ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం | MMTS Train Accident At Nampally Station | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం

Published Wed, Oct 9 2013 9:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

MMTS Train Accident At Nampally Station

హైదరాబాద్: లింగంపల్లి-ఫలక్నుమా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయింది.  రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది.

క్యాబిన్లో ఇరుక్కునపోయిన డ్రైవర్ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement