బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతయింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతయింది. ఇందులో ఆరుగురు మత్స్యకారులున్నారు. బోటు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సముద్రంలో ఆగిపోయింది.
మత్స్యకారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని బంధువులకు తెలియజేశారు. నడిసముద్రంలో చిక్కుకుపోయామని తెలిపారు. మూడు రోజుల క్రితం వీరు ఉప్పాడ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు.