారులను ప్రభుత్వం టాస్క్ఫోర్స్ టీమ్లో సభ్యులుగా నియమించింది. టాస్క్పోర్స్ బృందం బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు న గరంలో 200 చదరపు మీటర్లు కలిగిన భవన నిర్మాణాలను మొదటి విడతగా దాదాపు 200 ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగాయా? నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించినదీ, లేనిదీ తదితర అంశాలను టాస్క్పోర్స్ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేయకుంటే వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకే నాలుగు టీమ్లు బయలుదేరి నగరంలోని నాలుగువైపులకు వెళ్లాయి. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. అయితే అనుకోకుండా డీటీసీపీ నుంచి ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో రెస్క్యూ టీమ్లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు నిలిపివేసి వారివారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎన్నికలు వస్తున్నాయనే.. వాస్తవానికి వందల సంఖ్యలో భవనాలను ఈ తనిఖీల్లో కూల్చివేయడం, లేదా నోటీసులు అందించడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. నగరంలో తనిఖీలు ప్రారంభించిన వెంటనే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా టీడీపీ నాయకులు, వారికి కావాల్సిన వారే బిల్డర్లుగా ఉండటంతో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇంకేముంది నగరంలో మరో మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో భవనాల జోలికి వస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందంటూ ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న మంత్రి పుల్లారావు దృష్టికి ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మంత్రి నారాయణ దష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. నగరపాలకసంస్థ ఎన్నికల దృష్ట్యా రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేయాలని, ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూడవచ్చంటూ వత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నారాయణ రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేయాలని డీటీసీపీకి ఆదేశాలు జారీచేయడంతో ఆయన రెస్క్యూటీమ్ అధికారులకు ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏది ఏమైనా నగరపాలకసంస్థ ఎన్నికలను అడ్డుపెట్టుకొని నగరంలో అ«నధికార భవనాలపై చర్యలకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. దీంతో ఏ నగరంలో లేని విధంగా అక్రమ కట్టడాలకు అడ్డగా గుంటూరు నగరం మారుతోంది. -
పోడు మహిళలపై దాడులు ఆపాలి
పీఓడబ్ల్యూ రాష్ట్ర నేతలు చండ్ర అరుణ. ఝాన్సీ రేగళ్ల (కొత్తగూడెం రూరల్): ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై దాడులు ఆపాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగళ్ళ పంచాయతీలోని బాబోజితండా, చంద్రాలగూడెం, పగడాయిగూడెం, తోకబందాల తదితర గ్రామాలలో మంగళవారం పర్యటించారు. వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న మహిళల నుంచి భూములను లాక్కునేందుకే హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. పేద దళితులు, గిరిజనుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని విస్మరించి; పోడు భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని, దాడులు ఆపాలని, అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.శిరోమణి, నాయకులు గోకినపల్లి లలిత, వై.సావిత్రి, ఎంపీటీసీ సభ్యుడు వాంకుడోత్ కోబల్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంకుశ పాలనను అడ్డుకుందాం
– అభివృద్ధి మరిచి ఫిరాయింపులు – కేసీఆర్ నిరంకుశ పాలనను అడ్డుకుందాం – జలసాధన సమితి బహిరంగ సభలో విపక్ష నేతలు ధ్వజం – ముగిసిన పాదయాత్ర పాలమూరు : కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటూ పార్టీ ఫిరాయింపులెందుకే ప్రాధాన్యమిస్తున్నారు.. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచుకోవడానికి, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు తెచ్చి రైతులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు.. అంటూ వివిధ పార్టీల నేతలు ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధనకై జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 22న చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు అధికార పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు మద్ధతు తెలిపి కదం తొక్కారు. జిల్లా కళాకారుల డప్పుదరువుల మధ్య పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగింది. అడ్డుకున్న పోలీసులు పాదయాత్రగా ప్రధాన రహదారి వెంట వస్తుండగా కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డగించారు. ప్రధాన రోడ్డుపై వెళ్లేందుకు అనుమతి లేదని, తెలంగాణ చౌరస్తా మీదుగా వెళ్లాలని టూటౌన్ సీఐ రాజు నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాదయాత్రగా వెళ్తే తప్పేందని, తాము ఈ దారినే వెళ్తామని పోలీసులను తోసుకుంటూ ధర్నాచౌక్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగింపు సభలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అధ్యక్షులు, జేఏసీ, ప్రజాసంఘాల నేతలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సభ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటì కీ తడుస్తూనే ప్రసంగించారు. జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి, డీసీసీ అ«ధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, జేఏసీ ఛైర్మన్ రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యయన వేధిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐఎంల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, వెంకటేష్, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు, జలసాధన సమితి నాయకులు అంబదాస్, బోయిన్పల్లి రాము, నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాజెక్టు సాధించేవరకు పోరాడండి : కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి మక్తల్, నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టు సాధించేవరకు పోరాటం సాగించాలి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఎప్పుడు అధికారంలో ఉండదు. తెలంగాణ ఉద్యమంలో రైతుల పాత్ర గొప్పది. కానీ ప్రభుత్వం రైతులనే విస్మరిస్తోంది. రుణ మాఫీ చేస్తానని ఇప్పటికి నాన్చుతోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా నిధులు కేటాయించకుండా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు వేలకోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ప్రజలే బుద్ధిచెప్పాలి ప్రాజెక్టు కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తుంటే ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని ఐదున్నరకోట్ల కుటుంబాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు సాగునీరందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్మరిస్తే భవిష్యత్లో ప్రజలే కేసీఆర్కు బుద్ధి చెబుతారు. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలు కదలిరావాలి గవర్నర్ పాలనలో పార్టీలకతీతంగా తీసుకొచ్చిన జీఓ నెం.69ను ప్రభుత్వం విస్మరిస్తోంది. కేసీఆర్ దయ ఉంటేనే పనులు అవుతున్నాయి. రాష్ట్రంలోని మంత్రులు కేసీఆర్ బానిసలుగా మారారు. రాజకీయాల కోసం పాదయాత్రలో పాల్గొనడం లేదు. దగ్గరనుంచి నీళ్లొచ్చే అవకాశమున్నా చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏముంది. హరీష్రావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రజలు కదలిరావాలి. – సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మెడలు వంచి ప్రాజెక్టు సాధిస్తాం ప్రభుత్వం మెడలు వంచైనా నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టును సాధిద్దాం. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆపి ప్రజల పొట్టకొట్టేందుకు టీఆర్ఎస్ కుట్రపన్నింది. ప్రాజెక్టుల కోసం పాటుపడకుండా పార్టీ ఫిరాయింపులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరికి పవర్ శాశ్వతం కాదు. కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోంది. – టీ–టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మెడమీద తలకాయ లేదు : కేసీఆర్కు మెడ మీద తలకాయ లేదు. ఉంటే కూతవేటు దూరంలో ఉన్న జూరాల నుంచి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీరందించేవారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి నీరు తీసుకురావాలంటే నార్లాపూర్ వద్ద 100 మీటర్లు, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వద్ద మొత్తం నాలుగుసార్లు లిఫ్టు చేయాల్సి ఉంటుంది. చివరలో ఉన్న ఈ మూడు నియోజకవర్గాలకు సాగునీరందించడం సాధ్యంకాదు. డబ్బుల కోసమే పెద్దపెద్ద రిజర్వాయర్లు చేపడుతున్నారు. ఏ ప్రజలు ఎంపీగా గెలిపించి రాజకీయ జీవితమిచ్చారో ఆ ప్రజలను విస్మరిస్తే పతనం తప్పదు. – బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి దోచుకోవడానికే ప్రాజెక్టులు ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడానికే ప్రాజెక్టులు కడుతున్నట్టుంది. వెనకబడ్డ మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలకు భీమా ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జయమ్మ చెరువుకు నీళ్లు ఇవ్వాలని దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డికి విన్నవించారు. అందులో భాగంగానే జీఓ నెం.69 ఏర్పడింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రజలకు ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలి. కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాజెక్టు కడితే ఎక్కువ పైసలు వస్తాయని అవసరం లేకున్నా వ్యయాన్ని పెంచుతున్నారు. సొంత ప్రయోజనాలకోసం పార్టీ మారిన వారిని ప్రజలు క్షమించరు. – డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే అన్నీ మాయమాటలే రాష్ట్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మభ్యపెడుతుంది. ప్రాజెక్టుకోసం అన్ని పార్టీలు ఏకమైనా కనువిప్పు కలగడంలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి స్వలాభం చూసుకుంటున్నారు. భూ నిర్వాసితులకు చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వ జీఓ ప్రకారం చెల్లించడం దుర్మార్గం. జీఓ 69కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటాం. – చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే -
వేస్ట్మేనేజ్మెంట్ ప్రాజెక్టును రద్దు చేయాలి
రామన్నపేట : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే తెలంగాణ వేస్ట్మేనేజ్మెంట్ ప్రాజెక్టును రద్దు చేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె చాంద్ డిమాండ్ చేశారు. సోమవారం టీయూవీ నాయకులతో కలసి కక్కిరేణి గ్రామశివారులో ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో ఆందోళన నిర్వహించారు. ఆ స్థలంలో టీయూవీ జెండాలను పాతారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కోరారు. వివిధ జిల్లాలనుంచి వ్యర్థాలను తెచ్చి భూమిలో పాతిపెట్టడం వల్ల నియోజకవర్గంలోని సగం గ్రామాలు కాలుష్యం బారినపడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈనెల 2న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివరాత్రి లక్ష్మమ్మ, పిట్ట వెంకట్రెడ్డి, శివరాత్రి లక్ష్మమ్మ, నార్కట్పల్లి రమేష్, కమ్మంపాటి వెంకన్న, చింతల యాదగిరి, చింత లక్ష్మణ్, వేముల సైదులు, బెడిద లింగస్వామి, సోములు బాలరాజు, బాశబోయిన లింగయ్య, దువ్వాసి సుధాకర్, చిల్లా గోపాల్, బి.సత్తయ్య పాల్గొన్నారు. -
ప్రమాదాలు నివారించాలి
ఆర్టీఏ నాగలక్ష్మి వేములవాడ రూరల్ : ప్రమాదాలు ముందుగా ఎవరికీ తెలియవని, అవి జరగ్గకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల వెహికిల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా వేములవాడ డిపోలో శనివారం ప్రమాదాల నివారణలో కృషి చేసిన కార్మికులను సన్మానించారు. డ్రైవర్ చేతిలోనే బస్సులోని 50మంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయన్నారు. వారిని సురక్షింగా గమ్యం చేర్చితేనే ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆమె తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే వేములవాడ డిపో ప్రమాదరహిత డిపోగా పేరొందాలన్నారు. నిబంధనలు పాటిస్తే ఇది సాధ్యమేనని అన్నారు. గతేడాది ఆరు ప్రమాదాలు జరిగాయని, అందులో మూడు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగాయని చెప్పారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎన్నికైన ఎస్బీరావు, డి.చంద్రయ్య, ఎన్ఎస్రావును సన్మానించారు. సిబ్బంది శ్రీనివాస్, సం«ధ్యారాణి, గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. -
ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు..
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్రెడ్డి నాగర్కర్నూల్రూరల్: ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, కొడంగల్, గద్వాల ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, డీకే అరుణ పాల మూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, కేఎల్ఐ ప్రాజెక్టు పనులు సక్రమంగా జరుగుతున్నా వారి ఉనికిని కోల్పోతున్నారన్న భయంతో ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తే జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. భవిష్యత్లో వారికి ప్రజల నుంచి మరింత విశ్వాçÜం పోతుందనే భయం పట్టుకుందన్నారు. ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హరితహారంలో భాగంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, నిత్యం నాటిన మొక్కలను ఎమ్మెల్యే దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు ఎప్పుడు పడ్డా గ్రామా నికి 2500 మొక్కల చొప్పున నాటాలని, పర్యావరణాన్ని కాపాడటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గన్యాగుల పీఏసీఎస్ చైర్మన్ మాధవరెడ్డి, నగరపంచాయతీ కౌన్సిలర్ సత్యం, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, రమణ పాల్గొన్నారు. -
పాఠశాలల మూసివేతను నిలిపివేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్రెడ్డి విద్యారణ్యపురి : విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొండల్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రారంభించాలన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను సెమీరెసిడెన్షియల్గా, ఉన్నత పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. విద్యాపరిక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు ఎ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్య కాషాÄæూకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నూతన విద్యావిధానం కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ సిఫారసులు ప్రభుత్వ విద్యకు గొడ్డలిపెట్టుగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ ఈనెల 25న విద్యాపరరిక్షణ కమిటీ ఆ««దl్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, జి,నటరాజ్, టి.పురుషోత్తమ్, కె.సునంద, ఎస్.గోవర్ధన్, డి.శ్రీనివాస్, పి.చంద్రం పాల్గొన్నారు. -
ఆ కూల్చివేతలు ఆపండి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కలెక్టర్ యువరాజ్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
వారంలోగా అక్రమ కట్టడాలు తొలగించాలి
జమ్మికుంట : పట్టణంలోని వంతెనకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు వెంటనే అక్రమ కట్టడాలు తొలగించి సెట్బ్యాక్ చేసుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ శ్రీకాంత్తో కలిసి ఆయన రైల్వేఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం పరిశీలించారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం వంద అడుగులకు ఇరువైపులా సెట్బ్యాక్ చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ నిర్మాణం, పట్టణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని వ్యాపారులు కోరగా.. చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారులు వారంలోగా అక్రమ కట్టాడాలను తొలగించుకోవాలని లేకుంటే తామే కట్టాడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ రాజేశం, నగర పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
8 నెలలుగా వేతనాల్లేవ్..!
దౌల్తాబాద్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లు, అటెండర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎనిమిది నెలల వేతనాల్లేక పండుగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని స్వీపర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్టైం పేరుతో వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పాఠశాలల్లో 8గంటల పాటు పనిచేస్తున్నారు. గతంలో కనీస వేతనంగా రూ.6,700లుగా గుర్తించిన ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా వీరికి మాత్రం నామమాత్రంగా రూ.1,623 మాత్రమే వేతనంగా చెల్లిస్తుంది. పెరిగిన నిత్యవసర ధరలతో వేగలేక పోతున్న సిబ్బందికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా తొమ్మిది నెలల వేతనాలు చెల్లించలేదు. అసలే నామమాత్రపు జీతాలతో సతమతమవుతుంటే దాన్నీ సక్రమంగా చెల్లించకపోవడంతో వారి కష్టాలు చెప్పనలవి కావు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారులు నిర్లక్ష్యం కారణంగా వారికి తిప్పలు తప్పడంలేదు. గతంలో వీరికి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాగితాలకే పరిమితమైంది. -
కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'
న్యూయార్క్ః ఆధునిక జీవితంలో ప్రతి విషయం ఫింగర్ టిప్స్ పై ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ల్యాప్ లపై ఆధారపడటం తప్పడం లేదు. కొందరు ఆధునిక టెక్నాలజీకి, సామాజిక మాధ్యమాలకు బానిసలు కూడ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతిగా స్క్రీన్ చూడటం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతికి కంటి సమస్యలూ అధికమౌతున్నాయి. ఇందుకు పరిష్కారం దిశగా ఆలోచించిన పరిశోధకులు కంటికి రక్షణ కల్పించే పారదర్శక అద్దాలను అందుబాటులోకి తెచ్చారు. స్క్రీన్ చూసేప్పుడు వాటిని వినియోగించడంవల్ల కాంతిని నిరోధించి కంటికి శ్రమ తగ్గిస్తాయని చెప్తున్నారు. స్క్రీనర్ల పేరిట కాంతిని నిరోధించే ప్రయోగాత్మక పారదర్శక అద్దాలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అధికంగా వాడేవారు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న 28 ఏళ్ళ ఛినో కిమ్ ఆ దిశగా ఆలోచించాడు. ఆధునిక అద్దాలను ధరించడంవల్ల అత్యధిక సమయం స్క్రీన్లు చూసేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాడు. టెక్ సంస్కృతి వైరస్ లా వ్యాపిస్తున్న నేటి తరుణంలో కంటిని కాపాడేందుకు తన నూతన సృష్టి ఎంతగానో సహకరిస్తుందని ఇటీవల జరిగిన ఎన్ వై యు ఇంటరాక్టివ్ టెలికమ్యూనికేషన్స్ కార్యక్రమం స్ప్రింగ్ షోలో తెలిపాడు. 'స్క్రీనర్' ను తలకు ధరించి చూడ్డంద్వారా కంటి సమస్యలనుంచి బయటపడొచ్చని ఛినోకిమ్ చెప్తున్నాడు. దైనందిన జీవితంలో ఎక్కువశాతం స్క్రీన్లను చూసేవారు స్మార్ట్ ఫిల్మ్ తో తయారు చేసిన లెన్స్ కలిగిన ఈ స్క్రీనర్ ను వినియోగిస్తే ఫలితాలు ఉంటాయంటున్నాడు. 'మెషీన్ లెర్నింగ్ ఫర్ ఆర్ట్స్' చదువుతున్న సమయంలో తనకు ఈ కొత్త ఆలోచన వచ్చిందని, బేసిక్ మెషీన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అద్దాలను రూపొందించినట్లు కిమ్ తెలిపాడు. స్క్రీనర్లు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి కూడ రక్షిస్తాయని తెలిపాడు. -
సలాం సిద్ధిఖ్ భాయ్
రూ.7.50కే ప్లేట్ టిఫిన్ విక్రరుుస్తున్న చిరువ్యాపారి నిత్యావసరాల ధరలు మండిపోతున్నా తక్కువ రేటుకే అల్పాహారం కూలీలు, పేదలకు అండగా నిలుస్తున్న మానుకోట వాసి మహబూబాబాద్ : మానుకోటలో ఎక్కడికి వెళ్లినా ప్లేట్ టిఫిన్ ధర రూ.20కి తగ్గకుండా ఉంటుంది. కానీ.. పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిద్ధిఖ్ సెంటర్కు వె ళ్తే మాత్రం రూ.7.50కే ప్లేట్ టిఫిన్ దొరుకుతుంది. నిత్యావసరాల ధరలు మండిపోతున్నా సెంటర్ నిర్వాహకుడు కొన్నేళ్లుగా అల్పాహారం ధరను పెంచకుండా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మానుకోటకు చెందిన మహ్మద్ సిద్ధిఖ్, నూరున్నీసాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పట్టణంలోని కొండపల్లి గోపాల్రావునగర్కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన చిన్నఇల్లు నిర్మిం చుకుని వారు జీవనం సాగిస్తున్నారు. సిద్ధిఖ్ 20 ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వర్కర్గా పనిచేశారు. అరుుతే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో ఆయన వెన్నెముక దెబ్బతినడంతో పాటు కుడికాలు విరిగింది. దీంతో అప్పటినుంచి బరువైన పనులు చేయలేకపోతున్నా రు. ఈ క్రమంలో కుటుంబపోషణ కోసం తొలు త తొర్రూరు బస్టాండ్ సమీపంలో తోపుడు బం డిపై అల్పాహారం (టిఫిన్) విక్రయూలను ప్రా రంభించారు. అనంతరం కొంతకాలానికి అక్క డే గుమ్చీని ఏర్పాటు చేసుకుని అందులో రోజు ఉదయం వేళలో టిఫిన్లను అమ్ముతున్నారు. 2006లో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు రూ. 5కే ప్లేట్ ఇడ్లీ (నాలుగు), రూ.5 కే ప్లేట్ దో శ అమ్మారు. మూడేళ్ల క్రితం నుంచి ఇడ్లీ, దోశ ప్లేట్ రేటును స్వల్పంగా రూ.7.50కు పెంచడం తో కూలీలు, హమాలీలు, ప్రయూణికులు తక్కు వ ధరకు అల్పాహారాన్ని చేసేందుకు ఆసక్తి చూ పుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మినపప ప్పు ధర కిలోకు రూ.200, ఇడ్లీ రవ్వ కిలోకు రూ.25, పల్లీలు కిలోకు రూ.90, మిర్చి కిలో రూ.70 పలుకుతున్నారుు. అరుునప్పటికీ రూ.7.50కే ప్లేట్ టిఫిన్ అందిస్తున్న సిద్ధిఖ్ను వినియోగదారులు అభినందిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నందుకే.. సిద్ధిఖ్ తక్కువ రేటుకు టిఫిన్ విక్రరుుంచేందుకు ఓ కారణముంది. అది ఏమంటే ఆయన కుటుంబ సభ్యులంతా టిఫిన్ సెంటర్ నిర్వహణకు రోజు సాయం చేస్తుంటారు. అల్పాహారం తయూరీకి కావాల్సిన పిండి, తదితర పదార్థాలను ఇంటివద్దే ిసిద్ధిఖ్ భార్యతో పాటు కూతుళ్లు సిద్ధం చేస్తుంటారు. ఇద్దరు కుమారులు ఇడ్లీ బండి వద్ద తండ్రికి చేదోడుగా ఉంటారు. పెద్ద కుమారుడు సాజిద్ పదో తరగతి పూర్తి చేసి సెంటర్లో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు వాజిద్ ఐటీఐ చదువుతూ 10 గంటల వరకు సెంటర్లో పనిచేసి కాలేజీకి వెళ్తుంటాడు. ఉద యం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ప్రతిరోజూ ఇడ్లీ, దోశ కలిపి 200 ప్లేట్ల విక్ర యూలు జరుగుతాయన్నారు. ఇంటిల్లిపాది సెంటర్ నిర్వహణకు సహ కరిస్తుండడంతో నిర్వహ ణ ఖర్చులు తగ్గుతున్నాయని, అందుకే తక్కువ ధరకు టిఫిన్ విక్రయిస్తున్నానని చెప్పారు. కూలీ మాత్రమే గిట్టుబాటు నా భార్య, పిల్లలందరూ సహకరిస్తుండడంతోనే ఇన్నాళ్లుగా తక్కువ రేటుకు టిఫిన్ తయూరుచేసి విక్రరుుస్తున్నా. టిఫిన్ సెంటర్ ద్వారా మాకు పెద్దగా ఆదాయం రాదు. కేవలం కూలీ మాత్రమే గిట్టుబాటు అవుతుంది. తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కుటుంబ సభ్యులమంతా కష్టపడితే అన్ని ఖర్చులు పోనూ రూ.500 మిగులుతారుు. ఎక్కువ ఆదాయం సంపాదించాలనే ఆలోచన లేదు. నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తక్కువ రేటు టిఫిన్ ఇవ్వాలనేదే నా లక్ష్యం. - మహ్మద్ సిద్ధిఖ్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, మానుకోట -
'సాక్షి' ప్రసారాలు పునరుద్దరించాలి
తిరుపతి : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా చిత్తూరు జిల్లాలో ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 28 మండలాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది జర్నలిస్టులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరు నగరంలో వైఎస్సార్సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలతో పాటు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు నగర వీధుల్లో మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు జర్నలిస్టులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పలమనేరు, నాగలాపురం, మదనపల్లి, పెనుమూరు, కార్వేటినగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. -
పీవోకే లో కార్యకలాపాలను ఆపండి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో చైనా తన కార్యకలాపాలను ఆపాలని భారత్ మరోసారి చైనాకు స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీవోకేలో చైనా కార్యకలాపాలను భారత్ అంగీకరించదని స్సష్టం చేశారు. పీవోకే భారత్ లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. షియా తెగ అధికంగా ఉన్న ప్రాంతంమైన గిల్గిత్, బల్టిస్థాన్ ప్రాంతంలో చైనా అనేక కార్యాక్రమాలను చేపపట్టేందుకు చైనా పెట్టుబడులు కుమ్మరిస్తోందని ఆయన తెలిపారు. -
కాంగ్రెస్ అడ్డుపడినా కాళేశ్వరం ఆగదు: హరీష్రావు
నర్సంపేట (వరంగల్): గోదావరి జలాలతో సాగునీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యావులం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో అడ్డుపడినా.. పూర్తిచేసి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వుండలంలోని వూదన్నపేట చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 45 అడుగుల మిషన్ కాకతీయు పైలాన్ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. సభలో మాట్లాడుతూ... నర్సంపేట ప్రాంతంలోని పాకాల, మాదన్నపేట, రంగాయి చెరువులకు దేవాదుల నీటిని తరలించి రెండో పంటకు సాగు నీరందించేందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయమై సోనియాను కలసి మాట్లాడలేదని విమర్శించారు. మనుగడ కాపాడుకునేందుకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. -
స్కూలుకు వెళ్ళేందుకు భయపడిపోతున్నారు!
హర్యానాః రెవారీలో బాలికలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. గత నెల్లో జరిగిన అత్యాచార ఘటనతో బిడ్డల రక్షణే ప్రధానంగా భావిస్తున్న తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో చదువులకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనతో ఆందోళన చెందిన స్థానికులు ఏకంగా బాలికలను చదువకే దూరం చేస్తున్నారు. గతనెల్లో ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం జరగడంతో హర్యానా రెవారీ గ్రామంలోని విద్యార్థినులను పాఠశాలల కు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఏ సమయంలో ఎటువంటి ఆపద ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. పక్కనే ఉన్న సుమాఖేరా గ్రామ పంచాయితీలో ఉన్న ఒకే ఒక్క పాఠశాలకు పిల్లలను బలవంతంగా పంపించాల్సి వస్తోందని, మార్గ మధ్యంలో పిల్లలకు రక్షణ కరువుగా ఉందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలకు వెళ్ళే 38 మంది విద్యార్థినులు చదువు మానుకున్నారు. రెవారీ సమీప గ్రామం లాలా లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలేదని, కనీసం 38 మంది బాలికలు అక్కడి స్కూలుకు రావడం మానుకున్నారని రెవారీ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ తెలిపారు. ఏప్రిల్ 18న జరిగిన అత్యాచార ఘటనతో పొరుగు గ్రామంలోని ప్రభుత్వపాఠశాలకు పంపేందుకు భయపడిపోతున్నారని గార్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల జాబితాలోని 4 నుంచి 7 తరగతుల అమ్మాయిల పేర్లను తొలగించిన పంచాయితీ.. సుమాఖేరాలో పాఠశాలను సీనియర్ సెకండరీ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రైమరీ స్కూళ్ళను అప్ గ్రేడ్ చేసి, సుమాఖేరాలో పాఠశాలను 8వ తరగతి వరకూ పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదే నేపథ్యంలో స్థానికులు శుక్రవారం ధర్నాకు కూడ దిగి, డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ కు వినతి పత్రాలను కూడ అందజేశారు. దీంతో ప్రస్తుతం సుమాఖేరాలోని ప్రైమరీ స్కూల్ ను అప్ గ్రేడ్ చేయడంలో ఆలస్యమైనా.. జిల్లా అధికారులు లాలా గ్రామంలో పాఠశాల భద్రతపై స్థానికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గార్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖటార్ ఇరు గ్రామాల ప్రజలు ఓ అవగాహనకు వచ్చి సుమాఖేరాలో ప్రైమరీ స్కూల్ ను 8వ తరగతి వరకూ అప్ గ్రేడ్ చేసేందుకు సహకరించాలని తెలిపారు. ఇరు గ్రామాల్లోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు కూడ చేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే బాలికలకోసం ప్రవేశ పెట్టిన బేటీ బచావ్, బేటీ పఢావ్ ప్రచారం బాలికల్లో ఏమాత్రం విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడం లేదని, వారికి రక్షణ కరువవ్వడంతో తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్నించేస్తున్నారంటూ ప్రతిపక్ష ఐఎన్ఎల్డీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడాన్ని కూడ ఐఎన్ ఎల్డీ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా తప్పుబట్టారు. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు!
న్యూ ఢిల్లీ: ఇంతకు ముందు మార్కెట్లో మాంచి క్రేజ్ ఉన్న ఫోన్లు కొన్ని ఇప్పుడు పరిమిత సంఖ్యలో వాడుకలో ఉన్నాయి. ఇటీవల ఫేస్బుక్ ఆధీనంలోకి వెళ్లిపోయిన వాట్సప్.. ఇలాంటి కొన్ని మొబైల్లలో ఈ సంవత్సరాంతానికి తమ సేవలను నిలిపేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో ఒకప్పటి పాపులర్ మొబైల్లు ఉన్నాయి. అన్ని బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం వర్షన్ మొబైల్లకు( బ్లాక్ బెర్రీ 10తో సహా), నోకియాకు చెందిన సింబియాన్ యస్40, సింబియాన్ యస్60 వెర్షన్లకు సేవలను నిలిపేయాలని వాట్సప్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2009లో వాట్సప్ను ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మొబైల్ మార్కెట్కు భిన్నమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. మార్కెట్లోని 70 శాతం ఫోన్లకు బ్లాక్ బెర్రీ, నోకియా సంస్థలే ఆపరేటింగ్ సిస్టంను సమకూర్చేవి. ఇప్పుడు మాత్రం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆపరేటింగ్ సిస్టంలు అందిస్తున్న మొబైల్లు 99 శాతం మార్కెట్ను ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగించే మొబైల్ ఫోన్లకు అనుకూలంగా తమ మెసేజింగ్ యాప్ పనిచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
కోమాలో ఉన్నా.. ప్రేమ ఆగలేదు
ముఫ్ఫై ఏళ్ళుగా ఆమెకు భర్తే లోకం... అతడికి సపర్యలు చేయడమే ఆమె జీవితం. మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న మాజీ ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఆటగాడు జీన్ ఫిర్రే ఆడమ్స్ జీవితం.. అనూహ్యంగా తల్లకిందులైంది. సర్జరీ తర్వాత బుద్ధి మందగించి, కోమాలోకి జారుకున్న అతడు నేటికీ మంచానికే పరిమితమయ్యాడు. అయితేనేం ఆయన భార్య బెర్నెడెట్ మాత్రం అతడి సేవే జీవితంగా గడుపుతోంది. అన్యోన్య దాంపత్యానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. భర్త మంచాన పడిన నాటినుంచి బెర్నాడెట్ అతనిని వీడింది లేదు. పంచ ప్రాణాలు అతనిపైనే పెట్టుకొని రేయింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 1982 లో తలకిందులైన జీన్ పిర్రే.. నేటికీ కోలుకోలేదు. ముఫ్ఫై మూడేళ్ళ క్రితం మోకాలినొప్పితో సాధారణ సర్జరీకోసం ఆస్పత్రిలో చేరిన జీన్ పిర్రే తిరిగి కోలుకోలేదు. కానీ ఆయన భార్య బెర్నాడెట్ మాత్రం ముఫ్ఫై ఏళ్ళుగా అత్యంత ప్రేమతో ఆయనకు సేవలు అందిస్తూనే ఉంది. పుట్టినరోజైనా, క్రిస్మస్ పండుగైనా, ఫాదర్స్ డే అయినా జీన్ పిర్రేకు అందరితో సమానంగా బహుమతులను అందిస్తుంది. కోమాలో ఉండి, ఏమాత్రం స్వవిషయాలు పట్టని అతడిపట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం చూపకుండా అత్యంత ప్రేమతో, ఆప్యాయంగా సేవలు అందిస్తోంది. జీన్ ఫిర్రేకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు. ఆస్పత్రిలో ఉండేలాంటి మాడిఫైడ్ బెడ్ పై తన రూమ్ లో పడుకొని, ఒక్క ఊపిరి మాత్రం స్వయంగా తీసుకుంటాడు. ఆయనకు సంబంధించిన మిగిలిన పనులన్నీ భార్య బెర్రాడెట్ చూసుకోవలసిందే. విసుగూ విరామం లేకుండా.. ముఫ్ఫై ఏళ్ళుగా ఆమె అదే ప్రేమతో జీన్ కు సేవలు అందించడం... భార్యాభర్తల బంధానికి నిలువెత్తు నిరద్శనంగా నిలుస్తుంది. ఆ దంపతుల అమితమైన ప్రేమకు తార్కాణంగా కనిపిస్తుంది. ఫ్రాన్స్ నిమెస్ సమీపంలో నివాసం ఉంటున్న బెర్నెడెట్.. ఏ వేడుకైనా జీన్ పెర్రె కు బహుమతిగా ఓ టీ షర్లు కొంటుంది. అతడికి ప్రతిరోజూ బెడ్ పైనే టీ షర్లు మారుస్తుంటుంది. ఎప్పుడూ ఆయన రూమ్ శుభ్రంగా ఉండేట్టు చూసుకుంటుంది. గదిని అందంగా అలకరించడంతోపాటు, సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను కూడ జీన్ ఫెర్రే కోసం కొనుగోలు చేస్తానని చెప్పడం ప్రేమైక జీవనానికి మచ్చుతునకగా చెప్పాలి. 1970ల్లో ఫ్రాన్స్ అంతర్జాతీయ ఆటగాడైన జీన్ పెర్రే మోకాలి శస్త్ర చికిత్స తెచ్చిన అనంతమైన మార్పుతో మంచానికే పరిమితమైపోయాడు. ఆహారం అరుగుదలతోపాటు, కళ్ళు తెరవడం మూయడం తప్ప ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాడు. అయితేనేం అతని భార్య బెర్నాడెట్ ఏమాత్రం అతన్ని నిర్లక్ష్యం చేయలేదు. జీవిత భాగస్వామి అంటే అర్థాన్ని చెబుతూ ప్రతిరోజూ స్నాన పానాదులు చేయించడం, బట్టలు తొడగడం, భోజనం పెట్టడంతోపాటు అతనికి బెడ్ సోర్స్ వంటి ఇతర వ్యాధులు సోకకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఒక్కోసారి అతడు మేల్కొనే సమయాన్ని గుర్తించడంకోసం ఆమె నిద్రపోకుండా రాత్రంగా మెలకువగానే ఉంటుంది. జీన్ ఫెర్నే ను వదిలి బెర్నాడెట్ అత్యంత అవసరమైతేగాని బయటకు వెళ్ళదు. తప్పని పరిస్థితిలో ఒకరోజు గడపాల్సి వచ్చినపుడు కేర్ టేకర్లకు అప్పగించి వెడుతుంటుంది. అయితే ఆ సమయంలో అతని మానసిక స్థితిలో తీవ్రమైన మార్పు ఉంటుందని వారు చెప్పడం... ఆ దంపతుల మధ్య సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. జీన్ ఫెర్రేకు సపర్యలు చేస్తున్నపుడు, ఆహారం తినిపిస్తున్నపుడు అతనిలోని భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్తుంది బెర్నాడెట్. 46 ఏళ్ళ బెర్నడెట్ గత ముఫ్ఫై ఏళ్లుగా తన భర్త ఏ క్షణంలోనైనా కోలుకుంటాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. ఒక్క క్షణం కూడ అతన్ని విడవకుండా కనిపెట్టుకొని ఉంటోంది. తాను సపర్యలు చేస్తుంటే జీన్ స్పర్శను ఫీలౌతున్నారని, అలాగే తన స్వరాన్ని కూడ జీన్ తప్పక గుర్తిస్తాడని ఆశతో ఎదురు చూస్తోంది. -
భారత్కు ఆర్థికసాయాన్ని నిలిపేస్తున్న బ్రిటన్
న్యూఢిల్లీ: భారత్లోని వెనుకబడిన రాష్ట్రాలలో విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం బ్రిటన్ దీర్ఘకాలంగా కేటాయిస్తున్న నిధులను జనవరి 1 నుంచి నిలిపివేయనుంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను మాత్రం పూర్తిచేయనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. మిగిలిపోయిన నిధులను సాంకేతిక సహాయంలో భాగంగా అందించనున్నట్లు తెలిపింది. 2013-15 మధ్య కాలంలో ఒడిషా, బిహార్, ఛత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిటన్ నుంచి సుమారు రూ. 850 కోట్ల ఆర్థిక సహాయాన్ని భారత్ పొందింది. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ కేటాయిస్తున్న నిధుల్లో బ్రిటన్ అందించే సహాయం వాటా చాలా తక్కువని, ఆ నిధులు లేకపోయినా భారత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రణబ్ వ్యాఖ్యలపై బ్రిటన్లో పెద్ద దుమారమే రేగింది. బ్రిటన్ భారత్కు అందిస్తున్న స్వల్పసాయం పట్ల ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కు అందిస్తున్న సహాయాన్ని 2016 జనవరి 1 నుంచి నిలిపివేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐదు అంశాలలో సహకారానికి బ్రిటన్తో భారత్ ఒప్పందం కుదుర్చకుంది. ఇందులో వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారంతో పాటు పట్టణ మౌలిక వసతులు, శక్తి వనరుల పెంపు తదితర అంశాలు ఉన్నాయి. -
ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..
► రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ సేవల చార్జీల అంశం తేలేంత వరకూ ఈ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాల్సిందిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ను (ఆర్కామ్) ట్రాయ్ ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన నియమ, నిబంధనల వివరాలు ఇవ్వాలంటూ కంపెనీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్ మాధ్యమానికి ప్రాచుర్యంలోకి తెచ్చేదిగా పేర్కొంటూ... సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్.. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించేందుకు ఫ్రీ బేసిక్స్ సర్వీసును తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్లో ఆర్కామ్తో చేతులు కలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ అనేది నెట్ న్యూట్రాలిటి (వెబ్సైట్ల విషయంలో వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించడం) నిబంధనకు విరుద్ధంగా ఉందని వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ సేవలకు సంబంధించి వివిధ కస్టమర్ల నుంచి వివిధ రకాలుగా వసూలు చేసే చార్జీలు, నియమ నిబంధనలు, షరతుల వివరాలు ఇచ్చే దాకా ఈ సేవలను ఆపేయాలంటూ డిసెంబర్ 1న ఆర్కామ్కు ట్రాయ్ సూచించింది. డిసెంబర్ 7న ట్రాయ్కి లేఖ రాసిన ఆర్కామ్.. డిసెంబర్ 9 దాకా గడువు కోరింది. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో ట్రాయ్ మరోసారి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ట్రాయ్ ఆదేశాల మేరకు అనుమతులు వచ్చేదాకా ఫ్రీ బేసిక్స్ వాణిజ్యపరమైన సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఆర్కామ్ వర్గాలు తెలిపాయి. -
'ఇంటర్వ్యూలకు స్వస్తి!'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో బంధుప్రీతి, అశ్రిత పక్షపాతానికి స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు జూనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు ముఖాముఖిలను(ఇంటర్వ్యూలు) నిర్వహించే విధానానికి శుభంకార్డు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త విధానంలో నైపుణ్య పరీక్షలు, ఫిజికల్ టెస్టులు వంటివి ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సమాచారం. దీని ప్రకారం రాతపూర్వక పరీక్షల్లో మాత్రమే అభ్యర్థులు తమ ప్రతిభను కనబరుచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ తప్పకుండా ఆ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ అని భావిస్తే మాత్రం సిబ్బంది వ్యవహారాలశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరుగుతుందని, ఇంటర్వ్యూల పేరిట బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం జరుగుతుందని, దానికి స్వస్తి పలకాలని ప్రధాని మోదీ జెండా వందనం సందర్భంగా ఎర్రకోటపై ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలను రద్దు చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ప్రధాని చెప్పారు. -
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
-
మంచంపట్టిన మందుబాబులు !
-
'అనంత'లో పోలీసుల అత్యుత్సాహం
-
టాటూతో తంటాలు..!
కొత్త సినిమా వచ్చినా... అభిమాన నాయకుడు గెలిచినా.. టీవీ సీరియల్ లో ఓ క్యారెక్టర్ కు కాస్త ఇంపార్టెన్స్ పెరిగినా ఇంకేముంది యూత్ ఒంటిపై ఆ టాటూ కనపడాల్సిందే. ఇటీవల బాహుబలి సినిమాకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ లభించడంతో హీరో ప్రభాస్ టాటూ.. చైనాలో ఓ ఊపు ఊపింది. అలాగే ఒకానొక సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై తమ అభిమానం ప్రదర్శించాలనుకున్న ప్రజలు ఒంటిపై మోడీ పచ్చబొట్లను వేయించుకొన్నారు. ఇంతకీ ఈ టాటూల గొడవంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే టాటూలంటే అంత క్రేజ్ చూపించే యూత్ ప్రస్తుతం అవి చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఆకర్షణకోసం వేసుకున్న టాటూ న్యూయార్క్ కు చెందిన టిఫనీ పాస్టిరారో జీవితంలో ఓ పెద్ద అగాధాన్ని నింపింది. ఆమెకు సోకిన వింత వ్యాధి టాటూ వల్లనే అని తెలియడంతో ఆమెకు దగ్గరగా నిలబడేందుకు కూడ జనం భయపడుతున్నారు. విటిలిగో పేరున పిలుస్తున్న ఈ వ్యాధి ఆమెను ఎంతో ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తి కూడ చెందుతుండటం అందర్నీ వణికిస్తోంది. చర్మవ్యాధితో బాధపడుతున్న పాస్టిరారో ఒంటినిండా తెల్లని, నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను అందరూ దూరంగా పెట్టడమేకాక, హేళనగా కూడ మాట్లాడుతున్నారంటూ బాధపడుతోంది. తన శరీరంపై ఏర్పడిన మచ్చలు కనపడకుండా ఉండేందుకు దట్టంగా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టింది. అయితే అమెరికన్ టాప్ మోడల్స్ కంటెస్టెంట్ 2014 విన్నీ హార్లో ఓ టీవీలో శరీరంపై మచ్చలతో కనిపించడంతో పాస్టిరారో ఆశ్చర్యపోయింది. ఆమె మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని ఓ సందర్భంలో ప్రశ్నించింది కూడ. "విటిలిగో వ్యాధి సోకిన మరికొంతమంది కూడ ఉన్నారని నేను మొదటిసారి చూస్తున్నాను. మీకు కూడ ఈ వ్యాధి ఉందా? అని అడిగినప్పుడు ఆమె నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరిని పరిచయం కూడ చేసింది." అంటూ పాస్టిరారో విన్నీహార్లోతో మాట్లాడిన అనుభవాలను పలువురితో పంచుకుంటోంది. అంతేకాదు ఓ పెద్ద టాటూను తన శరీరంపై ఏర్పడ్డ మచ్చలపై వేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే టాటూ అభిమానుల్లో అవగాహన కలిగిస్తోంది. మరో అడుగేసి తనగురించి ఫేస్ బుక్ లో వివరాలు పెట్టి టాటూవల్ల కలుగుతున్న నష్టంపై జనంలో చైతన్యం రావాలని ఆశిస్తోంది. ఇంతకీ ఈ పచ్చబొట్లు ఎంత పురాతనమో తెలుసా! ఈ పచ్చబొట్ల చరిత్ర ఇప్పటిది కాదు... వేల సంవత్సరాల క్రితమే టాటూల సంప్రదాయం ఉన్నట్లు ఇటీవల బయటపడ్డ ఓ మమ్మీని బట్టి తెలిసింది. ఆ మమ్మీ శరీరంపై దాదాపు 61 టాటూలు ఉన్నట్లు గుర్తించారు. అంటే టాటూల క్రేజ్ జనంలో ఎంతగా ఉందో అర్థమౌతుంది. -
టవర్ నిర్మాణం ఆపాలి
విజయనగరం: ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏర్పాటు చేయ తలపెట్టిన రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలసలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామ శివారులోని గార్డెన్స్ సమీపంలో గ్రామస్తుంలంతా కలిసి ధర్నా నిర్వహించారు. సెలటవర్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశారు. -
బాల్యవివాహాలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరు : గుంటూరు జిల్లాలో పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలో ఆరు బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహాలు జరుపుతున్నట్టు గురువారం పోలీసులకు సమాచారం రావడంతో వివాహా మండపాలకు చేరుకొని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమం కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కాగా, కుటుంబసభ్యులు అధికారుల నుంచి నకిలీ దృవ పత్రాలతో రేషన్ కార్డులను మధ్యవర్తుల ద్వారా సంపాదించారు. వాటిని అడ్డుగా పెట్టుకొని ఈ వివాహాలకు పాల్పడుతున్నారు. కాగా, పోలీసులు తమ విచారణలో బాలికలకు వయస్సు సుమారు 12 నుంచి 13 ఏళ్లుగా గుర్తించారు. (పెదకూరపాడు) -
కానిస్టేబుల్ ఓవరాక్షన్.. ఆగిన ప్యాసింజర్
హైదరాబాద్: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రైల్వే కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణంగా ప్యాసింజర్ రైలు ఆగిపోయింది. రైల్వే స్టేషన్లో చేయి తగిలిందనే కారణంగా హనుమంతు అనే కానిస్టేబుల్ ఓ ప్రయాణికుడిని చితకబాదాడు. కానిస్టేబుల్ దురుసుతనంపై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో మాచర్ల ప్యాసింజర్ స్టేషన్లో ఆగిపోయింది. -
అక్రమ బస్సులను అరికట్టండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి తీవ్రనష్టం కలిగించేలా జరుగుతున్న అక్రమరవాణాను నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మేనేజింగ్ డెరైక్టర్ పూర్ణచంద్రరావు సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితిని సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను ఆయన అధికారులకు వివరించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎం, డీవీఎం, డీఎంలతో ఆయన మాట్లాడారు. అక్రమ రవాణాను నిరోధించడాన్ని ప్రధాన కార్యక్రమంగా భావించాలని పేర్కొన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ఫొటోలు తీసి స్థానిక రవాణా, పోలీసు శాఖ అధికారులకు అందజేసి వారి సహకారంతో వాటిని నియంత్రించాలని సూచించారు. బస్సుస్టాపుల్లో ఆపే ప్రైవేటు వాహనాల ఫొటోలనూ తీసి అధికారులకు పంపాలన్నారు. పర్మిట్లకు విరుద్ధంగా తిరిగే సెట్విన్ బస్సులపై రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రవాణాశాఖ అధికారులతో జరిపే సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేయాలని ఆదేశించారు. కొత్తగా 500 బస్సులు కొంటున్నందున ఆయా డిపోల పరిధిలోని కాలంచెల్లిన బస్సుల పూర్తి వివరాలను సిద్ధం చేయాలన్నారు. సిద్ధిపేట నుంచి తిరుపతికి సూపర్ లగ్జరీ , సిద్ధిపేట-హన్మకొండ మధ్య ఎక్స్ప్రెస్ బస్సులు తిప్పాలని, సిద్ధిపేట నుంచి ముంబైకి బస్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వరంగల్ -సూరత్ మధ్య బస్సులు నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. బస్సుస్టాండ్లను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఖాళీ స్థలాల్లో చెట్లు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదేశించారు. -
రేపు ఆర్టీసీ బస్సులూ ఉండవు!
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నందున ఆ రోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వే రోజున సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, బ్యాంకులు కూడా సెలవు ప్రకటించేశాయి. హోటళ్లు, సినిమా థియేటర్లు సైతం తెరుచుకోవు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోవటంతో బస్సులు నడపకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులనే వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువేల బస్సులు ఉపయోగించే అవకాశం ఉంది. మిగిలిన 4 వేల బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తే పరిమితంగా బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. అద్దె చెల్లిస్తేనే ఏర్పాట్లు... తెలంగాణవ్యాప్తంగా బస్సులు తిరగని పక్షంలో ఆర్టీసీ రోజుకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది. డీజిల్ రూపంలో దాదాపు రూ.5 కోట్లు, మెయింటెనెన్స్ ద్వారా రూ.2 కోట్ల మేర పొదుపు నమోదైనా రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో సర్వే కోసం ఆర్టీసీ బస్సులను విగినియోగిస్తే అందుకు అద్దె చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు సంస్థ తేల్చి చెప్పింది. ఒక్కో బస్సుకు రూ.11,200 చొప్పున అద్దె చెల్లించాలని పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 1,100 బస్సుల కోసం కలెక్టర్ల నుంచి విజ్ఞాపనలు అందాయి. సోమవారం మధ్యాహ్నానికి ఐదు నుంచి ఆరు వేల బస్సులు బుక్కయ్యే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం పాఠశాలల బస్సులను బుక్ చేసుకుంటున్నాయి. కాగా, 19న బస్సులు తిప్పకూడదని ఆర్టీసీ నిర్ణయించినా.. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు రావాల్సి ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉన్నందున వారు ఇళ్ల వద్ద లేకున్నా సర్వేకు ఇబ్బంది ఉండదని, సర్వే సిబ్బంది దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. మరీ అంత అవసరమైతే అత్యవసర విధుల్లో ఉన్నట్టుగా కలెక్టర్ల నుంచి పత్రాలు తెప్పించి జారీ చేస్తామని పేర్కొంటున్నారు. -
బంగాళాఖాతంలో బోటు గల్లంతు
హైదరాబాద్: బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతయింది. ఇందులో ఆరుగురు మత్స్యకారులున్నారు. బోటు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సముద్రంలో ఆగిపోయింది. మత్స్యకారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని బంధువులకు తెలియజేశారు. నడిసముద్రంలో చిక్కుకుపోయామని తెలిపారు. మూడు రోజుల క్రితం వీరు ఉప్పాడ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. -
ఆగిన ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు సవ్యంగా అందని బిల్లులు రెండు నెలలుగా ముప్పు తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. అధికారులు బిల్లులు చెల్లించకపోవటంతో... చేతిలో డబ్బులు లేక లబ్ధిదారులు పనులు పక్కన పెట్టేశారు. బిల్లులు ఎప్పుడు అందుతాయో తెలియక గృహనిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక మొత్తం విడుదల కాకపోవడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఇటీవలి వరకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను గృహనిర్మాణ సంస్థ ఎండీ ఆధ్వర్యంలో విడుదల చేసేవారు. ప్రభుత్వం ఆ త్రైమాసిక మొత్తాన్ని ఎండీ ఖాతాలో వేసేది. దాన్ని ఆ నెలకు సంబంధించి అధికారులు రూపొందించిన నివేదిక ఆధారంగా లబ్ధిదారులకు చెల్లించేవారు. కానీ గత నవంబర్లో ఈ విధానాన్ని మార్చి... నేరుగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు జరిపే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం నేరుగా సంబంధిత బ్యాంకుల నుంచే లబ్ధిదారుల ఖాతాలోకి బిల్లుకు సంబంధించిన డబ్బులు వెళ్లిపోతాయి. ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు గృహ నిర్మాణ సంస్థలో ప్రత్యేకంగా ఓ చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో అధికారిని నియమించారు. పాత విధానం అమలులో ఉన్నప్పుడు చెక్కులు రూపొదించటం, వివరాలు నమోదు చేయటం, ఆ నిధులు ఖాతాలకు మళ్లించటం.... తదితర కసరత్తు వల్ల కొంత ఆలస్యంగా బిల్లులు అందేవి. కానీ కొత్త విధానం వల్ల కేవలం మూడు రోజుల్లోనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలోకి చేరిపోతాయంటూ అధికారులు ప్రచారం చేశారు. తొలి నెలలో అనుకున్నట్టే అమలైంది. కానీ.. జనవరి నుంచి సమస్య మొదలైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం దాదాపు రూ.100 కోట్లు విడుదల చేశారు. వీటితో ఆ నెల 21 వరకు పెండింగుపడిన బిల్లులు చెల్లించేశారు. మిగతా నిధులు రాకపోయేసరికి దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు చెందిన లబ్ధిదారులు పనులు నిలిపివేసి బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. తుదకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నిధులెప్పుడొస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన కసరత్తు ముమ్మరం కావటంతో సచివాలయంలోని ఉన్నతాధికారులు ఆ పనిలో నిమగ్నమై దీన్ని గాలికొదిలేశారు. ఫిబ్రవరి 24 వరకే అందాయి ‘‘ఫిబ్రవరి 24 వరకు నిధులు అందాయి. వాటిని లబ్ధిదారులకు చెల్లించాం. ఆ తర్వాత నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం నేను వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నందున... నిధులు ఎప్పుడొచ్చే విషయంపై సమాచారం లేదు.’’ - గృహనిర్మాణ సంస్థ సీజీఎం జగదీశ్బాబు నెలన్నరగా కాళ్లరిగేలా తిరుగుతున్నం ‘‘ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలుపెట్టి నెలన్నర క్రితమే బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నం. మొదటి విడత బిల్లు కోసం అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా నిధులు లేవని చెప్తున్నరు. వ్యవసాయ కూలీ పనిచేసుకునే మాకు పైసలెక్కడినుంచి వస్తయ్. చేసేదిలేక పని ఆపేసినం.’’ -ఉప్పరి పుణ్యవతి, నాగిరెడ్డి గూడ, రంగారెడ్డి జిల్లా పీడీల ఆవేదన: ‘‘పరిస్థితి దారుణంగా ఉంది. బిల్లులు ఎప్పుడొస్తాయంటూ లబ్ధిదారులు కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వచ్చి నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక మేము కార్యాలయాలకు వెళ్లలేం. లబ్ధిదారుల నిలదీతను తట్టుకోలేం’’ అంటూ పలు జిల్లాల పీడీలు పేర్కొంటున్నారు. -
పార్టీల రంగులు బయటపడుతున్నాయి..
నందిపేట న్యూస్లైన్ : తెలంగాణపై ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన ఒక్కో పార్టీ రంగులు ఇప్పుడు బయటపడుతున్నాయని మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకునేందుకు త్వరలోనే తుపాను వస్తుందంటూ కొందరు నాయకులు పగటి కలలు కంటున్నారని, ఏ తుపాన్ వచ్చినా అది టీ కప్పులోవచ్చే తుపానుతో సమానమన్నారు. మంగళవారం మండలంలోని వెల్మల్, కౌల్పూర్, కంఠం, అయిలాపూర్ గ్రామాలలో జరిగిన జండాపండుగ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్బిన్హందాన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సురేశ్రెడ్డి మాట్లాడారు. ఎటువంటి రాజకీయ ప్రయోజ నాలు ఆశించకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటుపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేం దుకే జండాపండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కౌల్పూర్ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పా టు చేయిస్తానని హామీనిచ్చారు. అయిలాపూర్లో మహిళా భవనం నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తాహెర్ మాట్లాడుతూ వాస్తవాలను ధైర్యంగా చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో బతికి ఉండగానే సమాధులు కట్టిన టీడీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
కంచికి చేరని ‘చోరీ కథలు’
కామారెడ్డి, న్యూస్లైన్: భారీ కేసులలో దొంగలు చిక్కడం లేదు. బంగారం రికవరీ లేదు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో భారీ దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కేసూ పరిష్కారం కాలేదు. చోరీలు జరిగినపుడు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం, కొంత కాలం ఆ బృందాలు విచారణ నిర్వహించి తరువాత మరిచిపోవడం జరుగుతోంది. కామారెడ్డిలో గడచిన మూడేళ్ల కాలంలో రూ. కోటిన్నరకు పైగా విలువైన బంగారం, నగ దు చోరీ జరిగింది. భారీ దొంగతనాలతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో పట్టణంలోని పలు కాలనీలలో దొంగతనాలు పెరిగాయి. ఇళ్లకు తాళం వేసి ఉంటే చాలు దొంగలుపగులగొట్టి ఇళ్లల్లో నుం చి బంగారం, నగదు, ఇతర వస్తువులను దోచుకెళ్లడం పరిపాటిగా మారింది. పట్టణ పోలీసులు పెట్రోలింగు పేరుతో హడావుడి చేయడమే తప్ప దొంగతనాలను నిరోధించలేకపోయారన్న అపవాదు మిగిలింది. ఇదే సమయంలో పగ టిపూట మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాల దొంగతనాలు కూడా ఎక్కువగానే జరిగాయి. తాళాలేసిన ఇళ్లల్లో దొంగతనాలు, మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం పరిపాటిగా మారి న పరిస్థితుల్లో వాటిని ఛేదించేందుకు అపసోపాలు పడుతు న్న పట్టణ పోలీసులు భారీ దొంగతనాల విషయాన్ని పట్టిం చుకునే పరిస్థితులలో లేరనే చెప్పాలి. దీంతో పట్టణంలో జరిగిన భారీ బంగారం చోరీ కేసులు పరిష్కారానికి నోచు కోవడం లేదు. పట్టణంలో పోలీసులు ప్రధానంగా తమకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చడమే తప్ప ఇలాం టి కేసుల విషయంలో ఆసక్తి చూపడం లేదన్న అపవాదులు మూటగట్టుకున్నారు. మరుగున పడిన బంగారం చోరీ కేసులు.. 2010లో గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి కామారెడ్డిలోని బంగారు వ్యాపారులను కలిసి తిరుగు ప్రయాణంలో బస్టాండ్కు వెళ్లారు. బస్సు ఎక్కుతున్నపుడు తన వద్ద ఉన్న ఐదు కిలోల బంగారం బ్యాగును దొంగలు తస్కరించారు. ఆ కేసు ఇప్పటి వరకు కొలిక్కిరాలేదు. 2011లో పట్టణంలోని స్టేషన్రోడ్డులో కైలాస్ శేఖర్ తన ఎలక్ట్రానిక్స్ షాపును మూసి వేసి ద్విచక్ర వాహనంపై జయప్రకాశ్నారాయణ విగ్రహం సమీపంలోని ఇంటికి చేరారు. వాహనం దిగేలోపే ఆయన బ్యాగును దొంగలు అపహరించుకు వెళ్లారు. బ్యాగులోని రూ. లక్ష నగదుతో పాటు రూ.లక్ష విలువైన బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డులు దొంగల పరమయ్యాయి. 2012 సెప్టెంబర్లో పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద జిరాక్స్ సెంటర్ యజమానికి లక్ష్మన్ దుకాణాన్ని మూసివేసి విద్యానగర్లోని తన ఇంటికి వెళ్లారు. ఆయనను వెంబడించిన దొంగలు అతని వద్ద ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. బ్యాగులో రూ. 30 వేల నగదు ఉన్నట్టు అప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2012 అక్టోబర్ ఐదున పట్టణంలోని శివం జువెల్లర్స్ యజమాని పాత శ్రీనివాస్ రోజులాగే రాత్రి తన దుకాణాన్ని మూసి వేసి కిలోన్నర బంగారం, ఆభరణాలతో పాటు రూ. 10 లక్షల నగదును బ్యాగులో తీసుకుని వీక్లీమార్కెట్లోని తన ఇంటికి వెళ్లారు. ఇంటిదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇంట్లోకి వెళ్లే సమయంలో గుర్తుతెలి యని దుండగులు బ్యాగును లాక్కుని పారిపోయారు. అప్పుడు బంగారం, నగదు కలిపి రూ. 58 లక్షల విలువ కట్టారు. 2012లో పట్టణంలోని పలు బంగారం దుకాణాల్లో పట్టపగలే మహిళలు వెండి ఆభరణాలు దొంగిలించారు. దొంగతనం విషయం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా పోలీసులు విచారణజరిపినా దొంగలు చిక్కలేదు. -
కంప్యూటర్ మిథ్య
భద్రాచలం, న్యూస్లైన్ :జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఆశ్రమ పాఠ శాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రభుత్వం మంగళం పాడింది. గత రెండేళ్లుగా విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించడం లేదు. నిధుల లేమి కారణంగా ఈ విషయంలో తామేమీ చేయలేమని ఐటీడీఏ అధికారులు సైతం చేతులెత్తేశారు. గిరిజన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కల్పించి, వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2005లో ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. దీనిపై ఎంతో శ్రద్ధ కనబరిచి భారీగా నిధులు కేటాయించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోవటంతో ఇక ఈ పథకానికి మంగళం పాడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని 41 ఆశ్రమ పాఠ శాలలో ‘గిరిప్రజ్ఞ’ పేరుతో 2005లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. 3 నుంచి 9వ తరగతి వరకు చుదువుతున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా ప్రయోజనం చే కూరేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ విద్యను బోధించేందుకు పాఠశాలకు ఇద్దరు చొప్పున 82 మంది వలంటీర్లను నియమించారు. వీరికి వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద ఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. 2005 నుంచి నాలుగేళ్ల పాటు విన్ఫో వేవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ విద్య నిర్వహణ బాధ్యతలు చూశారు. అయితే క్షేత్ర స్థాయిలో సరైన ఫలితాలు రాకపోవడమే కాకుండా వలంటీర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, కంప్యూటర్ల మరమ్మతులపై దృష్టి సారించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో శరత్ ఐటీడీఏ పీవోగా ఉన్న సమయంలో ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించారు. కంప్యూటర్ విద్య నిలిచిపోకూడదనే ఉద్దేశంతో ఈ బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ ద్వారా చేపట్టాలని శరత్ నిర్ణయించారు. కొంతకాలానికి నిధుల లేమితో బోధకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోయింది. ప్రస్తుతం ఐటీడీఏ అధికారులు కూడా దీని గురించి పట్టించుకోకపోవటంతో విద్యాశాఖాధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మాయమైన కంప్యూటర్ సామగ్రి... కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా బోధనకు సరఫరా చేసిన సామగ్రి మాయమైనట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు పది కంప్యూటర్లు, పది యూపీఎస్లు, సరిపడా సీడీలు, రెండేసి ప్రింటర్లు, మరో రెండు లేజర్ ప్రింటర్లు, రెండు డిజిటల్ కెమెరాలు, రెండు స్కానర్లు అందజేశారు. తక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఏడు చొప్పున మొత్తం 250 కంప్యూటర్లు సరఫరా చేశారు. అయితే వీటిలో కంప్యూటర్లు మినహా మరే ఇతర వస్తువులు పాఠశాలల్లో కనిపించడం లేదు. అవి ఏమయ్యాయనే దానిపై ఇప్పటి వరకూ తగిన పరిశీలన లేకపోవటంతో మిగిలిన వస్తువులను కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఐటీడీఏ పీవోగా ప్రవీణ్కుమార్ ఉన్న సమయంలో కంప్యూటర్ విద్యను గాడిలో పెట్టేందుకు వీటికి మరమ్మతులు చేయించారు. ఇందుకోసం రూ.2.69 లక్షలు ఖర్చు చేశారు. అయితే రిపేర్ల పేరుతో భద్రాచలం తీసుకొచ్చిన కంప్యూటర్ సామగ్రి కొంత తిరిగి పాఠశాలలకు వెళ్లలేదనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కానీ దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టి సారించకపోవటంతో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్, కెమెరాలు చాలాచోట్ల మాయమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు దీనిపై దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలే అంటున్నాయి. జడ్పీ పాఠశాలల్లోనూ మూసివేతేనా..? జిల్లా పరిషత్ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్యా బోధిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ నిధులతో దీనిని అమలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు కంప్యూటర్ విద్యాబోధన చూసే బాధ్యతను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అనే సంస్థకు అప్పగించారు. వీరి కాంట్రాక్ట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఇక జడ్పీ పాఠశాలల్లోనూ కంప్యూటర్ విద్యాబోధన అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అంతా కంప్యూటరైజేషన్తోనే పనులు సాగుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంలోనే ఎక్కుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన సవాలక్ష సమస్యల నడుమ సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జడ్పీ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : నాంపల్లి రాజేష్, ఏజెన్సీ డీఈవో ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ సామగ్రి అంతా మరమ్మతులకు గురయ్యాయి. వీటిని రిపేర్ చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఈ ఏడాది కంప్యూటర్ విద్యాబోధన అనుమానమే. అయితే భవిష్యత్లో దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము. జడ్పీ పాఠశాలల్లో ఈ నెలాఖరుతో కాంట్రాక్టు గడువు ముగుస్తున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి కంప్యూటర్ శిక్షణ ఇప్పించి విద్యా బోధన జరిగేలా దృష్టి సారించాము. -
తుఫాన్’ను అడ్డుకుంటాం
ఖలీల్వాడి, న్యూస్లైన్ : కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను అడ్డుకుని తీరుతామని విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సామాజిక తెలంగాణ అంటూ ప్రజల వద్దకు వచ్చిన చిరంజీవి తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా మారిన చిరంజీవి కుటుంబ సభ్యులు నటించే సినిమాలను అడ్డుకుంటామన్నారు. తుఫాన్ సినిమా తెలంగాణలో విడుదల కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి ప్రగతి, నాయకులు మర్రికిరణ్, సాయి, శ్రావణ్తివారి, లక్ష్మణ్, ప్రశాంత్, సుమన్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’ దోపిడీపై ఆందోళన
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్లైన్:సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకుండా ఉంటే ప్రజల నుంచి అధిక మొత్తం రాబట్టి దోపిడీ చేయడం సరికాదంటూ జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శనివారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపై ధ్వజమెత్తారు. రాత్రి వేళ బస్సులు తిప్పవద్దని, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరేందుకు శనివారం జేఏసీ నాయకులు ప్రొద్దుటూరులోని బీబీవీఆర్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లారు. బస్సుల తిప్పి తీరుతామంటూ యాజమాన్యం జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్రావెల్స్ నిర్వాహకుల వ్యవహార శైలికి నిరసనగా జేఏసీ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేటు ట్రావెల్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఉద్యమానికి అండగా నిలిస్తే ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారు హైదరాబాద్కు వెళ్లే ఒక్కో టికెట్కు రూ.1500 రాబట్టి దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీన్ని అరికట్టకపోతే బస్సులకు జరిగే నష్టానికి తమది బాధ్యత కాదని తేల్చి చెప్పారు. బస్సులు తిరిగితే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సీఐ బాలిరెడ్డి, ఎస్ఐ ఇబ్రహీం ఆ ప్రాంతానికి చేరుకుని జేఏసీ నాయకులతో మాట్లాడారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ట్రావెల్స్ భవనంలోకి సమైక్యవాదులు ఎక్కువ మంది చేరుకోవడంతో తొపులాటలో గదిలో ఉన్న ఒక అద్దం పగిలిపోయింది. ఓ వ్యక్తి జేఏసీ ఉద్యమానికి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం లక్ష రూపాయలు ఇచ్చిందని మాట్లాడటంతో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ చేరుకున్నారు. ఎవరికి ఇచ్చారని నిలదీయడంతో ఉద్యమంలో వంటావార్పు సమయంలో డబ్బు ఖర్చయిందని ట్రావెల్స్ యాజమాన్యం మాట మార్చింది. సీఐ బాలిరెడ్డి బీబీవీఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి జేఏసీ ఆర్టీసీ నాయకులను అక్కడి నుంచి పంపించారు. జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, మాదాసు మురళీ, ఆర్టీసీ యూనియన్ నాయకులు ఎన్నార్ శేఖర్, టీవీఆర్ రెడ్డి, మాచయ్య, కార్మికులు కాళేశ్వరి, బీసీవీఆర్, ఇందు ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వెళ్లి సమైక్యాంద్రకు సహకరించి బస్సులు తిప్పకుండా ఉండాలని కోరారు. -
వ్యూహాలు లేని మంత్రాంగం
-
కర్నాటక ఎక్స్ప్రెస్ను నిలిపేసిన ఉద్యమకారులు