21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు | on 21 Delhi CM Chandrababu | Sakshi
Sakshi News home page

21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Published Thu, Nov 20 2014 2:01 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు - Sakshi

21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు  ఈ నెల 21వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమల రాయితీలు తదితర అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
 
23 నుంచి 29 వరకు బాబు జపాన్ పర్యటన: సీఎం చంద్రబాబు  ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు కనీసం 40 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు పాల్గొంటారు. సీఎంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణతో పాటు కమ్యునికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement