
ప్రతీకాత్మక చిత్రం
తిరుమల : ఈ ఏడాది మరిన్ని అద్భుతమైన ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని శివన్ దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..జీఎస్ఎల్వీ ఉపగ్రహాన్ని రేపు(గురువారం) ఉదయం 4:56 నిముషాలకు నింగిలోకి ప్రవేవపెట్టనున్నట్లు తెలిపారు.
కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని చెప్పారు. మరో 15 రోజుల్లో పీఎస్ఎల్వీ ఉపగ్రహం ప్రయోగం ఉంటుందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం చంద్రయాన్ ఉపగ్రహం ప్రయోగిస్తున్నామని, ఏప్రిల్లో చంద్రయాన్ ప్రయోగాత్మక పరిశీలన ఉంటుందని, అక్టోబర్లో పూర్తి స్థాయిలో ప్రయోగిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment