అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కారాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రామాంజనేయరెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థి వర్గం హత్య చేశారు. శనివారం ఉదయం ఏదో చిన్నపాటి విషయంలో తగాదా పడ్డ ఇరు కుటుంబాలు మాటామాటా పెంచుకుని హత్యల దాకా దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.