
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది.
► అత్యధికంగా కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.
► నేడు అర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురం జిల్లా పర్యటించనున్నారు.
► నేడు గుంటూరు నగరంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్టు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్రావు తెలిపారు.
తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 334కు చేరింది.
► ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
► తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జాతీయం:
► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,289 కి చేరింది.
► ఇప్పటివరకు దేశంలో 118 మంది మృతి చెందగా, 328 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► మహారాష్ట్రలో 748 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు.
► తమిళనాడులో 571 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.
► ఢిల్లీలో 503 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12.71 లక్షలు దాటింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 69 వేలు దాటింది.
► ఇప్పటివరకు 2.61 లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.36 లక్షలు దాటింది
► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 9,602 మంది మృతి చెందారు.