అన్నీ మానవీయ కోణంతో ముడిపడిన కేసులే..
పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకెళ్లాలి
కాల్మనీ వర్క్షాపులో పలువురు వక్తలు
సాంఘిక దురాచారంగా మారిన కాల్మనీ కోరలు పీకాలని విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన కాల్మనీ వర్క్షాప్లో పలువురు పేర్కొన్నారు. సామాజిక చైతన్యం, బ్యాంకర్ల పూర్తి సహకారం ఉన్నప్పుడే ఈ కేసులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. పోలీసులు విస్తృత ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు.