State Division
-
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
విభజన తెరిచిన కొత్త తలుపులు
ప్రస్తుతం ఏపీలో నెలకొని ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల కోసం ముప్పై ఏళ్ల క్రితం 1994లో జరిగిన ఎన్నికల ముందు పంజాబ్కు చెందిన మాజీ రక్షణశాఖ అధికారీ, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం ఏడాది పాటు ఇక్కడ ‘క్యాంప్’ చేసి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం అప్పట్లో ఆయన వెతుకులాడారు. అయితే ఆయన ఆశించిన సామాజిక సమీకరణాలు ఇక్కడ లేవని నిర్ధారించుకున్నాక ఆయన వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన ప్రయత్నం ఫలించి ఉత్తరప్రదేశ్లో 1995లో సమాజవాదీ పార్టీ మద్దతుతో బీఎస్పీ నుంచి మాయావతి తొలి ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యారు. అవే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ను ఓడించి ఎన్టీఆర్ గెలవడంతో 1995లో చంద్రబాబు ‘మార్క్’ టీడీపీ రాజకీయాలకు తెలుగునాట మార్గం సుగమం అయింది. అప్పటి నుంచి యూపీ – ఏపీ రాజకీయాలు రైలు పట్టాలు మాదిరిగా సమాంతరంగానే ఉంటూ ఎక్కడా సారూప్యత లేని రీతిలో ఉన్నాయి. ఉత్తర–దక్షిణ దిక్కుల్లో ఉన్న రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాల పైబడిన ఆర్థిక సంస్కరణల ప్రభావం దేశ సామాజిక రంగం మీద ఆ యా రాష్ట్రాలను బట్టి ఎక్కువ తక్కువగా కనిపించడం అయితే కాదనలేనిది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వెనుక ఉన్నది కూడా ఈ సంస్కరణల కాల ప్రభావమే. అలాగే సంస్కరణల్లోని ‘సరళీకరణ’ అంశం మనవద్ద సీబీఎన్ సరికొత్త–‘ద్రవ రాజకీయాలకు’ (‘లిక్విడ్ పాలిటిక్స్’) ప్రాతిపదిక అయింది. వాటి లక్షణం అది కనుక మారుతున్న కాలంతో పాటుగా దాన్ని ఆయన ‘అడాప్ట్’ చేసుకున్నారు. అయితే ‘సరళీకరణ’ను తమకు తగినట్టు ‘అడాప్ట్’ చేసుకోవడం అనేది, ఏ ఒక్కరి గుత్త సొత్తో కాదు కనుక, సంస్కరణలు మొదలైన పదేళ్ళకే 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బిహార్ నుంచి జార్ఖండ్లు విడిపోయాయి. మరో పదేళ్లకు ఈ రాష్ట్రాల సరిహద్దున ఉన్న తెలంగాణ... ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. దీనికి వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాలు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎన్ని కారణాలు ఉన్నా అవి దాన్ని ఆపలేక పోయాయి. ఉపరితలాల్లో కనిపించకుండా భూగర్భ పొరలను కుదిపే తాత్విక అంశం–‘సరళీకరణ’ అనబడే ‘లిబరలైజేషన్’. ఈ ముప్పై ఏళ్లలో ఐదు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, వాటిలో కొత్త పార్టీలు ఏర్పడి అవి అధికారాల్లోకి వచ్చాయి. అలా కొత్త సమాజాలకు అవకాశాలు వచ్చాయి. ఇటువంటి జాతీయ పరిణామం చూసినప్పుడు, ప్రాంతాల మధ్య విభజన తర్వాతే... ముప్పై ఏళ్ల క్రితం కాన్షీరాం ఆశించిన కులాలవారీగా విడిపోయిన రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏర్పడలేదు. ఇప్పటికీ కొందరు దీన్ని ‘నెగిటివ్’ దృష్టి నుంచి చూసినా, గడచిన పదేళ్ళలో అది ‘మర్యాద’ ముసుగును తొలగించుకుని మరీ ‘ఓపెన్’గా మన మధ్య స్థిరపడింది. కనుక ఇప్పుడు బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ‘కులం’ పోషించే సూక్ష్మస్థాయి పాత్రను ఏపీ విషయంలో మనం అన్వయించి చూడవచ్చు. ఇకముందు అదేమంత ‘బూతు’ అవదు. ఎంత త్వరగా మనం ఏమిటో మనం స్వీయప్రకటన చేసుకుంటే అంత మేర మనకు సమయం వృథా అవదు. అయితే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపీలో నెలకొనివున్న సామాజిక రాజకీయ సమీకరణాలను చూసినప్పుడు ఇప్పటికే అవి కాన్షీరాం దృష్టి దాటి విస్తరించాయా అనేది ‘కేస్ స్టడీ’ అవుతుంది. అలా కావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది– గత ప్రభుత్వం కోనసీమ జిల్లాకు పేరు మార్చినప్పుడు మే 2022లో అమలాపురంలో జరిగిన ఆందోళన, విధ్వంసం, గృహదహనాలు విభజిత ఏపీ చరిత్రలో మొదటి సామాజిక హింసాత్మక సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు సామాజికంగా అదొక సున్నితమైన తొలికూతగా గుర్తించాలి. రెండవది– కొంచెం లోతైన విస్తృతమైన చర్చ అవసరమైనది. కాపు కులం నుంచి ముఖ్యమంత్రి రావాలి, అంటూ తిరుపతి మాజీ కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ కొంత కాలంగా కోరుతున్నారు. అలా కనుక జరిగితే, ఆ తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి అవుతారు అనేది బహుశా ఆయన ఆశ కావొచ్చు. ఈ మొత్తాన్ని సమీక్షించడానికి 2024 ఏపీ ఎన్నికల పూర్వరంగం సరైన ‘ఎరీనా’ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఒక ఎస్సీ ముఖ్యమంత్రిగా మాయావతి 2007–12 మధ్య చెప్పుకోదగిన పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. అయితే, ఎస్సీ కాకపోయినా ఓసీ కులాల్లో పేదల నుంచి అన్ని కులాల్లోని పేదల వరకూ... అందరికీ 2019–24 మధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందాయి. కేవలం ఆర్థిక పరమైన ఊరట మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న పరిపాలనా వైఖరి కారణంగా సూక్ష్మ స్థాయిలో ‘పవర్ పాలిటిక్స్’ స్థానంలోకి ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ప్రవేశించాయి. వీటిలో ‘డెలివరీ’ ప్రధానం తప్ప రాజకీయ పార్టీల పట్ల విశ్వాసాలతో పెద్దగా పని ఉండదు. శ్రేణులలో కూడా మొదలైన ఇటువంటి ‘లిక్విడ్ పాలిటిక్స్’ ధోరణి కారణంగా ఇకముందు ముఖ్యమంత్రి కులం ప్రజల సానుకూల తీర్పుకు ప్రాతిపదిక కాకపోవచ్చు.– జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విభజన... అసమాన అంతరాలు పెంచడానికా?
రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటికి పదేళ్లు గడిచాయి. పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దశాబ్దా్దలుగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల నెత్తుటి మరకలను పాలకులు తమ తిరోగమన విధానాలతో తుడిపేస్తున్నారు. ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పోకడ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తన పబ్బం గడుపుకోవడం మీదనే కేంద్రం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరికి ఎగ్గొట్టారు. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపించారు.ఇక, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలను నిర్వహించలేదు. పదేళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా, గోదావరీ నదీజలాల వ్యవహారంలో ఎటూ తేల్చకపోగా, కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది. విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల విభజన లాంటి ముఖ్యమైన అంశాలను కూడా తేల్చలేదు. ద్రవ్యలోటు పూడ్చే విధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం అసలు తాను ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోగా, సాగునీటి రంగానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ అధికారంలో వుండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం చేశారు. దీని ఫలితమే టీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనూ, ప్రశ్నించే గొంతులనూ అణచివేస్తూ కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు. పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుతున్న సందర్భంలో ప్రతిపక్షం (బీజేపీ) నుండి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టి తను డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాలు ఈ 10 ఏండ్లలో పట్టించుకోకుండా గాలికొదిలేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ నీటి యుద్ధం కొనసాగుతూనే వుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి నీటిని క్రమబద్ధీ్దకరించటం, రివర్ బోర్డు ఏర్పాటు, ద్రవ్యలోటు పూడ్చడం, ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపడం, ఆంధ్రలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు వంటివి పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీపీసీలో మిగిలివున్న 3 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు జరుగలేదు. 9, 10 షెడ్యూల్లో వున్న 91 ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజించినట్లు ప్రకటించి, నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు, ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక, సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి, ఉపాధి, నీటి వనరులు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ సంస్థల వద్ద అతితక్కువ వేతనాలకు వాచ్మెన్లుగా, గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారినారు.తెలంగాణ ఏర్పడితే ఈ పరిస్థితులు వస్తాయని ప్రజలు భావించలేదు. ఉద్యోగాలు వస్తాయనీ, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయనీ, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామనీ భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి. ఇది సామాజిక దోపిడి, వివక్షకు దారితీసింది. దీని ఫలితమే బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి, ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించవలసిన అవసరం వున్నది. రాష్ట్రంలో, దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది. ప్రజల ప్రధాన సమస్యలైన భూమి, కూలి, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కొరకైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పరిపాలన సాగించాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై వుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా అధికారంలోకి వచ్చే, వచ్చిన పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధి కనబరచాలి.జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) -
పెండింగ్ అంశాలపై నేడు కేంద్రం సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమీక్ష చేయనుంది. సమన్వయ కమిటీ వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం. చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించారు. ఈ–సమీక్ష పోర్టల్లో పొందుపరిచిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న 15 అంశాలను అజెండాలో చేర్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ, పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను అజెండాలో చేర్చారు. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా సంస్ధ ఏర్పాటు, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు, ఆర్ అండ్ ఆర్తో సహా పోలవరం పూర్తి వ్యయాన్ని భరించడం తదితర అంశాలు కూడా ఉన్నాయి. -
మోదీ వ్యాఖ్యలపై చర్చకు నోటీసు ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సూచించారు. మోదీ మాట్లాడిన అంశాలపై ఏపీ ఎంపీలు నోటీసు ఇవ్వాలని కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చ జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని అన్నారు. చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి మెజార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇటీవల రాజ్యసభలో ఏపీపై చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి షెడ్యూల్ 9, 10లలో ప్రస్తావించిన 150 సంస్థల విషయం ఎనిమిదేళ్లు అవుతున్నా కేంద్రం తేల్చకపోవడం అన్యాయమన్నారు. -
రాష్ట్ర విభజనకు మద్దతివ్వం ..
సాక్షి బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తాం అని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి చెప్పారు. ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక పోరాట సమితి పిలుపుని చ్చిన ఉత్తర కర్ణాటక బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బడ్జెట్లో ఉత్తరకు అన్యాయం కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ ప్రకటించారనే కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని చెప్పారు. కాగా, ఆగస్టు 9 నుంచి మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నేతలందరూ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలిపారు. తొలి బృందంలో తాను, గోవింద కారజోళ, శోభ కరంద్లాజే, రెండో బృందంలో ఆర్.అశోక్, అరవింద్ లింబావళి, జగదీశ్ శెట్టర్, మూడో బృందంలో కేఎస్ ఈశ్వరప్ప, సీటీ రవి, లక్ష్మణ సవదిలు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాధనలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తాం తమ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై చర్చించాం, అభ్యర్థుల ఎంపిక చర్చకు రాలేదని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాలకు 22– 23 స్థానాలు కచ్చితంగా గెలుచుకోగలుగుతామని జోస్యం చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని చెప్పారు. మీడియా ప్రతినిధులను విధానసౌధలోకి రానివ్వనని సీఎం అనడం సమంజసం కాదని అన్నారు. మీడియాను నిర్బంధించడం మంచి పరిణామం కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. -
రాష్ట్రాన్ని విడదీయడమే మంచిదైంది
గుంటూరువెస్ట్: రాష్ట్రాన్ని విడదీయడమే మంచిదైందని, దీన్ని కొందరు విమర్శించినా విభజన వల్ల మనకు పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు లభించాయని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. విభజన వల్ల వచ్చిన అవకాశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందన్నారు. జనాభాలో 50 శాతం మంది మహిళలున్న ఈ సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలను ఎంపికచేసి 50 మందికి రూ.5,000, 50 మందికి రూ.3,500 చొప్పున నగదును అందజేశారు. -
ఉండవల్లి అప్పుడు ఏం చేశారు: సోము వీర్రాజు
సాక్షి, రాజమండ్రి: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది కూడా బీజేపీయేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఆంధ్రా అభివృద్ధి గుర్తుకు రాలేదా.. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినపుడు అప్పటి ఎంపీ ఉండవల్లి ఏం చేశారు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్ళినపుడు ఉండవల్లి ఏమీ చేయలేకపోయారు ఎందుకు అని ప్రశ్నించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ యత్నిస్తుందని సోము అన్నారు. ‘ఉపాధి’ పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అని, ముందస్తు ఎన్నికలపై మోడీదే తుది నిర్ణయం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్ట లేకపోతోందని వీర్రాజు విమర్శించారు. -
విభజన హామీలపై ఉమ్మడి పోరు
ఇబ్రహీంపట్నం(మైలవరం): రాష్ట్ర విభజన హామీల సాధనకు ఫిబ్రవరిలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏవిధమైన హామీలు పొందారు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. గుంటూరు జిల్లా గొట్టుపాడులో దళితులపై దాడిచేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములను అరెస్ట్ చేయకపోతే ‘చలో గుంటూరు’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు సిద్ధం కండి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా రింగ్సెంటర్లో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఏ కాలనీ గ్రౌండ్ నుంచి స్థానిక రింగ్సెంటర్ వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో బాబూరావు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారలు మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయిల్ ఉత్పత్తుల ధరలు పెంచడమేనని చెప్పారు. ధరలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఉద్యమించనున్నుట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, స్వరూపారాణి, జమలయ్య, శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆర్.రఘు, నాగేశ్వరరెడ్డి, పీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పశ్చిమ కృష్ణా కార్యదర్శిగా డీవీ కృష్ణ రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం జిల్లా మహాసభలో పశ్చిమకృష్ణా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా డీవీ కృష్ణ, కార్యవర్గదర్శివర్గ సభ్యులుగా దోనేపూడికాశీనా«థ్, ఎన్సీహెచ్ శ్రీనివాస్, శ్రీదేవి, పీవీ ఆంజనేయులు, నాగేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్లను ఎన్నికయ్యారు. మరో 24 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
‘విభజన’ రభస ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నాలుగేళ్లు కావస్తోంది. కాని పోలీస్ శాఖలో విభజన మాత్రం సాగదీత ధోరణిలోనే ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్గా ఉన్న డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ అధికారుల విభజన పెండింగ్లోనే ఉండిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన సీనియారిటీ జీవోలు 54, 108 కారణంగా తాము అన్యాయానికి గురయ్యామంటూ గ్రూప్–1 డీఎస్పీలు, ప్రమోటీ అధికారులు ఒకరిపై ఒకరు కోర్టుకెళ్లారు. సీనియారిటీ జాబితా సవరించి అధికారుల విభజన పూర్తి చేయాలని 2015లో హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల్లో చలనం లేకుండా పోయింది. సీనియారిటీ సమీక్ష పేరుతో ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారే తప్ప.. పరిష్కార మార్గాలు వెతకడం లేదు. మూడేళ్లుగా ప్యానల్ పెండింగ్ సీనియారిటీ జాబితా సవరించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ముందుకు కదలకపోవడంతో అధికారుల పదోన్నతులపై నీలినీడలు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా (2015 నుంచి 2017 వరకు) కేంద్రానికి వెళ్లాల్సిన కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ జాబితా పెండింగ్లోనే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సీనియారిటీ జాబితాను సవరించి ప్యానల్ను పంపించాల్సి ఉంది. కానీ ఇది జరగలేదు. 2007 గ్రూప్–1 అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్గా పదోన్నతి పొందాల్సి ఉంది. వీరు పదోన్నతి పొందితే పోలీస్ శాఖకు ఎస్పీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారులు 24 మంది కీలకమవుతారు. ఇద్దరు డీజీపీలు మారారు.. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు డీజీపీలు మారిపోయారు. ఇక్కడ అనురాగ్ శర్మ, అక్కడ జేవీ రాముడు ఇద్దరు విభజన అంశాలను పూర్తి స్థాయిలో గట్టెక్కించలేకపోయారన్న ఆరోపణ ఉంది. అయితే ఇప్పుడున్న డీజీపీలు మహేందర్రెడ్డి, సాంబశివరావు అయినా సీనియారిటీ జాబితాను పరిష్కరించి కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ ప్రతిపాదనలతోపాటు ప్రమోటీ అధికారులకు సరైన స్థానం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంది. ఎన్నాళ్లీ అడ్హాక్ పదోన్నతులు సీనియారిటీ జాబితా సవరించకుండా విచక్షణ అధికారాల పేరుతో రెండు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా అడ్హాక్ పదోన్నతులు కల్పించారు. ఏ అధికారి కూడా రెగ్యూలర్ పోస్టులో పదోన్నతి పొందింది లేదు. ఇటీవల తెలంగాణలో గ్రూప్–1 అధికారులు, ప్రమోటీలు మొత్తం అడ్హాక్ పద్ధతిలోనే ప్రమోషన్ పొందారు. అదే సీనియారిటీ జాబితా క్లియర్ అయితే వారందరికీ రెగ్యులర్ పదోన్నతి కింద సీనియారిటీ స్థానం నిర్ధారించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రమోషన్లు రావాల్సిన మిగతా అధికారులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. -
‘ఉమ్మడి’ ఫీజు చెల్లింపులకు ఓకే!
- 2013–14 ఫీజు బకాయిలపై సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ - సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సుకు ఆమోదం! - వారం రోజుల్లో ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమవుతోంది. బకాయిలను చెల్లించాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఈ బకాయిలకు మోక్షం కలగనుంది. 2013–14 విద్యా సంవత్సరపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను 2014–15 వార్షికంలో విడతల వారీగా విడుదల చేయగా.. రూ.248.5 కోట్లు మిగిలిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య చెల్లింపులపై నెలకొన్న అస్పష్టతతో రాష్ట్రం మిగిలిపోయిన నిధులను పెండింగ్లో పెట్టింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ 2013–14 బకాయిల ఊసెత్తకపోవడంతో వాటిపై గందరగోళం నెలకొంది. ఆయా విద్యార్థులు కోర్సు పూర్తి చేసినప్పటికీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించని కారణంతో సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేశారు. భారం తగ్గే అవకాశం వాస్తవానికి 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.248.5 కోట్లు ఉన్నాయి. లక్ష మంది విద్యార్థులు కాలేజీలకు బకాయి పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసే బకాయిల చెల్లింపుల్లో సాంఘిక సంక్షేమ శాఖ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. నాలుగేళ్ల నాటి బకాయిలు కావడంతో వీరిలో సగం మంది విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించుకోగా.. కొందరు కార్యాలయానికి వచ్చి ఫీజు నిధులు విడుదల చేయాలని వినతులు సమర్పిస్తున్నారు ప్రస్తుతం బకాయిలున్న వారిలో 20 శాతం విద్యార్థులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ క్రమంలో బకాయిలను పూర్తి స్థాయిలో కాకుండా సగం ఇస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఫీజులు చెల్లించాలని సాంఘిక సంక్షేమ శాఖ భావిస్తోంది. తొలి విడతలో రూ.150 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అంగీకరించినట్లు సమాచారం. డిమాండ్ను బట్టి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారం రోజుల్లో నిధుల విడుదల ఉత్తర్వులు రావొచ్చని సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అక్కరకు రాని చంద్రబాబు అనుభవం!
► రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి అడ్డుకోరు. ► ఓటుకు కోట్లు నేపథ్యంలో ప్రత్యేక హోదా తాకట్టు.. ► విభజన హామీల అమలు లేదు.. ► రెవెన్యూ లోటు భర్తీ లేదు.. రాజధానికీ అరకొర నిధులే.. ► పదోషెడ్యూలులో ఆస్తులు పోతున్నా పట్టదు.. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి... పదేళ్ల ప్రతిపక్షనాయకుడు.. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం..ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవో వేరే చెప్పనక్కరలేదు.. ఆయన జగమెరిగిన ‘త్రికాలజ్ఞుడు’. స్వయం ప్రకటిత ‘అనుభవజ్ఞుడు’. ఆయనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..తన అనుభవం.. కేంద్రంతో తన ఫ్రెండ్షిప్.. వెరసి రాష్ట్రానికి ఎంతో మేలుచేస్తుందని, స్వర్గాన్ని నేలకు దించేస్తానని నమ్మబలికారు.. నమ్మి జనం ఓట్లేశారు. మూడేళ్లు పూర్తయ్యాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఖాళీ.. రాష్ట్రానికి ఏం ఒరిగింది? ప్రజలకు ఏం మేలు జరిగింది? బాబుగారి అనుభవమంతా ఏమయ్యింది? రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారా? కనీసం మాట్లాడారా?.. ఆకాశాన్ని నేలకు దించనక్కరలేదు.. న్యాయంగా మనకు రావలసినవి వచ్చేలా చూశారా? అన్నిటికీ ఒక్కటే సమాధానం.. ఏమీ జరగలేదు. అమరావతి : ఐదుకోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘ప్రత్యేక హోదా’ను పనిగట్టుకుని అటకెక్కించారు. రాష్ట్ర ప్రగతికి పది కాదు, పదిహేను సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని తిరుమల వెంకన్న సాక్షిగా, నరేంద్రమోదీ సమక్షంలో డిమాండ్ చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత మాటమార్చారు. నాడు ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే.. దాంతో ఏం వస్తుంది? అని ప్రశ్నించడంతో విలేకరులతో పాటు ప్రజలూ నివ్వెరపోయారు. ఆంధ్రప్రదేశ్లో అంతులేని అవినీతితో ఆర్జించిన నల్లడబ్బును ఎరవేసి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నందునే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారన్నది బహిరంగ రహస్యం. అంటే తన ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నమాట. ముఖ్యమంత్రి హోదాలో ముందుండి పోరాడాల్సిన, అందరినీ కలుపుకుని పోయి కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు మూడేళ్లలో ఎన్నడూ నోరు మెదిపిందే లేదు. వెరసి.. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయింది. విభజన హామీలదీ అదేదారి.. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు పూర్తయినప్పటికీ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి విభజన చట్టంలోని హామీలన్నింటినీ చదివేస్తే అదే ఏదో ప్రత్యేక ప్యాకేజీ అన్నట్లు వెంకయ్యనాయుడిని పిలిచి సన్మానాలు చేశారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు నాయుడు స్వాగతించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. జైట్లీ ప్రకటనలో అసలు ప్యాకేజీ అన్నమాటే లేకపోయినా ప్యాకేజీ ఏదో ప్రకటించారంటూ ప్రచారం చేశారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు పట్టుబట్టకుండా ప్యాకేజీ వచ్చేసిందంటూ చంకలు గుద్దుకోవడంతోనే మూడేళ్లు గడచిపోయాయి. రాష్ట్ర విభజన ఏడాది ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలో కేంద్రం భారీగా కోత విధించింది. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం అరకొర నిధులతోనే సరిపుచ్చింది. విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇంకా సాగునీటి రంగం, ఉద్యోగుల సర్వీసు అంశాలు, పంపిణీ, పదవ, తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు. పైగా తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలోను, అలాగే పదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ప్రతికూల ఆదేశాలు జారీ అయ్యాయి. పదవ షెడ్యూల్లోని సంస్థలకు చెందిన స్థిరాస్తుల్లో(రూ.33 వేల కోట్లు) ఏపీకి ఎటువంటి వాటా రాదని, ఎక్కడి ఆస్తులు అక్కడికే చెందుతాయని, నగదు, అప్పులను మాత్రమే జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థలకు చెందిన ఆస్తులు(రూ.10వేల కోట్లు), అప్పుల పంపిణీకి సబంధించి హెడ్ క్వార్టర్స్ అంటే కేవలం ప్రధాన కేంద్ర కార్యాలయం ఆస్తులు, అప్పులే గానీ దాని అనుబంధ యూనిట్లు, సంస్థలు రావని ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయలేకపోయారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా మౌన ప్రేక్షకుని మాదిరిగా చూస్తుండడమే చంద్రబాబు అనుభవమని అనుకోవడం తప్ప ఇక ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. విభజన చట్టంలోని ప్రధాన హామీలు, వాటి అమలు తీరు తెన్నులు రెవెన్యూ లోటు భర్తీగా రూ.16,078 కోట్లు కేంద్రం ఇవ్వాలికానీ కేంద్రం 4,117 కోట్ల రూపాయలతో సరిపుచ్చింది. ఇంతకన్నా ఒక్క పైసా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాకు మంగళం పలికింది. బాబు కోరిక మేరక చట్టంలోని అంశాలన్నీ కలిపి అదే ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి తొలుత బాబు ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని అడిగారు. అయితే కేంద్రానికి 43,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. కానీ కేంద్రం రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలే ఇస్తామని తేల్చింది. ఇందులో ఇప్పటికి 1,950 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దుగరాజపట్టణంలో భారీ ఓడరేవు నిర్మాణం చేపడతామని విభజన చట్టంలో చెప్పారు కానీ ఇప్పుడు వయబుల్ కాదని కేంద్రం స్పష్టీకరించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారు కానీ ఇంకా వయబులిటీ అధ్యయనం పేరుతో కమిటీ ఏర్పాటు వద్దే ఆగిపోయింది. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారుకానీ రైల్వే జోన్ ఏర్పాటుపై దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీల రికవరీలో విభజన చట్టం నిబంధనలతో రాష్ట్రానికి రూ.3820 కోట్లు నష్టం వస్తున్నందున నిబంధనల్లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో చెప్పారు. అయితే ఒక ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయలతో కేంద్రం సరిపుచ్చేసింది. మూడేళ్లలో రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం. -
న్యాయం కావాలి!
ఉమ్మడి హైకోర్టును పీడిస్తున్న ఖాళీలు - పని ఒత్తిడితో న్యాయమూర్తులు ఉక్కిరిబిక్కిరి - పోస్టుల భర్తీలో కేంద్రం తీవ్ర జాప్యం - రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలపై మీనమేషాలు - కక్షిదారులు, న్యాయవాదుల్లో పెరిగిపోతున్న అసహనం సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తుల ఖాళీలు.. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టును పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉన్నతస్థాయిలో జరుగుతున్న అసాధారణ జాప్యంతో పెరిగిపోతున్న పని ఒత్తిడి న్యాయమూర్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న సంస్కరణల నేపథ్యంలో పెరిగిపోతున్న ఇతర అధికారిక పనులతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకునేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, ఆ మేర హైకోర్టు నుంచి సిఫారసులు అందినా ఇప్పటివరకు వారి నియామకానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో విచారణకు నోచుకోని కేసులతో.. భరించలేని ఒత్తిడితో కక్షిదారులు, న్యాయవాదుల్లో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. రిటైర్డ్ న్యాయమూర్తులేమైనట్లు..? రాజ్యాంగంలోని అధికరణ 224ఎ కింద రిటైర్డ్ న్యాయమూర్తులను హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవల వినియోగంపై అప్పటి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు నిర్ధిష్టమైన ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కేంద్ర న్యాయశాఖ గత ఏడాది నవంబర్లో రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గత ఏడాది చివర్లో నలుగురు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేశారు. జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ ఎస్.రవికుమార్ పేర్లను కేంద్రానికి పంపారు. ఇలా నాలుగు హైకోర్టుల నుంచి 18 పేర్లు పంపినా.. కేంద్రం ఇప్పటికీ గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. అయినా ప్రయోజనం లేదు... అయితే పెరుగుతున్న సంఖ్యలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంతో సిట్టింగ్ న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. రోజుకు ఒక్కో న్యాయమూర్తి ముందు వందల సంఖ్యలో కేసులు వస్తున్నప్పటికీ, వాటిలో గరిష్టంగా 60–80 కేసులు మాత్రమే విచారించడం సాధ్యమవుతోంది. దీంతో కక్షిదారుల నుంచి న్యాయవాదులకు, న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు ఒత్తిడి ఎదురవుతోంది. ఒక్కో జడ్జి పరిష్కరించిన కేసులు...(సుప్రీంకోర్టు తాజా లెక్కల ప్రకారం) ► ఉమ్మడి హైకోర్టులో (గత సెప్టెంబర్ నాటికి) పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య: 2,85,663. ► ఇందులో క్రిమినల్ కేసులు: 41,172... సివిల్ కేసులు: 2,44,491. ► 2016 మూడో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో హైకోర్టు పరిష్కరించిన కేసు సంఖ్య: 17,991 ► ఆ క్వార్టర్లో హైకోర్టు పని దినాలు: 60 ► ఈ లెక్కన ఒక్కో న్యాయమూర్తి పరిష్కరించిన సరాసరి కేసులు: 299 పెరుగుతున్న కేసుల సంఖ్య(ఒక ఏడాదికి)... ► రాష్ట్ర విభజనకు ముందు దాఖలయ్యే రిట్ పిటిషన్ల సంఖ్య: 35 వేల నుంచి 38 వేలు ► ప్రస్తుతం: దాదాపు 47 వేలు ► రాష్ట్ర విభజనకు ముందు క్రిమినల్ కేసుల సంఖ్య: 11 వేల నుంచి 13 వేలు ► ప్రస్తుతం: 22 వేలకుపైగా... ► ఇప్పుడు తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్ లేకపోవడంతో, ఉద్యోగ వివాదాల కేసులను హైకోర్టే విచారించాల్సి వస్తోంది. వీటికి తోడు ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాల కేసులు కూడా భారీగానే దాఖలవుతున్నాయి. -
బాధ్యుల్లేరు.. భారం ఉంది..
పోలీస్శాఖలో కీలక విభాగాలకు అధిపతులేరీ? పదోన్నతులకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ల పదోన్నతులు, పోస్టింగ్స్పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కీలక విభాగాల పనితీరు గాడి తప్పేలా కనిపిస్తోంది. ఇన్చార్జీ లతో నెట్టుకొస్తున్న విభాగాలు అయోమయంలో పడిపో యాయి. దీంతో అదనపు డీజీపీల నుంచి ఎస్పీల వరకు పనిభారం పెరిగిపోయింది. రెండు జోన్లకు ఒకే ఐజీ, 4 రేంజ్లకు ఇద్దరు డీఐజీలే ఉన్నారు. సీఐడీకి చీఫ్గా ఉండే అదనపు డీజీ పోస్టు ఖాళీగా ఉంది. సీఐడీలో ఆరుగురు ఎస్పీలకు గానూ ఒక ఎస్పీ మాత్రమే ఉన్నారు. నలుగురు డీఐజీలు ఉండాల్సింది ఒక డీఐజీతో నెట్టుకొస్తున్నారు. ఏసీబీకీ చీఫ్ హోదాలో కూడా ఇన్చార్జీల పాలనే సాగుతోంది. ఏసీబీలో జాయింట్ డైరెక్టర్లుగా 4 పోస్టులంటే ఇద్దరే సర్వీసుల్లో ఉన్న అధికారులు న్నారు. మిగతా ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు. విజిలెన్స్లోనూ ఇన్చార్జీ డైరెక్టర్ పాలన కొనసాగు తోంది. డీఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ హోదా వరకు ఉన్న 41 మంది అధికారులు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అసలే కొరతతో ఇబ్బంది పడుతుంటే ఈ పదవీ విరమణలతో మరింత డీలా పడనుందని ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజనలో భాగంగా 12 నాన్క్యాడర్ ఎస్పీ, 24 వరకు అదనపు ఎస్పీ పోస్టులు వచ్చాయి. వీటితోపాటు కొత్తగా మంజూరయ్యే పోస్టులకు పదోన్నతి ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. -
జీరోలా చేస్తున్నారు
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి గుంటూరు(నగరంపాలెం): పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు. పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. శత్రువుల కన్నా పార్టీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేకపోవటంలో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పార్టీ పదవులతో విజిటింగ్ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్మెంట్లు చేసుకునేవారు ఎక్కువయ్యారని విమర్శించారు. -
ప్రజల అభీష్టం మేరకే విభజన జరిగింది కదా!
► ‘విభజన’ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ► అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజల అభీష్టం మేరకే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కదా..! విభజన జరిగిన తర్వాత దీనిపై ఇప్పుడు విచారణ జరపాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి?’ అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా 26 మంది దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహెర్, జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన బెంచ్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజ న జరిగింది కదా! దీనిపై విచారణ జరపాలని కోర డంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. కిరణ్కుమార్రెడ్డి తరఫు న్యాయవాది ఏడీఎన్ రావు జోక్యం చేసుకుంటూ.. ‘రాష్ట్ర విభజన ఏపీ ప్రజల కోరికకు విరుద్ధంగా విభజన జరిగింది. కాబట్టి బిల్లు ఆమోదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేలా లోక్సభ సెక్రటరీ జనరల్ను ఆదేశించండి..’ అని కోరారు. విభజనకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేయలేదని, దీనిపై కూడా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఇతర పిటిషనర్లు రఘురామకృష్ణ రాజు, పద్మనాభరావు తరఫు న్యాయవాది సతీశ్ ధర్మాసనాన్ని కోరారు. కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏపీని విభజించామని కేంద్రం తరఫున అదనపు సొలిటర్ జనరల్ పరంజిత్ సింగ్ పట్వాలియా ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నామని, అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోతే దాఖలు చేయాలని ఆదేశించింది. -
‘విభజనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం’
సత్తెనపల్లి: ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఒక్కటే చేసిందనే అపవాదు వేస్తున్నారని, చంద్రబాబు రెండుసార్లు రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖలు ఇచ్చిన విషయాన్ని జేడీ శీలం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ తప్పుకాదని అందరూ కలిసి చేసిందే అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్ర మోదీ హమీ ఇచ్చి మాటమార్చడం దురదష్టకరమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని దూషిస్తూ ప్రధానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.... సిగ్గు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జేడీ శీలం విమర్శించారు. చంద్రబాబు తన చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ భూములు పంపిణీ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బ్యాంకులు జాతీయకరణ చేస్తే మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడును ఓడించేందుకు ఇప్పటినుంచే సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘సరిహద్దు’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలంగాణ లారీలను చెక్పోస్టుల వద్ద అడ్డుకుని రోజుల తరబడి నిలిపేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి ఒప్పందం కుదరకపోవటంతో ఇబ్బంది పడుతున్న తమను ఇప్పుడు ఏపీ అధికారులు కావాలనే వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన అనంతరం సరిహద్దు దాటాలంటే పన్ను కట్టాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ‘సరిహద్దు’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల చర్చల ఫలితంగా వివాదం సద్దుమణిగింది. నాలుగు రోజులుగా దాచేపల్లి, పొందుగుల, నాగార్జునసాగర్ తదితర చెక్పోస్టుల వద్ద వందల సంఖ్యలో తెలంగాణ లారీలను ఏపీ అధికారులు నిలిపేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఇసుక లారీలే ఉన్నాయి. సరైన వే బిల్స్ ఉన్నా స్థానికంగా కంప్యూటరీకరణ లేనందున వాటిని నర్సరావుపేట కార్యాలయానికి వెళ్లి సరిచూసుకోవాలనే కారణంతో లారీలను రెండు, మూడురోజులపాటు నిలిపేశారు. దీంతో తెలంగాణ లారీ యజమానులు ధర్నాలకు కూడా దిగారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోందని గుర్తించిన ఏపీ అధికారులు గురువారం చాలా లారీలను వదిలేశారు. ‘తోక బిల్లు’ లేదని... ఓ చెక్పోస్టులో లారీని తనిఖీ చేశాక పత్రాలన్నీ సరిగా ఉంటే ‘పత్రాలు సరిగానే ఉన్నాయి సరిహద్దు దాటేందుకు అభ్యంతరం లేదు’ అని పేర్కొంటూ ఓ పత్రం ఇస్తారు. దానిని లారీల డ్రైవర్లు తోక బిల్లుగా వ్యవహరిస్తారు. ఆ బిల్లు లేదనే సాకుతో అధికారులు లారీ డ్రైవర్లను వేధిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆరోపిస్తోంది. ఒక్కో లారీ నుంచి ఏపీ అధికారులు రూ.400 వరకు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు చర్చించుకుని లారీలకు సింగిల్ పర్మిట్ విధానం ప్రారంభించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇసుక దందా... ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు అక్రమంగా సిలికా ఇసుకను తెలంగాణకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇసుక సరఫరా బాగా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ ఎమ్మెల్యే చిలుకలూరిపేట, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి సిలికా ఇసుక అక్రమ సరఫరాకు తెరలేపారు. దీనికి ఆ ఎమ్మెల్యే హైదరాబాద్కు చెందిన లారీలనే వినియోగించటం గమనార్హం. అధికారులు పట్టుకున్న లారీల్లో ఇవీ ఉండటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
‘కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు’
గుంటూరు : ప్రత్యేక హోదాకు మించిన ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్కు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ చట్టంలో ఉన్నవి అమలు చేసి వాటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రత్యేక హోదాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈరోజు తనను విమర్శిస్తున్నారని వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. తెనాలిలో ఇవాళ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనకు బీజేపీ నేతల సన్మానం చేశారు. -
ఈ చిన్న లాజిక్ కూడా మరిచారా...బాబుగారూ
ప్రత్యేక హోదా వస్తే అప్పుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది ఇందులో రూ.26,253 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణం ప్రత్యేక హోదా ఇస్తే–ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది అంటే 23,628.33 కోట్లు కేంద్రం భరిస్తుంది–రాష్ట్రం కేవలం రూ.2623.37 కోట్లే భరిస్తే చాలు రూ.11,525 కోట్లు రాష్ట్ర సర్కారు వాటా కేంద్రం వద్ద పెండింగ్లో 13 విదేశీ అప్పు ప్రాజెక్టులు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం భారీ ఎత్తున విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రాజెక్టులను రూపొందించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు జైకా, తదితర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 37,778.80 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇందులో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ఈ అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. రాష్ట్ర సర్కారు పది శాతం భరిస్తే సరిపోతుంది. 26,253.71 కోట్ల రూపాయల అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 23,628.33 కోట్ల రూపాయలు భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2623.37 కోట్లు భరిస్తే సరిపోతుంది. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ విదేశీ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా వర్తింప చేస్తే రాష్ట్రంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తరువాత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆధారంగాను, అలాగే వ్యయం చేసే సామర్ధ్యం ఆధారంగా ఆమోదం తెలుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వ్యయం చేసే సామర్ధ్యంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే సామర్ధ్యాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకునే ఎంత వరకు ఏ ప్రాజెక్టులకు అనుమతించాలో నిర్ధారిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా చేపట్టేందుకు 13 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం 13 ప్రాజెక్టుల వ్యయం రూ.37,778.80 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థల రుణం రూ.26,253.71 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భరించనున్న వాటాగా రూ.11,525.09 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయంలో 70 శాతం మేర విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 30 శాతం భరించనుంది. -
తెలంగాణకు చేరిన ఇంజనీర్లు
టీఎస్ జెన్కోలో భర్తీ చేయనున్న యూజమాన్యం ? పాల్వంచ: ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఇంజనీర్లు గురువారం తమ విధులు బహిష్కరించి స్వరాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ సీలేరు ఆంధ్రాలోకి వెళ్లడంతో ఇంతకాలం అక్కడే విధుల్లో కొనసాగారు. ఈ క్రమంలో తెలంగాణ స్థాని కత కలిగిన వారిని రిలీవ్ చేసి పంపించాలని అక్కడ ఇంజనీర్లు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీనికి తెలంగాణ లో అన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లు సంఘీభావం తెలుపుతున్నాయి. కానీ ఉద్యోగుల విభజన చేసి పంపడంలో జాప్యంతో విధులు బహిష్కరించి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విధులు బహిష్కరించిన వారిని టీఎస్ జెన్కోలో భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బాధ్యత తీసుకుందని తెలుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం నుంచిఅనుమతి తీసుకున్నామని ఆ సంఘ నేతలు చెబుతున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సుధాకర్రావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్రావు, అసోసియేట్ అధ్యక్షుడు మంగీలాల్ నేతృత్వంలో సీలేరుకు వెళ్లిన 30 మంది ఇంజనీర్లు (ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది) సీఈ మోహన్ రావుకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆ వెంటనే వారు విధులు బహిష్కరించి తెలంగాణ చేరుకున్నారు. మార్గమధ్యలో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్కు గురువారం రాత్రికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే వీరు నేరుగా టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావును కలిసి టీఎస్ జెన్కోలో తమను భర్తీ చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు సైతం టీఎస్ జెన్కోలో పనిచేస్తుండటంతో వారిని ఎక్కడ భర్తీ చేయాలనే విషయమై తర్జనభర్జన జరుగుతోంది. తక్కువ మందే రావడంతో వెంటనే వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీ కరించిందని ఇంజనీర్ల సంఘాలు హామీ ఇచ్చి మరీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో చేర్చుకునేందుకు సుముఖం సీలేరులో విధులు బహిష్కరించి వచ్చే వారిని తెలంగాణలో జాయిన్ చేసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
తపాలా రెండు ముక్కలు..!
- విభజన ప్రక్రియ ప్రారంభం - తెలంగాణ సర్కిల్ చీఫ్గా చంద్రశేఖర్ నియామకం - ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ రాయ్ బదిలీ - పరిపాలనా సిబ్బందికి ఆప్షన్ అవకాశం - తపాలా సిబ్బంది ఎక్కడివారక్కడే సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖను విభ జించాలని ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి తపాలా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన 42:58 నిష్పత్తిలో విభజన తంతు పూర్తి చేయాలంటూ తాజాగా హైదరాబాద్కు సమాచారం అందింది. తపాలా శాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజినల్ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాల్లోని పరిపాలన విభాగాల్లోని సిబ్బంది, మల్టీ టాస్క్ సర్వీసు సిబ్బందికి, సర్కిల్ కార్యాలయాల్లోని ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎగువ స్థాయి వారికి ఆప్షన్ అవకాశం కల్పించారు. వారు ఏ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నారో ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖలు సమర్పించారు. ఇక ఆయా ప్రాంతాల్లో తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి. తెలంగాణకు కొత్త చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ విభజనలో భాగంగా తెలంగాణ సర్కిల్కు కొత్త పోస్ట్మాస్టర్ జనరల్ను తపాలా శాఖ నియమించింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఏపీ సర్కిల్ చీఫ్గా పనిచేస్తున్న రాయ్ని ఉత్తరప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్గా బదిలీ చేసి, ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ను తెలంగాణ సర్కిల్ చీఫ్గా నియమించింది. ఆయన ఒకటో తేదీన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ సర్కిల్కు మరో అధికారిని నియమించేవరకు చంద్రశేఖరే ఇన్చార్జిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇక ఉన్నత పదవుల్లో ఏ ప్రాంతానికి ఎవరిని నియమించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టులను ఏ రాష్ట్రానికి అవిగా కేటాయించాల్సి ఉన్నందున అందులో స్పష్టత ఇవ్వాలంటూ స్థానిక యంత్రాంగం ఢిల్లీకి లేఖ రాసింది. మరో రెండుమూడు రోజుల్లో అందులో స్పష్టత రానుండటంతో నియామకాలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం తపాలా శాఖలో 41,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 26 వేల మంది గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉన్నారు. వీరిని రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంది. -
డాక్యుమెంట్లతో పాటు స్వీయ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులకు స్థానికత కావాలంటే స్వీయ ప్రకటనతో పాటు తెలంగాణలో నివాసం ఉన్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలను ఆన్లైన్లో గానీ మీసేవలోగానీ సమర్పిస్తే సబంధిత తహసీల్దారు వారం రోజుల్లోగా స్థానికత పత్రం జారీ చేస్తారు. వారంలోగా తహసీల్దారు జారీ చేయకపోతే స్వయంచాలకం (ఆటోమేటిక్)గా ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలాగ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారికి స్థానికతపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోగా తెలంగాణలోని ఏ ప్రాంతంనుంచైనా ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికతను వర్తింప చేస్తారు. ఆ తరువాత వెళ్లే వారికి స్థానికత వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు, విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని, వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు కాదని పేర్కొన్నారు. మైనర్లకు స్థానికత కావాలంటే తల్లిదండ్రులు, సంరక్షకులు ధరఖాస్తు చేసుకోవచ్చును. స్వీయ ప్రకటనలోని సమాచారం తప్పు అని తేలితే.. స్థానికత పత్రం ద్వారా పొందిన ఉద్యోగం లేదా అడ్మిషన్ రద్దు చేస్తారు. అంతేగాక ప్రాసిక్యూషన్ చర్యలు చేపడతారు. డెరైక్టు రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడ నివాసం ఉంటున్నారనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలి గానీ వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నివాసాన్ని కాదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ పొందాలంటే.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ఉద్యోగార్థులు, విద్యార్థులు ఏపీలో స్థానికత పొందాలంటే.. తెలంగాణలో నివాసం ఉన్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఒకటి జత చేయాలి. -
ఐటీడీఏ...4 జిల్లాల్లోకి..!
రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత కూడా భద్రాచలం అతి పెద్ద ఐటీడీఏగా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 29 మండలాలు, తెలంగాణ రాష్ట్రంలో 24 మండలాలున్న ఐటీడీఏ... జిల్లాల పునర్విభజన కారణంగా నాలుగు ముక్కలవుతోంది. భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు, భూపాలపల్లిలో 2, మహబూబాబాద్లో 3, ఖమ్మం జిల్లాలో 3 మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలోకి రానున్నారుు. కామేపల్లిని కొత్తగూడెంలో ఉంచుతారా... ఖమ్మంలో కలుపుతారా వేచి చూడాల్సిందే. భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత ప్రజానీకం అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో 1975 మార్చి 3వ తేదీన ఖమ్మం కేంద్రంగా ఐటీడీఏ తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని 1979 డిసెంబర్ 17న పాల్వంచకు తరలించారు. అక్కడ నుంచి 1993 ఫిబ్రవరి 9న భద్రాచలంనకు మార్చారు. భద్రాచలంలో మొదట్లో ఐటీడీఏ కార్యాలయూన్ని చర్ల రోడ్డులోని ప్రస్తుతం గిరిజన బీఈడీ కళాశాల నిర్వహిస్తున్న భవనాల్లో నిర్వహించారు. కొద్ది కాలానికి ఐటీడీఏకు ప్రత్యేకించి విశాలమైన భవనాలు నిర్మించారు. భద్రాచలం ఐటీడీఏకు ఉన్న అధునాతన భవనాలు, సువిశాలమైన స్థలం తెలంగాణ రాష్ట్రంలో కాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ ఐటీడీఏకు కూడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా.... రాష్ట్ర విభజన జరగక ముందు జిల్లాలో 46 మండలాలకుగాను, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలోని 29 మండలాలు పూర్తిగా, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు కూడా ఐటీడీఏ పరిధిలోనే ఉండేవి. ఇందులో ట్రైబల్ సబ్ప్లాన్(టీఎస్పీ) పరిధిగా గుర్తించిన 19 మండలాలపై ఐటీడీఏ ద్వారా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఉండేది. జిల్లా విస్తీర్ణం 16,029 స్క్వేర్ కిలోమీటర్లు కాగా, ఇందులో ఐటీడీఏ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతం 12,175 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అంటే ఈ లెక్కన జిల్లా విస్తీర్ణంలో 76 శాతం ఏజెన్సీనే అన్నమాట. జిల్లాలో 4 డివిజన్లు ఉండగా, ఇందులో 3 డివిజన్లు ఏజె న్సీ పరిధిలోనివి. జిల్లా మొత్తం మీద 6.83 లక్షల మంది గిరిజన జనాభా ఉండగా, ఇందులో 5.61 మంది గిరిజనులు ఏజెన్సీ ప్రాంతవాసులే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. ఈ కారణంగా భద్రాచలం ఐటీడీఏ పరిధి త గ్గింది. ప్రస్తుతం జిల్లాలో 41 మండలాలకు గాను ఐటీడీఏ పరిధిలో 24 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో 904 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 571 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన జనాభాలో 1,90,304 మంది తగ్గిపోయారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో.... రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఐటీడీఏ స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 41 మండలాల్లో కొత్తగా ఏర్పడబోయే భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు ఉంటారుు. అరుుతే జూలూరుపాడు, బయ్యారం, గార్ల, కామేపల్లి, ఏన్కూరు ఏజెన్సీ మండలాలు ఖమ్మంలో ఉంటాయని, వీటి కోసమని అక్కడ కొత్తగా ఐటీడీఏ కార్యాలయూన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి జిల్లా నుంచి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అయితే తాజాగా కొత్త ప్రతిపాదనలు వచ్చి పడ్డాయి. గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే మహబూబాబాద్ జిల్లాలోకి, అదే విధంగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలోకి సర్దుబాటు చేసేందుకు తాజా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇదే జరిగితే భద్రాచలం ఐటీడీఏ పరిధి మరింతగా తగ్గిపోయే అవకాశముంది. -
ఏపీ స్థానికత ఫైల్పై రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారి స్థానికత అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఏపీ స్థానికత ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్థానికత గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగి వచ్చేవారిని స్థానికత వర్తిస్తుంది. విభజన జరిగినప్పటి నుంచి మూడేళ్లలోపు.. అంటే జూన్ 2, 2017లోపు ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చేవారినందర్నీ స్థానికులుగా గుర్తించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో దీనికి చట్టరూపం దాల్చింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభిన్న ప్రాంతాలమధ్య విద్య, ఉద్యోగాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ‘371-డి’, ‘371-ఈ’లను చేర్చిన విషయం తెలిసిందే. ఆయా నిబంధనలను నిర్వచిస్తూ 1975లో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 97 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో స్థిరపడి రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనుకునేవారి విషయంలో స్థానికతను నిర్ధారించేందుకు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975లోని పేరా 7ను సవరించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. -
'సీమ ఆత్మగౌరవాన్ని బాబు దెబ్బ తీస్తున్నారు'
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కడపలో గురువారం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ...జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా సీమ రౌడీలంటూ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మితే ప్రాణానికి ప్రాణం ఇచ్చేది కడప వాసులేనని, చంద్రబాబులా ద్రోహులు కాదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం కేంద్రానికి లేఖ ఇచ్చింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు విభజనపై బాబు మాటమార్చి ఇతరులను నిందిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. -
ఆర్టీసీ..కేరాఫ్ విజయవాడ
► పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ►సిటీ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, యాప్ల ప్రారంభోత్సవాలతో ► హైటెక్ హంగామా విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్ పైఅంతస్తులో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం సీఎం చంద్రబాబు చేతులమీదుగా సోమవారం ప్రారంభమైంది. దీంతో పాటు ఆధునీకరించిన సిటీ బస్సు టెర్మినల్ను, వై స్క్రీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్లను సీఎం ప్రారంభించారు. విజయవాడ (బస్స్టేషన్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్లో రెండవదిగా గుర్తింపు పొందిన పండిట్ నెహ్రూ బస్స్టేషన్ (పీఎన్బీఎస్)కు మరో కీలక స్థానం దక్కింది. ఇకపై ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర పరిపాలన కార్యాలయానికి విజయవాడ కేరాఫ్గా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ బస్భవన్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలన్నీ విజయవాడ పీఎన్బీఎస్పై నిర్మించిన పైఅంతస్తుకు తరలిరానున్నాయి. ఎన్టీ రామారావు నూతన పరిపాలన భవనాన్ని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు.హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన సిటీబస్ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, ప్రత్యేకంగా రూపొందించిన యాప్లను ప్రారంభించారు. రెండు గంటలపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సందడి నెలకొంది. బస్టాండ్ సిటీటెర్మినల్కు చేరుకున్న సీఎంకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్వాగతం పలికారు. రూ.1.2 కోట్లతో నిర్మించిన సిటీ బస్సుపోర్టు (టెర్మినల్)ను ప్రారంభించారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు మేలైన రవాణా సౌకర్యాలు కోసం ఆంధ్రాబ్యాంక్ సౌజన్యంతో సిటీబస్సు పోర్టును ఆధునీకరించారు. లైవ్ ట్రాకింగ్ యాప్ ఏర్పాటు చేసిన బస్సులను తిలకించిన సీఎం డ్రైవింగ్ సీటులో కూర్చొని వాటి పనితీరు, ఉపయోగాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సులో డ్రైవర్ పక్కన కూర్చొని సీఎం బస్టాండ్ అవరణలో కొద్దిదూరం ప్రయాణించారు. అనంతరం రూ.10కోట్లతో నిర్మిం చిన ఎన్టీ రామారావు పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రవిభజన అనంతరం ఆర్టీసీ సొంత పరి పాలన కార్యాలయాన్ని సమకూర్చుకున్నట్టు అయ్యిం ది. 9నెలల వ్యవధిలో దీన్ని నిర్మాణం పూర్తి చేయడంతో హైదరాబాద్ బస్భవన్లో ఉన్న 325మంది సిబ్బంది ఇకపై ఇక్కడికి తరలివచ్చి విధులు, ప్రధాన పరిపాలనా కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు. బస్టాండ్లో ఏర్పా టు చేసిన వై స్క్రీన్ సంస్థ నిర్మించిన రెండు మినీ ధియేటర్లను ప్రారంభించారు. ప్రయాణ విరామ సమయం లో ప్రయాణికులకు వినోద సౌకర్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహనరావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన హ్యాపీ వ్యాలీ నిర్వాహకురాలు ఆగిరిపల్లిలో రూ.100కోట్లతో వంద ఎకరాల్లో నిర్మించిన హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్ను ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో అదే తరహాలో ఉయ్యూరులోనూ ఏర్పాట్లుచేస్తున్నట్టు నిర్వాహకురాలు పొట్లూరి శ్రీలక్ష్మి ఆయనను కలిసి వివరించారు. హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సంస్థ ద్వారా విద్యా, ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శ్రీలక్ష్మికి సీఎం సూచించారు. అమరావతికి కార్మికుల ఒక రోజు వేతనం.. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు, కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే జిలానీబాషా, సీహెచ్ సుందరయ్య పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏఎన్యూ : అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. నవనిర్మాణాత్సోవాల్లో భాగంగా శనివారం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్బిలిటీ ఆధ్వర్యంలో అశాస్త్రీయ - విభజన- రెండేళ్లలో రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. కార్యక్రమానికి వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్పాల్, ప్రిన్సిపాల్ సిద్ధయ్య, దూరవిద్య పరీక్షల కో-ఆర్డినేటర్ వేదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మీ ... నీవెక్కడ
► పథకం అమలులో సర్కార్ నిర్లక్ష్యం ► ఆన్లైన్ నుంచి బంగారు తల్లి తొలగింపు ► పెండింగ్లో వేల దరఖాస్తులు ► అయోమయంలో లబ్ధిదారులు ‘ప్రతి ఆడపిల్లనూ వివక్ష అన్నది లేకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చేందుకు, రాష్ట్రంలో తొలిసారిగా 1996లో బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం. అదే పథకాన్ని కొన్ని మార్పులతో ఇప్పుడు ‘మా ఇంటి మహాలక్ష్మి’ పథకంగా అమలు చేస్తున్నాం. పుట్టే ప్రతి ఆడశిశువునూ సగౌరవంగా, సంతోషంగా సమాజంలోకి స్వాగతించుదాం, మన ఉత్తమ సంస్కృతిని చాటుదాం.’ అంటూ రాష్ర్ట విభజన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఉన్నప్పుడు బాలికల సంరక్షణకు బంగారు తల్లి పేరుతో పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఆ పథకం పేరునే మా ఇంటి మహాలక్ష్మిగా చంద్రబాబు మార్చారు. పథకం పేరు మార్చడంలో ఉన్న ఆత్రుత...అమలులో లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. - ధర్మవరం మా ఇంటి మహాలక్ష్మి పేరుతో చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తున్న బంగారు తల్లి పథకం అమలు నేడు ప్రశ్నార్థకమైంది. ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని, ఆడబిడ్డలను తల్లిదండ్రులు భారంగా భావించకూడదనే సదుద్దేశంతో నాడు కిరణ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి చంద్ర ప్రభుత్వం మంగళం పాడింది? గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న చిత్తశుద్ధి వాటి అమలులో లేకపోవడం శోచనీయం. అంతా అయోమయం! మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద పేరు నమోదు చేసుకుంటే ఆడబిడ్డ పుట్టిన నాటి నుంచి పెళ్లి వరకు వివిధ దశల్లో వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తల్లిదండ్రులు ఆశించారు. బంగారు తల్లి పథకాన్ని 2014 వరకు మున్సిపాలిటీల్లో మెప్మా, రూరల్ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరును మాఇంటి మహాలక్ష్మిగా మార్చి, అమలు చేసే బాధ్యతను ఐసీడీఎస్ పర్యవేక్షిస్తుందంటూ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 30న జీవో 50 విడుదల చేశారు. తమ పరిధి నుంచి ఐసీడీఎస్కు పర్యవేక్షణను మార్పు చేస్తారన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి దరఖాస్తులను వెలుగు, మెప్మా సిబ్బంది స్వీకరించడం లేదు. అర్హులు ఎవరైన తమ పిల్లల వివరాలను నమోదు చేసుకునేందుకు వెళితే సదరు శాఖల అధికారులు ఐసీడీఎస్ (అంగన్వాడీ కేంద్రాల్లో ) కలవాలని చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఐసీడీఎస్కు అందకపోవడంతో వారూ సైతం దరఖాస్తులను స్వీకరించడం లేదు. దీంతో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్లో అర్థం కాక పలువురు అయోమయంలో పడ్డారు. ఆన్లైన్ నుంచి తొలగింపు బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న ఆన్లైన్ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. 2014 వరకు అర్బన్ ఏరియాల్లో (మెప్మా పరిధిలో )4,488 దరఖాస్తులు రాగా 632 మందికి తొలివిడత సాయం అందింది. అదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 14,646 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాగా 815 మందికి మాత్రమే తొలివిడత సాయం అందింది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా ఈ పథకాన్ని మొత్తం ఆన్లైన్ నుంచి తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు. పథకం ద్వారా లభించే ప్రోత్సాహకాలు : బంగారు తల్లి పథకంలో బాలికకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. శిశువు పుట్టిన వెంటనే జనన నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు అందిస్తే.... ఆ శిశువు తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతుంది. ఒకటి నుంచి రెండేళ్ల వరకు రూ.1,000, మూడు నుంచి ఐదేళ్ల వరకు రూ.1,500, ఆరు నుంచి పదేళ్ల వరకు రూ.2 వేలు, 11నుంచి 12 ఏళ్ల వరకు రూ.2,500, 13వ ఏట రూ.2,500, 14నుంచి 15 ఏళ్ల వరకు రూ.3,000, 16నుంచి17 ఏళ్ల వరకు రూ.3,500, 18నుంచి21 ఏళ్ల వరకు రూ.4 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు తప్పని సరిగా చదువుకోవాల్సి ఉంటుంది. బాలిక విద్యను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ఆమె పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా బ్యాంకులో జమ చేసిన నగదు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారురాలు 18 ఏళ్లు నిండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటే రూ.50వేలు ప్రభుత్వం అందిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక పెళ్లి చేస్తే రూ.లక్ష వస్తుంది. -
హైకోర్టు విభజన చేయకపోవడం వెనుక కుట్ర
టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ హైకోర్టును విభజించకపోవడం వెనుక కుట్ర దాగుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ ఆరోపించారు. వీలైనంత త్వరగా హైకోర్టును విభజిస్తామని లోక్సభలో మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఏడాదైనా దానిని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టిన సందర్భంగా హైకోర్టు విభజనపై తాము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమవుతున్నాయన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థలో న్యాయాధికారుల విభజనకు సంబంధించి హైకోర్టు రూపొందిం చిన ప్రాథమిక కేటాయింపుల జాబితా వెనుక కూడా కుట్ర ఉందని వినోద్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయిస్తూ హైకోర్టు జాబితా రూపొందించిందని, ఏపీలో పెద్ద సంఖ్యలో ఖాళీలుండగా అక్కడి అధికారులను తెలంగాణకు కేటాయించడంలో ఆం తర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేటాయంపులు రాజ్యాంగ విరుద్ధమే కాక, సహజ న్యాయ సూత్రాలకు సైతం విరుద్ధంగా ఉన్నాయన్నారు. న్యాయం చేయాల్సిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటున్నారని, ఇది సరికాదన్నా రు. తెలంగాణ వారికి న్యాయం చేయకుంటే ఏసీజేను నిలదీసేందుకు వెనుకాడబోమని ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టం చేస్తున్నానని అన్నారు. ఇరిటేట్ చేయవద్దు: తెలంగాణ న్యాయాధికారులకు హైకోర్టు అన్యాయం చేస్తే ఊరుకోబోమని వినోద్ హెచ్చరించారు. ప్రశాంతంగా వెళుతున్న తమను ఇరిటేట్ చేయవద్దన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏసీజే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీరు చెట్టు కింద కూర్చొని తీర్పునిచ్చే వారి కంటే దారుణంగా ఉం దన్నారు. ఏపీలో 30 పోస్టులు ఖాళీగా పెట్టుకుని 110 మందిని తెలంగాణకు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హైకోర్టు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే కేటాయింపుల జాబితాపై వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణకు ఏసీజే చేసిందేమీ లేదు: సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుత ఏసీజే వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తాము కలిసిన ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒప్పుకునే ఏసీజే న్యాయం మాత్రం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణకు వ్యతిరేంగా నిర్ణయాలు తీసుకుంటూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. -
సీమాంధ్రులు మిమ్మల్ని ‘ఒకే ఒక్కడు’గా భావించారు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరిగిన రోజు రాజ్యసభలో మీ హావ భావాలూ, వాక్పటిమ చూసి సీమాంధ్రను ఆదుకోవడానికి ఉన్న ‘ఒకే ఒక్కడు’గా భావించి సీమాంధ్ర ప్రజలు మీకు అత్యున్నత స్థానం కల్పించారని, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రమంత్రి వెంకయ్యకి శనివారం మూడు పేజీల లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఇలా..‘రాష్ట్ర విభజనను సీమాంధ్రకు చెందిన ఏ పార్టీ పార్లమెంటు సభ్యుడు గానీ, మంత్రులు గానీ సమర్థించలేదు. మీరు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నా సీమాంధ్ర తరఫున వకాల్తా తీసుకుని విభజన జరిగిన రోజు బిల్లును సమర్థించారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమి విజయం సాధించిందంటే దానికి కారణం మీరు రాజ్యసభలో చేసిన ప్రసంగమే. మీరు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మం త్రులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అయినా మేం సిద్ధాంతానికి కట్టుబడి సమర్థిస్తున్నామని మీరు చెప్పారు. అలాగే మేం అధికారంలోకి వస్తామని, ఇప్పుడు నేను అడుగుతున్నవన్నీ మేం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మీరే అన్నారు’ అని గుర్తు చేశారు. సవరణలు ప్రతిపాదించి.. : ‘ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వండి.. ఐదేళ్లలో పరిశ్రమల స్థాపన సాధ్యం కాదు. ఒప్పుకోని పక్షంలో నా సవరణల మీద ఓటింగ్కు పట్టుబడతాను అంటూ ఆరోజు హెచ్చరించారు. అలా ప్రతిపాదించి ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెంది వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.ఆ విషయం ప్రజలకు తెలియకపోవడం శోచనీయం. నాటి ప్రధాని ప్రకటనకే విలువ లేదంటున్నారు నేటి పాలకులు! నాడు, నేడు కీలకపాత్ర వహిస్తున్న మీరు కా ర్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా కోసం నేను ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఈనెల 13న సభకు వస్తున్నందున దానికి అనుకూలంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటితో ఓటు వేయించి భారత రాజకీయ చరిత్రలో ఒక ధృవతారగా వెలుగొందాలని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. -
ప్రత్యేక పోరులో అగ్రభాగాన వైఎస్సార్సీపీ
* ఢిల్లీనుంచి గల్లీ వరకూ నిరంతర పోరు * ప్రధాని, రాష్ట్రపతి కేంద్రమంత్రులకు జగన్ విజ్ఞప్తులు * హోదాకోసం జగన్ ఆమరణ దీక్ష, యువభేరి సదస్సులు * ప్రత్యేకహోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం * మే 10న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ ధర్నాలు సాక్షి, హైదరాబాద్: విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని తొలి నుంచీ నమ్ముతూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన నిలిచింది. సాధారణ ఎన్నికలు ముగియగానే ప్రధాని పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోదీని కలిసింది మొదలు నేటి వరకూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా కోసం నిరంతరం నినదిస్తూనే ఉన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేయడం మొదలుకొని ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా కావాలని వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు జాతీయ స్థాయిలో ఆ ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా రాదేమోనన్న ఆందోళనతో తిరుపతితో మునికోటి ఆత్మార్పణం చేసుకోవడం యావత్ రాష్ట్రాన్ని కుదిపివేసింది. మరో ముగ్గురు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దశలో జగన్ వారి కుటుంబాలను పరామర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్ష భగ్నం తరువాత కూడా జగన్ యువభేరీలను నిర్వహిస్తూ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతను చాటి చెబుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం చేసిన ప్రకటనలో తేల్చి చెప్పడంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్సీపీ పిలుపు నిచ్చింది. హోదాకోసం వైఎస్సార్సీపీ... 2014, మే 19: ప్రధానిగా పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోడీని తమ పార్టీ ఎంపీలతో పాటుగా ఢిల్లీలో కలిసి ప్రత్యేక హోదా కావాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 2015 మార్చి: ఎంపీలతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తు చేసిన జగన్. మే: ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపిన పార్టీ ఎంపీలు. జూన్ 3, 4: మంగళగిరిలో జగన్ చేసిన రెండు రోజుల సమర దీక్షలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. జూన్ 9: ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ప్రత్యేకహోదా అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చిన జగన్మోహన్రెడ్డి. ఆగస్టు 10: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేసి రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. అదే రోజు మార్చ్ టు పార్లమెంట్ను నిర్వహించి ఢిల్లీ వీధుల్లో అరెస్టయ్యారు. ఆగస్టు 29: ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బంద్ను విజయవంతంగా నిర్వహించారు. సెప్టెంబర్ 15: తిరుపతిలో జగన్ యూనివర్శిటీ విద్యార్థులు, యువకులతో యువభేరి సదస్సులను నిర్వహించి ప్రత్యేక హోదాపై వారిని జాగృతం చేశారు. సెప్టెంబర్ 22: విశాఖపట్టణంలో యువభేరి సదస్సు నిర్వహణ. అక్టోబర్ 7: ప్రత్యేకహోదా కోసం జగన్ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభం. అక్టోబర్ 14: ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో జగన్ దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వం. 2016 జనవరి 27: ప్రత్యేకహోదాకోస ఆవశ్యకతను వివరిస్తూ కాకినాడలో యువభేరి. ఫిబ్రవరి 2: శ్రీకాకుళంలోనూ విద్యార్థులు, యువకులను సమీకరించి యువభేరీ సదస్సు నిర్వహణ. ఫిబ్రవరి 23, 24: ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసిన జగన్. -
ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కడప: ‘‘భిన్నమైన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేర్చాలి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా కడప ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టను తిరుమల తరహాలో పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒంటిమిట్ట, కడప పెద్దదర్గా, గండికోట ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హాబ్గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానమే శరణ్యం రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. 25, 26న మరోసారి జిల్లా పర్యటన కడపలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పెన్నా నదిలో చెక్డ్యాం నిర్మిస్తామని సీఎం తెలిపారు. నీరు-చెట్టు పథకం, సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ఈ నెల 25, 26వ తేదీల్లో మళ్లీ వైఎస్సార్ జిల్లాకు వస్తానన్నారు. చెర్లోపల్లి పనులను పరిశీలించిన సీఎం సీఎం చంద్రబాబు గురువారం ఉదయం చెర్లోపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతరం రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరి టాల సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత అనంతపురంలో నీరు-ప్రగతిపై సదస్సు నిర్వహించారు. చివరగా కొడికొండ చెక్పోస్టు సమీపంలో ఎలక్ట్రానిక్ అండ్ బయోటెక్నాల జీ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల్లో బాబు ప్రసంగించారు. -
ఎన్టీపీసీ ‘విద్యుత్’పై కేంద్రానిదే నిర్ణయం !
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న 1,600(25800) మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధన మేరకు ‘ఎన్టీపీసీ’, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) మధ్య గత జనవరి 18న కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) బహిర్గతం చేసింది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, సలహాలను వచ్చే నెల 18లోగా తెలియజేయాలని ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. 1,600 మెగావాట్ల తొలి దశ ప్రాజెక్టుపై పీపీఏలో రాష్ట్ర పునర్విభజన చట్టం హామీ ఊసే లేదు. కేంద్రం హామీ మేరకు 100 శాతం విద్యుత్ రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా రాష్ట్రానికి కేటాయించే విద్యుత్ను కేంద్రమే నిర్ణయిస్తుందని ఒప్పందంలో రాసుకున్నారు. పీపీఏలో పెట్టుబడి వ్యయాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. విద్యుత్ కేంద్రం వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ తేదీ(సీవోడీ) నుంచి 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం మనుగడలోకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సీవోడీ కానీ, ప్రాజెక్టు నిర్మాణ కాల వ్యవధి వివరాలు మాత్రం లేవు. -
రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్ పుస్తకం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ రాష్ట్ర విభజన తీరుపై ఓ పుస్తకాన్ని రాస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా జరిగిన పరిణామాలను ప్రత్యేకించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఓఎం) వివరాలను సమగ్రంగా ఆ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా రాష్ట్రం పేరును ఆంధ్రప్రదేశ్గా ఏవిధంగా ఖరారు చేయాల్సి వచ్చిందో కూడా ఆయన అందులో వివరిస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంటులో కలిసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పుస్తకం గురించి వివరించారు. అయితే ఆయన చెబుతున్న విషయాలను అడ్డుకుంటూ, ‘మీరు కాంగ్రెస్ను నాశనం చేశారు’ అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పాత విషయాలు ఇప్పుడెందుకు లేవదీస్తారంటూ జైరాం రమేశ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
నిర్లక్ష్యంతోనే కాంగ్రెస్ బలహీనం: రఘువీరా
విజయవాడ (గుణదల): పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో పార్టీ మరింత బలహీనపడిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్లో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఎంపికచేసిన 70 మంది ముఖ్య కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో 15 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేవిధంగా కార్యకర్తలు వ్యూహరచన చేయాలని సూచించారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకొని పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఉపకరిస్తుందన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు చేబదులు పరిమితి రెట్టింపు
♦ ఆంధ్రాకు రూ.770కోట్ల నుంచి రూ.1,510 కోట్లకు... ♦ తెలంగాణకు రూ.550కోట్ల నుంచి రూ.1,080కోట్లకు పెంపు ♦ వీటితోపాటు అన్ని రాష్ట్రాలకూ పెంచిన ఆర్బీఐ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చేబదులు (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్) ఆర్బీఐ రెట్టింపు చేసింది. దీంతో ఈ రాష్ట్రాలకు రోజువారీ ఖర్చులు, చెల్లింపులకు మరింత వెసులుబాటు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాల ఆదాయ వనరులు, వ్యయం పెరగడంతో పాటు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టి ఆధారంగా ఈ పరిమితిని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిమితి 1,320 కోట్ల రూపాయలుండేది. రాష్ట్ర విభజన తరువాత ఇది ఏపీకి రూ.770 కోట్లు, తెలంగాణకు రూ.550 కోట్లు అయింది. ఇప్పుడు దీన్ని ఏపీకి రూ.1,510కోట్లకు, తెలంగాణకు రూ.1,080కోట్లకు పెంచిన ఆర్బీఐ.. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం గతేడాది కాలంలో తరచూ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ను వాడుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఖజానాలో నగదు నిల్వలు లేనప్పటికీ ఆర్బీఐ నుంచి చేబదులుగా ఏపీ ప్రభుత్వం రూ.1,510 కోట్ల వరకు వాడుకోవచ్చు. దీనికి మూడు నెలల వరకు 6.75శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. ఆ తరువాత కూడా అడ్వాన్స్ కొనసాగితే అదనంగా ఒక శాతం వడ్డీ చెల్లించాలి. చేబదులు పరిమితిని దాటి ఆర్బీఐ నుంచి నిధులను వాడుకుంటే ఓవర్డ్రాఫ్ట్కు వెళ్లినట్లు అవుతుంది. ఓడీలో 14 పనిదినాల పాటు ఉండవచ్చు. ఒకవేళ ఈ గడువు కూడా దాటితే ఆర్బీఐ ఆ రాష్ట్ర చెల్లింపులన్నింటినీ నిలిపేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో తొలిసారి వేస్ అండ్ మీన్స్ పరిమితికి నూరు శాతంలోపు మాత్రమే ఓవర్డ్రాఫ్ట్కు వెళితే ఆ మొత్తానికి సాధారణ వడ్డీకి అదనంగా రెండు శాతం వడ్డీని వసూలు చేస్తుంది. వేస్ అండ్ మీన్స్ పరిమితికి నూరు శాతం దాటిపోయి ఓవర్డ్రాఫ్ట్కు వెళితే ఆ మొత్తానికి సాధారణ వడ్డీకి అదనంగా ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తారు. -
తెలుగు ప్రజలకు మరోసారి ద్రోహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలకు రాష్ట్ర విభజన తరువాత మరోసారి ద్రోహం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పూర్తిగా భంగకరమని పేర్కొన్నారు. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ గురించి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీకి తెలియదంటే నమ్మశక్యంగా లేదన్నారు. టీడీపీ నేతలను సంప్రదించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావించలేమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్గజపతి రాజు కూడా నోరు మెదపలేదని శ్రీకాంత్రెడ్డి తప్పు పట్టారు. వీరంతా తమ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లుగా ఉందని మండిపడ్డారు. 2011లో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడినప్పు డే మనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. దిగువ రాష్ట్రాలకు మిగులు జలాలను వాడుకునే పూర్తి హక్కు ఉన్నా దానికోసం చంద్రబాబు పోరాడటం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను ఆయన దాదాపుగా వదులుకున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉండటమే రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ ముందడుగు తాము అధికారంలోకి వస్తే బెల్ట్షాపుల రద్దుతోపాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క మద్యం షాపు మాత్రమే ఉండేలా చేస్తామని, ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తామని వైఎస్ జగన్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని శ్రీకాంత్రెడ్డి గుర్తుచేశారు. విజయవాడలో కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించడంతో ఆయన ప్రస్తుతం ఓ అడుగు ముందుకేసి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారని పేర్కొన్నారు. -
ఇంటర్మీడియెట్లో ‘ఫ్రీ ఫ్లో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేకమంది ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు ఇంటర్మీడియెట్ బోర్డు ‘ఫ్రీ ఫ్లో’ ద్వారా పరిష్కారాన్ని చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఏపీప్రాంతాల్లో ఇంటర్ ఫస్టియర్ చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో పడ్డారు. ఫస్టియర్ ఎక్కడ చదివారో సెకండియర్ కూడా అదే రాష్ట్రం బోర్డు నుంచి రాయాలి. రాష్ట్ర విభజనతో మొదటి సంవత్సరం చదివిన ఏపీలోని విద్యార్థులు తెలంగాణకు, తెలంగాణలోని విద్యార్థులు ఏపీకి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోయింది. టెన్త్ వరకు ఒకచోట చదివి ఇంటర్ వేరే చోట చదివినప్పుడు స్థానికతతోపాటు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సొంత రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయాలనుకున్న వారికి కష్టాలు తప్పలేదు. కొంతమంది హైదరాబాద్లోని కాలేజీల్లో ఫస్టియర్ చదివి సెకండియర్ ఏపీలోని కాలేజీల్లో చేరడానికి వెళ్లినా మళ్లీ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని అక్కడి కాలేజీలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంపై ఏపీ ఇంటర్బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్తో చర్చించారు. ఒక రాష్ట్రం నుంచి వేరేగా కొత్త రాష్ట్ర ఏర్పాటు సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ‘ఫ్రీ ఫ్లో’ విధానం అమలు చేయడానికి ఆస్కారమున్నందున దాన్ని అనుసరించాలని నిర్ణయించారు. ఫ్రీ ఫ్లో అంటే? ఒక రాష్ట్రంలో చదివిన విద్యార్థి తదుపరి తరగతులను కొత్త రాష్ట్రంలో కొనసాగించడానికి ‘ఫ్రీ ఫ్లో’ విధానం అవకాశమిస్తుంది. ఆయా విద్యార్థుల సమాచారాన్ని ఆయా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొని తదుపరి తరగతులు, పరీక్షలకు అనుమతించాలి. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమో దం తెలిపింది. తెలంగాణ బోర్డు కార్యదర్శి కూడా సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇరు రాష్ట్రాల మధ్య మార్పును కోరుకునే ఇంటర్ విద్యార్థుల సమాచార మార్పిడికి అవకాశముంటుంది. ఏపీలో ఫ్రీ ఫ్లో విధానానికి వీలుగా ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. -
ప్రత్యేక నిధులు నీటిపాలు
ఓహెచ్ఆర్ల రిపేర్లకు రూ.1.57కోట్లు పనులన్నీ ఐదులక్షల లోపే అవసరం లేని చోటు వృథాగా ఖర్చు విశాఖపట్నం : రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని జిల్లాలకు కేంద్రం కేటాయించిన నిధులను కొన్నిశాఖలు అర్థంపర్థంలేని పనులకు కేటాయిస్తున్నాయి. రెండు విడతల్లో రూ.100 కోట్లు జిల్లాకు విడుదల కాగా..తొలివిడతలో మంజూరైన నిధుల్లో రూ.42 కోట్లు వివిధ శాఖలు ప్రతిపాదించిన పనులకు కేటాయించారు. ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధకశాఖ, డ్వామా, వ్యవసాయ, ఉద్యానవనశాఖలు కనీస అవసరం లేనిచోట్ల వృథాగా ఖర్చుచేసేందుకు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఎస్కు కేటాయించిన రూ.1.57కోట్లలో రూ.కోటి ఓహెచ్ఆర్ ట్యాంకుల మరమ్మతులకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. మూలనపడ్డ 13 పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.57.2 కోట్లు కేటాయించిన ఈ శాఖ శిథిలావస్థకు చేరిన 31 ఓహెచ్ఆర్ ట్యాంకుల మరమ్మతుల కోసమంటూ రూ.కోటి కేటాయించింది. ఒకటిరెండు పనులు మినహా మిగిలిన పనులకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలలోపే కేటాయింపులు జరిగాయి. డుంబ్రిగుడ మండలంలో ఏడు పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.41 లక్షలు, పెదబయలు మండలంలో రెండు స్కీంలకు రూ.5.70 లక్షలు, కోటవురట్ల మండలంలో మూడు పథకాలకు రూ.5.50 లక్షలు, పాయకరావుపేట మండలం పాల్తేరు వద్ద నిరుపయోగంగా ఉన్న పీడబ్ల్యూఎస్ స్కీం పునరుద్ధరణకు రూ.5లక్షలు కేటాయించారు. ఇక ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకుల మరమ్మతుల పేరిట బుచ్చెయ్యపేట మండలంలో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనాతో మూడు పనులకు ప్రతిపాదించారు. రావికమతం మండలంలో రూ.8.20 లక్షలతో 4 పనులకు, దేవరాపల్లి మండలంలో రూ.5.50 లక్షలతో ఐదు పనులకు, పాడేరులో 8 పనులకు రూ.21లక్షలు, పెదబయలు మండలంలో ఆరులక్షలతో రెండు పనులకు, రూ.2.50 లక్షల అంచనాతో బుచ్చెయ్యపేట,నక్కపల్లి మండలాల్లో ఒక్కొక్కటి, పాయకరావుపేటలో మూడు, కోటవురట్ల, పరవాడ లలో ఒక్కొక్కటి,పెందుర్తి రెండుపనులకు ప్రతిపాదించారు. దాదాపుఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ట్యాంకులైతే కనీస మరమ్మతులకు సైతం నోచుకోని దుస్థితి. అలాంటి శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు సైతం ప్రత్యేక మరమ్మతుల పేరిట ఈ ప్రత్యేక నిధులు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. జర్మన్ టెక్నాలజీతో వీటిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నప్పటికీ వీటిలో చాలా వరకు కనీసమరమ్మతులకు పనికిరానిస్థితిలో ఉన్నాయి. రూ.లక్షలుపోసివీటికి పైపై మెరుగులు దిగ్గినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మళ్లీ కొద్దిరోజుల్లోనే శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జీర్ణావస్థలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు మరమ్మతుల పేరిట లక్షలు వెచ్చించే బదులు వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మేలన్న వాదన వినిపిస్తోంది. మరో పదేళ్లు ఢోకా ఉండదు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ జర్మన్ టెక్నాలజీ ద్వారా మరమ్మతులు చేయడం వల్ల కనీసం పదేళ్ల పాటు వినియోగంలోకి తీసుకురావచ్చు. జీర్ణావస్థలో ఉన్న ట్యాంకులోని ఇనుప ప్రేమ్లకు పోర్స్రాక్ మెటీరియల్, జియోబ్యాండ్ కెమికల్ను అప్లై చేసి తిరిగి రంగు, సిమ్మెంట్ పూత వేస్తే చాలు..పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. సొమ్ములు వృధా కావు.. -తోట ప్రభాకరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
'విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది'
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్రం చేసే సాయం గురించి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఏం చేశారో ప్రధాని చెప్పలేదని జేపీ అన్నారు. రాజధాని అంటే కేవలం అమరావతే కాదని చెప్పారు. -
ఇదా ఉపకారం
విద్యాసంవత్సరం{పారంభమైనా తెరుచుకోని ఈ పాస్ఫీజులు.. ఉపకార వేతనాలపైఎడతెగని జాప్యం ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో విద్యార్థులు.. తల్లితండ్రులు విశాఖపట్నం రాష్ర్ట విభజన పాపం విద్యార్థులను శాపంలా వెన్నాడుతోంది. విద్యా సంవత్సరం ఆరంభమై నాలుగునెలలు గడుస్తున్నా నేటికీ ట్యూషన్ ఫీజులు, మెస్చార్జీల కోసం దర ఖాస్తుచేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని ఆంధ్ర విద్యార్థుల విషయంలో సర్కారు నాన్చుడు ధోరణి ఇక్కడి వారిని కలవరపెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, మైనార్టీలతో పాటు ఈబీసీ వర్గానికి చెందిన ఇంటర్మీడియట్, ఆపైన కోర్సుల విద్యార్థులు ఏటా ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. అడ్మిషన్ సమయంలోనే అర్హుల నుంచి విద్యాసంస్థలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆధార్కార్డులు, అకౌంట్ నెంబర్లను కూడా తీసుకుంటారు. విద్యాసంవత్సరం ఆరంభ మైన నెలలోగా తొలుత విద్యాసంస్థల వారీగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. తర్వాత అర్హుల జాబితాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వాటిని అధికారులు పరిశీలించి సిఫార్సు చేస్తారు. వాటికనుగుణంగానాలుగునెలలకొకసారి నిధులు విడుదల చేస్తుంటారు. ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ విద్యాసంస్థల రిజిస్ట్రేషన్ కూడా పూర్తికాలేదు. మరొక పక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్సైట్ కూడా తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో 2014-15లో కళాశాల స్థాయిలో కొత్తగా 6.82 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, మరో 7.39 లక్షల మంది మంది రెన్యువల్ చేయించుకున్నారు. వీరికి సంబంధించి బకాయిలు మరో రూ.150కోట్ల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఎంతమంది చేరారు?ఎంత మంది అర్హులో కూడా తెలియని పరిస్థితి. ఇంటర్మీడియట్ ఆపైబడి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. ఇక్కడ పుట్టి తెలంగాణాలో చదువుకుంటున్న వారు.. తెలంగాణాలో పుట్టి ఇక్కడ చదువుకుంటున్న వారి విషయంలో ఇరు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రానందునే జాప్యం జరుగుతోందని భోగట్టా. తమ రాష్ర్టంలో చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల విషయాన్ని పెండింగ్లో పెట్టిన తెలంగాణా సర్కార్ తమ రాష్ర్ట విద్యార్థులకు మాత్రం ఇప్పటికే ఉపకార వేతనాలు, మెస్చార్జీలు, ఫీజురింయబర్సుమెంట్ విషయంలో దరఖాస్తుల స్వీకరిస్తోంది. మన ప్రభుత్వంమాత్రం కావాలనే జాప్యం చేస్తుందనే వాదన విన్పిస్తోంది. -
రోడ్డు మీద దీక్షలు చేస్తే చూస్తూ ఉండాలా?
-
వైఎస్ జగన్ దీక్షకు అనుమతిచ్చేది లేదన్న చంద్రబాబు
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ప్రెస్మీట్ లో మాట్లాడుతూ 'చచ్చిపోతామని దరఖాస్తు చేస్తే అనుమతి ఇవ్వాలా?. జగన్ ధర్నా చేయాల్సింది గుంటూరులో కాదు...ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని అనుకోవడానికే ఇలా చేస్తున్నారు. రోడ్డుపై ధర్నా చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? బస్సులు తగలబెడతామంటే అనుమతి ఇస్తామా? మీరు కూడా దీక్షలు చేశారు కదా... అని మీడియా ప్రతినిధులును ప్రశ్నిస్తూ' మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. యువభేరిలో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు...కేంద్ర మంత్రులతో భేటీ అయిన వివరాలను మీడియాకు వివరించారు. * ఏపీకి సాయం చేయాలని అరుణ్ జైట్లీని కోరాం *విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని కోరాం * అమరావతిలో ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణం, కర్నూలు నుంచి అమరావతికి రోడ్డు కోరాం. * వ్యవసాయా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 200 కోట్లు మంజూరయింది. *రాజధాని పరిధిలో 50 ఎకరాలు డీ నోటిఫై చేయాలని కోరాం. *ఏపీలో విమానయానం పెరిగింది. కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశాం. *ఏపీలో 3 అంతర్జాతీయ విమానావ్రయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. *పొగాకు రైతు సమస్యలపై కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్తో చర్చించాం. *పదేళ్ల యూపీఏ పాలనలో నదుల అనుసంధానం నిర్లక్ష్యం చేసింది. *5 నెలల 20 రోజుల్లో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశాం. *పోలవరం ప్రాజెక్ట్ కోసం ఈ ఏడాది రూ.1950 కోట్లు ఖర్చు పెట్టాం. * పోలవరానికి సవరించిన అంచనాలతో నిధులు మంజూరు కోరాం. *కొత్తగా 17 జాతీయ సంస్థలు ఏపీకి వస్తున్నాయి. *పామాయిల్, పట్టు పరిశ్రమల సమస్యలను పరిష్కరించాలని కోరాం. *భవిష్యత్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తాం. *11 విద్యా కేంద్రాలకు భూకేటాయింపులు పూర్తయ్యాయి. *కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేయాల్సి ఉంది. -
ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు
-
ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం ఢిల్లీలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరామని, పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకూ సాయం చేయమన్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ సమస్యలన్నింటినీ కేంద్ర మంత్రులకు వివరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పొగాకు రైతులను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. -
అప్పటి నిధుల విభజన చెల్లదు...
* నిధులు వినియోగించకుండా ఏపీ ఇంటర్బోర్డును ఆదేశించండి * హైకోర్టులో తెలంగాణ ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు ఇంటర్ బోర్డుకు వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343 కోట్ల నిధులను ఇరు రాష్ట్రాల బోర్డులకు విభజన చేస్తూ అప్పటి బోర్డు కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ నగరంలో లేకపోవడంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల ఆస్తులను మిగిలిన సంస్థల అస్తి, అప్పులను విభజించినట్లు విభజించేందుకు సెక్షన్ 75 అనుమతించడం లేదు. అయితే అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి తనకు లేని అధికారాన్ని ఉపయోగిస్తూ వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343.5 కోట్లను 31.5.2014న ఇరు బోర్డులకూ విభజన చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రూ.200 కోట్లను ఏపీ ఇంటర్ బోర్డు పేరు మీద వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉన్నత విద్యా మండలి విషయంలోనూ ఇలానే నిధుల విభజన చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినివ్వొద్దని బ్యాంకులకు లేఖలు రాశాయి. విషయం తెలుసుకున్న ఏపీ బోర్డు రూ.105 కోట్లను విజయవాడ ఆంధ్రాబ్యాంకుకు మళ్లించింది. అయితే మిగిలిన బ్యాంకులు ఖాతాల నిర్వహణకు అనుమతినివ్వకపోవడంతో ఏపీ బోర్డు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు పొందింది. ఖాతాల స్తంభన నాటికి ఖాతాల్లో ఉన్న నిల్వలను అలా కొనసాగించాలని బ్యాం కులను హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఏపీ బోర్డు పేరు మీద విభజన చేసిన నిధులను విత్డ్రా చేయకుండా, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయండి. ఆ మొత్తాలను తమ కు వాపసు చేసేలా ఆదేశాలివ్వండి.’ అని తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
తలలు వంచుకుని నిల్చున్నవారా ప్రశ్నించేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వేళ సోనియాగాంధీ ముందు తలలు వంచుకుని నిల్చున్నవారు ఇప్పుడు ప్రధామంత్రి మోదీ మెడలు వం చుతాననడం హాస్యాస్పదమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి చెం దిన మున్సిపల్, నగరపాలక సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలకు ఆది వారం పార్టీ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ తెలుగువాడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ మిత్రపక్షం కాకపోయినా ఫెడరల్ స్ఫూర్తితో టీం ఇండియా గా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనపై తప్పు డు ఆరోపణలు చేయడం, దురద్దేశాలు ఆపాదించడం తగదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని కొందరు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సమయంలోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. స్మార్ట్సిటీల ఎంపిక, విధివిధానాలు, మురికివాడలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, నగరాలకు కేంద్రం నుంచి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. దేశంలోని 500 నగరాల్లో రాబోయే ఐదేళ్లలో అమృత పథకం కింద మంచినీటి సరఫరా, పరిశుభ్రత, వ్యర్థపదార్థాల సేకరణ, శుద్ధీకరణ, పట్టణ రోడ్లు వంటివాటికి లక్షకోట్లు ఖర్చు చేయనున్నట్టుగా వెల్లడించారు. వరంగల్ను వారసత్వ నగరాల కింద ఎంపిక చేశామన్నారు. స్వచ్ఛభారత్ కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు ఇస్తామన్నారు. పట్టణల్లో స్వయం సహా యక బృందాలను నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు అనుసంధానం చేసి ఉపాధిని పెంచుతామన్నారు. ఆగిపోయిన రాజీవ్ ఆవాస యోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీనేత గీతామూర్తి బీజేపీలో చేరారు. సదస్సుకు జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
‘దుమ్ముగూడెం’ ఇక రాష్ట్రానికే పరిమితం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిన ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుపై మున్ముందు ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి చర్చలు జరపరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రయోజనాలను రాష్ట్రంవరకే పరిమితం చేసేలా డిజైన్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో జరిగిన కాల్వల పనులను ఇతర ప్రాజెక్టులతో అనుసంధానించే మార్గాలను అన్వేషించి, సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశం చేసింది. రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు ఏపీకి వెళ్లడంతో ప్రాజెక్టులోని కీలక హెడ్వర్క్ పనులన్నీ ఏపీకి వెళ్లిపోయాయి. కెనాల్ల పనులు మాత్రం తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయాన్ని రూ.1824 కోట్లుగా నిర్ణయించగా అందులో ఇప్పటికే రూ.1,047 కోట్ల పనులు పూర్తయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణలో జరగాల్సిన పనుల విలువ రూ.1203 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు రూ.696.49 కోట్ల పనులు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. చర్చలు వద్దన్న సీఎం: కాగా ఇటీవల దుమ్ముగూడెం ప్రాజెక్టుపై వరుసగా 2 రోజులు సమీక్ష జరిపిన సీఎం కె.చంద్రశేఖర్రావు, ఇందిరాసాగర్ పనులపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇరు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టు లెక్కన తెలంగాణ రూ. 382 కోట్లు, ఏపీ రూ. 233 కోట్ల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుందని లెక్కలు వేశారు. ఈ పనుల ఖర్చుకు సంబంధించి గతేడాది ఆగస్టు నెలలోనే నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగినా ఇంతవరకూ పనులు చేసే విషయమై ఏపీ ఎలాంటి స్పష్టతనివ్వలేద న్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇందిరాసాగర్ మిగులు పనులను ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పూర్తి చేసుకునేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదని, ఈ దృష్ట్యా చర్చలు, ఒప్పందాల అంశాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు పరిమితం చేసేలా పనులను ఏవిధంగా వాడుకోవచ్చో అంచనాకు రావాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందిరాసాగర్ కింది ఆయకట్టును రాజీవ్సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానించడమా? లేక రోళ్లపాడు వద్ద 11 టీఎంసీలు, బయ్యారం వద్ద 6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు అనుసంధానించాలా అనే అంశాలపై సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. -
ఇంకా కుదురుకోని ‘సంక్షేమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంకా విభజన బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. ముఖ్యం గా ఉన్నతోద్యోగుల విభజన కారణంగా సంక్షేమ శాఖల పనితీరు మందగించింది. రాష్ట్ర విభజన జరి గి పధ్నాలుగు నెలలు దాటినా పరిపాలనాపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పూర్తిస్థాయిలో ఇంకా కుదురుకోలేదు. కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సంక్షేమ భవన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ డెరైక్టరేట్లలో ఉద్యోగుల కొరత కారణంగా పని ఒత్తిడి పెరిగింది. ఎస్సీ అభివృద్ధిశాఖలో ఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో తెలంగాణకు విడిగా ఒక స్థానాన్ని సృష్టించాల్సి వస్తోంది. ఇద్దరు జేడీలు ఉండగా వారిలో ఒకరు డిప్యూటేషన్పై వెళ్లడంతో ఆ పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇక సాంఘిక సంక్షేమ అధికారుల(ఎస్డబ్ల్యూవో) పోస్టులు మొ త్తం 858 ఉండగా వాటిలో 177 ఖాళీగా ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల(డీఎస్డబ్ల్యూవో) పోస్టులు 11కుగాను 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎస్డబ్ల్యూవో పోస్టులు 61 కాగా అం దులో 8 ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్/జోనల్ పోస్టులు కలుపుకుంటే 150 పోస్టులకుగాను 32 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ శాఖకు సంబంధించి ఏపీకి అడిషనల్ డెరైక్టర్ పోస్టు వెళ్లడంతో ఇక్కడ ఏడీ పోస్టును సృష్టించాల్సి ఉంది. దీనితోపాటు ఒక జేడీ, రెండు డీడీ పోస్టులు, ఆరు సెక్షన్ సూపరింటెండెంట్ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 10 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, రెండు జోనల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడు ఏటీడబ్ల్యూవో పోస్టులు, 83 గ్రేడ్-2 హెడ్మాస్టర్ పోస్టులు, వంటవాళ్లు 201 మంది, 129 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గ్రేడ్-2 పోస్టులు, 352 సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఏఎస్) పోస్టులు, 259 సెకండరీ గ్రేడ్ టీచర్ల(జీపీఎస్)పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో జాయింట్ డెరైక్టర్ ఇన్చార్జి డెరైక్టర్గా కొనసాగిస్తున్నారు. అదనపు డెరైక్టర్ పోస్టును సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 750కుగాను 200 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1500 కామాటీ, వంట వాళ్లు, వాచ్మన్ పోస్టులకుగాను 310 ఖాళీగా ఉన్నాయి. -
అవని.. ఆకాశమే హద్దని
జిల్లాలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సామాన్య, మధ్య తరగతి జనం సెంటు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తూ రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నరసాపురం అర్బన్ : జిల్లాలో భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. జిల్లాలో మారుమూల ఉన్న నరసాపురంలో మార్కెట్ ప్రాంతంలో గజం స్థలం రూ. 2 లక్షలు పైనే పలుకుతోంది. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. ఈ పట్టణాల్లోని మారుమూల కూడా గజం రూ.15 వేలకు చేరింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పాలకులు అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తుండడం, ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూమ్ తీసుకొచ్చి ధరలు పెంచేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ మంది. ఒకానొక దశలో భూములను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తామనే ప్రకటనలు గుప్పించడంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు రివ్వున ఆకాశాన్ని తాకాయి. జిల్లాకు శివారున ఉండే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సైతం పంట భూములు ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన అపార్ట్మెంట్ల సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. ఏలూరు కార్పొరేషన్తో సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి 200 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. స్థలాల ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం కూడా పేదలకు నివాస గృహాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. భూముల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మారింది. -
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏపీకి ప్రత్యేకంగా నిర్వహించిన మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. బీ-కేటగిరీ భర్తీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కొద్దిసేపు ఆందోళన మినహా తొలిరోజు ప్రశాంతంగానే కౌన్సెలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీకి చేరుకున్నారు. కౌన్సెలింగ్కు వచ్చినవారి కోసం యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెల్త్ యూనివర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పలకరించారు. హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో తొలి సీటును గుంటూరుకు చెందిన 16వ ర్యాంకర్ కె.గీతాశ్రీ తీసుకోగా, ఆమెకు మంత్రి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గీతాశ్రీ విలేకరులతో మాట్లాడుతూ న్యూరాలజిస్ట్ను కావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అఖిలభారత విద్యార్థి సంఘ పరిషత్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘ నేతలు హెల్త్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. తొలుత వర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా గేటును తోసుకుని లోపలికి వచ్చారు. మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్చేసి స్టేషన్కు తరలించారు. అవకతవలకు పాల్పడుతున్న ప్రైవేటు మెడికల్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కామినేనికి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. -
‘స్మార్ట్’గా తప్పించారు!
ఒకప్పటి రాజధాని.. రాష్ట్రాలను కలిపే క్రమంలో పోగొట్టుకున్న తన హోదాను రాష్ట్ర విభజన సమయంలో దక్కించుకుంటుందని అందరూ భావించారు. ఆ దిశగా ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు పోరాడారు కూడా. అయితే ఫలితం లేకపోయింది. కానీ కర్నూలుకు ప్రాధాన్యం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారు. అయితే ప్రస్తుతం ఆయన హామీలు ఒక్కొక్కటిగా నీరుగారిపోతుండడం విస్మయాన్ని కల్గిస్తోంది. కర్నూలుకు మరోసారి మొండిచేయి - ఒకప్పటి రాజధానికి వరుస పరాభవాలు - హామీలు ఒక్కొక్కటిగా నీరుగారుతున్న వైనం - అధికార పార్టీ జిల్లా నేతలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పటి రాజధానికి ఆ హోదా దక్కకపోయినా అంతకు మించిన రీతిలో అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం హామీలు గుప్పించింది. ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్), క్యాన్సర్ ఆసుపత్రి, హజ్హూస్, క్రీడా యూనివర్సిటి, స్మార్ట్సిటి ఇలా ఎన్నో కర్నూలుకే అన్నట్టు ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఇక్కడి నేతలు, మంత్రులతోపాటు సీఎం సైతం బల్లగుద్దీ మరీ ఈ మాటలు చెప్పారు. అన్నీ ఒకే ఇక పనులే తరువాయి అన్నంతగా పరిస్థితిని తెచ్చారు. రాజధాని చాన్స్ మిస్సయినా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి తథ్యమన్నట్లు జిల్లా ప్రజలు భావించారు. కాని అచరణకు వచ్చే సరికి పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా సాగుతోంది. అర్భాటంగా ప్రకటించిన హామీలన్నీ ఒక్కోక్కటిగా ఇతర జిల్లాలకు తరలిపోతుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం సార్మ్సిటి జాబితాలో కూడా లేకపోవడంతో కర్నూలుకు మరో భంగపాటుగా భావిస్తున్నారు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో టార్చ్లైట్ వేసి వెతికినా కర్నూలు కనిపించకపోవడం గమనార్హం. రూ.300 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు రెండున్నర నెలల క్రిత మే స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం స్మార్ట్ సిటీగా కర్నూలును ఎంపిక చేసింది. సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నగర జనాభా, మంచినీటి అవసరాలు, డ్రెయినేజీ సిస్టం, మురికివాడల పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు, సమగ్రాభివృద్ధికి కావాల్సిన అవసరమైన నివేదికలు తయారు చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకదృష్టి సారించి రూ.300 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. నగరంలో ప్రధానంగా మురుగు కాల్వ వ్యవస్థ, భూగర్భ డ్రెయినేజి, నీటిశుద్ధి కేంద్రాలు, అన్ని వీధులకు రోడ్లు, కాల్వలు, కల్వర్టులు, ఖాళీ స్థలాల్లో పార్కుల ఏర్పాటు వంటి వాటితో నివేదికలు రూపొందించారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చకపోవడంతో అధికార పార్టీకి చెందిన జిల్లా నేతలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా స్మార్ట్ సిటీల ఎంపికలో కూడా కర్నూలును విస్మరించడం గమనార్హం. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికి మాత్రమే చోటు దక్కింది. -
ప్రత్యేక హోదాపై పచ్చి మోసం
{పత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఏలూరు(ఆర్ఆర్ పేట) : రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, దానికి మద్దతు పలికిన టీడీపీ ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ సీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని, తాము అధికారంలోకి వస్తే కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. అదే వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. గతంలో రామ మందిర నిర్మాణం విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసగించిందని, ఆ మోసాన్ని గ్రహించిన ఓటర్లు తరువాత ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని గుర్తు చేశారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఆ పార్టీ మరోసారి అధికారం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుబ్బారాయుడు హెచ్చరించారు. విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసగించగా, ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆ హామీ నుంచి పలాయనం చిత్తగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో చూపిన ఉత్సాహాన్ని ప్రత్యేక హోదా అమలు చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమమే
రాయలసీమ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడపాల్సి ఉంటుందని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. తిరుపతిలో గురువారం ఏపీ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు నేతలు, వక్తలు ప్రసంగించారు. - ‘విభజన’ ఉద్యమంలో టీడీపీ నేతలే లేరు - ఉమ్మడి రాజధానిలో వాటా ఇవ్వాలి - జర్నలిస్ట్ ఫోరం చర్చాగోష్టిలో వక్తలు తిరుపతి అర్బన్: రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కూడా రాయలసీమ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే మరో పదిహేనేళ్లలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడపాల్సి ఉంటుందని రాయలసీమ అధ్యయనాల సమితి అధ్యక్షుడు భూమన్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 అ మలు, ప్రత్యేక హోదా, రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అం శాలపై ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి జిల్లాలోని ప లువురు రాజకీయ నేతలు, రైతు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు రాష్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన్ మాట్లాడుతూ రాయల సీమ జిల్లాలకు నీటి వనరులను సమృద్ధిగా అం దిస్తే తప్ప ప్రజలు తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చలేరన్నారు. అలాగే నాలుగు జిల్లాల్లో లభ్యమయ్యే ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సీమ ప్రాంత అభివృద్ధికే కేటాయిం చాలన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని ప్రధాన అంశాలో ్లనూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమం వస్తుందన్నారు. నష్టపోతామని చెప్పినా వినలేదు ఉమ్మడి రాష్ట్రం విడిపోతే నష్టపోతామని చెప్పినా పార్టీలు, స్వార్థపరులు వినలేదు. ఇప్పటికీ అన్ని రంగాల్లో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కేంద్రం స్పం దించి నవ్యాంధ్రకు నిధులు ఇవ్వా లి. సెక్షన్ 8పై కఠినంగా వ్యవహరించి, గవర్నర్ సమస్యలు పరిష్కరించాలి. -డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, డాక్టర్స్ జేఏసీ నేత ఉద్యమంలో టీడీపీ నేతలే లేరు సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ నేతలు ఎక్కడా కనిపించలేదు. అస లు సెక్షన్ 8పై ఇంత రాద్ధాం తం చేయడం కన్నా ఆ సెక్షన్లోనే సవరణలు చేయాలి. మన ప్రభు త్వ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శినే తెలంగాణ వాళ్లు లోపలికి రానీలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో...? హైదరాబాద్లో పరి స్థితులు చూస్తుంటే మరోసారి ఉద్యమించాల్సిన అవసరం కలుగుతోంది. -నిర్మల, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కేంద్రం తప్పక న్యాయం చేస్తుంది నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం తప్ప క సహకరించి, న్యాయం చేస్తుంది. ఒకప్పుడు అన్నపూర్ణాంధ్రగా ఉన్న మన రాష్ట్రాన్ని ఇప్పుడు అంధకారాంధ్రగా మార్చారు. కేసీఆర్ ధోరణి మారాలి. రాజధాని నిర్మాణానికి డీటైల్డ్ రిపోర్డు ఇవ్వకుండానే కేం ద్రం నిధులు ఇవ్వడం లేదంటే ఎట్లా? విభజన చట్టంలోని పాత, కొత్త గైడ్లైన్స్ను పరిశీలించి నిర్ణయించాల్సి వుంది. - గుడిపల్లి భానుప్రకాష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత గవర్నర్ జోక్యం ఉండాలి హైదరాబాద్లో సీమాంధ్రులకు న్యాయం జరిగి భద్రతకు భరోసా రావాలంటే గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఆ దిశగా ఆయన రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా చూడాలి. - తలారి ఆదిత్య, సత్యవేడు ఎమ్మెల్యే రైతు సమస్యలు పేరుకుపోతున్నాయి విభజన తర్వాత రైతు లు, వారికి సంబంధించిన శాఖల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. రైతులు పం డించే పంటలకు వారే ధరలు నిర్ణయించే వాతావరణం కల్పిం చాలి. అంతేగాక నవ్యాంధ్రలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. - మాంగాటి గోపాల్రెడ్డి, రైతు సంఘంనేత ఉమ్మడి రాజధానిలో వాటా ఇవ్వాలి నవ్యాంధ్రకు ఉమ్మడి రాజధాని హైదరాబా ద్ ఆదాయంలో వా టా ఇవ్వాలి. ఆంధ్రులపై తెలంగాణ వాదు లు దాడులు చేస్తే అక్క డ కేసులు నమోదు కావు. విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు కాదంటే విభజన జరగనట్టే. రాష్ట్ర కార్యదర్శి, ఏపీ ఎన్జీవోల సంఘం రెండు కౌన్సిళ్లను సంప్రదించాలి సెక్షన్ 8తో పాటు విభజన చట్టంలోని అంశాలపై రెండు కౌన్సిళ్లను కేంద్రం సంప్రదించి న్యాయం చేయాలి. ఈ అంశంపై మేధావులు కూడా ఉద్యమించాలి. దీన్ని రాజకీయ కో ణంగా చూడకుండా రాష్ట్ర అంశంగా పరిగణించాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. - జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెలీ సమగ్ర సర్వే పేరుతో మోసం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే పేరుతో ఆం ధ్రులను తరిమే ప్రయత్నాలు చేసింది. అంతేగాక తెలంగాణ నియంతృత్వ పోకడలతో డెప్యూ టీ కలెక్టర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, గవర్నర్ చొరవ తీసుకుని సీమాంధ్రులకు రక్షణ కల్పించాలి. - బొప్పరాజు వెంకటేశ్వవర్లు, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యారంగం అభివృద్ధికీ ఆటంకమే.. రాష్ట్ర విభజనతో విద్యా రంగాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు అవస్థ లు పడుతున్నారు. ప్రొఫెసర్లకు కూడా భద్రత లేకుండా తిరగాల్సి వస్తోంది. రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి. - ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాలకు తావు ఇవ్వవద్దు ప్రస్తుతం హైదరాబాద్లో ఎదురవుతున్న సెక్షన్ 8 సమస్యను పరిష్కరించేందుకు జర్నలిస్టుల ఫోరం నిర్వహిస్తున్న ఇలాంటి స దస్సుల్లో రాజకీయాల కు తావు లేదు. అన్ని వర్గా లు కలిసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించడమేకాకుండా మీడియా ను నియంత్రించాలంటే ఆయనకే ఇబ్బందులు. - కృష్ణాంజనేయులు, జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు -
ఆ స్కూళ్లు మూత!
విలీన మండలాల్లో ఇదీ దుస్థితి * తెలంగాణలోకి వెళ్లిపోయిన టీచర్లు * చోద్యం చూసిన ఏపీ అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామంటూ పాఠశాలల నుంచి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏడు మండలాల్లోని టీచర్లను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖలోకి తీసుకోవాలని ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తమను రిలీవ్ చేయాలని అక్కడి టీచర్లు గత కొంతకాలంగా కోరుతూ వచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టలేదు. టీచర్లు పదేపదే రిలీవ్ చేయాలని కోరినా ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక టీచర్లను రిలీవ్ చేయాలని ఈ మండలాల విద్యాధికారులకు ఖమ్మం కలెక్టర్ చెప్పారు. ఈ సమస్యను మండల విద్యాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఖమ్మం కలెక్టర్ సూచన మేరకు టీచర్లంతా మంగళవారం ఎవరికి వారు స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలు రాసి ఇచ్చి స్కూళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడు మండలాలకు చెందిన 400 మంది టీచర్లు తెలంగాణకు వెళ్లారని, దీంతో అక్కడి అన్ని స్కూళ్లూ మూతపడ్డాయని తమకు సమాచారం వచ్చిందని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. జూలైలో రేషనలైజేషన్, బదిలీల సమయంలో ఈ మండలాలకు టీచర్లను ఏర్పాటుచేస్తామని, అప్పుడు రిలీవ్ అవ్వాలని తాము సూచించినా టీచర్లు పట్టించుకోకుండా స్వచ్ఛందంగా రిలీవ్ అయి వెళ్లారన్నారు. ఈ స్కూళ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాకార్యదర్శి ఆర్పీ సిసోడియాతో ‘సాక్షి’ సంప్రదించగా ఇతర మండలాల స్కూళ్లనుంచి టీచర్లను తాత్కాలికంగా ఏర్పాటుచేయనున్నామని, ఏ స్కూలూ మూత పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మిషన్ కాకతీయ:మహాయజ్ఞం
46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యం 6 వేలకు పైగా చెరువుల్లో కొనసాగుతున్న పనులు హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టేదిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. కృష్ణా, గోదావరిల కింద 262 టీఎంసీల నీటిని వినియోగించుకుని.. చెరువుల కింద ఉన్న ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా.. ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టును చేపట్టింది. ఏటా 9 వేల చెరువుల చొప్పున ఐదేళ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించి.. 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురానుంది. మహాయజ్ఞంలా మొదలైన ఈ కార్యక్రమంపై రాష్ట్ర రైతాంగంలో భారీ ఆశలున్నాయి. ఈ పథకానికి చిన్నచిన్న అవాంతరాలు ఎదురవుతున్నా.. పనులు మాత్రం ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయి. ‘మిషన్ కాకతీయ’కు మొత్తంగా రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. తొలిఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించిన సర్కారు.. 9,627 చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించింది. నాబార్డు, జైకా, ప్రపంచ బ్యాంకుల ద్వారా మరో రూ.4 వేల కోట్ల వరకు సమీకరించే పనిలో పడింది. ఇక ఇప్పటికే ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.43 కోట్ల మేర విరాళాలు అందాయి. సమస్యలు ఎన్నో..: చెరువుల పనులకు సంబంధించిన టెండర్ల నుంచే వివాదాలు ముసురుకున్నా వాటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం కొంత సఫలమైంది. అయితే శాఖల మధ్య ఇంకా పూర్తిస్థాయిలో సమన్వయం సాధించాల్సి ఉంది. కబ్జాల నివారణకు రెవెన్యూ సహకారం, అటవీ భూముల్లో పనులకు ఆ శాఖ మద్దతు, పూడిక తరలింపునకు వ్యయసాయశాఖ సహకారం వంటివి ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ముఖ్యంగా చెరువుల ఎఫ్ఆర్ఎల్లను గుర్తించడంలో, శిఖం కబ్జాలను గుర్తించి అడ్డుకోవడంలో రెవెన్యూ శాఖ నుంచి సహకారం లేదు. దీనికితోడు పరిపాలనా అనుమతులు, టెండర్లలో జాప్యంతో ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. వచ్చే ఏడాదైనా ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, డిసెంబర్లోనే పనులు మొదలుపెడితే ప్రయోజనం ఉంటుంది. పునరుద్ధరిస్తున్న చెరువులను రక్షించుకునేందుకు కబ్జా కాకుండా చర్యలు, హద్దుల నిర్ణయం, రాజకీయ జోక్యాన్ని తగ్గించడం వంటివాటిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉంది. -
విభజనే కారణం
బుక్లెట్లు, కరపత్రాలు పంపిణీ చేయండి పోరాటాల వీడియో చిత్రాలు ప్రదర్శించండి రెండో తేదీన నవ నిర్మాణ దీక్షతో స్ఫూర్తి రగిలించండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు హైదరాబాద్: ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజన గాయాలను గుర్తుచేయనున్నారు. ఏడాదిలో ఏం సాధించామంటే చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... విభజనవల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అంశంపై ప్రజల్లో భావోద్వేగాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం వివరిస్తూ ఆ సమయంలో అయిన గాయాలు, పోరాటాలు, ఆందోళనలతో చిత్రీకరించిన వీడియోలను ప్రజల్లో విస్తృతంగా ప్రదర్శించాలని ఆదేశించారు. విభజన అంశాలు ప్రజలు మరిచిపోకుండా వారిలో భావోద్వేగాలను సజీవంగా ఉంచేలా వీడియో చిత్రాలు, బుక్లెట్లు, కరపత్రాలు వంటి అన్ని రకాలుగా ప్రజల్లో పంపిణీ చేయాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్లుగా తాము ఆ పని చేయవచ్చా? అని కొందరు సందేహం వ్యక్తం చేయగా... కచ్చితంగా చేయాల్సింది మీరేనని నొక్కి చెప్పారు. అయితే... రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాలతోపాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, రాజధానికి నిధులు రాబట్టలేకపోవడం వంటి అనేక వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజల దృష్టిని మళ్లించడంకోసమే విభజన గాయాలను గుర్తుచేస్తూ సెంటిమెంట్ను తెరమీదకు తెచ్చారన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో వ్యక్తమైంది. రెండో తేదీన నవ నిర్మాణ దీక్ష జూన్ రెండో తేదీన నవ నిర్మాణ దీక్ష నిర్వహించి ప్రజల్లో కసి, స్ఫూర్తి రగిలించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, 13 జిల్లాల ప్రజల కార్యక్రమమని తెలిపారు. ఇది ఉత్సవం కాదని, అన్యాయంగా విభజన చేసిన వారు సైతం అసూయపడేలా రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అయ్యేందుకే ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోతరగతి ఆపై చదివే విద్యార్థులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన నియంతృత్వ వైఖరికి నిరసనగానే 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీ వేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. రాజధాని విషయంలో తాము చెప్పిన మాటను ప్రజలు నమ్మారని ఉద్ఘాటించారు. ఇప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని, భావోద్వేగాలు రెచ్చగొట్టే ధోరణితోనే ముందుకెళుతోందని విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఏపీకి వెళ్లి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష నేపథ్యంలో అయిదు రోజులపాటు తమ పాలనపై ప్రగతి నివేదిక (ప్రోగ్రెస్ రిపోర్టు)ను ప్రజల్లో పెడతామన్నారు. మూడో తేదీ ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆర్థిక శాఖలో నిధులన్నీ ఇక ఆన్లైన్ ద్వారానే విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. పలువురు మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం రాష్ట్రంలోని వడదెబ్బ మృతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వడదెబ్బ వల్ల మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కొత్తగా వచ్చిన మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీని భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. తొలిరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేద ని రిటర్నింగ్ అధికారి, ఏపీ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 21 వరకూ నామినేషన్లు స్వీకరించి 22న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 25 తుది గడువు. అవసరమైన పక్షంలో జూన్ ఒకటిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకూ ఎన్నికలు నిర్వహించి ఐదు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 20న గోవిందరెడ్డి నామినేషన్.. : ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డీసీ గోవిందరెడ్డి ఈ నెల 20 న నామినేషన్ను దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
ప్రొటోకాల్ పోటు
రాజధాని స్థాయిలో విశాఖకు వీఐపీల తాకిడి ఖర్చుల భారంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి {పైవేటు హోటళ్లకు కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు రాష్ర్ట విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖ నగరానికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. పేరుకు మంగళగిరి తాత్కాలిక రాజధాని అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయి. కేబినెట్ మీటింగ్ల నుంచి అంతర్జాతీయ సదస్సుల వరకు అన్నింటికి ఈ పోర్టు సిటీయే వేదికవుతోంది. వేలకోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలన్నీ ఇక్కడే సాగుతున్నాయి. వీఐపీల పర్యటనల కోసం పెట్టే ప్రోటోకాల్ ఖర్చులు ఇక్కడి అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. విశాఖపట్నం : విశాఖకు వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హద్హుద్ తర్వాత వీఐపీలే కాదు..దేశ విదేశాలకు చెందిన ముఖ్యల రాక బాగా పెరిగిపోయింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలేని నెలంటూ లేదనే చెప్పాలి. ఒక్కో నెలలో రెండు మూడు సార్లు వస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం, ఏపీ టూరిజం గెస్ట్హౌస్లు ఉన్నాయి. అయినా సీఎంతో సహా వీరందరికీ స్టార్ హోటళ్లే కావాలి. నోవటల్ అయితే సీఎంకు క్యాంపుకార్యాలయంగా మారిపోయిందనే చెప్పాలి. అలాగే ప్రోటోకాల్ వాహనాలు మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించుకోవడం కాని, కొత్తవి కొనుగోలు చేయడం కానీచేయరు..వచ్చిన ప్రతీ సారివేలకు వేలు పోసి ప్రైవేటు ఏసీ వాహనాలే కావాలి. వీరి పర్యటనల పేరుతో స్టార్ హోటళ్లను, ప్రైవేటు ట్రావల్ ఏజెన్సీలను మేపుతున్నారనే చెప్పాలి. బకాయిలు కోట్లల్లో...వచ్చేది లక్షల్లో సీఎం గత పది నెలల్లో అధికారికంగా 23 సార్లు జిల్లాకు వచ్చారు. ఒకసారి వచ్చివెళితేరూ.30లక్షలు ఖర్చవుతుందని అంచనా. అదే సీఎం పర్యటనలో కాస్తా భారీ కార్యక్రమం ఏదైనా ఉంటే ఖర్చు రూ. కోటి దాటిపోతోంది. అంటే సరాసరిన ట్రిప్పుడు సుమారుగా రూ.50లక్షల చొప్పున లెక్కేసుకున్నా సుమారు రూ.11.5కోట్ల పైమాటే. ఇక వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, కేంద్ర బృందాలు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, గవర్నర్లు, కేంద్ర రాష్ర్ట మంత్రులు, సుప్రీం, హైకోర్టు జడ్జిలు ఇలా వీఐపీల పర్యటనలు లెక్కకు మించేఉన్నాయి. వీటిన్నింటికి ప్రోటోకాల్ ఖర్చులు లెక్కలేస్తే రూ.15-20 కోట్ల పైబడే ఉంటోంది. సీఎం పర్యటనల కోసం ఒక్క బాలాజీ సప్లయిర్స్కే అక్షరాల రూ.40 లక్షలు వరకు అధికారులు చెల్లించాల్సి ఉంది. రూ.20లక్షల వరకు హోటళ్లకు, కాన్వాయ్ వాహనాల కోసం ట్రావెల్ ఏజెంట్స్కు 35లక్షల వరకు చెల్లించాలి. అలాగే ఇతర ఖర్చులుగా మరో రూ.50లక్షలవరకు బిల్లులు బకాయిలున్నాయి. వీఐపీల పర్యటనల కోసం హోటళ్లు, కాన్వాయ్, ఇతర ఖర్చుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.40లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా అధికారికంగా రెండుకోట్లకు పైగానే బకాయిలున్నాయి. 2014-15 సంవత్సరానికి ప్రోటోకాల్ ఖర్చుకు జిల్లాకు రూ.34లక్షలు మంజూరైతే రూ.22లక్షలు మాత్రమే డ్రా చేసుకోగలిగారు. మిగిలిన రూ.13లక్షలు ఆంక్షలు పుణ్యామని వెనక్కి మళ్లిపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.12లక్షలు మాత్రమే మజూరయ్యాయి. ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. వీఐపీల తాకిడీ ఇంత తీవ్రంగా ఉంటే కలెక్టరేట్లో మాత్రం ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగమంటూ లేని దుస్థితి నెలకొంది. రాజధాని స్థాయిలో వీఐపీల తాకిడి ఉన్న విశాఖలో ప్రత్యేకంగా డివిజనల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగం ఉండాల్సి ఉన్నప్పటికీ విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. -
విలీన కష్టాలు
ఏలూరు సిటీ :‘రాష్ట్ర విభజనతో ఎవరికేం ఒరిగిందో తెలియదు కానీ.. మా జీవితాలు మాత్రం నాశనమయ్యే దుస్థితి నెలకొంది. బాగా చదువుకున్నా ఉద్యోగాలకు దరఖాస్తులు చేయలేని దీనస్థితిలో బతుకుతున్నాం. మాకు అన్యాయం చేయకండి’ అంటూ పోలవరం పాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడు, కుకునూరు డీఎస్సీ-14 అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన 200 మందికి పైగా అభ్యర్థులు డీఎస్సీ-14లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానికత లేదంటూ అందులో 100కు పైగా దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొందుతున్నామని అభ్యర్థులు తెలి పారు. తమ దరఖాస్తులను తిరస్కరించినట్టు అధికారులు సమాచారం ఇవ్వడంతో తీవ్ర మానసిక వేదనకు గరవుతున్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో డీఈవో డి.మధుసూదనరావు లిఖతపూర్వక సమాధానం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయండి మా తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి చదివిం చింది. బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ-14లో టీచర్ ఉద్యోగం వస్తుందని భావించాను. మా తల్లిని బాగా చూసుకోవచ్చని ఆశపడ్డాను. కానీ.. రాష్ట్ర విభజన మాకు శాపంగా మారుతుందని హించలేదు. ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేం బలైపోతున్నాం. న్యాయం చేయండి. - ఎం.రమణయ్య, కుకునూరు రెక్కాడితేగాని డొక్కాడదు కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం మాది. పనులు చేసుకుంటూనే చదువుకున్నాను. డీఎస్సీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. సమాధానం చెప్పే నాథుడే లేడు. రెక్కాడితే గాని డొక్కాడని మాకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం కావాలి. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. - కారం నాగేశ్వరరావు, వేలేరుపాడు శిక్షణకు రూ.15 వేలు కట్టా డీఎస్సీ-14కు దరఖాస్తు చేసుకున్నాను. పరీక్ష కోసం ఆవనిగడ్డలోని కోచింగ్ సెంటర్కు రూ.15 వేలు చెల్లించా ను. అక్కడే ఉండి చదువుకునేందుకు మరో రూ.5 వేలు ఖర్చయ్యాయి. ఇప్పుడు దరఖాస్తు తిరస్కరిస్తే నా పరిస్థితి ఏం కావాలి. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. మాకు ఇలాంటి కష్టాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు. - కుంజా నాగమణి, వేలేరుపాడు -
ఇడుపులపాయలో ఆర్జీకేయూటీ ఆఫీస్
హైదరాబాద్లో ఏపీ విద్యార్థులకు ఎంసెట్ సెంటర్ అక్కడే వైఎస్సార్ జిల్లాలో ఉర్దూ వర్సిటీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ వేంపల్లె: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీకేయూటీ) ప్రధాన కార్యాలయాన్ని వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసే అవకాశముందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, త్వరలో ఇక్కడికి తరలించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం ఆయన అభియంత్ టెక్ ఫెస్టివల్-15ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే 8న ఎంసెట్ ఉంటుందని, ఇంజనీరింగ్కు 7,630, మెడిసిన్కు 5,880 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వచ్చే నెల 6తో గడువు ముగుస్తుందని, అయితే పరీక్షకు ఒక రోజు ముందు రూ.10 వేల ఫైన్ చెల్లించి ఎంసెట్ రాయవచ్చని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు 85 శాతం ఏపీ విద్యార్థులకు, మిగతా 15 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించినట్టు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏపీ విద్యార్థులకు 15 శాతం సీట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్లో చదివే ఏపీ విద్యార్థులకు(సుమారు 10 వేల మంది) ఎంసెట్ పరీక్ష కేంద్రాలను 99 శాతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన జాయిం ట్ సెక్రటరీకి లేఖ రాశామన్నారు. అనుమతి రాకపోతే కర్నూలులో ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లు 16 నుంచి మొదలవుతాయని, విభజన వల్ల విద్యకు ఆటంకం కలి గిందన్నారు. జూన్లో 2 వేల అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు నెలకొల్పాలన్నారు. వీటిలో తొమ్మిదింటికి నిధులు కేటాయించారన్నారు. వైఎస్సార్ జిల్లాలో టూరిజం పార్కు, ఉర్దూ వర్సిటీ, ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి జి.వి.రావు పాల్గొన్నారు. -
బాబు-మోదీల మధ్య లాలూచీ బయటపెట్టాలి
సీపీఎం కేంద్ర కమిటీ నేత శ్రీనివాసరావు డిమాండ్ ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించలేదు. ఇటీవల ప్రకటించిన ఆర్థిక, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంయమనం పాటిం చాలంటూ మభ్యపెడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. చంద్రబాబునాయుడు-నరేంద్రమోదీల మధ్య ఏదో లాలూచీ ఉంది. అదేంటో వెంటనే బయటపెట్టాలి’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తోంది. రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేంద్రంలో చేరిన తరువాత నిధులన్నీ మనకే వస్తాయంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారు’ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు అంజయ్య, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ హనీమూన్ పిరియడ్ ముగిసింది ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసింది. ఇక ముళ్ల కిరీటం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ రెండు చెంపలు వాచిపోయేలా ప్రజలు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంత సానుకూల పరిస్థితులు ఉండవన్నారు. వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ అని శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే, వెంకయ్యనాయుడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఫుల్పేజీ ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడేమో ఐదేళ్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా దాటవేస్తూ అసలుకే మోసం వచ్చేలా చేస్తున్నారన్నారు. -
ప్రత్యేక హోదాపై పోరాటమా? వంకాయా?
-
ప్రత్యేక హోదాపై పోరాటమా? వంకాయా?
ఏలూరు : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటాలా? వంకాయేం కాదూ... లోక్ సభలో 500పైగా స్థానాలుంటే..375 ఏమో ఎన్డీయేకి మెజార్టీ ఉంది. ఏంది నేను చేసేది పోరాటం' అని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి సోనియాగాంధీయే కారణమని, రాష్ట్రాన్ని తన స్వలాభం కోసం నాశనం చేశారని జేసీ దివాకర్ రెడ్డి నిన్న ఇక్కడ నిప్పులు చెరిగారు. ఈ నష్టాన్ని పూడ్చాలంటే యాభై ఏళ్లు పడుతుందన్నారు. విభజన జరిగిన విషయంపై అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి ఉందన్నారు. న్యాయబద్ధంగా జరిగిన విభజన కాదని, నాలుగు గోడల మధ్య ఎవరు చెయ్యి ఎత్తారో, ఎవరు చెయ్యి ఎత్తలేదో తేలీకుండా విభజన జరిగిందన్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీని ఆరడుగుల గోయ్యిలో పూడ్చేస్తారని, అభివృద్ధి కుంటుపడుతుందని తాను అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు వెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర నమస్కారాలు చేసి రావటం తప్ప చేయగలిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇంతకు ముందు లేని గొడవలు అన్నీ వస్తున్నాయన్నారు. -
దురుద్దేశంతో రాష్ట్రాన్ని విభజించారు:మేకపాటి
-
ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ
-
ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ
కేంద్ర ప్రభుత్వ ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించింది. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించింది. ఇది కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటును పూడ్చడంలో భాగంగా మరో రూ.500 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటుపై అధ్యయనం చేసేందుకు హోం శాఖ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సిఫారసుల మేరకు రూ.500 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తాత్కాలిక సాయం కింద అందజేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. అయితే 2014-15 బడ్జెట్లోనే రాజధాని అవసరాలకు, రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.1,180 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజన దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15,594 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తేలగా, ఆ లోటును భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి రెండు నెలల కాలాన్ని వదిలేసి మిగిలిన 10 నెలలకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే పంపాలని కేంద్రం కోరింది. దాంతో రూ.12 వేల కోట్ల రెవెన్యూ లోటుతో పాటు సీఎస్టీ కారణంగా నష్టపోతున్న మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తంగా రూ.13,500 కోట్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుందనగా.. కేంద్రం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశాలోని వెనుకబడిన జిల్లాలైన కలహండి-బొలంగీర్-కోరాపుట్ (కేబీకే) ప్రాంతాలకు అమలుచేసిన ప్యాకేజీని, బుందేల్ఖండ్లో అమలుచేసిన ప్యాకేజీని ఆధారంగా చేసుకుని అవే మార్గదర్శకాలకు అనుకూలంగా రాష్ట్రానికి కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ అంశం స్పష్టంగా లేకపోగా, దానికి అనుగుణంగా ఆరోజు ప్రధానమంత్రి రాజ్యసభలో ఆర్థిక లోటు భర్తీపై ప్రకటన చేశారు. అయితే ఆర్థిక లోటును భర్తీ చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి మిగతా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అనుసరిస్తున్న విధానంలో కేంద్రం ప్రస్తుత ప్యాకేజీ ప్రకటించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రతిపాదించగా.. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా 7 జిల్లాలకు రూ. 350 కోట్లు మాత్రమే విదిల్చింది. అదీ రాష్ట్ర విభజన జరిగిన ఇంతకాలం తర్వాత ప్రకటించడం గమనార్హం. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్ద ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించారు. తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా నిధులు మంజూరు చేయాలని, ఇందుకు ఒక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మరో మూడురోజుల్లో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వస్తున్న సమయంలో ఎట్టకేలకు ఈ ప్యాకేజీ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు, అవి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇవ్వాల్సిన పన్ను ప్రోత్సాహకాలను ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్రం నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పితే కొత్త ప్లాంటు, యంత్రాలపై 15 శాతం ఆదనపు డిప్రిసియేషన్ను అమలు చేస్తారు. అలాగే నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే అదనపు పెట్టుబడి భత్యం 15 శాతం ఇస్తారు. ఐదేళ్ల వరకు ఎప్పుడు కొత్త ప్లాంటు, యంత్రాలు నెలకొల్పినా ఈ భత్యం వర్తిస్తుంది. ఐదో సంవత్సరంలో పెట్టుబడి పెట్టినప్పటికీ ఇది అందుబాటులో ఉంటుంది. అదనపు డిప్రిసియేషన్ భత్యం, పెట్టుబడి భత్యం అందాలంటే పెట్టుబడులు రూ.25 కోట్లపైన ఉండాలన్న నిబంధన ఏమీ వర్తించదని ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. -
ఢిల్లీలో పర్యటించి ఏం సాధించారు?
సీఎం చంద్రబాబుపై ఎంపీ మిథున్రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం ఏం సాధించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చంద్రబాబు గద్దె నెక్కినప్పటి నుంచీ పదేపదే చెబుతున్నారు. మరో నెలలో కేంద్రం కొత్త బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతోంది. ప్రధాని, ఆర్థిక మంత్రిని కలిసినపుడు నిర్దిష్టమైన తేదీలోగా రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఈ రూ. 16 వేల కోట్లు తేగలరా? లేదా?’ అని మిథున్రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీల విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద మంజూరైన మన్నవరం బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రహరీ గోడ ఏర్పాటుకే పరిమితమైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అతీగతీ లేకుండా పోయిందన్నారు. చిత్తూరులో చక్కెర కార్మాగారాన్ని మూసి వేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ మాట దేవుడెరుగు సీఎం సొంత జిల్లాలోనే ఫ్యాక్టరీ కాపాడుకోలేకపోవడం దారుణమని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టైనా సాధించారా? ‘విభజన చట్టంలో గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీని నెలకొల్పుతామన్నారు. దానిపై ఎలాంటి పురోగతి లేదు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏమైందో తెలియదు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మిస్తామన్నారు. విమానయాన మంత్రి మన రాష్ట్రానికి చెందినవారైనా ఫలానా తేదీలోగా అంతర్జాతీయ హోదా కల్పిస్తామని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కాగితాలకే పరిమతిమైంది. దీనికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదు’ అని మిథున్ విమర్శించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. -
ముందు నుయ్యి..వెనుక గొయ్యి!
-
ఫ్యాప్సీ పేరు మారింది...
ఇక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లో చెరో మూడు కేంద్రాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) పేరును ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టాప్సీ)గా మార్చారు. రెండు రాష్ట్రాలకు ఒకే సంస్థగా ఉంటూ, ఆయా రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మెంబర్స్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు. ఫ్యాప్సీ పేరును ఎఫ్టాప్సీగా మార్చడానికి మంగళవారం జరిగిన ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నామని, దీనికి ఇంకా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీయే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. విలేకరుల సమావేశంలో రుంగ్టా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లలో... ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రుంగ్టా తెలిపారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు బాగున్నాయని, వీటిల్లో 80% అంశాలు ఫ్యాప్సీ సూచించినవే ఉండటం సంతోషంగా ఉందని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనీల్ రెడ్డి వెన్నం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీల్లో రూ. 2,000 కోట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించిన రూ. 1,500 కోట్లు చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తెలంగాణకు సంబంధించిన రూ. 650 కోట్లు మార్చిలోగా వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలాగా వచ్చే ఏడాది విద్యుత్ కొరత ఉండకపోవచ్చని, అలాగే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికోత్పత్తి పెరిగితే విద్యుత్కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అనీల్ తెలిపారు. -
ఏపీలో హెచ్పీసీఎల్ యూనిట్
రూ. 75 వేల కోట్లతో హైడ్రోకార్బన్ క్రాకర్ విభాగం హిందుస్థాన్ పెట్రోలియం సూత్రప్రాయ అంగీకారం అంతర్జాతీయ భాగస్వామి కోసం హెచ్పీసీఎల్ నిరీక్షణ వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకై చర్యలు వివిధ ప్రతిపాదనలపై అధికారులకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సుమారు 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ హైడ్రోకార్బన్ క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన యూనిట్ల ఏర్పాటు అంశాలపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హెచ్పీసీఎల్ అంతర్జాతీయ భాగస్వామి కోసం అన్వేషిస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సీఎస్కు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సీఎస్ సూచించారు. పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలను వెలికితీయడమే క్రాకర్ యూనిట్ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర వ్యవసాయ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాల్లో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధు లు జిల్లాకు వచ్చి వెళ్లారని, వారు పలు అంశాలను ప్రస్తావించారని, వాటిపై వివరణలు ఇచ్చామని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్కు తెలిపారు. అయితే తరువాత స్టీల్ అథారిటీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. అవసరమైతే స్టీల్ అథారిటీకి వెళ్లి ప్లాం ట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు అవసరమైన భూ సేకరణ చేయాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని భరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయాలని మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎస్ సూచించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు యూనివర్సిటీ ఏర్పాటుపై డెహ్రాడూన్ పెట్రోలియం యూనివర్సిటీకి చెందిన జె.పి.గుప్త కాకినాడ, రాజమండ్రిలో ప్రతిపాదితన స్థలాన్ని పరిశీలించారని, అయితే తరువాత ఎటువంటి స్పందన లేదని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్కు తెలిపారు. అక్కడి నుంచి స్పందన రాకపోయినా తదుపరి చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. రాయపూర్ నుంచి విశాఖపట్నానికి నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై త్వరలో జరిగే కేంద్ర జోనల్ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అధికారులు సీఎస్కు వివరించారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి దగ్గర మెగా పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని, అలాగే నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన భూమిని పర్యాటక శాఖకు అప్పగించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రైల్వే బోర్డు నుంచి ఎటువంటి చర్యలు లేవని, ఈ నేపథ్యంలో సీఎం చేత రైల్వే మంత్రికి లేఖ రాయించాలని సీఎస్ నిర్ణయించారు. ప్రతి నెలలో ఒక రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలలో ఒక రోజు ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్ డే’గా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్ణయించారు. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛాం ధ్రప్రదేశ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పోర్టల్ను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 365 రోజులు సచివాలయంలోని కార్యాలయాలు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలాగ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, దీన్ని గర్వకారణంగా ఉద్యోగులు భావించాలని సీఎస్ నిర్దేశించారు. -
ఏపీని అగ్రగామిగా నిలబెడతాం
చీమకుర్తి: దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెడతామని రోడ్లు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం రాత్రి చీమకుర్తిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన దారుణ వైఖరి వలన రాష్ట్రం సర్వం కోల్పోయిందన్నారు. మన రాష్ట్రంలో కాకినాడ నుంచి చెన్నై వరకు అపారమైన వనరులున్న కారణంగా రానున్న రోజుల్లో సుందరంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. బైపాస్కు శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి: చీమకుర్తి బైపాస్కు రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేస్తామని, దానికి శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి అన్నారు. ఇప్పటికే సీఈతో మాట్లాడానని, రేపోమాపో భూమిపూజ చేస్తానన్నారు. దానితో పాటు స్థానిక నాయకులు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు 8 సూట్లతో ఆర్ అండ్ బీ అతిథి గృహం మంజూరు చేస్తామని చెప్పారు. బస్టాండ్ నుంచి నెహ్రూనగర్ వరకు కర్నూల్రోడ్డు మార్జిన్లకు కూడా తారురోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, వైస్చైర్మన్ కందిమళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి రావలసిన గ్రానైట్ సీనరేజి నిధులను ఇప్పించే లా చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి శిద్దా దంపతులకు స్థానిక నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీధర్బాబు, కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, చీమకుర్తి కమలమోహన్, మన్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇవీ మన నియోజకవర్గాల కొత్త నంబర్లు
కాకినాడ సిటీ : రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను ఎలక్షన్ కమిషన్ మార్పు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాలుండగా మన జిల్లాలోని 19 నియోజకవర్గాల క్రమ సంఖ్య 154 (తుని నియోజకవర్గం) నుంచి 172 (రంపచోడవరం నియోజకవర్గం) వరకు ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నాయి. వీటిలో జిల్లాలోని నియోజకవర్గాల క్రమ సంఖ్య 35 (తుని) నుంచి 53(రంపచోడవరం) వరకు ఉంది. నియోజకవర్గాల వారీగా పాత, కొత్త క్రమ సంఖ్యలు ఇవి... -
21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 21వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమల రాయితీలు తదితర అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. 23 నుంచి 29 వరకు బాబు జపాన్ పర్యటన: సీఎం చంద్రబాబు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు కనీసం 40 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు పాల్గొంటారు. సీఎంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణతో పాటు కమ్యునికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. -
ఉభయ రాష్ట్రాలకూ ఒకే ‘ఐటీ’ బాస్
కొత్త పోస్టును సృష్టించిన కేంద్ర ప్రభుత్వం విజయవాడకు కొత్తగా ఐటీ చీఫ్ కమిషనర్ పోస్టు సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ పునర్వ్య వస్థీకరణలో భాగంగా కేంద్రం పలు కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఇందులోభాగంగా ఉభయ తెలుగురాష్ట్రాలకు కలిపి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్టాక్స్ పోస్టును హైదరాబాద్కు కేటాయించారు. ఇది కేంద్రప్రభుత్వ ప్ర త్యేక కార్యదర్శి హోదాకు సమానం. రెండు రాష్ట్రాల్లోని ఐటీశాఖ కేడర్ను ఈ పోస్టులో ఉండే అధికారే నియంత్రిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్కు కర్నూలులో, తెలంగాణకు హైదరాబాద్లో కొత్త గా అసెస్మెంట్ కమిషనర్ బాధ్యతలను చూసే పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీ కోసం విజయవాడలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్టాక్స్ పోస్టును సృష్టించారు. ఇప్పటికే విశాఖలో ఓ చీఫ్కమిషనర్ పోస్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం పరిధిలోకే ఏపీలోని అన్నిప్రాంతాలు వస్తాయి. కాగా, అప్పీళ్లను పరిశీలించి వేగంగా పరిష్కరించడానికి వీలుగా 11 అప్పీలెట్ కమిషనర్ పోస్టులు కూడా మంజూరయ్యాయి. వీటిలో ఐదింటిని హైదరాబాద్కు కేటాయించారు. ఈ మార్పులన్నీ ఈ నెల 15 నుంచే అమల్లోకి వస్తాయని ఐటీ శాఖ సోమవారం ఓప్రకటన విడుదల చేసింది. మరి న్ని వివరాలనుశాఖ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్కమ్టాక్స్.ఓఆర్జీ)లో చూడవచ్చు. -
జిల్లాకు అన్యాయం
* గిరిజన వర్సిటీ తరలిపోతున్నా పట్టించుకోని కేంద్ర మంత్రి * వైఎస్ఆర్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్ బొబ్బిలి(విజయనగరం): ‘‘ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం, ప్రతీ కమిటీ ఇదే నివేదిక ఇస్తోంది, రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు...అయితే ఇక్కడకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాకు తరలిస్తున్నారు ఇదేనా అభివృద్ధి చేయడమంటే ’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్కృష్ణ రంగారావు ప్రశ్నించారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలులోకి రాలేదన్నారు. పార్వతీపురం డివిజన్లో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారని, దీంతో జిల్లా వాసులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. మాన్సాస్ భూములు ఇస్తుండడంతో ఎంతో సంతోషపడ్డారని చెప్పారు. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని తరలించడం అన్యాయమన్నారు. ఇదేనా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయడం అని ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాకి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చూస్తూ ఊరుకోవడం సబబుగా లేదన్నారు. -
స్మార్ట్ సిటీల సదస్సులో పాల్గొన్న ఏపీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం బ్రిటన్లోని వెస్ట్మినిస్టర్ నగరంలో యూకే ప్రభుత్వం స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్నారు. రాష్ర్ట విభజన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ 3 నగరాల అభివృద్ధికీ తాము కట్టుబడి ఉన్నామని, తిరుపతి, విశాఖపట్నంలను ఐటీ హబ్లుగా తయారు చేయడంతో పాటు రాష్ట్రంలో 14 స్మార్ట్సిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. -
అసైన్డ్లో ‘రియల్’ దందా
మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రియల్ అక్రమాలు జోరందుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాయాజాలంలో ముగ్గురు కార్పొరేటర్ల ప్రమేయం ఉండడంతో సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు, బందరు మండలం కరగ్రహారం పరిధి వరకు వందలాది ఎకరాలున్నాయి. ఈ భూముల్లో కొన్నింటిని స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ప్లాట్టుగా మార్చేసి ప్రస్తుతం గజం రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కిన వ్యాపారులు తమ ఇష్టానుసారం ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ భూములన్నీ అసైన్డ్ భూములు అయినప్పటికీ రిజిష్ట్రార్ కార్యాలయంలో తమదైన శైలిలో చక్రం తిప్పుతున్న వ్యాపారులు ఇవి ప్రైవేటు భూములేనని నమ్మిస్తూ విక్రయాలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2006లోనే అసైన్డ్ భూములుగా గుర్తింపు పట్టణంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు ఉన్న భూములను, కరగ్రహారంలోని భూములను 2006లో అధికారులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను తమకు ప్రభుత్వం పోషణ కోసం ఇచ్చిందని వీటిని తీసుకోవద్దని పొలం యజమానులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో అప్పటి జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సురేష్కుమార్ ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఇవి అసైన్డ్ భూములుగానే నిర్ధారించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను ఇళ్లస్థలాలుగా ఇచ్చేందుకు రైతులు అంగీకరించక పోవడంతో కరగ్రహారానికి సమీపంలోని భూములను సేకరించి వందలాది మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశారు. ఈ కాలనీకి నవీన్మిట్టల్ కాలనీగా నామకరణం చేశారు. సర్వే నంబర్లు మార్చి ప్రైవేటు భూమిగా చూపి... రాష్ట్ర విభజన అనంతరం రియల్భూమ్ ఊపందుకోవడంతో పట్టణానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఈ అసైన్డ్ భూమిపై కన్నేశారు. ఆర్అండ్బీ అతిథి గృహం, బైపాస్రోడ్డు సమీపంలో నివశించే ఇద్దరు కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్ ఈ భూమిపై కన్నేశారు. ఒక స్వాతంత్ర సమరయోధునికి చెందిన రెండున్నర ఎకరాలు కొనుగోలు చేసి ఇది ప్రైవేటు భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిని ఆధారంగా చేసుకుని మిగిలిన అసైన్డ్ భూములను ప్రైవేటు భూములుగా చూపి ఈ ముగ్గురు కౌన్సిలర్లు భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విడగొట్టి విక్రయిస్తున్నారు. తమదైన శైలిలో భూమికి సంబంధించిన పత్రాలు, గతంలో ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను చూపుతూ ఇక్కడ ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. డ్రెయినేజీ గట్లే రోడ్లు! ఈ అసైన్డ్ భూమి మొత్తం వ్యవసాయ భూమే. పంటకాలువలు, డ్రెయినేజీలు ఈ భూముల పరిధిలో ఉన్నాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ప్లాట్లలోకి వెళ్లేందుకు ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయలేదు. కరగ్రహారానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న మురుగుకాలువ గట్టుపై రబ్బీసు రోడ్డు నిర్మించారు. అసైన్డ్భూమిని ప్లాట్లుగా విడగొట్టి 12 అడుగులకు మించకుండా రబ్బీసు రోడ్లు నిర్మించారు. ఈ ప్లాట్లకు అనుమతులు ఉన్నాయో, లేవో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి... పురపాలక సంఘం పరిధిలోని భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించటంపై మున్సిపల్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఇక్కడ భూమి అధికంగా ఉండటంతో అనుమతులు ఇచ్చే అధికారం తమ పరిధిలో లేదని తెలిపారు. లేఅవుట్ నిబంధన ప్రకారం 40 అడుగుల మేర రోడ్డు నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లయితే గృహనిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ను మంజూరు చేయబోమని చెప్పారు. -
ప్రజలు మళ్లీ మావైపు చూస్తున్నారు
ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నందిగామ ఉప ఎన్నికే నిదర్శనం అధికారపార్టీ తప్పటడుగులను జనాలకు వివరించాలి సాక్షి, విజయవాడ బ్యూరో : ‘మాకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ప్రజలంతా మా పార్టీ వైపే చూస్తున్నారు. ఇందుకు నందిగామ ఎన్నికలే ఉదాహరణ. సార్వత్రిక ఎన్నికల్లో 2000 ఓట్లతో సరిపుచ్చుకున్నాం. కానీ నందిగామ ఉప ఎన్నికల్లో 25వేల ఓట్లు రావడం సంతోషంగా ఉంది. ప్రజలంతా మళ్లీ మావైపే చూస్తున్నారు’ అని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఘువీరారెడ్డి కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణమనీ, భవిష్యత్తులో ఆ పార్టీకి ఓట్లు పడవని ప్రచారం జరిగిన నేపథ్యంలో మూడు నెలల వ్యవధిలోనే ప్రజలు చక్కని తీర్పునివ్వడం సంతృప్తికరంగా ఉందన్నారు. నందిగామ ఉప ఎన్నికల్లో జిల్లా నేతలతో పాటు నంది గామ నియోజకవర్గ నేతలు, బూత్, మండల స్థాయి కార్యకర్తలను అభినందించారు. ఇప్పుడిప్పుడే అధికార పార్టీ పరిపాలనా పరంగా తప్పటడుగులు వేస్తోందనీ, ఆయా పార్టీ నేతలు చేసే పొరపాట్లను, తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు చెప్పేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని రఘువీరా పిలుపునిచ్చారు. నరహరిశెట్టి నరసింహారావు పలువురు నాయకులు, మండల స్థాయి నేతలను రఘువీరాకు పరిచయం చేశారు. మాజీ మంత్రులు దేవినేని నెహ్రూ, కాసు కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజే సుధాకర్బాబు, పార్టీ జిల్లా ఇన్చార్జి షేక్ మస్తాన్వలి, దేవినేని అవినాష్, పీసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ, అడపా నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ అసాధ్యమే!
జిల్లాకు నీటి కష్టాలు తప్పవా? పోలవరం వస్తేనే 24 టీఎంసీల నీటికి అవకాశం తేల్చిన నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక సిద్ధం ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. జిల్లాలో గ్రిడ్ ఏర్పాటు అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. పోలవరం వస్తేనే గాని అది సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో జిల్లాకు నీటి కష్టాలు తప్పేట్టు లేవు. పరిశ్రమలు, వ్యవసాయానికే కాకుండా తాగునీటికీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. విశాఖ రూరల్: జిల్లాకు నీటివనరుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. మున్ముందు బహుళజాతి కంపెనీలు, ఐటీ, భారీ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. మానవ వనరులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నీటి వినియోగం రెట్టింపు కానుంది. ఇప్పటికే అవసరాలకు తగ్గ నీటి సరఫరా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో ఉన్న పరిశ్రమలకు, తాగునీటికి రోజుకు 90 ఎంజీడీలు అవసరం. కానీ ఏలేరు, రైవాడ, మేహాద్రిగెడ్డ, గోస్తనీ, గోదావరి, ముడసర్లోవ, గంభీరం, తాటి పూడి జలాశయాల నుంచి రోజుకు 65 నుంచి 70 ఎంజీడీలు మాత్రమే వస్తోంది. దీంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల్లో కోత విధించాల్సి వస్తోంది. తాగునీటి సరఫరాను కూడా కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఉండనే ఉన్నాయి. వాటర్ గ్రిడ్ కష్టమే : ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలను పెంచుకోడానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని, జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నీటి సరఫరా విభాగం అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు నిర్వహించన సమావేశంలో తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రుణమాఫీ తప్పించుకోడానికి, ప్రజల ఆలోచనలను మళ్లించడానికే రోజు కో ఆచరణ సాధ్యం కాని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తోందన్న విమర్శలున్నాయి. పోలవరంతోనే గ్రిడ్ సాధ్యం : గోదావరి నుంచి గాని, ఒరిస్సా, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో ఉన్న నదుల నుంచి జిల్లాకు నీరు చేరే అవకాశం లేదు. దీంతో ఇక్కడ పడిన వర్షపు నీటినే జలాశయాల్లో నిల్వ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయానికే ఈ నీటి నిల్వలు సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమని అధికారులు తేల్చారు. పోలవరం ద్వారా జిల్లాలో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో మిగిలిన జలాశయాల్లో నీటిని పరిశ్రమలు, సాగు అవసరాలకు వినియోగించుకొనే వీలు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. -
ఎందుకీ శిక్షణ?
పదింతల అయోమయం సిలబస్ మార్చారు.. శిక్షణ మరిచారు! ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు లేవు ఒకరోజు వీడియో కాన్ఫరెన్స్తో సరిపెట్టిన విద్యాశాఖ విద్యార్థుల ఆందోళన పదో తరగతి పాఠ్యాంశాలు ఈ విద్యా సంవత్సరం నుంచి మారాయి. తరగతులు ప్రారంభమై 85 రోజులు గడిచినా నేటికీ ఉపాధ్యాయులకు మారిన సిలబస్పై శిక్షణ ఇవ్వకుండా విద్యాశాఖ మౌనం వహిస్తోంది. కేవలం ఒక్కరోజు వీడియో కాన్పరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. సరైన శిక్షణ లేకుండానే ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. యలమంచిలి : జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద ఉన్నత పాఠశాలల్లో సుమారు 52 వేలకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం(ఎన్సీఎఫ్)-2005, వి ద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)-2009లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన రాష్ట్ర విద్యా ప్రణాళికా పరిధి పత్రం-2011 మేరకు పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్తో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. పిల్లలు తమకున్న సహజ శక్తి సామర్థాల ద్వారా బడి బయట జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ పరస్పర ప్రతి చర్యలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాల విశ్లేషణ చేస్తూ పాఠ్యాంశాలను అవగాహన చేసుకునే విధంగా పాఠ్య పుస్తకాలను రూపొందించారు. దీనిపై ఇప్పుడు సరైన బోధన అవసరం కాగా, ఉపాధ్యాయులకు ఆ దిశగా శిక్షణ కరువైంది. ఒక్కరోజు టెలికాన్ఫరెన్స్ శిక్షణతో సరా? వేసవి సెలవుల్లోనే మారిన సిలబస్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖకు వినతులు అందినా రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల నిర్వహించలేదు. మారిన సిలబస్పై ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడికి కనీసం 15 నుంచి 20 రోజుల శిక్షణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ 16 నుంచి 24 వరకు ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడి కీ ఓ రోజు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కొత్త సిలబస్ అమలులోకి వచ్చినపుడు బోధనాభ్యసన పద్ధతులపై జిల్లా, డివిజన్ స్థాయిల్లో పాఠ్యపుస్తక రచయితలతో, రిసోర్స్పర్సన్లతో వృత్యంతర శిక్షణ ఇప్పించాలి. గతంలో సిలబస్ మారిన సమయంలో ఇదే విధంగా చేశారు. ఈ సారి మాత్రం విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇలా అయితే విద్యాబోధన ఎలా? నూతన పాఠ్యపుస్తకాలతో పాత విధానం (11 పేపర్ల పరీక్షా విధానం) అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల మాదిరి ప్రశ్నపత్రాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాశాఖ వెబ్సైట్తో పాటు అన్ని జిల్లాల డీఈవోల వెబ్సైట్లలో మోడల్ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచారు. విద్యాబోధన మాత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగా మారిన ప్రణాళికతో జరగాలని ఆదేశించారు. విద్యార్థుల ఇబ్బందులు కొత్త పాఠ్యాంశాల వల్ల పలు సబ్జెక్టుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవు. విద్యార్థులు స్వయంగా ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి. దీని కోసం వారు దినపత్రికలు, గ్రంథాలయాలు, ఇంటర్నెట్ తదితరాల నుంచి సమాచారాన్ని సేకరించాలి. భౌతికశాస్త్రం పాఠాలు కఠినతరంగా ఉండటంతో పాటు ప్రయోగాలు చేయడానికి అవసరమైన సదుపాయాలు పాఠశాలల్లో లేవు. జీవశాస్త్రంలో ముద్రణా లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కృత్యాధార పద్ధతిలో పాఠాలు బోధించాల్సి ఉంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పదో తరగతి విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. శిక్షణ ఇస్తే మెరుగైన బోధన మారిన సిలబస్పై ఉపాధ్యాయులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే శిక్షణ ఇచ్చి ఉంటే బాగుండేది. కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల లక్ష్యం మేరకు విద్యార్థులకు బోధన చేయలేకపోతున్నారు. కనీసం కరదీపికలైనా అందజేస్తే బాగుంటుంది. గణితం, ఆంగ్లం పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ వల్ల గతంలో కన్నా పాఠ్యాంశాల స్థాయి, కాఠిన్యం, ప్రామాణికత తగ్గాయి. శిక్షణ ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. -ఎస్.సూర్యప్రకాశ్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం పదో తరగతిలో మారిన పాఠ్యాంశాల సిలబస్పై గతంలో టీవీ ద్వారా శిక్షణ ఇచ్చాం. ఇపుడు నేరుగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. శిక్షణా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాలు వచ్చిన వెంటనే శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. -వెంకటకృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
విస్తరణకు వేళాయె
రూ.260కోట్లతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి 482ఎకరాల సేకరణ లక్ష్యం 206కుటుంబాల తరలింపు నూజివీడు : నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గన్నవరం విమానాశ్రయాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విజయవాడకు వీఐపీలు, వీవీఐపీల రాకపోకలు పెరిగినందున విమాన సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 5వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు మాత్రమే దిగేం దుకు వీలుంది. రాబోయే రోజుల్లో దీనిని అంతర్జాతీయ స్థాయికి పెంచాల్సిన అవసరం రానుంది.అలాగే బోయింగ్ 747 లాంటి విమానాలు దిగేందుకు వీలుగా విమానాశ్రయాన్ని విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా సేకరించాల్సిన భూ వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి పంపారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం గతంలోనే రూ.260కోట్లు కేటాయించింది. విమానాశ్రయంలో ఉన్న ప్రస్తుత రన్వే పొడవు 6500 అడుగులుండగా దానిని 10500 అడుగుల పొడవుకు పెంచేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి గానూ ఇప్పుడున్న దానికి అదనంగా మరో 482ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అందుబాటులో 51ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున మిగిలిన 431ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. గన్నవరం మండలం కేసరపల్లిలో 121.97ఎకరాలు, బుద్ధవరంలో 196.56ఎకరాలు, అర్జంపూడిలో 112.49 ఎకరాలు సేకరించనున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది సమగ్ర సర్వే పూర్తిచేశారు. ఈ భూసేకరణ కారణంగా 206 కుటుంబాలను విమానాశ్రయం విస్తరణ చేయనున్న ప్రాంతం నుంచి తరలించాల్సి వస్తోంది. దీనికి గానూ వారికి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పునరావాసాన్ని కల్పించడానికి నిధులు కేటాయించారు. వీరందరికీ రీ సెటిల్మెంట్ అండ్ రీహేబిటేషన్ కింద పునరావాసం కల్పిస్తారు. భూసేకరణ, పునరావాసానికి కలిపి ప్రభుత్వం రూ.260కోట్లు కేటాయించినట్లు సబ్కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు పేర్కొన్నారు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తరువాతే భూసేకరణ ప్రక్రియ చేపడతామని ఆయన తెలిపారు. -
సీఎంల భేటీ శుభ పరిణామం: వెంకయ్య
సమస్యల పరిష్కారంలో ఇది ముందడుగు రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ స్నేహభావం కొనసాగాలి.. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కావడం శుభ పరి ణామమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నాటి కేంద్ర ప్రభుత్వం కసరత్తు, దూరదృష్టి, విజ్ఞత లేకుండా చేసిన విభజన వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య అవసరమైనవి, అనవసరమైనవి అనేక వివాదాలు వచ్చి ప్రజ లను ఆందోళనకు గురిచేశాయి. న్యాయం జరుగుతోందని ఒక రాష్ట్రం, రాష్ట్రం ఏర్పడినా న్యాయం జరగడంలేదని మరొక రాష్ట్రం బాధ పడేపరిస్థితిని ఆనాటి పాల కులు తెచ్చారు. వారి వ్యవహారం వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు, ఆ రాష్ట్రానికి చెం దిన వారు తెలంగాణకు ప్రాతినిథ్యం వహిం చాల్సి వస్తోంది. ఆ ఎంపీల మానసిక క్షోభ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాగే శాసన మం డలి సభ్యుల సంఖ్య 20 ఉండాల్సిన చోట ఆమేరకు కేటాయించలేదు. పోలవరం విషయంలో ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి కల్పిం చారు. ఉద్యోగుల కేటాయింపునకు కమిటీలను ముందే వేసి, మార్గదర్శకాలను ఆనాడే రూ పొందించి పార్లమెంటు విశ్వాసాన్ని పొంది ఉంటే సరిపోయేది. కానీ దాన్ని జఠిలం చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో కూడా అనిశ్చితి. కిందిస్థాయి ఉద్యోగులదీ అదే పరిస్థితి. విభాగాలు, సంస్థల కేటాయింపు వంటి అంశాలను ముందే చూడాల్సిం ది. ఎవరినో నిందించాలని ఇలా అనడంలేదు. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టడానికి లేదు. ఇద్దరు సీఎం లు, స్పీకర్లు, సీఎస్లు చర్చలు జరపడం సమస్యల పరిష్కారంలో ఒక ముందడుగు. వివాదాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. రెండు రాష్ట్రాలూ చర్చలు కొనసాగించాలి. అర్థవంతమై న రీతిలో చర్చలు జరగాలి. జఠిల సమస్యలపై విస్తృతంగా, లోతుగా మాట్లాడుకోవాలి. శాశ్వత, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుక్కోవాలి. అవసరం వస్తే సాయం చేయడానికి కేంద్రం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ స్నేహభావం కొనసాగాలి. కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకోదు. వాళ్లు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ‘హిందూ’ అనే పదం ఒక జీవన విధానమని, దానిలో మతపర సంకుచితత్వం లేదని తెలిపారు. -
వెబ్..డబ్..
నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక మొదటిసారిగా వన్ టైం పాస్వర్డ్ విధానం తొలి ప్రాధాన్య కళాశాలల వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి మొబైల్ ఇన్బాక్స్ ఖాళీ చేస్తే మేలు విజయవాడ : తీవ్ర ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక దశకు చేరుకుంది. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పునర్విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే ఈ ఏడాది ఉమ్మడిగా ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కౌన్సె లింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఈ నెల 17నుంచి వెబ్ ఆప్లన్ల ఎంపికకు షెడ్యూల్ ప్రకటించింది. గతంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అభ్యర్థులను తప్పుదారి పట్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కౌన్సెలింగ్లో స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్ టైం పాస్వర్డ్ను ప్రవేశపెట్టింది. వన్ టైం పాస్వర్డ్ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవశాశం ఉండదు. ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల కళాశాలల్లో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. అభ్యర్థులు ఆయా హెల్ప్లైన్ సెంటర్లలోనే వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ ఏడాది నుంచి హెల్ప్లైన్ కేంద్రాల్లో విద్యార్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్సు కాపీలు అందజేస్తే సరిపోతుంది. వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) వల్ల ప్రయోజనాలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులకు ముందుగానే పాస్వర్డ్ ఉన్న స్క్రాచ్ కార్డును ఇచ్చేవారు. కౌన్సెలింగ్ పూర్తయి సీటు ఎలాంట్మెంట్ అయ్యేవరకు ఆ పాస్వర్డ్ను భద్రంగా ఉంచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రోకర్లకు, కళాశాలల యాజమాన్యాలకు ఆ పాస్వర్డ్ ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల జాబితాను మార్చేసేవారు. ఈ పరిస్థితిని నివారించేందుకు వన్ టైం పాస్వర్డ్ను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులకు కౌన్సెలింగ్లో లాగిన్ అయిన వెంటనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు పాస్వర్డ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లు లాగాన్ అయితే అన్నిసార్లు మొబైల్ నంబరుకు వేర్వేరు పాస్వర్డ్లు వస్తాయి. ప్రలోభాలకు లొంగొద్దు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించే హెల్ప్లైన్ సెంటర్లు, నెట్కేఫ్ల వద్ద బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కళాశాలలకు సంబంధించిన బ్రోకర్లు, యజమానులు యూనిఫాం ఉచితమని, పాకెట్ మనీ ఇస్తామని, బస్పాస్ ఉచితమని ఆఫర్లు ఇస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి మొదటి సంవత్సరం ఫీజులో సగం వెనక్కి ఇచ్చేస్తామంటూ ఆకర్షించేందుకు ప్రయత్నిసున్నారు. అటువంటి వారి ప్రలోభాలకు గురికాకుండా సరైన కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. సొంతగా అప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఏయే కళాశాలలను ప్రాధాన్యత ఇచ్చారనే విషయం బయటకు వెల్లడించకపోవడం ఉత్తమం. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెబ్ అప్షన్లను ఎంపిక చేసుకునే సమయంలో మొబైల్ ఇన్బాక్స్ను ఖాళీగా ఉంచితే మేలు. కాలేజీ ఎంపిక చేసుకునేముందు అక్కడి సౌకర్యాలు, ఆధ్యాపకులు, లేబొరేటరీలు, ప్లేస్మెంట్ సౌకర్యం తదితర వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. టాప్ కాలేజీల జాబితాతోపాటు నచ్చిన బ్రాంచిల లిస్ట్ కూడా సిద్ధం చేసుకుంటే మంచిది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు( ఏ రాష్ర్టంలో వాళ్లు ఆ రాష్ట్రంలోనే కళాశాలలు ఎంపిక చేసుకోవాలని కొందరు దళారులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.) కాలేజీ, బ్రాంచిల ఎంపికకు సంబంధించి ఒక్కో ర్యాంకు వారికి రెండు రోజుల సమయం కేటాయించారు. మొదటి రోజు కొన్ని అప్షన్లు ఇచ్చి ఇతర కారణాల వల్ల లాగ్ అవుట్ కావాల్సి వస్తే ‘సేవ్’ అనే బటన్పై క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్లకు అదే చివరి రోజైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అపుడు మాత్రమే ఎంపిక చేసుకున్న కళాశాలలు, బ్రాంచిల జాబితా సబ్మిట్ అవుతుంది. అప్షన్లు మార్పుకు మరో రోజు అవకాశం కల్పిచడం జరిగింది. వన్ టైం పాస్వర్డ్ ఎంతో మేలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరిగే సమయంలో కొందరు నెట్ సెంటర్ల యజమానులు కీ బోర్డుకు ప్రత్యేకమైన గాడ్జెట్ను అమర్చి పాస్వర్డ్ను తెలుసుకునేవారు. తద్వారా అప్షన్లు మార్చేవారు. కొత్త విధానంలో ఎప్పటికప్పుడు పాస్వర్డ్ మారడం వల్ల అభ్యర్థి డేటాను తస్కరించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఇది ఎంతో మేలు చేస్తుంది. అప్షన్లు ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థి ప్రతి కళాశాల సమచారం తెలసుకోవడం మంచిది. - కె.శ్రీధర్, కంప్యూర్ సైన్స్ ఫ్యాకల్టీ, పీబీ సిద్ధార్థ కాలేజీ -
అయ్యన్నా..మా మొర వినన్నా...
నేడు మంత్రి అయ్యన్నపాత్రుడు రాక కైకలూరు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎన్ఆర్ ఈజీఎస్ (ఉపాధి హామీ) శాఖల మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు నేడు జిల్లాకు రానున్నారు. సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నిధుల కొరత వేధిస్తుండంతో అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా గ్రామ పట్టుసీమలైన పంచాయతీలు నిధుల కొరతతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో 969 పంచాయతీలుండగా...వీటిలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని దీనస్థితిలో అనేక పంచాయతీలు పాలన సాగిస్తున్నాయి. ఒక పక్క 100 రోజుల ప్రణాళిక అంటూ కాగితాల మీద లెక్కలు అడుగుతున్న అధికారులు నిధుల మార్గాలు చూపాలని ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటికే ఆయా పంచాయతీల్లో వ్యతిరేకత వచ్చింది. పంచాయతీల్లో పెరుకుపోయిన విద్యుత్ బకాయిల కారణంగా కొత్త పనులు చేయడానికి విద్యుత్శాఖ ససేమిరా అంటుంది. ఈ కారణంతో అనేక కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ నీటి సరఫరా కోటి సమస్యలతో ఈదుతుంది. ఫిల్టర్బెడ్లలో ఇసుక మార్చడానికి కూడా నిధులు లేమి వేధిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలో రక్షిత నీటి సరఫరా పథకాలు ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల కోసం కూలీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వలసల నివారణకు ఈ పథకం ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. అనేక పంచాయతీలు పాడుబడ్డ కొంపల్లా దర్శనమిస్తున్నాయి. సమస్యలు తీర్చాలని మంత్రిని కోరుతున్నారు. -
గిరి‘జన గోడు’
సాక్షి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతోపాటు రాష్ట్ర విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజన జిల్లా ఏర్పాటు అంశం క్రమంగా జఠిలమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లేదా మన జిల్లాలోని పోలవరాన్ని కొత్త జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంపై రచ్చ సాగుతోంది. మరోవైపు గిరిజన జిల్లాలో కలవడం తమకు ఇష్టం లేదని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు ఇలా.. జిల్లాలో ఇప్పటికే 39లక్షల పైగా జనాభా ఉన్నారు. మొన్నటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వేలేరుపాడు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు కలిసిన కుక్కునూరు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం అయ్యూరుు. తద్వారా ఆ మండలాలకు చెందిన దాదాపు 70వేల జనాభా మన జిల్లాలో చేరింది. దీంతో జిల్లా జనాభా 40 లక్షలు దాటిపోనుంది. జనాభాతోపాటు భూ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో గిరిజన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, టి.నరసాపురం, కొత్తగా కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, ఆ జిల్లాలో కలిసిన కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలతో కలిపి గిరిజన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజనేతరుల ఆందోళన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాలుగురోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. గిరిజనులు ప్రత్యేక జిల్లాకు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ గిరిజనేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొయ్యలగూడెం మండలాన్ని కొత్త జిల్లాలో విలీనం చేయూలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కన్నాపురం పంచాయతీ సోమవారం తీర్మానం చేసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోపాలపురం మండలంలోని గిరిజనేతరులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. గిరి జన ప్రత్యేక చట్టాల వల్ల తాము నష్టపోతామని ఆ మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంపై రచ్చ గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే ఆ జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా గిరిజనులు గట్టిగానే పట్టుపడుతున్నారు. జిల్లాలోని పోలవరం లేదా కేఆర్ పురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడి గిరిజనుల నుంచి వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పోల వరం నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లేందుకు ప్రస్తుతం నేరుగా మార్గం లేదు. పోలవరం నుంచి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీదుగా గోదావరిని దాటి రాజమండ్రికి.. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్లాలి. అంటే దాదాపు 120 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వరకూ రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ రెండు ప్రాం తాల మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన మండలాలకు సైతం దూరం తగ్గుతుంది. ఈ సౌలభ్యం ఉందనే కారణంగా పోలవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని జిల్లాలోని గిరిజనులు కోరుతున్నారు. ఐటీడీఏను విస్తరిస్తారా గిరిజన జిల్లా ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంటే గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)ను విస్తరించాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (73 గ్రామాలు), బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగా (6 గ్రామా లు) జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ మండలాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. వీటిని జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలు ఉన్నాయి. కలెక్టర్ను కలిసిన బాలరాజు కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన జిల్లా కేంద్రంగా పోలవరాన్ని ఎంపిక చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్ కాటమనేని భాస్కర్ను సోమవారం కోరారు. ఇరు జిల్లాలకు అందుబాటులో ఉండటంతోపాటు ఇందిరా సాగర్ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న దృష్ట్యా పోలవరానికి ప్రాధాన్యత ఏర్పడిందని కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని బాలరాజుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. -
బదిలీల టెన్షన్
మంత్రివర్గ నిర్ణయంతో నిషేధం ఎత్తివేత ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు ఆందోళనలో ఉద్యోగులు విజయవాడ : ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ మొదలైంది. మూడు రోజుల కిందట జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నెల రోజుల పాటు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదికిక బదిలీలు ఉండవని భావిస్తున్న తరుణంలో పిడుగులాంటి ఈ నిర్ణయంతో అంతా కలవరపడుతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై పిల్లల్ని పాఠశాలలు, కళాశాలల్లో చేర్చిన సమయంలో బదిలీలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. బదిలీలు రిక్వెస్ట్ చేసిన వారికి మాత్రమే చేస్తారా.. లేదా సీనియారిటీ ఆధారంగా అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. ఒకవేళ సీనియారిటీ ఆధారంగా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఏటా జూన్లో ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్నవారిని కౌన్సెలింగ్కు పిలిచి బదిలీలు నిర్వహించేవారు. అలా ఒక కార్యాలయం, సంస్థలో పనిచేస్తున్న వారిని 20 శాతానికి మించకుండా బదిలీ చేసేవారు. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం కాకుండా రిక్వెస్ట్, మ్యూచువల్, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్పరంగా చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టులో బదిలీలా.. ఈ ఏడాదికి బదిలీలు ఉండవ నే ఉద్దేశంతో ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోని విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చినట్లు చెబుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు కూడా చెల్లించారు. ఇప్పుడు అకస్మికంగా బదిలీలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జోనల్ కేడర్ ఉద్యోగులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాంటివారికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమవారిని నియమించుకునేందుకేనా.. తమకు అనువైన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రభుత్వం బదిలీలపై నిపేధం ఎత్తివేసినట్లు ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. పలు కార్యాలయాల్లో కీలక పోస్టుల కోసం ఉద్యోగులు పాలకులు చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. తమవారిని సీటులో కూర్చోపెట్టేందుకు ఎవరిపై బదిలీవేటు వేస్తారోనని ఉద్యోగులు భయపడుతున్నారు. బదిలీల విషయంలో వివిధ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కీలక పోస్టుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలతో తమ జేబులు కూడా నింపుకోవచ్చని మరికొందరు ఉత్సాహపడుతున్నారు. దీంతో బదిలీలు నిలుపుకొనేందుకు కొందరు, కోరుకున్న పోస్టుకోసం మరికొందరు బేరసారాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత
5వ తేదీలోగా సమర్పణకు అవకాశం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ఆయా శాఖలు, విభాగాలు ఆప్షన్ ఫారాలను అందజేశాయి. ఈ నెల 5వ తేదీలోగా ఆప్షన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటు సచివాలయంతో పాటు జంటనగరాల్లోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులు ఏ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకోవాలనే దానిపై చర్చల్లోనే మునిగిపోయారు. భార్య కూడా ఉద్యోగి అయితే ఏ రాష్ట్రంలో ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే సమాచారాన్ని సహచర ఉద్యోగులతో చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద 5వ తేదీ వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులు ఆప్షన్ ఫారాలను నింపడం, సమర్పించడంపైనే దృష్టిసారించనున్నారు. ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. -
‘మన్యసీమ’వైపు మరో అడుగు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో ముంపు బారినపడే మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో పురుడుపోసుకున్న కొత్త జిల్లా ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోంది. ‘మన్యసీమ’ జిల్లా ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణారావుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. విభజన అనంతరం తెలంగాణ లోని ఖమ్మం జిల్లా నుంచి నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, మూడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఎప్పటి నుంచో మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాకారమయ్యే దిశగా అడుగులు పడడానికి ఈ పరిణామం దోహదం చేసింది. రాష్ట్రంలో విలీనమైన ఏడు మండలాలను, ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న ఏజెన్సీ మండలాలను కలుపుతూ కొత్తగా మన్యసీమ జిల్లా ఏర్పాటు యోచనపై తూర్పు గోదావరి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఇటీవల రంపచోడవరంలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. కాగా ఆ ప్రక్రియను ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు కొనసాగిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు మన్యసీమ జిల్లా వైపే మొగ్గుచూపారు. దీంతో విలీనమైన మండలాల గ్రామాల్లో దశలవారీ విసృ్తతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ లోపు మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రంపచోడవరం కేంద్రంగా మన్యసీమ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపినట్టు కలెక్టరేట్ వర్గాలు బుధవారం రాత్రి ‘సాక్షి’కి ధృవీకరించాయి.తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరిలో విలీనమైన కుకునూరు, బూర్గంపాడు, వేలేరుపాడు; తూర్పుగోదావరిలో విలీనమైన భద్రాచలం రూరల్ ప్రాంతం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలతో పాటు వై.రామవరం మండలాన్ని రెండుగా విభజించి ప్రతిపాదిత మన్యసీమ జిల్లాలో కలపాలని నివేదించారు.రాజవొమ్మంగి మండలంలో కొన్ని గ్రామాలు, జిల్లాకు సరిహద్దున విశాఖజిల్లాలో ఉన్న గ్రామాలను కలిపి ఒక మండలాన్ని, విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగ్రామాలను కలిపి మరో మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలా 20 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటుకు ఒక ప్రతిపాదన పంపారు. పాలనాపరమైన ప్రయోజనాలే ప్రాతిపదిక కాగా పశ్చిమ ఏజెన్సీలో విలీనం అనంతరం ఉన్న ఆరు మండలాలు, తూర్పుగోదావరి ఏజెన్సీలో ప్రస్తుతమున్న ఏడు మండలాలు, కొత్తగా చేరిన నాలుగు మండలాలు, ప్రత్తిపాడు, శంఖవరం, కోటనందూరు, రౌతులపూడి మండలాల్లోని ఉప ప్రణాళిక ప్రాంతాల్ని కలిపి మూడు రెవెన్యూ డివిజన్లుగా మార్చి, మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలన్న మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్రంలో 14వ జిల్లా అవతరించేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయా మండలాలను విలీనం చేసినా ఒక జిల్లా ఏర్పాటుకు అవసరమైన జనాభా ఉండనంత మాత్రాన.. మన్యసీమ ఏర్పాటును జనాభా ప్రాతిపదికన చూడరాదని, ఏజెన్సీలో ప్రత్యేక పరిస్థితులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒకే జిల్లా పరిధిలో జరిగితే ఒనగూడే పాలనాపరమైన ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఖమ్మం నుంచి విలీనమైన మండలాల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నా విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా జిల్లా అధికారులు ఈ ప్రతిపాదన పంపించారని సమాచారం. -
ఆంధ్రాలో ‘పాత నేరగాళ్లు’ అధికం
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగమైన పోలీసు విభాగం రికార్డుల పంపకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పదే పదే నేరాలు చేసి పోలీసులకు చిక్కుతున్న పాత నేరగాళ్లు (ఎంఓ క్రిమినల్స్) తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నట్లు వాటిల్లో తేలింది. సీఐడీ అధీనంలో ఉండే వేలిముద్రల విభాగం (ఎఫ్పీబీ) రికార్డుల్లో ఇది బహిర్గతమైంది. ఉమ్మడి రాష్ట్ర ఎఫ్పీబీలో మొత్తం 1.8 లక్షల మంది పాత నేరగాళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 1.27 లక్షలు, తెలంగాణకు చెందిన వారు 53 వేల మంది ఉన్నట్లు తేలింది. -
ట్రాన్స్కోకు షాక్ !
భూములు ఇవ్వడానికి రైతుల నిరాకరణ చుక్కల్ని అంటుతున్న ధరలే కారణం! పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కొత్త సబ్స్టేషన్లు తప్పనిసరి అంటున్న అధికారులు సాక్షి, విజయవాడ : జిల్లాలో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, లైన్ల ఏర్పాటు కోసం ట్రాన్స్కో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ‘మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి’ అన్న చందంగా మారాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రైతులు తమ భూములను ట్రాన్స్కోకు అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో మల్టీప్లెక్స్లు, బహుళ అంతస్తుల షాపింగ్ కాంపెక్స్లు వెలుస్తున్నాయి. జిల్లాలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వాటి అవసరాలకు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లు, లైన్లు ఏమాత్రం సరిపోవని ట్రాన్స్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు ట్రాన్స్కో అధికారులు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను ఇవ్వడానికి రైతులు ముందుకురావడం లేదు. కొన్నిచోట్ల సబ్స్టేషన్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కోర్టులకు సైతం వెళ్తున్నారు. కొత్తగా వచ్చే సబ్స్టేషన్లు ఇవే.. గన్నవరం నుంచి హనుమాన్జంక్షన్ వరకు ఉన్న ఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్లకు విజయవాడలోని ట్రాన్స్కో సబ్స్టేషన్ల నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం విజయవాడలోనే విద్యుత్ లోడు పెరగడంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరో 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుచేస్తున్నారు. నూజీవీడు పరిసర ప్రాంతాల్లో ఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు రంగన్నగూడెంలో సబ్స్టేషన్ నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల్లోని గ్రామస్తుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుణదలలో సబ్స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు నున్న-గుణదల మధ్య ఉన్న సింగల్ లైన్ బదులుగా డబుల్ సర్కూట్ లైన్ వేయనున్నారు. కొత్త భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ట్రాన్స్కోకు ఇప్పటికే ఉన్న భూముల్లోనే కొత్తలైన్లు వేస్తున్నారు. నూజీవీడులో 220 కేవీ సబ్స్టేషన్కు, విజయవాడ భవానీపురంలో 133 కే వీ సబ్స్టేషన్కు టెండర్లు పిలవనున్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి అధికారులు టెక్నికల్ అనుమతులైతే సాధిస్తున్నారు గానీ, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇదీ కారణం.. తమ భూముల మీదగా 132 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుందని తెలిస్తేనే గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. ఈ లైను వల్ల తమ భూముల ధరలు సగానికి పడిపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్లే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గతంలో విజయవాడ ఆటోనగర్లో భవన యజమానులు తమ ఇళ్లపై నుంచి ట్రాన్స్కో లైన్లు వెళ్లడానికి వీలు లేదంటూ హైకోర్టుకు వెళ్లడంతో తప్పని పరిస్థితుల్లో భూమిలోంచి కేబుల్ వేసి ఆ ప్రాంతంలో సబ్స్టేషన్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది. పంట నష్టం ఏ మూలకు..! ప్రస్తుతం భూముల ధరలు చుక్కల్ని అంటుతుంటే ట్రాన్స్కో మాత్రం రైతులకు నష్టపరిహారం నామమాత్రంగానే ఇస్తోంది. ట్రాన్స్కో ఏర్పాటు చేసే టవర్లు, లైన్లు వల్ల దెబ్బతినే పంటకు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని ఆ సంస్థ నిబంధనలు చెబుతున్నాయి. తాము లక్షలాది రూపాయల ఆస్తి నష్టపోతుంటే కేవలం వేల రూపాయల్లో మాత్రమే నష్టపరిహారం వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాన్స్కో నిబంధనలు మార్చి భూములకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అవసరాలను గుర్తించాలి రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలు బాగా పెరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ట్రాన్స్కోకు సహకరించాలి. రెవెన్యూ అధికారులతో సంప్రదించి, వారు సూచించిన విధంగా ట్రాన్స్కో నిబంధనల మేరకు రైతుల భూములకు నష్టపరిహారం చెల్లిస్తాం. కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై లోడు ఎక్కువ పడి అవి దెబ్బతింటున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వీటి నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. - బత్తుల రామయ్య, ట్రాన్స్కో ఎస్ఈ -
మాట తప్పిన బాబుపై మండిపాటు
రుణమాఫీ పరిమితులపై తీవ్ర నిరసన వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన భారీగా రాస్తారోకోలు, మానవహారాలు సాక్షి, విశాఖపట్నం: రుణ మాఫీ హామీ అమలుపై పరిమితులు విధిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుతో నరకాసుర వధ పేరిట మూడు రోజుల ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా రాస్తారోకో, మానవహారం, చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలతో హోరెత్తించాయి. పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలునాయుడు, గిడ్డి ఈశ్వరి తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు బూటకపు హామీలపై ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన తేదీ ఖరారైందని, రెండు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులేంటో పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్రస్తుతం మాట మార్చడం సరికాదని వారు ఆక్షేపించారు. అన్నీ తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మొత్తం రూ.1,01,816 కోట్ల రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చి ప్రస్తుతం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో కాశీపురం కూడలిలో రాస్తారోకో, మానవహారం, చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం జరిగాయి. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాస్తారోకో, మానవహారం నిర్వహించి చంద్రబాబు దిష్టి బొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. యలమంచిలిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో ఆందోళన చేపట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అరకులోయ నియోజకవర్గం హుకుంపేటలో పార్టీ మండల శ్రేణులు రాస్తారోకో నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని మాకవరపాలెంలో పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేసి, ఆందోళన నిర్వహించారు. పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఆయన సోదరుడు రవికుమార్ ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టారు. రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. భీమిలిలో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం నేతృత్వంలో భీమిలి అర్బన్ ఇన్చార్జి అక్కరమాని వెంకటరావు, పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని చినవాల్తేరు కూడలిలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. -
జిల్లా, జోనల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులకే విభజనతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు జిల్లా, జోనల్ స్థాయి (స్థానిక కేడర్) పోస్టుల్లో పదోన్నతులు, నియామకాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు కూడా అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో ఏపీలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతలు లభించనున్నాయి. అలాగే జిల్లా, జోనల్ స్థాయి పోస్టులకు కొత్తగా నియామకాలను కూడా చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. -
పన్నేతర ఆదాయంపై ఏపీ సర్కారు దృష్టి
మళ్లీ అన్నిరంగాల్లో యూజర్ చార్జీల బాదుడు! హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నేతర ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో పన్నులు ఎక్కువగా ఉన్నందున కొత్తగా పన్నులు పెంచడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో పన్నేతర ఆదాయ మార్గాల ద్వారా ఏటా అదనంగా రూ.10 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏయే రంగాల ద్వారా పన్నేతర ఆదాయం రాబట్టుకోవచ్చో అధ్యయనం చేసి నివేదిక సమర్పించే బాధ్యతలను కేపీఎంజీ అనే కన్సల్టెన్సీకి ఆర్థిక శాఖ అప్పగించింది. ఈ కన్సల్టెన్సీ ఇతర రాష్ట్రాలు అవసరమైతే ఇతర దేశాల్లో పన్నేతర ఆదాయాన్ని ఎలా రాబట్టుకుంటున్నారు, ఏయే రంగాల్లో పన్నేతర ఆదాయం ఎంత వస్తోందో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. -
దూరదర్శన్.. మన దగ్గరకే
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ప్రభావం దూరదర్శన్పైనా పడింది. ఇప్పటికే పలు ప్రైవేటు చానల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను వేర్వేరుగా ప్రసారం చేస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రసారాలు చేసేందుకు ప్రసారభారతికి దూరదర్శన్ ప్రతిపాదనలు అందాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కార్యక్రమాలు ప్రసారంచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రసారం చేసినా, అందులో రెండు గంటలు స్థానిక కార్యక్రమాలకు అవకాశం ఇచ్చేవారు. తొలుత అర్ధగంటే కేటాయించినా ఆ తర్వాత రెండు గంటలకు పెంచారు. ఇందులోనే 15 నిమిషాల్లో ఈ 13 జిల్లాల వార్తలు ఉండేవి. ప్రధానంగా కోస్తాంధ్రలోని 10 జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలను ఈ ప్రాంతం నుంచి ప్రసారం చేసేవారు. ఇవి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం నుంచి విడిపోయి విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ తదితర అన్ని కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అయితే ఇందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని తెలిసింది. 30 ఏళ్ల అనుబంధం! 1977లో నీలం సంజీవరెడ్డి హైదరాబాద్ దూరదర్శన్ను ప్రారంభించారు. 1985 నాటికి విజయవాడలోనే ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో ఈ ప్రాంత వాసులకు హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో 1985వ దశకంలో దూరదర్శన్కు విపరీ తమైన ప్రాచుర్యం ఉండేది. హైదరాబాద్ దూరదర్శన్ రెండుగా విడిపోతే ఈ ప్రాంత ప్రజలకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోతుంది. మరో ఆరు నెలల వ్యవధి.. హైదరాబాద్ దూరదర్శన్ నుంచి విడిపోయి ఇక్కడ నుంచి పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించాలంటే మరో ఆరు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. వివిధ రకాల కార్యక్రమాలను రికార్డు చేసుకోవడానికి స్టూడియో, అప్లింకింగ్ సౌకర్యం, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. యాంకర్లు, న్యూస్ రీడర్లతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాల్సి ఉంది. అలాగే కార్యక్రమాలను నేరుగా ప్రసారం చేసేందుకు ఓబీ వ్యాన్ అవసరం ఉంటుంది. విస్తరణకు తగిన అవకాశాలు.. ప్రస్తుతం స్టూడియో ఎకరంన్నర స్థలంలో నిర్మించారు. రెండు గంటల కార్యక్రమాలను ఇక్కడినుంచే ప్రసారం చేస్తున్నందున ప్రోగ్రామ్ జనరేటింగ్, అప్లింకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దూరదర్శన్ విస్తరణ చేయాలంటే ప్రస్తుతం ఉన్న చోటనే మరో నాలుగు ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ నూతన నిర్మాణాలు చేసుకుంటే ఈ ప్రాంతంలోనూ హైదరాబాద్లోని రామంతపూర్కు దీటుగా కేంద్రాన్ని నిర్మించుకోవచ్చు. -
కమలనాథన్ మార్గదర్శకాలు మరింత జాప్యం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పంపిణీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాల విడుదలకు మరింత జాప్యం జరగనుంది. ముసాయిదా మార్గదర్శకాల రూపకల్పనకు జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుతో సమావేశమయ్యారు. జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ తన వద్ద పెండిం గ్లో లేదని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ వద్ద ఉందని ఐవైఆర్ వివరించారు. రానున్న రెండేళ్ల కాలంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అప్షన్ ఇచ్చే అంశంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు ఏకాభిప్రాయానికి వస్తేనే ముసాయిదా మార్గదర్శకాల వెల్లడికి మార్గం సుగమవుతుందని కమలనాథన్ ఏపీ సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. కమలనాథన్ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మంత్రివర్గ సమావేశంలో బిజీగా ఉన్నందున కలవలేకపోయారు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గురువారం ఢిల్లీలో సమావేశానికి వెళుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాల విడుదల మరింత జాప్యం కానుంది. -
ఎర్ర చంధనం
మూడేళ్లలో 60 టన్నుల దుంగలు స్వాధీనం ప్రభుత్వానికి నివేదించిన అధికారులు తిరుపతికి ఎర్ర చందనం దుంగల తరలింపు అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.18 కోట్లు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ లోటు బడ్జెట్ ఏర్పడటం.. కొత్త ప్రభుత్వం రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ఫించన్ల పెంపు తదితర హామీలను నెరవేర్చడం కోసం.. ఇతర వనరుల సమీకరణలో భాగంగా ఎర్రచందనం నిల్వలను వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో అనంతపురం అటవీశాఖ పరిధిలో స్వాధీనం చేసుకున్న దుంగలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. జిల్లాలో 60 టన్నుల ఎర్రచందనం దుంగలు నిల్వ ఉన్నాయని స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం దుంగల నిల్వలు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం వృక్షాలు పెద్దగా లేకపోయినా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి స్మగ్లర్లు దుంగలను అనంతపురం జిల్లా మీదుగా తరలిస్తూ..ఇక్కడి అటవీశాఖాదికారులకు పట్టుబడడంతో వారి నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను అనంతపురంలోని రేంజర్ కార్యాలయంలో భద్రపరిచారు. గడిచిన మూడేళ్లలో అధికారులు స్వాధీనం చేసుకున్న దుంగలు 60 టన్నులు నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ఎర్రచందనం విలువ రూ.30లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే.. జిల్లాలో నిల్వ ఉన్న దుంగల ఖరీదు దాదాపు రూ.18కోట్లు అన్నమాట. తరచూ ఎక్కడో ఒక చోట ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుని వాహనాలు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నా..అక్రమ రవాణా ఆగడం లేదు. వాహనాలు విక్రయిస్తే రూ.20 లక్షలు జిల్లాలోని అటవీశాఖ పరిధిలో 2012 నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన వాహనాలు మొత్తం 48 ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అనంతపురం అటవీశాఖ కార్యాలయంలో వే లానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వీటిని వేలంలో విక్ర యిస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇంటిదొంగలు తేలనేలేదు జిల్లాలో ఆరు (అనంతపురం, కళ్యాణదుర్గం, బుక్కపట్నం, పెనుకొండ, కదిరి, గుత్తి) ఫారెస్ట్ రేంజ్లు ఉన్నాయి. 1989 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే ఈ అడవుల్లో ఎక్కడా ఎర్రచందనం వృక్షాలు లేవు. గతంలో శ్రీగంధం చెట్లు ఉన్నా..ప్రస్తుతం అవి కూడా కనిపించడం లేదు. అయితే కర్నూలు నల్లమల అడవులు, వైఎస్సార్ జిల్లాలోని శేషాచలం, పాలకొండల్లో ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నాయి. వాటిని అక్కడి స్మగ్లర్లు నరికి వేసి దుంగలుగా మార్చి..గతంలో చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి చైనాకు తరలించేవారు. అయితే చిత్తూరు జిల్లాలోని తలకోన అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు నిఘా పెంచారు. దీంతో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల స్మగ్లర్లు రూటు మార్చి అనంతపురం జిల్లా మీదుగా దుంగలను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే జిల్లాలో ఆ స్మగ్లర్లు పోలీసుశాఖలోని కొంత మంది ఎస్ఐలతో పాటు అటవీశాఖలోని కొంత మంది అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరి సహకారంతోనే స్మగ్లర్లు దుంగలను యథేచ్ఛగా జిల్లా దాటిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైన నేపథ్యంలో అటవీ శాఖాధికారులు అడపా దడపా దాడులు చేసి దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 54 కేసులు నమోదు చేసి..115 మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే పోలీసులు, అటవీశాఖాధికారుల కళ్లుగప్పి పారి పోయిన నిందితులు కూడా అదేస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తప్పించుకున్న వారు అటవీ శాఖాధికారులు, సిబ్బందితో పరిచయాలు పెంచుకుని..వారు కోల్పోయిన దుంగలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే జూన్ 8న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనంతపురం రేంజీ కార్యాలయం ఆవరణలోని గదిలో దాచి ఉంచిన రూ.కోటి విలువైన దుంగలను దర్జాగా తీసుకెళ్లిపోయారు. ఇంటిదొంగల ప్రమేయం ఉండటంతోనే నెలరోజులు గడిచిపోయినా ఇంత వరకు దొంగల సంగతి ఓ కొలిక్కిరాలేదు. పోలీసులు సైతం కేసును ఛేదించలేకపోతున్నారు. వెలుగుచూడనివి ఎన్నో..! కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు కూలీలతో ఇష్టారాజ్యంగా నరికించి ఎక్కడపడితే అక్కడ దాచిపెడతారు. జిల్లాలో కూడా గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, తలుపుల, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల్లో ఎక్కువగా దాచిపెడుతున్నట్లు తెలిసింది. పరిస్థితులు, వాతావరణం అనుకూలించినపుడు జిల్లా హద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ జిల్లా నుంచి తలుపుల, కదిరి మార్గంలో ఎక్కువగా ఎర్రచందనం దుంగలు తరలిపోతున్నట్లు తెలిసింది. ఈ తతంగం మొత్తం తెలిసినా సిబ్బంది తగినంత మంది లేకపోవడం.. ఆయుధాలు లేకపోవడంతో గాలింపును పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. స్మగ్లర్లకు ఇది అదునుగా మారింది. దీనికి తోడు కాసులకు కక్కుర్తిపడే కొంత మంది పోలీసులు, అటవీ సిబ్బంది సహకారం ఉండడంతో వారికి మరింత బలం చేకూరుతోంది. తిరుపతికి తరలించాం కార్యాలయంలో భద్రత లేకపోవడం, ప్రభుత్వం దుంగలను వేలం వేయాలని సూచించడంతో అనంతపురం రేంజీకార్యాలయంలో నిల్వ ఉంచిన 60 టన్నుల ఎర్రచందనం దుంగలను ప్రధాన అటవీసంరక్షణ అధికారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా బాకరాపేటలోని కేంద్ర శాండిల్ఉడ్ కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం కార్యాలయంలో దుంగలు ఏమీ లేవు. -శ్రీనివాసులు, సబ్ డీఎఫ్ఓ, అనంతపురం -
నీళ్లు చల్లిన జైట్లీ
ఎరువుల రాయితీకి నగదు బదిలీకిలంకెతో రైతులకు ఇబ్బందులు సీమకు ప్రత్యేక ప్యాకేజీపై బడ్జెట్లో ప్రస్తావనే లేదు ఐఐటీని మంజూరు చేసినా ఎక్కడో తేల్చలేదు వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపుతో కాస్త ఊరట కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లాపై చూపే ప్రభావం ఇదీ బోడిగుండుకూ మోకాలికీ ముడేయడమంటే ఇదే..! సంస్కరణల పేరుతో ఎరువుల రాయితీకి నగదు బదిలీకి ముడిపెట్టడంతో 8.70 లక్షలమంది రైతులకు అగచాట్లు తప్పేలా లేవు. విభజన సమయంలో సీమకు ప్రత్యేకప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ఇప్పుడు ఆ మాటే మరిచిపోవడంతో ప్రగతి ప్రశ్నార్థకమైంది. మన్నవరం పరిశ్రమను పూర్తిచేయడంతోపాటు కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటుపై హామీ ఇవ్వకపోవడంతో ఉపాధిపై యువత ఆందోళన చెందుతోంది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచడంతో 75 వేల మందికిపైగా వేతన జీవులకు కాసింత ఊరట లభించింది. మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన నేపథ్యంలో చెన్నై-బళ్లారి, తడ-పూతలపట్టు రహదారుల దశ తిరిగినట్లే..! ఇదీ జిల్లాపై కేంద్ర బడ్జెట్ చూపిన ప్రభావం..!? సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అర్బన్: దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రాయలసీమ రెండో స్థానంలో ఉంది. సీమలో భాగమైన మన జిల్లాలో పశ్చిమ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది. ఏటా కరవు బారిన పడిన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కూడా హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడంతో జిల్లా ప్రజానీకం భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆ ఆశల్లో నీళ్లు చల్లారు. ఖేదం (-).... సంక్షోభంలో సేద్యం..: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రైతులను నోటితో పలకరించి.. నొసటితో వెక్కిరించారు. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో 8.70 లక్షల కుటుంబాలు సేద్యంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. కర్షకలోకానికి ఊతం ఇవ్వాల్సిన కేంద్రం వారిని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేసింది. యూరియాపై రాయితీని పూర్తిగా ఎత్తేసింది. ప్రస్తుతం యూరియా బస్తా రాయితీపై రూ.274కు మార్కెట్లో లభిస్తోంది. ఇకపై యూరియా బస్తా కొనాలంటే రైతు రూ.1324 వెచ్చించాలి. ఇక పోషక ఆధారిత ఎరువుల (నైట్రోజన్, పాస్ఫరస్, పొటాష్)పై ఇచ్చే రాయితీకి కూడా నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించింది. అంటే.. రైతు పూర్తి ధరకు ఎరువులను కొనుగోలు చేస్తే ఆ తర్వాత కేంద్రం రాయితీని ఆ రైతు ఖాతాలో జమా చేస్తుందన్న మాట. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు పూర్తి స్థాయి ధరను వెచ్చించి ఎరువులను కొనుగోలు చేయగలరా? రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే కేంద్రం ఈ ఎత్తు వేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై కేంద్రం చేతులెత్తేసింది. ఇందుకు దేశవ్యాప్తంగా కేవలం రూ.వంద కోట్లే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జిల్లా ప్రజలను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఉపాధి ఎండమావే..: జిల్లాలో మన్నవరం వద్ద బీహెచ్ఈఎల్-ఎన్టీపీసీ రూ.12 వేల కోట్లతో విద్యుదుత్పత్తి పరికరణాల తయారీ పరిశ్రమ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పరిశ్రమ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కానీ.. ఈ పరిశ్రమ పూర్తి చేయడంపై బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పరిశ్రమను పూర్తిచేయడంతోపాటూ కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు మరిన్నింటిని జిల్లాకు కేటాయిస్తారని ప్రజలు భావించారు. కానీ.. ఒక్క పరిశ్రమను కూడా జిల్లాకు కేటాయించకపోవడంతో ఉపాధి కోసం యువత సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. మోదం (+).... వేతన జీవులకు ఊరట..: జిల్లాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, టీటీడీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 75 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆదాయపన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచడం వల్ల వేతనజీవులకు కాస్త ఊరట నిచ్చినట్లయింది. గృహ నిర్మాణ రుణాలను తక్కువ వడ్డీకే ఇవ్వడంతోపాటు.. ఆదాయపన్ను రాయితీని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వేతనజీవులకు వెసులుబాటు కల్పించినట్లయింది. భరోసా కరవు..: దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాం తం రాయలసీమ.. అందులోనూ చిత్తూరుజిల్లా. రాష్ట్ర విభజన సమయంలో సీమకు బుందేఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. బడ్జెట్లో మాత్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం.. సీమకు ప్రత్యేక ప్యాకేజీకి ఎన్ని నిధులు కేటాయిస్తామన్నది స్పష్టీకరించకపోవడంతో ప్రజానీకం ఆందోళన చెందుతోంది. ఐఐటీ వస్తుందా..?: ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసినట్లుగానే రాష్ట్రానికి కూడా ఐఐటీని మంజూరు చేస్తున్న ట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేయక ముందే ఐఐటీని తిరుపతిలో నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. కేంద్రం మాత్రం మంజూరు చేసిన ఐఐటీని ఎక్కడ నెలకొల్పుతామన్నది స్పష్టంగా ప్రకటించలేదు. ఇది తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుపై అనుమానాలకు దారితీస్తోంది. పాఠశాల విద్యకు ఊతం..: పాఠశాల విద్యకు కేంద్రం ఊతం ఇచ్చింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద రూ.208కోట్లు నిధులు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాగం కేంద్రానికి రెండు నెలల క్రితమే నివేదిక పంపింది. సర్వశిక్ష అభియాన్కు కేంద్ర బడ్జెట్లో మొత్తం రూ.28,635 కోట్లు నిధులు కేటాయించిన నేపథ్యంలో మన జిల్లాకు రూ.208 కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రహదారులకు జీవం..: మౌలిక సదుపాయాలు.. ప్రధానంగా జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేయాలని నిర్ణయించడంతో జిల్లాలో రహదారుల స్వరూపమే మారిపోనుంది. చెన్నై-బళ్లారి, తడ-పూతలపట్టు రహదారులకు కొత్త కళ రానుంది. కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం చేసే రోడ్డు కూడా మన జిల్లా నుంచే వెళ్లే అవకాశం ఉంది. ఫోర్లేన్, సిక్స్ లేన్ రోడ్డు ఏర్పాటైతే ప్రైవేటు రంగంలో పరిశ్రమలు నెలకొల్పడానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. సంక్షేమమంటే ఇదేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. బడ్జెట్లో అరుణ్జైట్లీ నిధులు కేటాయించిన తీరే అందుకు తార్కాణం. పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఇదేనా..? మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గదే. కానీ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేవలం రూ.వంద కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని అరుణ్జైట్లీ ప్రకటించడంలో ఔచిత్యమేమిటన్నది వారికే తెలియాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలి. యువతకు ఉపాధిపై భరోసాను ఇచ్చేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. -వరప్రసాద్, ఎంపీ, తిరుపతి రాజధానికి నిధులు కేటాయించాల్సింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డ కొత్త ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఉండాల్సింది. అలాగే ఐటీ రంగాన్ని రాయలసీమలో మరింత అభివృద్ధి చేసే దిశగా కేంద్రం బడ్జెట్లో చర్యలు తీసుకుని ఉండాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్లో నవ్యాంధ్రకు కేటాయింపులు లేకపోవడం బాధించింది. - డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, వైద్యురాలు ఎయిమ్స్పై స్పష్టత ఏదీ..? అభివృద్ధిని వికేంద్రీకరించే క్రమంలో ఏపీలో దేశస్థాయి వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్) ఏర్పాటుపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, రాయలసీమవాసుల్లో ఆందోళన నెలకొంది. కానీ ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయిన నవ్యాంధ్రలో బాగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. - డాక్టర్ పార్థసారథి, ఐఏఎం కార్యదర్శి ఏడ్చే బిడ్డకు వెలక్కాయ చూపినట్టుంది ఎన్నికలకు ముందు బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం బడ్జెట్లో చేసిన పద్దులను పరిశీలిస్తే ఏడ్చే బిడ్డకు వెలక్కాయ చూపినట్టుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎక్కడా స్పష్టమైన నిధుల కేటాయింపు జరగక మళ్లీ బీజేపీ ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. ఈ బడ్జెట్తో సామాన్యునికి ఒనగూరే అభివృద్ధి అంటూ ఏదీ లేదు. దేశానికి ప్రాముఖ్యం కలిగిన రక్షణ రంగంలోనూ ఎఫ్డీఐలను తెస్తే దేశ భద్రతకు భరోసా ఉంటుందా..? - పీ.నవీన్కుమార్రెడ్డి, జె సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉద్యోగులకు నిరాశే మిగిల్చింది మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రధానంగా గత యూపీయే విధానాలనే కొనసాగించింది. సాధారణ ప్రజలతో పాటు వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగించింది. టాక్స్ మినహాయింపు కనీసం రూ.5 లక్షలు ఉంటుందని ఉద్యోగులు ఆశించారు. రూ.2 లక్షల నుంచి మరో రూ.50 వేలకు పెంచి చేతులు దులుపుకున్నారు. కనీసం రూ.4 లక్షల వరకైనా చేసి ఉంటే కొంత ఊరట ఉండేది. వేలకోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ కంపెనీలకు ఈ బడ్జెట్ ఊతం ఇచ్చినట్టుగానే ఉంది. పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అడుగడుగునా నిర్వీర్యం చేస్తూనే.. కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించిందని చెప్పక తప్పదు. - ఎం నాగార్జున, టీటీడీ ఉద్యోగి ఆశలపై నీళ్లు చల్లారు వేతన జీవులకు రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను మినహయింపు ఇస్తామని ఆశలు రేకెత్తించారు. తీరా బడ్జెట్లో కేవలం రూ.50వేలు మాత్రం పెంచి ఆశలపై నీళ్లు చల్లారు. అంటే 12నెలల పాటు పనిచేస్తే వచ్చిన జీతంలో నుంచి సుమారు 2నెలల జీతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. ఇది దారుణం. పెరిగిన ధరలకు కళ్లెం వేయకపోతే ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. - లోకేష్వర్మ, రాష్ర్ట అధ్యక్షుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం గృహిణులకు తగిన బడ్జెట్ కాదిది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గృహిణులకు ప్రణాళికాబద్ధత ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి..చేసేది ఒకటిలాగా బడ్జెట్ పద్దును చూస్తే అర్థం అవుతోంది. మొత్తం మీద ఈ బడ్జెట్ గృహిణుల అంచనాలకు తగినట్లుగా లేదనిపిస్తోంది. - ఎంఆర్ రెడ్డెమ్మ, గృహిణి కార్మికులకు నయవంచన ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగాల్లో పదేపదే చెప్పే కార్మిక సంక్షేమం అంశానికి తూట్లు పొడిచేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. అసలు వివిధ కర్మాగారాల్లోని కార్మికులకు, అసంఘటిత రంగాల్లోని కోట్లాది మంది కార్మికులకు ఏం సంక్షేమం చేపడుతారో బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణం. ప్రతి రంగానికి చెప్పిన అంశాలను చూస్తే స్పష్టమైన విధానమే కనబడలేదు. ఇది కేవలం కార్పొరేటర్లకు ఉపయోగ పడేలా ఉన్న బడ్జెట్లా కనబడుతోంది. - లేబూరు రత్నకుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రైతన్నకేదీ భరోసా.. దేశానికి రైతన్న వెన్నెముక. వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతన్నలను నట్టేట ముంచింది. ఎరువుల రాయితీ ఎత్తేయడం, నగదు బదిలీని వర్తింపజేయడం అంటే సేద్యాన్ని సంక్షోభంలోకి నెట్టడమే. రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతు రుణాల మాఫీకి కేంద్రం ఎలాంటి దన్ను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రైతు రుణాల మాఫీపై చంద్రబాబు తక్షణమే విధి విధానాలను ప్రకటించాలి. రైతుల రుణాలను మాఫీ చేయకపోతే కర్షకుల ఆగ్రహాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం కాలి బూడిదవడం ఖాయం. రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీమకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ఐఐటీని తిరుపతిలోనే నెలకొల్పి.. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలి. -పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట మొండిచేయి చూపిన మోడీ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో సీమాంధ్రకు మొండిచేయే మిగిలింది. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతానని ప్రమాణం చేసి ప్రధాని అయిన నరేంద్రమోడీ బడ్జెట్ విషయంలో మాట తప్పి కొత్త రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఈ బడ్జెట్ కార్పోరేటర్లకు, ధనిక వర్గాలకు ఉపయోగపడేలా ఉందేకానీ మధ్య తరగతి ప్రజలకు, రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడదు. రైల్వే బడ్జెట్ ఎంత నిరాశ కల్గించిందో ఈ బడ్జెట్ అంతకుమించిన నిరాశను మిగిల్చింది. అరుణ్జైట్లీ గొప్ప ఆర్థికవేత్త అన్న గుర్తింపును పొందారే కానీ ఏమాత్రం మానవతాదృక్పథంతో ఆలోచించకపోవడం దారుణం. కొత్త రాష్ట్ర పునర్నిర్మాణాన్ని విస్మరించి ఏకపక్షంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం దురదృష్టకరం. సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని తాము పూడుస్తామని ప్రగల్భాలు పలికి ఆచరణలో సాధ్యం చేయలేకపోయారు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు ఎలాంటి నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించి కోట్లాదిమంది ప్రజల మనోభావాలను తమ ఆర్థిక ప్రగతిని, అభివృద్ధిని విస్మరించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. - దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే వ్యవసాయానికి ప్రాధాన్యం లేదు మనదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం వదిలివేసినట్టు బడ్జెట్ చెబుతోంది. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.36 వేల కోట్లు కేటాయించిన కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించడానికి కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. గ్రామీణ ప్రాం తాల్లో గృహ నిర్మాణం, నీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని విస్మరించడం బాధాకరం. విద్యారంగానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై, రాజధాని నిర్మాణంపై ప్రస్తావన రాకపోవడం అన్యాయం. -ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ గొప్పగా ఏమీ లేదు కేంద్రప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఏమీ లేదు. ఆదాయపు పన్ను మినహాయించిన అంశంలో చేసిన వెసులుబాటు పెద్దగా ప్రయోజనాన్ని చేకూర్చదు. ఇనుప క మ్మీలు, సిమెంట్ ధరలు తగ్గించారు. దీనివల్ల నిర్మాణరంగానికి మేలు జరుగుతుంది. అలాగే తయారీ రంగానికి మేలు చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. వినియోగసామర్థ్యం, కొనుగోలు సామర్థ్యం పెరుగుతాయి. మధ్యతరగతి ఉద్యోగులకు గృహ రుణాలను కొంత పెంచారు. -ప్రొఫెసర్ ఎ.పద్మావతి, ఆర్థికశాస్త్ర విభాగాధిపతి పొంతన లేని బడ్జెట్ బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిన హామీలకు, ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్కు పొంతనలేదు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన నరేంద్రమోడీ ప్రభుత్వం బడ్జెట్లో తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. సామాన్య ప్రజానీకానికి, మధ్యతరగతి ఉద్యోగులకు బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ఆదాయపన్ను పరిధిని కొంతమేరకే పెంచారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే గ్రామీణ లింక్ రోడ్ల నిర్మాణానికి ఎక్కువ కేటాయింపులు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. పేద, మధ్యతరగతికి ఆశాజనకంగా లేదు. -ప్రొఫెసర్ సవరయ్య, ఎస్వీయూ విద్యారంగానికి ప్రాధాన్యం లేదు గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రాష్ట్ర విభజన వల్ల మనం 200 కేంద్రీయ సంస్థలను కోల్పోయాం. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రీయ విద్యాసంస్థలను కేటాయించక పోవడం దారుణం. తిరుపతికి కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర సంస్థలను కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో ఏ ఒక్క సంస్థ ఏర్పాటుకూ కేటాయింపులు పెద్దగా లేవు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుత్సాహానికి గురిచేసింది. -హేమంత్కుమార్, విద్యార్థి -
ప్రగతి ‘రైలు’.. పట్టాలెక్కేనా..!?
నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి సదానందగౌడ నత్తనడకన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు ఊపు సాక్షి ప్రతినిధి, తిరుపతి: రైల్వే బడ్జెట్పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలను మంత్రి సదానందగౌడ సాకారం చేస్తారా? గత రైల్వే మంత్రుల తరహాలోనే వమ్ము చేస్తారా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. విభజన నేపథ్యంలో రాష్ట్ర, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను కేంద్రం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది నేడు తేలిపోనుంది. వివరాల్లోకి వెళితే.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్సభలో 2014-15 (పూర్తి స్థాయి) రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ.. జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైల్వే మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇదే జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది. అపార ఖనిజ సంపదకూ.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా, అభివృద్ధిలో మాత్రం అథమ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం రైల్వే మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పశ్చిమ మండలాల్లో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేలా కడప-మదనపల్లె-బంగారుపేట-బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండలాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి-నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వాటా నిధుల కేటాయింపే సాకుగా... నిధుల లభ్యత లేదనే సాకు చూపి ఆ రెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వేశాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్లో ఆ రెండు మార్గాలను మంజూరు చేసింది. 2008-09, 2009-10 బడ్జెట్లలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ రెండు రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా నిధులను ఇచ్చారు. ఫలితంగా కడప-బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప-బెంగళూరు రైల్వే మార్గం పనులు రూ.129 కోట్ల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకూ 21.59 కి.మీల మేర సాగుతున్నాయి. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేమార్గం సర్వే పనులు 2010 నాటికే పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. ఐదేళ్లలో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయన్నది రైల్వేశాఖే ఓ అంచనాకు రాలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాన్మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడదల చేయకపోవడమే. ఇదే సాకుగా చూపి రైల్వేశాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం. డివిజన్ పోయి జోన్ వచ్చె.. గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్లో కొన్ని భాగాలను వేరు చేసి.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశబ్దాలుగా విన్పిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికీ, రైల్వేశాఖకూ రాజకీయ, పారిశ్రామిక వర్గాలు ప్రతిపాదనలు కూడా పంపాయి. మంగళవారం రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత రానుంది. -
వాహనాలకు రెట్టింపు పోటు
అరసవల్లి: రాష్ట్ర విభజన ప్రభావం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పన్ను భారం రెట్టింపు కావడంతో వాహన యజమానులతోపాటు ప్రయాణికులు, సరుకు రవాణాపై పెను భారం పడుతోంది. రాష్ట్రం విడిపోయిన రోజు.. అంటే జూన్ రెండో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చే యించుకున్న వాహనాలకు రెండు రాష్ట్రాల్లో నూ ఒకే పన్నుతో తిరిగే వెసులుబాటు ఉన్నా.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం ఆంధ్ర, తెలంగాణల్లో తిరగాలంటే రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా పన్ను చెల్లించాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎక్కడికెళ్లాలన్నా ఒకే పన్ను చలానాతో సరి పోయేది. ఇప్పుడు అదే చలానాతో కొత్త ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనే తిరిగేం దుకు అనుమతి ఉంది. తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ పన్ను కట్టాల్సిందే. అలాగే జూన్ రెండో తేదీ తర్వాత కొనుగోలు చేసిన ఏ వాహనాన్నయినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే పోలీస్ క్లియరెన్స్ తప్పని సరి. ఉదాహరణకు గతంలోశ్రీకాకుళం జిల్లాలో కొన్న వాహనాన్ని ఏదైనా తెలంగాణ జిల్లాకు బదిలీ చేయాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ సరిపోయేది. కొత్త నిబంధనల ప్రకారం ఆ సర్టిఫికెట్తోపాటు వాహనంపై ఏ విధమైన కేసులు లేవని ధ్రువీకరిస్తూ పోలీసులు ఇచ్చే క్లియరెన్స్ సరిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. జూన్ 2వ తేదీకి ముందు కొన్న వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తించదు. సొంత వాహనదారులకు ఇబ్బందులు ఈ ఏడాది జూన్ రెండు తర్వాత మోటారు సైకిళ్లు, కార్లు తదితర వ్యక్తిగత వాహనాలను ఏ రాష్ట్రంలో కొంటే అక్కడే లైఫ్ ట్యాక్స్ చెల్లిం చాలి. అయితే ఆ వాహనాలు రెండో రాష్ట్రంలోకి వెళ్లి, అక్కడ నెల రోజులకు మించి ఉంటే మాత్రం అక్కడ మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండా తిరిగే వాహనాలపై భారీగా జరిమానాలు వడ్డిస్తారు. మోటారు సైకిల్పై 9 శాతం, కార్లు ఇతర తేలికపాటి వాహనాలపై 12 శాతం జరి మానా వసూలు చేస్తారు. ప్రైవేటు బస్సులకు భారం రాష్ట్ర విభజన తో రవాణా శాఖ కూడా రెం డుగా విడిపోయింది. ఈ ప్రభావం వాణి జ్య వాహనాలు, ప్రైవేటు బస్సులపై తీవ్రం గా పడింది. రాష్ట్ర పర్మిట్పై తిరిగే ప్రైవేట్ బస్సుల యజమానులు ఇంతకు ముందు ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుకు రూ.3,675 చొప్పున పన్ను చెల్లించేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతే మొత్తం చొప్పున కట్టాల్సి వస్తోంది. అంటే ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.7,350 చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్నంతా ప్రైవేట్ ఆపరేటర్లు సహజంగా ప్రయాణికులపైనే మోపుతారు. ఆర్టీసీ బస్సులకు ఏడాదిపాటు ఇప్పుడున్న పర్మిట్లతో రాష్ట్రాల్లో తిరిగే వెసులుబాటు కల్పించినా.. వాటి కాలపరిమితి తీరిన తర్వాత రెండు రాష్ట్రాల్లో తిరగాలంటే వేర్వేరుగా పర్మిట్లు తీసుకోకతప్పదు. వాణిజ్య వాహనాలదీ ఇదే పరిస్థితి జూన్ రెండో తేదీకి ముందు పర్మిట్ తీసుకున్న వాణిజ్య వాహనాలకు పర్మిట్ కాలపరిమితి పూర్తియ్యేవరకు రెండు రాష్ట్రాలోనూ తిరిగే అవశాం కల్పిం చారు. ఆ తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల్లో తిరగాలం టే వేర్వేరు పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. రవాణా రంగం సంక్షోభంలో ఉన్నందున రెండు చోట్లా పన్న చెల్లించడం భారమవుతుందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అనుకూలం
అరకు, పాడేరులో పర్యాటకాభివృద్ధికి అవకాశ సీఐఐ సదస్సులో ఉత్తరాంధ్ర ఎంపీలు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అన్ని విధాలా అనువైనదని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి చేశాయన్నారు. ఇక మీదట ఆ పరిస్థితి లేకుండా ప్రాంతాలవారీ సమానాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వ పరంగా అనుమతులకు తన వంతు సహకారం అందించనున్నట్టు తెలిపారు. విశాఖలో రూ.1400 కోట్లు మేర ఉన్న ఐటీ పరిశ్రమను రూ.10 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అభివృద్ధి చేయాలన్నారు. పారిశ్రామికవాడలు, కారిడార్ల కోసం నిరీక్షించకుండా సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏపీఐఐసీకి స్థలాలిచ్చినా.. నిర్ణీత గడువులోగా పరిశ్రమల్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ఇలాంటి భూముల్ని సేకరించి ప్రత్యామ్నాయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అనుబంధంగా అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరితో సంబంధాలున్న దక్షిణ భారత్లోనే అతి పెద్దదైన అరకు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్నారు. అరకు, పాడేరులో చాలా ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలమన్నారు. ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత మూడేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, విభజన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం పరిశ్రమల ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు. సమావేశంలో సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి సురేష్, విశాఖ జోన్ అధ్యక్షుడు జి.వి.ఎల్.సత్యకుమార్ పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల రాబడి ఢమాల్
- పెరిగిన భూముల ధరలు - తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య - భారీగా పడిపోయిన ఆదాయం - రాజధాని ప్రకటన కోసం ఎదురు చూపులు ఏలూరు : రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పటి నుంచి జిల్లాలో భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన పూర్తి కావటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. దానికి తోడు జిల్లాకు సమీపంలో రాజధాని ఏర్పాటు కానుందనే ఊహాగానాలు భూముల ధరల బూమ్కు కారణమయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచే వ్యవసాయ, ఇతర భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. జిల్లా సరిహద్దులోని హనుమాన్ జంక్షన్లో ఎకరం భూమి విలువ రూ. కోటి పై మాటే. వట్లూర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గ్రామాల్లోను ఎకరం రూ.75 లక్షలు పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. జిల్లాలో భూములకు సంబంధించి నెలకు సగటున 12 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య ఏడు వేలు కూడా దాటటం లేదు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్, మే, జూన్ నెలలు)కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ భీమవరం జిల్లా పరిధిలో రూ.42 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.27 కోట్లే సమకూరింది. ఏలూరు జిల్లా కార్యాలయం పరిధిలో రూ.27 కోట్లు లక్ష్యం కాగా రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది లక్ష్యంలో 57 శాతమే ఆదాయం 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం సుమారు 1.20 లక్షల భూముల క్రయవిక్రయాల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయని అంచనా కాగా 80 వేలు మాత్రం జరిగాయి. మొత్తం రూ.333 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.190 కోట్లు సమకూరాయి. లక్ష్యంలో 57 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ పరిస్థితికి రాష్ట్ర విభజనే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. వారంలో భూముల ప్రభుత్వ విలువ పెంపు వచ్చే నెలలో పట్టణాల్లో భూముల ప్రభుత్వ విలువను రిజిస్ట్రేషన్శాఖ సవరించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విలువ , బహిరంగ మార్కెట్ల్లో వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని భూముల విలువను 30 శాతం పెంచనున్నారు. దీనిపై రిజిస్ట్రేషన్శాఖ సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపింది. వారం రోజుల్లో విలువ పెంపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని రిజిస్ట్రేషన్శాఖ అధికారులు భావిస్తున్నారు. -
సమస్యలతో‘రణం’
నూతన పాలకవర్గాలకు సమస్యల స్వాగతం జిల్లా అంతటా తాగునీటి సమస్య అధ్వానంగా డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు మచిలీపట్నం : ఎట్టకేలకు పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు గురువారం నుంచి కొలువుదీరనున్నాయి. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలను గత మూడున్నర సంవత్సరాలుగా ప్రత్యేకాధికారులే పాలిం చారు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో పాలన కుంటుపడింది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీల్లో తొలిసారిగా పాలకవర్గాలు పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. ప్రతి పురపాలక సఘంలోనూ తాగునీరు, డ్రెయినేజీ, అంతర్గత రహదారులు, డంపింగ్ యార్డులు, దోమల బెడద వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోంది. జగ్గయ్యపేట, తిరువూరు వంటి పురపాలక సంఘాలకు నూతన పైప్లైన్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు, డ్రెయినేజీలు ఏకమై మురుగునీరు రోడ్లపైనే ప్రవహించటం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కొలువుదీరుతున్న నూతన పాలకవర్గాలకు ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో తాగునీరు ప్రధాన సమస్యగా మారింది. నివేశనా స్థలాల కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పురపాలక సంఘానికి సొంత భవనం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ సమస్య పట్టణవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరువూరు నగర పంచాయతీలోనూ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. రూ.100 కోట్ల అంచనాలతో కృష్ణానది నంచి పైప్లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతి కోసం పంపారు. ఈ ప్రతిపాదనలు కాగితాలను దాటడం లేదు. పురపాలక సంఘానికి కార్యాలయం నిమిత్తం రూ.50 లక్షలతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. డ్రెయినేజీ సమస్యతోపాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు లేరు. నందిగామ నగర పంచాయతీలో మునేరు నుంచి పట్టణంలోకి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ దెబ్బతిన్నది. దీంతో గత నెల రోజులుగా పట్టణవాసులకు తాగునీటి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అంతర్గత రహదారులు దారుణంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి కార్యాలయ భవనం లేదు. సిబ్బంది కొరత ఉంది. గుడివాడలో పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు లీకవుతూ తాగునీరు కలుషితమవుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది. పెడన పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించేందుకు రూపొందిం చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ ఇబ్బందికరంగా మారింది. డంపింగ్ యార్డు అవసరం. ఎన్టీఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో తాగునీరుతోపాటు అనేక సమస్యలు తిష్టవేశాయి. జగ్గయ్యపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముక్త్యాల నుంచి 9 కిలో మీటర్ల మేర పైప్లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు అభివృద్ధికి నోచుకోవటం లేదు. డంపింగ్యార్డు సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది. నూజివీడులో రూ.66 కోట్లతో నిర్మిస్తున్న పైప్లైన్ పనులు పూర్తికావాల్సి ఉంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి నూజివీడు వరకు ఈ పైప్లైన్ను నిర్మిస్తున్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ సమస్య ప్రధానంగా ఉంది. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి మచిలీపట్నం పుట్లమ్మచెరువు వరకు 11.5 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతోంది. రూ. 80 కోట్లతో ప్రారంభించిన ఓపెన్ డ్రెయినేజీ పనులు కూడా నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. డంపింగ్యార్డు సమస్య ఉంది. -
‘స్థానిక’ పాలకుల ఎన్నికకు విధివిధానాలివే..
పురపాలక సంఘాల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఒక చోట ఓటు విప్ ధిక్కరిస్తే ఓటు చెల్లినా.. వేటు తప్పదు.. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ నేడో, రేపో మండల, జిల్లా పరిషత్లకు.. ఎట్టకేలకు ‘స్థానిక సంస్థల’ అధినేతల ఎన్నికకు రంగం సిద్ధమైంది. పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, పెడన పురపాలక సంఘాలతో పాటు ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీలకు మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 12న ఫలితాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఫలితాలు వెల్లడైన వారంలోపు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేవారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు తదితర కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. వైఎస్సార్ సీపీ విజ్ఞాపనలు, రాజ్భవన్ జోక్యంతో నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 3న మునిసిపల్, 4న మండల, 5న జిల్లా పరిషత్ సారథులను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధివిధానాలపై కథనం ఇదీ.. ఎంపీలకు ఒక చోటే ఓటు పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిలకు సంబంధించిన ప్రకటనను మునిసిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారికి, ఆయా సంఘాల్లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఆప్షన్ ఇచ్చిన ఎంపీలకు అందజేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కౌన్సిలర్లు, మునిసిపాల్టీ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే అధికంగా మున్సిపాలిటీలు ఉన్నప్పుడు ఏదో ఒక చోట మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. వారు ప్రత్యేక సమావేశానికి హాజరై పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే నాటికి, మునిసిపల్ పరిధిలో ఓటరు అయి ఉంటే... ఆ మునిసిపాల్టీలో వారూ ఓటు వేయవచ్చు. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు (లోక్సభ, రాజ్యసభ) ఆహ్వానం ఉంది. కానీ వారికి ఓటు హక్కు లేదు. కోరం ఉంటేనే ఎన్నిక మున్సిపాల్టీల సారథుల ఎన్నిక జూలై 3న జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, కమిషనర్ల ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత కౌన్సిల్ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు అర్హులైన వారిలో సగం మంది సభ్యులు సమావేశం ప్రారంభమైన గంటలోపు హాజరైతే కోరం ఉన్నట్లు. ఉదాహరణకు మచిలీపట్నం మున్సిపాలిటీలో 42 మంది కౌన్సిలర్లు, బందరు ఎంపీ, ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉంది. అంటే 44 మంది సభ్యులున్నట్లు. వీరిలో 22 మంది హాజరైతే కోరం ఉన్నట్లు. కోరం లేకుంటే మరుసటి రోజు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం మళ్లీ సమావేశం నిర్వహిస్తారు. పని దినమైనా, సెలవు రోజైనా సమావేశం ఉంటుంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచిం చాలి. మరో సభ్యుడు సమర్థించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సరి సమానంగా ఓట్లు వచ్చిన పక్షంలో ఎన్నికల అధికారి డ్రా పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. ఒకవేళ ఆ రోజున కూడా కోరం లేకపోతే.. కోరం ఉన్నా ఎన్నిక జరగపోతే ఆ విషయాన్ని తదుపరి ఆదేశాల కోసం ఎన్నికల కమిషన్కు నివేదిస్తారు. విప్ కీలకం మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, సారథుల ఎన్నికలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండటాన్నే విప్ అంటారు. అంటే తన ఆదేశాల్ని ధిక్కరిస్తే... కొరడా ఝళిపించే అవకాశం పార్టీకి ఉంటుంది. స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు ఈ నిబంధన వర్తించదు. 14 పార్టీలు విప్ జారీ చేసే అర్హత కలిగి ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలను బట్టి స్పష్టమమవుతోంది. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేం దుకు పార్టీ పక్షాన ఒక విప్ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మాలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడు లేదా, పార్టీ నాయకుడిని విప్గా నియమించవచ్చు. సభ్యుడికి మాత్రమే సమావేశ మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం ఒక గంట ముందు, ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ చేసినా, ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకం చేయకపోతే.. విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్ అందుకుని, ఎన్నిక సందర్భంగా ధిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే.. ఓటు చెల్లుతుంది. ఆ సభ్యుడు సభ్యత్వం కోల్పోతాడు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఇలా... మునిసిపల్, మండల, జెడ్పీ సారథుల ఎన్నిక తరువాత కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్కు ఒకరు, జిల్లా పరిషత్కు ఇద్దరిని ఎన్నుకోవాలి. కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన వయోజనులు నిర్దేశిత ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 10 గంటలకు నామినేషన్లు సమర్పించాలి. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే తెలుగు అక్షర క్రమంలో జాబితా రూపొందించి ఎన్నిక నిర్వహిస్తారు. మండల పరిషత్లో ఎంపీటీసీ సభ్యులు, జిల్లాపరిషత్లో జెడ్పీటీసీ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతిలో కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో ఎకరిని ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికకు విప్ వర్తించదు. ఇక మున్సిపాలిటీలకు ముగ్గురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు మైనార్టీ వర్గాలకు, వారిలో ఒకరు మహిళ అయి ఉండాలి. ముస్లిం, క్రిష్టియన్, సిక్, బుద్దిస్ట్, జోరాస్త్రియన్ మైనార్టీ వర్గాల్లో ఎవరైనా మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లయిన వారిని ఎన్నుకోవాలి. మరో కో-ఆప్టెడ్ సభ్యుడిగా రిటైర్డ్ మునిసిపల్ ఉద్యోగి, వివిధ రంగాలపై అవగాహన నైపుణ్యం, సామాజిక సేవాతత్పరత వంటి సుగుణాలు కలిగిన వారిని ఎన్నుకోవాలి. కౌన్సిల్ ప్రమాణస్వీకారం తర్వాత 60 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. -
వ్యాపార లక్ష్యం రూ.10 వేలకోట్లు
ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రవికుమార్ వత్సవాయి : ఈ ఏడాది పదివేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం జి.రవి కుమార్ తెలిపారు. వత్సవాయిలో బుధవారం జరిగిన ఆంధ్రాబ్యాంక్ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 103ఆంధ్రాబ్యాంక్ శాఖలు, 87 ఏటీఎం సెంటర్లు ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రూ.8,200 కోట్ల వ్యాపారం జరి గిందన్నారు. ఈ ఏడాది రూ.10 వేల కోట్ల వ్యాపారం చేయాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 30 ఏటీఎం సెంటర్లు, 10 శాఖలను ప్రారంభించామని, ఈ ఏడాది జిల్లాలో మరో 30 ఏటీఎంలు, 10 శాఖలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరో ఐదు శాఖలకు అనుమతులు లభించాయని తెలి పారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు చేతి వృత్తుల వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రకటించారు. వడ్డీ వ్యాపారుల బారిన పడి నష్టపోకుండా చిరువ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామని చెప్పారు. గత ఏడాది జిల్లాలో 1500 మంది చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన నేపత్యంలో జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ నిమోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందుకనుగుణంగా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
హాట్ కేకులు.. జనరల్ మెడిసిన్ సీట్లు
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా ప్రారంభం తొలి రోజు అర్ధరాత్రి దాటే వరకు సీట్ల భర్తీ విజయవాడ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన కౌన్సెలింగ్ తొలిరోజైన బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. జనరల్ మెడిసిన్ సీట్లు హాటుకేకుల్లా భర్తీ అయ్యాయి. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా సీట్లు భర్తీ అవుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు స్క్రీనులపై చూపించారు. మొదటి రోజు నాన్సర్వీస్ జనరల్ కేటగిరీకి సంబంధించి కౌన్సెలింగ్ పక్రియ నిర్వహిం చారు. తొలుత ఫస్ట్ ర్యాంకర్ బి.శ్రీరామిరెడ్డికి వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ అడ్మిషన్ పత్రాన్ని అందజేసి కౌన్సెలింగ్ ప్రారంభించారు. అనంతరం కౌన్సెలింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న వర్సిటీ రెక్టార్ డాక్టర్ రమణమ్మ నేతృత్వంలో ర్యాం కుల వారీగా వివిధ ప్రభుత్వ, ప్రరుువేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమో సీట్లను భర్తీ చేశారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా జనరల్ మెడిసిన్ సీట్లు హాట్కేకుల్లా మారాయి. తొలి పది మంది ర్యాంకర్లలో ముగ్గరు కౌన్సెలింగ్కు గైర్హాజరవగా, మిగిలిన వారిలో ఆరుగురు జనరల్ మెడిసిన్ సీట్లు తీసుకున్నారు. ఒకరు జనరల్ సర్జరీని ఎంచుకున్నారు. మధ్యాహ్నానికే నాన్సర్వీస్ ఓపెన్ కేటగిరికి సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో జనరల్ మెడిసిన్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికిప్రరుువేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్ ఏర్పడింది. జనరల్ మెడిసిన్ తర్వాత, జనరల్ సర్జరీ, అబ్స్ట్రాటిక్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్, రేడియాలజీ, ఆర్థోపెడిక్ వంటి విభాగాల కోసం పోటీ పెరిగింది. ఆయా విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్సీట్లు లభించని వారు డిప్లొమా కోర్సులను ఎంచుకుంటున్నారు. రాత్రి ఏడు గంటల సమయానికి ఆ కేటగిరిలో నాన్క్లినికల్ సీట్లు మాత్రమే మిగిలాయి. ఉస్మానియా, గాంధీ కళాశాలలకు తగ్గని క్రేజ్ రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉస్మానియా, గాంధీ కళాశాలల్లో అడ్మిషన్లకు క్రేజ్ తగ్గలేదు. పదేళ్ల వరకూ విద్యారంగంలో పాత విధానాన్నే కొనసాగించేందుకు నిర్ణయించడంతో టాప్ ర్యాంకర్లందరూ ఉస్మానియూ, గాంధీ మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు మొగ్గు చూపారు. మూడో ప్రాధాన్యతగా ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరారు. టాప్ ర్యాంకర్ కర్నూలు జిల్లా వాసి అయినప్పటికీ ఉస్మానియూలో జనరల్ మెడిసిన్సీటు పొందగా, కాకినాడ రంగరాయ కళాశాలలో ఎంబీ బీఎస్ చదివిన నాల్గో ర్యాంకర్ కూడా అక్కడే జనరల్ మెడిసిన్లో చేరారు. ఐదో ర్యాంకర్ అనంతపురానికి చెందిన బండపల్లి దివ్యరెడ్డి, కడపకు చెందిన ఆరో ర్యాంకర్ రాం భూపాల్రెడ్డి గాంధీ కళాశాలలో జనరల్ మెడిసిన్ సీట్లు పొందగా, హైదరాబాద్కే చెందిన ఏడో ర్యాంకర్ బల్లిపల్లి అర్జున్ గాంధీ కళాశాలలో జనరల్ సర్జరీలో సీటు పొందాడు. ఇలా టాప్ ర్యాంకర్లందరూ ఉస్మానియా, గాంధీ కళాశాలల్లో చేరేందుకే ఆసక్తి చూపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా యూనివర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యూని వర్సిటీ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు, సిల్వర్ జూబ్లీ బ్లాక్లో పేరెంట్స్ వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇబ్బందులు తలెత్తలేదు. కౌన్సెలింగ్ జరిగే ప్రాంతంలో సైతం ఎప్పటికప్పుడు స్క్రీన్లపై సీట్ల వివరాలు డిస్ప్లే చేయడంతో తాము చేరాలనుకునే కళాశాలల్లో సీట్లు ఎంచుకోవడం విద్యార్థులకు సులభమైంది. -
ఆ గనులు ‘పశ్చిమ’కే
కుకునూరు : రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మం జిల్లా పరిధిలో గల కుకునూరు మండలంలోని గనులు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చాయి. అతి విలువైన ఇనుపరాయి, అందమైన స్ఫటిక (క్వార్జ్) నిల్వలు కుకునూరు మండలంలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనం నేపథ్యంలో విలువైన రాతి నిక్షేపాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందనున్నాయి. కుకునూరు మం డలం ఉప్పేరు పంచాయతీ పరిధిలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం అడవుల్లో అణు విద్యుత్కు ఉపయోగపడే ఇనుపరాయి నిల్వలు అపారంగా ఉన్నాయి. బ్రిటిష్ వారు గమనించిన ఆ ఇనుప రాయిని ఇప్పటివరకు మన ప్రభుత్వాలు గాని, అధికారులు గాని గుర్తించకపోవడం గమనార్హం. 2012లో చెన్నైకి చెందిన ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చి సెంటర్, ఖమ్మం జిల్లాకు చెందిన మైనింగ్ అధికారుల సహకారంతో ఈ నిక్షేపాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేశారు. స్థానిక గిరిజనులు, అమరవరం అటవీ రేంజ్ అధికారులు అడ్డుకోవడంతో ఆ ఇనుపరాయి విలువ తెలిసింది. అతివిలువైన, అరుదైన ఆ ఇసుప రాయిని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అందమైన తెల్లరాయి నిల్వలు కుకునూరు మండల పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో అందమైన తెల్లరాయి (క్వార్జ్) నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనిని స్ఫటిక రాయి అంటారు. కివ్వాక పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెంలో గల ఈ తెల్లరాయి రసాయనాల తయారీలో ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం ఓ రసాయనాల పరిశ్రమకు చెందిన అక్రమార్కులు ఆ రాయిని తరలించుకుపోతుండగా గిరిజనులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇనుపరాయి, తెల్లరాయి గురించి పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పి, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అతి విలువైన ఖనిజ సంపదను వినియోగించుకోవడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు, కుకునూరు మండలం నవ్యాంధ్ర రాష్ట్రంలో విలీనమైన నేపథ్యంలో ఆ గిరి జన గ్రామాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ దృష్ట్యా కోట్ల విలువచేసే ఖనిజ సంపద కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందనుంది. ఆ సంపదను వెలికితీసి.. వాటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేయూలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఆ గిరిజన గ్రామాలు ఇకనైనా అభివృద్ధికి నోచుకుంటాయో, లేవో వేచి చూడాల్సిందే. -
కొలువుదీరేదెన్నడు?
పరోక్ష ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన - నీరసిస్తున్న ఆశావహులు - మారుతున్న సమీకరణలు - అభ్యర్థులకు చుక్కలు చూపుతున్న జంప్జిలానీలు కరీంనగర్ సిటీ: ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని అయోమయ పరిస్థితి పరోక్ష ఎన్నికల విషయంలో నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నలభై రోజులు దాటుతున్నా ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికపై స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, అసెంబ్లీ సమావేశాలు.. నెపం ఏదైనా చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, కనీసం ఆ దిశగా కసరత్తు చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి తలెకొంది. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని ఎన్నికకు ఉత్సాహంతో క్యాంప్లు వేసిన ఆశావాహులు ప్రస్తుత పరిస్థితితో బేజారెత్తిపోతున్నారు. క్యాంపుల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుంటే కండ్లు తేలేసి.. మళ్లీ వేద్దాంలే అంటూ నుంచి ఇంటిబాట పడుతున్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థులు గాలం వేయడంతో సభ్యులు కప్పదాట్లకూసై అంటున్నారు. నలభై రోజులు దాటినా ఊసేది? మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. మే 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి 40 రోజులు దాటుతున్నా జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల ఎన్నికలపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి విచిత్ర పరిస్థితి ప్రజాప్రతినిధులకు ఎదురవలేదు. గతంలో కౌంటింగ్ కేంద్రాల నుంచే విజేతలను క్యాంపులకు తరలించేవాళ్లు. వారం రోజుల్లోపు చైర్మన్ ఎన్నిక తేలిపోయేది. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రజాప్రతినిధులకు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకపోవడం ఇబ్బందిగా మారింది. చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా కీలకమవుతుండటంతో శాసనసభ కొలువు తీరాక, ప్రమాణస్వీకారం చేసిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు పూర్తయినా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికల సంఘం విభజన కాకపోవడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతుండటంతో అవి పూర్తయ్యాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కలవరపెడుతున్న జంప్జిలానీలు నానాతంటాలు పడి మద్దతుకు హామీ తీసుకొని క్యాంపులకు తీసుకెళ్తే ఎన్నిక నిర్వహించకపోవడంతో సభ్యుల మనసు మారకుండా చూడటం చైర్మన్ అభ్యర్థులకు మరో పరీక్షగా మారింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తుండటంతో రాజకీయ సమీకరణలు తారుమారవుతున్నాయి. జిల్లాలో 57 మండలాలకు 29 స్థానాల్లో టీఆర్ఎస్, 11 మండలాల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ రాగా, 17 మండలాల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల్లో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్ మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ పార్టీ సైతం చాపకిందనీరులా తమ ప్రయత్నాలు సాగిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది. క్యాంపు రాజకీయాలంటేనే కప్పదాట్లకు నిలయం. ఒక పార్టీ క్యాంపులో ఉన్నా, మరో పార్టీ ఆశావాహులు వారితో టచ్ లో ఉంటూ తమవైపు జంప్ చేసేలా ‘మాట్లాడుకుంటున్నారు’. ఇందుకు తగినట్లుగానే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాంపు నుంచి వచ్చి మరో క్యాంపునకు వెళ్లగా, మరికొంతమంది ఎన్నికల నాటికి పార్టీ మారుస్తామని ఒట్టేస్తున్నారు. కమాన్పూర్లో కాంగ్రెస్ క్యాంపు నిర్వహించి తిరిగి రాగా, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎనిమిది మంది ఎంపీటీసీలు క్యాంపు మార్చారు. కాంగ్రెస్ క్యాంపు నుంచి వచ్చి తిరిగి టీఆర్ఎస్ క్యాంపులో చేరడంతో ఎంపీపీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ముగింపు ఎప్పుడో...? పరోక్ష ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు ఎప్పుడనేది ప్రజాప్రతినిధుల మదిని తొలుస్తోంది. ఇప్పుడు...అప్పుడు అంటూ ప్రచారం జరగడం, ఆశావాహులు, పార్టీ నేతలు హడావుడి పడటం, ఆ తరువాత ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు పూర్తయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని పార్టీలన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో మళ్లీ క్యాంపులపై నేతలు దృష్టిసారిస్తున్నారు. మొత్తానికి పరోక్ష ఎన్నిక ఆశావాహుల్లో గుబులు పుట్టస్తుంటే, ఏదైనా జరగకపోతుందా అనే కోణంలో ప్రత్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
సంతాప తీర్మానంలా ఉంది: వైఎస్సార్సీపీ
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్రానికి దిక్సూచిలా ఉంటుందని, ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆశించామని, ఈ ప్రసంగం ఆంధ్రప్రదేశ్కు ఓ సంతాప తీర్మానంలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు గడికోట శ్రీకాంత్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రోజాలు మీడియా పాయింట్లో మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్ని అమలు చేసే విశ్వాసాన్ని, నమ్మకాన్ని గవర్నర్ తన ప్రసంగం ద్వారా కల్పించలేకపోయారని జ్యోతుల నెహ్రూ అన్నారు. గవర్నర్ కూడా టీడీపీ ఉద్దేశాన్ని మక్కీకి మక్కీగా తయారు చేసి చదివినట్లుందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తారని తెలిపారు. -
బీజేపీ గూటికి కిరణ్..?
కేంద్రమంత్రి వెంకయ్యతో మాజీ సీఎం కిరణ్ చర్చలు జేఎస్పీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన సాక్షి ప్రతినిధి, తిరుపతి : జేఎస్పీ అధినేత ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఆ పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారా? బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారా? కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జరిపిన మంత్రాం గం ఫలిస్తే.. పక్షం రోజుల్లోనే కాషాయదళంలోకి కిరణ్ చేరనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జేఎస్పీ వర్గాలు.. చివరి బంతి వరకూ వేచి చూడండి, రాష్ట్ర విభజనను ఆపుతానంటూ అప్పటి సీఎం కిరణ్ ప్రగల్భాలు పలికిన విషయం విదితమే. తనకు తాను సమైక్య సింహం.. చాంపియన్గా అభివర్ణించుకున్న కిరణ్ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక.. సీఎం పదవికి రాజీనామా చేసి జారుకున్నారు. ఆ తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. ప్రజలు విశ్వసించి జేఎస్పీకి ఓట్లేసి కాస్తోకూస్తో సీట్లను కట్టబెడితే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి బాగుంటే, ఆపార్టీ అధిష్టానానికి షరతులు పెట్టి పార్టీని విలీనం చేసేలా కిరణ్ అప్పట్లో ప్రణాళిక రచించారనే అభిప్రాయం క్రమంలోనే ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ ఊరువాడ ప్రచారం చేశారు. విజయంపై ధీమా లేని కిరణ్ తాను స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేయకుండా ఆదిలోనే కాడి దించారు. తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలోనూ కిరణ్ పోటీచేయలేదు. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్కుమార్రెడ్డి జేఎస్పీ తరఫున బరిలోకి దిగారు. రాష్ట్రంలో పీలేరు మినహా ఏ ఒక్క చోట కూడా జేఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కిరణ్ తెరమరుగయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కన్పించకపోవడమే అందుకు తార్కాణం. కాంగ్రెస్ పార్టీ కూడా అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ పూర్తిగా బలహీనపడింది. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కిరణ్ తన వ్యూహాన్ని మార్చారు. జేఎస్పీని కాంగ్రెస్లో కాకుండా బీజేపీలో విలీనం చేసి, ఆపార్టీలో కీలకపాత్ర పోషించడం ద్వారా రాజకీయంగా పునర్వైభవం సాధించాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బలమైన నేతలను కాషాయదళంలో చేర్చుకోవడానికి బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇది పసిగట్టిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇటీవల హైదరాబాద్లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డితోనూ కిరణ్ చర్చలు జరిపారు. తనను బీజేపీలో చేర్చుకుని.. ప్రాధాన్యం ఇస్తే జేఎస్పీని విలీనం చేస్తానని వెంకయ్యనాయుడు వద్ద ప్రతిపాదించినట్లు కిరణ్ అనుయాయులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని కిరణ్కు వెంకయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే అంశంపై పీలేరు నియోజకవర్గంలోని తనకు సన్నిహితులైన నేతలకు కిరణ్ చెప్పినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపడమే తరువాయి.. జేఎస్పీని ఆపార్టీలోకి విలీనం చేయడానికి కిరణ్ సిద్ధమైపోయారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్కు దన్నుగా నిలిచిన బీజేపీలోకి సమైక్య చాంపియన్గా అభివర్ణించుకున్న కిరణ్ ఇప్పుడు చేరడానికి అర్రులు చాస్తోండటం గమనార్హం. -
ట్రై చేద్దాం..!
అధికారుల ఊగిసలాట బదిలీ కోసం విశ్వప్రయత్నాలు తరచూ సెలవుపై వెళ్తున్న జిల్లా అధికారులు విభజన పర్వం ముగిసినా అధికారుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని ఉన్నతస్థాయిలోని ఉన్నవారు తమకు అనువైన ప్రాంతాలకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రభావం పాలనపై పడి వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులంతా ఇదే మూడ్లో ఉండడంతో ప్రజావసరాలకు ఇబ్బందులు వస్తున్నాయి. మహబూబ్నగర్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జిల్లాలోని ఉన్నతాధికారులు బదిలీపై దృష్టి సారించడంతో.. ఊగిసలాట మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన స్థా నాలకు వెళ్లాలన్న యోచనలో మరికొందరు జి ల్లా అధికారులు బదిలీల కోసం విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనువైన చోట్లకు బదిలీ చే యించుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చ ర్చించుకుంటున్నాయి. ఆ కోవలోనే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీకి వె ళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విసృ్తత ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన పొరుగు జిల్లాల్లోని కలెక్టర్లు కొందరిని బదిలీ చేయడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేపట్టారు. అయితే మన జిల్లా కలెక్టర్ బదిలీపై ఏమాత్రం స్పష్టత లేకపోగా.. బదిలీపై వెళ్లనున్నట్లు ఊహగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మణ్కూడా మంచిస్థానానికి పదోన్నతిపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన సెలవుపై వెళ్లడం వెనుక ఇటువంటి ఉద్దేశమే ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్కు ఓఎస్డీగా మహబూబ్నగర్ ఆర్డీఓ హన్మంతరావును బదిలీ చేశారు. ఆయా శాఖల పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు బదిలీ ధ్యాసలో ఉంటుండటంతో వాటి రోజువారీ పనితీరుపై సమీక్ష చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. తమకు అనుకూలంగా ఉండే అధికారులను జిల్లాకు రప్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఢిల్లీస్థాయి నేత మన జిల్లాకు తమ అనుయాయుడైన కలెక్టర్ను రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కూడా తాము చెప్పినట్లు నడుచుకునే ఆర్డీఓలు, ఎంపీడీఓలను తమ నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఆ అధికారులు వీరి కనుసన్నల్లో మెలగాలన్న భావనతో అధికారులను బదిలీ చేయించుకునేందుకు దృష్టిపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కొనసాగిన తహశీల్దార్ల పోస్టింగుల్లోనూ వివాదాలు చెలరేగాయి. జిల్లా స్థాయిలో కొత్త అధికారులు వచ్చాక తహశీల్దార్ల పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని రెవిన్యూ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్తంభించిన పాలనజిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఆంధ్రప్రదేశ్కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు జవాబు లేదు. దీంతో అధికారులు బదిలీలపై దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పాలన కొంతమేరకు స్తంభించిపోయింది. కొన్ని శాఖల పరిధిలో పురోగతి శూన్యమైంది. కనీసం కొంతమంది అధికారుల బదిలీలు చేసినా పాలన గాడిలో పడేందుకు వీలుదొరికేది.. అలా కాకుండా బదిలీ చేస్తారని తెలిసినా చేయకపోవడంతో పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగును పడిపోతోంది. -
ప్రగతే లక్ష్యం కావాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విద్య, క్రీడలు, సాంస్కృతికం, సాహిత్యం.. ఇలా వివిధ రంగాల్లో ఎంతోమంది మేరునగధీరులు జిల్లా పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తం చేశారు. ఎన్నో విషయాల్లో ఘనమైన చరిత్ర గల ఈ జిల్లా.. అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పది నియోజకవర్గాల్లో ఏడింట తెలుగుదేశం విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పస్తుతం తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లండి.. అసెంబ్లీలో మా వాణి గట్టిగా వినిపించండి..ఇక్కడి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించండి..’ అని జిల్లా వాసులు శాసనసభ్యులకు వేడుకుం టున్నారు. ‘ముఖ్యమంత్రి సహా నేతలందరూ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలపైనే దృష్టి సారిస్తున్నారు.. శ్రీకాకుళం లాంటి పట్టణాలనూ అభివృద్ధి చేసేలా వారిపై ఒత్తిడి తెండి’ అని కోరుతున్నారు. మంత్రి పదవి దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడుపై మరింత బాధ్యత ఉందని అంటున్నారు. ఈ పనులు పూర్తి చేయించండి.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే వంశధార రెండో దశ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. 2009 తర్వాత వాటిని పట్టిం చుకోలేదు. సుమారు రూ.933 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా రైతుల కడగండ్లు చాలావరకు తీరతాయి. పలాస ప్రాంతంలో చేపట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నారాయణపురం కాలువ, తోటపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. వర్షాల సీజన్ వచ్చేసింది. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నదులకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలి. సీతంపేట, భామిని, కొత్తూరు, పాల కొండ, పాతపట్నం, సారవకోట, మెళియాపుట్టి, మందస వంటి ప్రాంతాలు జిల్లాలో గిరిజన, సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం సహా ఉపాధి శిక్షణ కేంద్రాలు ఈ ప్రాంతాల్లో నెలకొల్పితే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలి. పైడి భీమవరం, రాజాం, టెక్కలి ప్రాం తాల్లో పరిశ్రమలున్నాయి. అయినా జిల్లా వాసులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పవర్ హాలిడే తప్పించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తగిన సదుపాయాలు కల్పించాలి. జిల్లాలోని ఇసుక రీచ్లకు వేలం నిర్వహించకపోవటంతో అవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వందలాది ట్రాక్ట ర్ల ఇసుక అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల మేర గండి పడుతోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలి. జిల్లాలో సుమారు 176 కి.మీ పొడవున తీర ప్రాంతం ఉంది. భావనపాడులో హార్బ ర్ నిర్మిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదు. కళింగపట్నం, శాలిహుండం, దంతవరపుకోట, బారువ వంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి వెనకబడిపోయింది. పేరుగాంచిన ఉద్దానం కొబ్బరి పంటకు ప్రోత్సాహం కరువైంది. ఈ ప్రాంతంలో కాయిర్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. రక్షిత తాగునీటి కోసం ఉద్దాన ప్రాంత వాసులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తు ల్ని ఆదుకునేందుకు డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. నాగావళి నదిపై వీరఘట్టం మండలం కిమ్మి, వంగర మండలం రుషింగి గ్రామాల మధ్య, శ్రీకాకుళం పొన్నాడ వద్ద, శ్రీకాకుళంలోని పాత వంతెన వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెల కొన్న సమస్యల కారణంగా రోగులు అవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం ఇక్కడ ఎండమావే. వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న టీడీపీ హామీ నెరవేరేలా చూడాలి. ప్రతి మండలంలోనూ మినీ స్టేడియం నిర్మించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలి. -
డబ్బుల్లేవ్
సాక్షి, కాకినాడ :ఏదైనా బిల్లు పట్టుకెళ్తే చాలు...బడ్జెట్ లేదు చెల్లింపులు మా వల్ల కాదు అనే సమాధానం ట్రెజరీ అధికారుల నుంచి వస్తోంది. శాఖల వారీగా ఆదాయం జమ అవుతున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో చెల్లింపులు మాత్రం జరగడం లేదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే ‘విభజన’ కష్టాలు అప్పుడే మొదలయ్యాయనే ఆందోళన సర్వత్రా విన్పిస్తోంది.రాష్ర్ట విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ట్రెజరీ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్ 2వ తేదీ(అపాయింటెడ్ డే)నుంచి వివిధ శాఖల హెడ్ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కు పాత అకౌంట్స్ రద్దయి కొత్తవి ప్రారంభమయ్యాయి. శాఖల వారీగా రోజూ వచ్చే ఆదాయం సంబంధిత అకౌంట్స్లో జమ అవుతోంది కానీ చెల్లింపులు మాత్రం జరగడం లేదు. రెండ్రోజుల క్రితం ట్రెజరీ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్ 1వ తేదీకి ముందుకు సంబంధించిన ఏ బిల్లులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జూన్ 1వ తేదీకి ముందు జారీయిన చెక్కులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని తేల్చారు. సంబంధిత శాఖలో బడ్జెట్ అలకేషన్ ఉండి ఉంటే జూన్ 2వ తేదీ తర్వాత తేదీతో జారీ అయ్యే చెక్లకు చెల్లింపులు జరపాలని సూచించారు. బడ్జెట్ ఐటమ్స్గా పేర్కొన్న చెల్లింపులను బడ్జెట్ ఉన్న మేరకు మాత్రమే సాధ్యమైనంత తక్కువ మొత్తంలోనే జరపాలని పేర్కొన్నారు. ఇక వివిధ శాఖల హెడ్స్ పేరిట ఉండే వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్స్ను జూన్ 1వ తేదీతో క్లోజ్ చేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ను జూన్ 2వ తేదీతో ప్రారంభించే అకౌంట్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్గా చూపించి ఆ తర్వాత చెల్లింపులు జరపాలని సూచించారు. రోజువారీ ఖర్చులకే చెల్లింపులు ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఏప్రిల్ - మే నెలలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ విడుదల చేశారు. ఈ బడ్జెట్కు సంబంధించి విడుదలైన నిధుల్లో 85 శాతానికి పైగా ఆయా శాఖలు వినియోగించుకున్నాయి. ఇక మిగిలిన నిధులు జూన్-1వ తేదీతోనే మురిగిపోయాయి. జూన్-2వ తేదీ తర్వాత జరిపే చెల్లింపులకు సంబంధించి ఇప్పటి వరకు బడ్జెట్ అలకేషన్ లేదు. కొత్త సర్కార్ ఇంకా కొలువు దీరకపోవడం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ర్ట బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ప్రతిరోజు వివిధ శాఖల ద్వారా జిల్లా ఖజానాకు రూ.6కోట్ల మేర ఆదాయం జమవుతుంది. ప్రతిరోజు చెల్లింపులు రూ.13 కోట్ల వరకు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఆయా శాఖలకు రోజువారీ నిర్వహణ ఖర్చులు మినహా టీఏలు, డీఏలు, మెడికల్ రీయింబర్సుమెంట్ తదితర బిల్లుల చెల్లింపులేమీ జరగడం లేదు. పదవీ విరమణ వయస్సు పెంచడంతో తగ్గిన భారం పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడంతో ఈనెలలో గరిష్టంగా రిటైర్ కావాల్సిన జిల్లాలోని సుమారు 450 ఉద్యోగుల పదవీ విరమణ గడువు మరో రెండేళ్లు పెరిగింది. దీంతో ఆ మేరకు వీరికి చెల్లించాల్సిన గ్రాట్యూటీ, పీఎఫ్, ఇతర చెల్లింపులు జరపాల్సిన అవసరం లేకపోవడంతో ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గినట్టయింది. రాష్ట్రం విడిపోవడంతో శాఖల వారీగా వేర్వేరు అకౌంట్లు ప్రారంభించినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు జరపలేకపోతున్నామని మార్గదర్శకాల మేరకే తాము పనిచేస్తున్నామని జిల్లా ట్రెజరీస్ డీడీ లలిత పేర్కొన్నారు. -
తిరుపతి కేంద్రంగా ‘ఆక్టోపస్’
రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తీవ్రవాదులను అణచివేయడానికి 400 మంది కమెండోలతో ఆక్టోపస్ విభాగం తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి పెరగనున్న మరింత భద్రత సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఆఫ్ కౌంటర్ టైస్ట్ ఆపరేషన్స్) రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఇప్పటికే ఆక్టోపస్ భద్రత కల్పిస్తున్న విషయం విదితమే. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుకానున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం, నిరోధించడం, తిప్పికొట్టడం కోసం హైదరాబాద్ కేంద్రంగా అక్టోబర్ 1, 2007న ఆక్టోపస్ ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఆక్టోపస్కు ఎంపిక చేసి, వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు గతంలో హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఏఆర్ పోలీసు విభాగంతో ఆలయానికి భద్రత కల్పించారు. ఆక్టోపస్ ఏర్పాటైన తర్వాత 90 మంది సభ్యులున్న ఒక దళం ప్రస్తుతం తిరుమ ల తిరుపతి దేవస్థానం భద్రతను పర్యవేక్షిస్తోంది. చిత్తూరు జిల్లాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనేకమార్లు హెచ్చరించాయి. పుత్తూరులోని ఓ ఇంట్లో తిష్టవేసిన ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్ను అక్టోబర్ 6, 2013న ఆక్టోపస్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే, తమిళనాడు సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత. ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు కేంద్ర నిఘా వర్గం గుర్తించింది. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆక్టోపస్ రంగంలోకి దిగి పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడి చేసి, వారి ఆట కట్టించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హిట్లిస్ట్లో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో.. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తెలంగాణకు కేటాయించారు. మన రాష్ట్రంలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిని పరిశీలించారు. చివరకు తిరుపతిలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుమలలో నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తే.. అక్కడే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్న ఆ విభాగం ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని రేణిగుంట, చంద్రగిరిల్లో ఆక్టోపస్కు భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంటకు సమీపంలో విమానాశ్రయం ఉంది. ఎక్కడైనా తీవ్రవాదుల దాడులు జరిగితే.. అక్కడికి తక్షణమే చేరుకోవాలంటే విమానాశ్రయానికి సమీపంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆక్టోపస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో రేణిగుంట పరిసర ప్రాంతాల్లో భూమిని ఆక్టోపస్కు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో కనిష్ఠంగా 400 మంది కమెండోలతో కూడిన నాలుగు దళాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ భద్రతకు ఒక దళాన్ని కేటాయిస్తారు. తక్కిన మూడు దళాలను తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి వినియోగించనున్నారు. -
‘విభజన’ హామీలు నెరవేరతాయి: గవర్నర్
తిరుమల: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలనూ కేంద్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నొక్కిచెప్పారు. ఆంధప్రదేశ్కు ప్రత్యేక హోదా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఉమ్మడి పరీక్షల విధానం ఇలా అన్నీ అమలవుతాయని, ఎలాంటి సందేహమూ అవసరం లేదని అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 14 రోజులు పూర్తయిందని, హైదరాబాద్లో నివసించే తెలుగువారితోపాటు తమిళం, బెంగాలి, మార్వాడీలు ఇలా అన్ని ప్రాంతాల వారికీ పూర్తి రక్షణ ఇస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏడుకొండల వేంకటేశ్వరుడిని ప్రార్థించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల గవర్నర్ పదవి ఎలా ఉందన్న ప్రశ్నకు ‘ఆ వేంకటేశ్వరుడినే అడగండి’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. -
ఖజానా ఖాళీ
మండపేట : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వారాలకు పైగా కార్యకలాపాలేవీ జరగకపోవడంతో ఖజానాలు ఖాళీ అయ్యాయి. దాంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా ఇంకా ఏ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఒక ప్రధాన ఖజానా కార్యాలయంతో పాటు 18 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులతో పాటు ఖజనా శాఖను ప్రభుత్వం రెండుగా విభజించింది. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర విభజనకు ముందుగానే ఖజానాల కార్యకలాపాలను స్తంభింపజేశారు. ప్రభుత్వోద్యోగులకు గత నెల 24వ తేదీనే జీతాలు చెల్లించేశారు. 27వ తేదీ నాటికి చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసి ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. సర్వర్లను నిలిపివేసి ఖాతాల్లో నిధులు లేకుండా చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈనెల 2వ తేదీ నుంచి కొత్త ఖాతాలు తెరిచి లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఖజనాల్లో ఏ విధమైన నిధులు జమకాలేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను ట్రెజరీల ద్వారానే పొందాల్సి ఉంటుంది. అలాగే చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల సొమ్ములను అక్కడి నుంచే డ్రా చేయాలి. ఖాతాల్లో నిధులు లేకపోవడం, బిల్లుల చెల్లింపునకు అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కొందరికి జీతాల్లేవ్ ఖజానాను మూసివేసే క్రమంలో గత నెలలో 24వ తేదీ నాటికే ఉద్యోగులకు జీతాలు చెల్లించేశారు. అయితే ఎన్నికల విధులు, విభజనకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడం తదితర పనుల్లో బిజీగా ఉన్న కొందరు ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టలేదు. జూన్ 2న ఖజానా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాక బిల్లులు పెట్టి జీతాలు తీసుకోవచ్చని వారు భావించారు. కాగా నేటికీ ఖజానా కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడం వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలువురు పింఛన్దారులు కూడా బిల్లులు పెట్టలేదని తెలుస్తోంది. త్వరితగతిన ఖజనాల్లో కార్యకలాపాలు పునరుద్ధరించాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు. -
రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలి’’ అని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల్లో జరిగినట్లే సినీరంగంలో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. దీనిలోని ఆంతర్యమేంటో బయటపెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ వివక్ష తగదు. ఇక్కడి నిర్మాతల సంఖ్య పెంచుకోవడం కోసం, తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి’’ అని కోరారు. తెలంగాణ నేలపై సినిమాలు తీస్తూ, తెలంగాణవారి సినిమాను ఓ ప్రాంతీయ సినిమాగా అభివర్ణించడం సరికాదని, ఇలాంటి చర్యలు తక్షణం విడనాడి తెలంగాణ సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్గోపాల్వర్మ తక్షణం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయాక సినీ పరిశ్రమ కలిసి ఉండటం అసాధ్యమని సంగిశెట్టి దశరథ పేర్కొన్నారు. ఇంకా ప్రేమ్రాజ్, కుమార్ మాట్లాడారు. -
‘ఇంటర్’లో విభజన ఉన్నట్టా.. లేనట్టా?
బోర్డు విభజన విషయంపై గందరగోళం హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఇంటర్బోర్డును కూడా విభజించారా లేదా అన్న విషయంలో అసందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ప్రభుత్వ వైఖరి కారణంగా సాక్షాత్తూ ఓ ఐఏఎస్ అధికారే గందరగోళంలో పడ్డారు. ఇంటర్మీడియెట్ బోర్డు రెండు రాష్ట్రాలకు ఏడాది వరకు సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే పాలనాపరమైన అవసరాల దృష్ట్యా బోర్డును విభజించాల్సిందేనని ప్రభుత్వం విభజన కమిటీకి గతంలోనే ప్రతిపాదనలు పంపినా.. దానిపై ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బాధ్యతలను ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటే, ఇంటర్విద్య, సాంకేతిక విద్య, కళాశాలవిద్య కమిషనర్గా కూడా ఆమెకే బాధ్యతలు అప్పగించింది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిగా మినహా ఇతర బాధ్యతలను, బుధవారం ఇంటర్ విద్యకు సంబంధించిన బాధ్యతలను ఆమె స్వీకరించారు. విభజనకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు అక్కడ జరగకపోవడంతో సెకండరీ విద్య ముఖ్యకార్యదర్శిగా పని చేసిన రాజేశ్వర్ తివారీని, విభజన వ్యవహారాల కమిటీకి నేతృత్వం వహించిన టక్కర్ను ఆమె సంప్రదించారు. బోర్డు విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకునే వరకూ ఆగాలని వారు సూచించారు. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేసిన పత్రాన్ని తీసుకుని తిరిగి వెళ్లిపోయారు. -
ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు
సచివాలయంలో ఉద్యోగుల స్థానం మార్పు - ఆంధ్రాకు చెందిన 99 మంది తెలంగాణకు - తెలంగాణకు చెందిన 127 మంది ఆంధ్రాకు - తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులూ ఆంధ్రాకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఉద్యోగుల పేర్లు, వారి హోదాతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఆదేశాల ప్రకారం నాల్గో తరగతి ఉద్యోగులు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని 774 మంది ఉద్యోగులను తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు కేటాయించారు. ఇందులో ఆంధ్రాకు చెందిన 99 మంది ఉన్నారు. అలాగే తెలంగాణకు చెందిన 127 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం తెలంగాణకు చెందిన ఉద్యోగులే ఎక్కువ మంది ఆంధ్రపదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి వస్తోంది. నాల్గో తరగతి ఉద్యోగులు సచివాలయంలో 595 మంది ఉండగా, వారిలో 35 మంది తప్ప మిగతా వారంతా తెలంగాణకు చెందినవారే. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ సచివాలయానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్య ప్రకారం.. అదనపు కార్యదర్శులు ముగ్గురు, సంయుక్త కార్యదర్శులు ముగ్గురు, ఉప కార్యదర్శులు 24 మంది, సహాయ కార్యదర్శులు 55, సెక్షన్ ఆఫీసర్లు 239, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 348, ప్రైవేట్ కార్యదర్శులు 34, ప్రత్యేక స్టెనోలు 10, సీనియర్ స్టెనోలు ముగ్గురు, జూనియర్ స్టెనోలు 12, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు 14, డీఆర్టీ అసిస్టెంట్లు 29 మంది ఉన్నారు. 1. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిన తెలంగాణకు చెందినవారు: ఇద్దరు అదనపు కార్యదర్శులు, ఇద్దరు ఉప కార్యదర్శులు, 75 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు, 29 మంది టీఆర్టీ అసిస్టెంట్లు ఉన్నారు. 2. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు: ముగ్గురు జూనియర్ స్టెనోలు, ముగ్గురు సీనియర్ స్టెనోలు, నలుగురు ప్రత్యేక స్టెనోలు, పది మంది ప్రైవేట్ కార్యదర్శులు, 78 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు 3. తెలంగాణ సచివాలయం, వివిధ విభాగాలు, చట్టసభల్లో పనిచేసే ఉద్యోగులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయిన ఉద్యోగులందర్నీ తక్షణమే రిలీవ్ చేయాలనీ, లేని పక్షంలో సంబంధిత శాఖల అధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింటెడ్ డే నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఉద్యోగుల విభజనకు సంబంధించి కసరత్తు ప్రారంభించినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఉద్యోగులను తాత్కాలిక పద్దతిలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
9లోగా అప్పగింతలు పూర్తి!
శాఖల నుంచి రోజూ పురోగతిపై సీఎస్లకు నివేదికలు {పస్తుత పోస్టుల్లోనే విభజన తర్వాతా కొనసాగింపు సీఎస్ పి.కె.మహంతి ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అప్పగింతలు సోమవారం నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులకు బాధ్యతల అప్పగింత, స్వీకరణలకు వారం రోజుల గడువు విధించారు. రెండు రాష్ట్రాల మధ్య ఫైళ్లు, ఆస్తులు తదితర అధికార అప్పగింతలకు ప్రణాళికను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుత (కరెంట్) ఫైళ్లు, మూసివేసిన ఫైళ్లు, ఉమ్మడి ఫైళ్లు, ఆస్తుల అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఈ అప్పగింతల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదని, ఫైళ్లు ఎవరికి అప్పగించిందీ పేర్కొంటూ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖాధిపతులే అధికారిక మార్పిడి అప్పగింతలు సజావుగా సాగుతున్నాయా లేదా అనేదీ పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఫైళ్లు సాఫ్ట్ కాపీతో ప్రింట్నూ అప్పగించాలని సూచించారు. అలాగే ప్రతీ విభాగంలోని ఓపీ సెక్షన్ ఆఫీసర్ నుంచి అప్పగింతలు పూర్తి అయినట్లు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ను ఉద్యోగులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అది సమర్పించేవరకు ఆయా ఉద్యోగులకు జూన్ నెల వేతనం చెల్లంచరని వెల్లడించారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రతి రోజూ అప్పగింతల పురోగతిపై రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నివేదిక సమర్పించాలని సూచించారు. ఈనెల 9లోగా అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయించిన బ్లాకుల్లో ఆయా ఉద్యోగులకు వసతి కేటాయించాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సబ్జెక్టుల కేటాయింపు కూడా కార్యదర్శులే చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులు, మిగతా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా పనిచేసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులను కోరారు. అలాగే కార్యాలయాల్లో ఫర్నిచర్ తక్కువైతే సాధారణ నిబంధనల మేరకు కొనుగోలు చేసుకోవాలని, టెలిఫోన్, ఫ్యాక్స్, కంప్యూటర్లు, ప్రింటర్లు తప్పనిసరిగా ఉండేలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పోస్టుల్లోనే విభజన తరువాత కూడా కొనసాగుతారని, ఎటువంటి మార్పూ ఉండదని పేర్కొంటూ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇద్దరు సీఎంల కనుసన్నల్లోనే
శాశ్వత విభజన పంపిణీలన్నీ వారి ఆధ్వర్యంలోనే.. - పంపిణీ చేయాల్సిన మొత్తం రాష్ట్ర కేడర్ పోస్టులు 65 వేలు మాత్రమే - ఇందులో ఖాళీలు 18,000 పోను ఉద్యోగుల పంపిణీ 47 వేలు మాత్రమే - శాశ్వత పంపిణీ అయ్యే వరకు రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర కేడర్ పోస్టుల పదోన్నతులు బంద్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల శాశ్వత పంపిణీ దగ్గర నుంచి విభజనకు సంబంధించిన ఇతర పంపిణీలన్నీ ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కనుసన్నల్లోనే జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మూడు నెలల గడువు విధించగా రికార్డు సమయంలో విభజన లెక్కలు కొలిక్కితెచ్చారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ప్రక్రియకు కేంద్రం ఏడాది పాటు సమయమిచ్చింది. ఇప్పుడు మూడు నెలలే గడువు ఇవ్వగా, విభజన తేదీ ఖరారైన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఆ ఎన్నికల నిర్వహణతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా సమాంతరంగా పనిచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని స్థాయిల్లో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల సంఖ్య 65 వేలుగా ఆర్థికశాఖ తేల్చింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ ఉద్యోగుల స్థానికత, పోస్టుల మంజూరు, సీనియారిటీ లెక్కలను సేకరించడంలో కీలక పాత్ర నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో తక్కువ సమయంలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగుల వివరాలను సేకరించగలిగామని, ఈ విభజన పని కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో రమేశ్ శనివారం తనను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మిగతా వారంతా ఆంధ్రా సర్కారులో పనిచేస్తున్నట్లే... ప్రస్తుతం సచివాలయంతో పాటు రాజధానిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని రమేశ్ పేర్కొన్నారు. శాశ్వత పంపిణీ అయ్యేవరకు మిగతా ఉద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తారన్నారు. ఐఏఎస్ అధికారుల్లో 44 మందిని తెలంగాణలో పనిచేయడానికి తాత్కాలికంగా కేటాయించారని, శాశ్వత పంపణీ అయ్యేవరకు మిగతా ఐఏఎస్ అధికారులందరూ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నట్లేనని ఆయన వివరించారు. ఉద్యోగుల స్థానికతకు రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రామాణికంగా తీసుకున్నామని, సంబంధిత శాఖాధిపతుల నుంచి స్థానికత, సీనియారిటీలపై లిఖిత పూర్వకంగా సర్టిఫికేషన్ తీసుకున్నామని ఆయన తెలిపారు. సచివాలయంలో సింగిల్ యూనిట్ శాఖల్లో 193 మంది స్థానికతపై అభ్యంతరాలు వస్తే రికార్డులన్నింటినీ పరిశీలించామని.. అభ్యంతరాల్లో వాస్తవం లేదని తేలిందని వివరించారు. తాత్కాలిక కేటాయింపులపై కూడా అభ్యంతరాలుంటే రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చునని.. వాటిపై కేంద్రం కూడా పక్షం రోజుల్లో పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు. శాశ్వత పంపిణీ పూర్తయ్యే వరకూ పదోతన్నతుల్లేవు... పంపిణీ పరిధిలోకి వచ్చే రాష్ట్ర కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులెవరికీ శాశ్వత పంపిణీ పూర్తయ్యే వరకు పదోన్నతులు ఇవ్వరాదని, అలాగే ఆ పోస్టుల స్థాయిని మార్చరాదని రమేశ్ స్పష్టంచేశారు. ఇది రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పోస్టులకు వర్తిస్తుందని తెలిపారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీకి ఆరు నెలల నుంచి ఏడాది పాటు సమయం పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీకి మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం జారీ చేస్తుందని, దాని ప్రకారం కమలనాథన్ కమిటీ రెండు రాష్ట్రాల్లో ప్రతి విభాగంలో కేడర్ సంఖ్యను, సీనియారిటీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల తుది పంపిణీ చేస్తుందని వివరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కేవలం రాష్ట్ర కేడర్ పోస్టులను మాత్రమే విభజించాలని చెపుతోందని ఆయన పేర్కొన్నారు. ‘ఓపెన్’ నియామక ఉద్యోగులు ఎక్కడివారక్కడే... ఇరు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరిల్లో నియామకమైన ఉద్యోగుల పంపిణీ ఉండదని, ఎక్కడి వారు అక్కడే పనిచేయాల్సి ఉందని రమేశ్ తెలిపారు. ఒక వేళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని ఓపెన్ కేటగిరిలో రిక్రూట్ అయిన ఉద్యోగులను ఎవరి ప్రాంతాలకు వారిని బదిలీ చేసుకోవాలనుకుంటే సాధ్యం అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. వివిధ కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో నియామకమైన ఉద్యోగులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల వివరాలివీ... - సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12.49 లక్షల ప్రభుత్వ పోస్టులున్నాయి. ఇందులో 2.57 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 9.92 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. - వీటిలో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 65,000 - మల్టీ జోనల్ పోస్టులు 6,600 - జోనల్ పోస్టులు 1.43 లక్షలు - జిల్లా కేడర్ పోస్టులు 10.32 లక్షలు - రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 65 వేలల్లో 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 47 వేల పోస్టులను మాత్రమే రాష్ట్ర విభజనలో పంపిణీ చేయనున్నారు. - ఆర్థికశాఖ లెక్కల ప్రకారం రాజధానిలోని శాఖాధిపతుల్లో ఆంధ్రప్రదేశ్కు మంజూరైన పోస్టుల కన్నా 2,360 మంది ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అదే తెలంగాణకు మంజూరైన పోస్టుల కన్నా 3,731 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. - సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కు మంజూరైన పోస్టుల కన్నా 499 మంది ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అదే తెలంగాణకు మంజూ రైన పోస్టుల కన్నా 548 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. -
నీటి విడుదలపై ప్రత్యేక కమిటీ
సాక్షి, హైదరాబాద్: నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు అయ్యే వరకు ఈ కమిటీ మనుగడలో ఉంటుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వి. నాగిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటారు. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇరు రాష్ట్రాల జెన్కో డెరైక్టర్లు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అయితే నీటి విడుదల విషయంలో పాత విధానం (ఇప్పటి వరకు అమలులో ఉన్న) ప్రకారమే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వరద నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత కూడా ఈ కమిటీ కిందకే రానుంది. కాగా కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలా? వద్దా ? అనే విషయాన్ని ఈ కొత్త కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ వరద జలాలపై ఆధారపడి ఉండడంతో నికర జల కేటాయింపులు లేవు. దాంతో వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం, సాగర్, జూరాల, బీమా, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, డెల్టాలకు నీటి విడుదల షెడ్యూల్ను ఈ కమిటీ ప్రకటించనుంది. అలాగే చెన్నై, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు మంచినీటి విడుదలను కూడా కమిటీయే పర్యవేక్షించనుంది. -
ఉద్యోగ సంఘాల మధ్య సమసిన వివాదం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న వివాదానికి ప్రభుత్వ పెద్దలు ముగింపు పలికారు. తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్లో అసోసియేషన్ కార్యాలయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి ముగింపు దొరికింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్లో ఉన్న కారణంగా శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మండిపడింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించడంతో ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చూసేందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
లోకాయుక్త, హక్కుల సంఘం సంగతేంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు విభాగాలు, సంస్థల విభజనపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో లోకాయుక్త, ప్రజాహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా మారిన మానవహక్కుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తున్న పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ), ప్రభుత్వ భూముల దురాక్రమణను నియంత్రించేందుకు దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటైన భూ ఆక్రమణల నియంత్రణ ప్రత్యేక కోర్టు, వినియోగదారుల హక్కులను పరిరక్షించే రాష్ట్ర వినియోగదారుల ఫోరం సహా అనేక సంస్థల విషయంలో స్పష్టత కరువైంది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి ఇవి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా పనిచేస్తాయా లేక ప్రత్యేకంగా ఏర్పాటవుతాయా? అన్నది అయోమయంగా మారింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత లేని కారణంగా ఈ సంస్థల నిర్వహణ గందరగోళంగా మారనుంది. ఏ రాష్ర్ట ప్రభుత్వ పరిధిలో అవి విధులు నిర్వహించాలి? ఈ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఎవరు చెల్లించాలి? తదితర అంశాలపై ఇప్పటికీ ఏమీ తేల్చలేదని న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా విధులు నిర్వహించేలా చట్టంలోని పదో షెడ్యూల్లో దాదాపు 107 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను చేర్చారు. ఇందులో లోకాయుక్త, హక్కుల కమిషన్ సహా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే 38 సంస్థలను మాత్రం చేర్చలేదు. అయితే రెండు రాష్ట్రాలకు వీటిని విభజించడం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. దీంతో సదరు సంస్థలను పదో షెడ్యూల్లో చేర్చాలని గవర్నర్ నరసింహన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ రూపంలో కేంద్రం ఈ సంస్థలను 10వ షెడ్యూల్లో చేర్చకపోతే జూన్ 2 తర్వాత వాటి నిర్వహణ ఇబ్బందిగా మారనుంది. కాగా, 10వ షెడ్యూల్లో చేర్చిన సంస్థల సంఖ్య ఇప్పటికే దాదాపు 150కి చేరడంతో ఈ సంస్థల నిర్వహణ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లోకాయుక్త, హక్కుల కమిషన్ వంటి న్యాయ సంస్థల విషయంలో కేంద్ర ం వెంటనే స్పష్టతనివ్వాల్సి ఉందని హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి అభిప్రాయపడ్డారు. -
సేవలు బంద్
నేటి నుంచి మూడు రోజుల పాటు సబ్రిజిస్ట్రార్,రవాణా శాఖల్లో నిలిచిపోనున్న సేవలు రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్వర్ల మార్పే కారణం వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఏపీ 27 యథాత థం ఒంగోలు టౌన్ రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖతో పాటు, రవాణా శాఖలో నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు లావాదేవీలు జరగవని ఆయా శాఖల అధికారులు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం, రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి విడివిడిగా కంప్యూటర్లలో సర్వర్లు మార్పు చేస్తుండటం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. కంప్యూటర్లకి సంబంధించి ఆన్లైన్లో సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేయడానికి ఈ మూడు రోజుల వ్యవధి అధికారులు తీసుకుంటున్నారు. జిల్లాలోని 18 సబ్రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఈసేవా, మీసేవా కేంద్రాల్లో కూడా ఎలాంటి ఈసీలు, నకళ్లతో పాటు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండవు. జిల్లా రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ యథాతథం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ ఏపీ 27 యథాతథంగా ఉంటుందని జిల్లా రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో ఎనిమిది చెక్పోస్టులు అదనంగా వచ్చాయన్నారు. నాగార్జునసాగర్ వద్ద ఒకటి, మాచర్ల వద్ద మరో చెక్పోస్టు మనకు దగ్గరలో రానున్నాయన్నారు. మొత్తం మీద కొత్త రాష్ట్రానికి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాలు తెలంగాణ జిల్లాలతో కలిసే చోట చెక్పోస్ట్లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. -
తాత్కాలిక కేటాయింపులే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాము చేసే తాత్కాలిక కేటాయింపుల మేరకు ఇరు ప్రాంత ఉద్యోగులు పని చేయాల్సిందేనని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆప్షన్లు ఇవ్వాలన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు గానీ.., స్థానికత, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకుగానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్థానికత ఆధారంగా చేస్తామని చెబుతున్నా.. రెండు రాష్ట్రాల్లో పరిపాలన అవసరాల దృష్ట్యా పని చేస్తున్న వారినే విభజించాల్సి వస్తోందని సీఎస్ పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేశామని చెబుతూ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలో పడ్డాయి. సమావేశం నుంచి బయటకు వస్తూనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కడి వారు అక్కడే పనిచేసేలా చర్యలు చేపట్టాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. పని చేస్తున్న ఉద్యోగుల ఆధారంగానే: సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాల్లో మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో విభజించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో కొందరు కొందరు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో శాశ్వత కేటాయింపులు ఉంటాయని, అంతవరకు ఈ కేటాయింపులు వర్తిస్తాయని సీఎస్ స్పష్టంచేశారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల విషయంలో ఎక్కడివారిని అక్కడే పనిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణకు నోచుకుంటుందోనని సంఘాల నేతలే చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు కొలువుదీరాక కేంద్రం ఏర్పాటు చేసే సమన్వయ కమిటీ ప్రత్యేకంగా గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సెల్ ఉద్యోగుల సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తుందని హామీనిచ్చింది. కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే జూన్ 9లోపు తెలపాలని పేర్కొంది. కాగా, జూన్ 1 తేదీనే తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్గా ఎం.మహేందర్రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడనున్నాయని తెలిసింది. సీఎస్తో జరిగిన భేటీలో టీఎన్జీవో, టీజీవో, ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకత లేదు: దేవీప్రసాద్ ఉద్యోగుల విభజనలో పారదర్శకత లేదని, ఎంతమంది ఉద్యోగులు ఎటు వెళ్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. కేంద్రం సరైన సమయంలో మార్గదర్శకాలను ఇవ్వలేదని, పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా విభజన చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. చాలా మంది సీమాంధ్ర ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని, కమలనాథన్ కమిటీకి ఈ వివరాలు అందజేశామని చెప్పారు. జూన్ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు ఒకటిన్నర రోజు వేతనం.. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ ఒకటిన్నర రోజు వేతనాన్ని (దాదాపు రూ.60 కోట్లు) విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో ఒకరోజు వేతనం తెలంగాణ ప్రభుత్వానికి (ముఖ్యమంత్రి సహాయ నిధికి), సగం రోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవీ ప్రసాద్ తెలిపారు. మళ్లీ తీసుకువస్తాం: శ్రీనివాస్గౌడ్ తెలంగాణ ఉద్యోగులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాల్సి వచ్చినా వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువస్తామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం వ్యవస్థాక అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీమాంధ్రులు కూడా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలన్నారు. ముందుగా ఇవ్వాల్సింది: విఠల్ కేంద్ర మార్గదర్శకాలను ముందుగా ఇస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది సీమాంధ్రులు ఇక్కడే ఉండే పరిస్థితి వచ్చిం దన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు. స్థానికేతరుల్లో వేల మంది టీచర్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన వేల మంది టీచర్లు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉన్నారని పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే స్థానికేతరులు 50 శాతానికిపైగా ఉన్నారన్నారు. -
సేవలకు సెలవు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. మూడు రోజులపాటు ఈ సేవలు ప్రజలకు అందే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూన్ రెండు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్నందున రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అన్ని శాఖలకు చెందిన కొత్త అకౌంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లు కేటాయించి ఆన్లైన్లో అనుసంధానం చేసేందుకు వీలుగా అన్ని శాఖల సేవలను నిలిపివేశారు. ఈ నెల 31, జూన్ ఒకటి తేదీల్లో సేవలు నిలిపివేస్తామని.. రెండో తేదీన అవి పునఃప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ.. ఆరోజు కార్యాలయాలు తెరిచి సర్వర్లు ఆన్ చేసి.. ఖాతాలు, కోడ్ నెంబర్లు తెలుసుకునేసరికే పుణ్యకాలం గడిచిపోతుందని, అందువల్ల ఆ రోజు కూడా సేవల పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా మీ సేవ, ఈ సేవ కేంద్రాలు పని చేయకపోవడం వల్ల దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. దీంతోపాటు మున్సిపల్, రిజిస్ట్రేషన్, రవాణా సేవలు శుక్రవారం సాయంత్రం పనివేళలు ముగిసిన వెంటనే నిలిచిపోయాయి. ఖజానా శాఖలో మార్పుచేర్పుల కోసం నాలుగు రోజుల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల బిల్లుల స్వీకరణ, చెల్లింపులు నిలిచిపోయాయి. కొత్త ఖాతాలు ప్రారంభమయ్యే వరకు చెల్లింపులు జరగవని తెలియడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందించే సేవలు.. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తనఖాలు, వివాహా ధ్రువపత్రాలు, ఈసీలు, నకళ్ల జారీ వంటి సేవలు కూడా స్తం భించాయి. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడే అవకాశముంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోనుంది. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మెజారిటీ ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. అత్యధిక ప్రభుత్వ శాఖల లావాదేవీలను ఈ కేంద్రాలతో అనుసంధానం చేయడం వల్ల గత రెండేళ్లుగా ప్రజలు అన్ని రకాల సేవలను వీటి ద్వారానే పొందుతున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు శాఖలతోపాటు పలు ఇతర శాఖల సేవలకు సంబంధించి సుమారు వంద రకాల సేవలు మీ సేవ ద్వారానే అందుతున్నాయి. జూన్ రెండో తేదీ వరకు ఇవన్నీ నిలిచిపోతాయి. జూన్రెండు ఆ తరువాత కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లతో పునఃప్రారంభమవుతాయి. -
ఆర్థిక లోటు పూడ్చండి
కేంద్రానికి చంద్రబాబు వినతి {పధాని, కేంద్ర మంత్రులతో భేటీ సీమాంధ్రకు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని విజ్ఞప్తి {పమాణ స్వీకారానికి రావాలని ప్రధానికి, మంత్రులకు ఆహ్వానం తెలంగాణ సీఎంకు ఆహ్వానంపై ‘చూద్దాం’ అన్న బాబు న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు దాదాపు రూ.13,579 కోట్ల లోటు ఏర్పడుతుందని, దీనిని పూడ్చాలని నూతన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ భవన్లో రెండు విడతలుగా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రితోపాటు హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను, ప్రణాళిక శాఖ మంత్రి జితేందర్సింగ్ను, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్రెడ్డిని కలిసినట్లు తెలిపారు. తన ప్రమాణస్వీకారానికి రావడంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులను కేంద్ర మంత్రులందరికీ వివరించా. విభజన ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. అప్పులను, విద్యుత్తును జనాభా ప్రాతిపదికగా విభజించారు. ఆస్తులను భౌగోళికంగా ఇచ్చేశారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ వల్ల తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. సీమాంధ్రకు మాత్రం వచ్చే 9 నెలల్లోనే భారీ లోటు ఏర్పడనుంది. ఒక పక్క అప్పు క డుతూ మరోపక్క ఆదాయం సంపాదించాలి. దీన్ని ఎలా చేయాలని ఒక్క మాట కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేశారు. ఈ లోటును పూడ్చాలని ఆర్థిక మంత్రిని కోరాం. తగిన ఆర్థిక రక్షణ కల్పించాలని ఆర్థిక సంఘం చైర్మన్ను కోరాం. విభజన సమయంలో పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. ఈ మూడింటినీ తక్షణం అమలు చేయాలని కోరాం. ఇప్పటివరకు ఉన్న హామీల అమలుకు ఒక సెల్ వేసి మానిటరింగ్ చేయాలని ప్రధానిని కోరాం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు. టీఆర్ఎస్ కావాలని రాద్ధాంతం చేసింది’ అని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్ కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. నిర్దిష్ట కాలపరిమితితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, చత్తీస్గఢ్లకు ఇచ్చినట్లుగానే ముందుగా సీమాంధ్రకు 30 టీఎంసీల నీళ్లివ్వాలని కోరామన్నారు. విభజన సవ్యంగా సాగేలా చూడాలని రాజ్నాథ్సింగ్ను కోరినట్లు చెప్పారు. ఐఐటీ, తదితర సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విభజన తరువాత కరెంటు నష్టాలను సర్దుబాటు చేయాలని విద్యుత్తు మంత్రి పియూష్ గోయల్ను కోరామన్నారు. గంగవరంలో ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణం, పెట్రోలియం కారిడార్ పునరుద్ధరణ చేపట్టాలని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కోరినట్లు చెప్పారు. త్వరగా పెటోల్రియం యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో త్వరగా హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరినట్లు చెప్పారు. రైతు రుణమాఫీపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో మాట్లాడినట్టు తెలిపారు. ‘వీటిపై రివ్యూ చేశాం. మళ్లీ చేస్తాం. అమలుకు కట్టుబడి ఉన్నా. తొలి సంతకం దానిపైనే చేస్తా’ అని చెప్పారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలుస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘చూద్దాం.. ’ అని బదులిచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టిస్తామని చెప్పారు. -
నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా
తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు వీలైనంతవరకు ఉద్యోగులు వారి రాష్ట్రానికే తెలంగాణ జాబితాలో లేని వారు ఆంధ్ర రాష్ట్రంలో.. సోమవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు వారి రాష్ట్రాల్లో విధుల్లో చేరాల్సిందే లీవులో వెళ్లినా, చేరకపోయినా శాశ్వతంగా పదోన్నతి కోల్పోతారు ఇద్దరు సీఎస్ల నేతృత్వంలో సమన్వయ కమిటీ రోజూ ఇద్దరు సీఎస్లకు విభజన అమలు నివేదికలు హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర విభజన నేపథ్యంలో వీలైనంత వరకు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించేందుకు ప్రభుత్వ ం కసరత్తు చేస్తోంది. శనివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేయాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ జాబితాలో లేని ఉద్యోగులంతా సీమాంధ్ర రాష్ట్రానికి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా సెలవు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి తెలంగాణలో పనిసే ఉద్యోగుల పేర్లతో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉద్యోగులు ఆదివారం ఆ ఉత్తర్వులను చూసుకుని సోమవారం ఉదయం 10 గంటలకల్లా వారికి కేటాయించిన చోట రిపోర్ట్ చేయాలి. మిగిలిన వారు సీమాంధ్ర కార్యాలయాల్లో పనిచేయాలి. ఉద్యోగులు వారికి కేటాయించిన రాష్ట్రంలో చేరకపోయినా, సెలవుపై వెళ్లినా ఆ ఉద్యోగి పదోన్నతిని కోల్పతారు. రెండో సారి ఇచ్చిన సమయంలోగా చేరకపోతే శాశ్వతంగా పదోన్నతిని కోల్పతారని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్ర విభజన సంధికాలంలో ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పనులపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం జారీ చేశారు. జూన్ 2న రెండు రాష్ట్రాలకు అన్ని రకాల అప్పగింతల బాధ్యత ప్రస్తుత విభజన కమిటీల్లో ఉన్న అధికారులు, ఆయా శాఖల అధికారులదేనని మార్గదర్శకాల్లో సీఎస్స్పష్టం చేశారు. విభజన అంశాలను రెండు రాష్ర్ట ప్రభుత్వాల తొలి మంత్రివర్గ సమావేశాల దృష్టికి తీసుకెళ్లడం, ఉమ్మడి కరెంట్ ఫైళ్లను ఇరు ప్రభుత్వాలకు అప్పగించే బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. జూన్ 2న సచివాలయంతోపాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగులందరూ ఎవరికి కేటాయించిన భవనాల్లోకి వారు కంప్యూటర్లు, ప్రింటర్లు, వాహనాలు, సెల్ఫోన్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. ఫర్నీచర్, ఎయిర్ కూలర్లు, జనరేటర్లు, ల్యాండ్ ఫోన్లను ఎక్కడివక్కడే ఉంచాలని చెప్పారు. రాష్ట్ర విభజనపై సమీక్షించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అపెక్స్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజూ విభజన అంశాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు రెండు రాష్ట్రాల సీఎస్లకు వివరించాల్సి ఉంది. తెలంగాణకు 44 మంది ఐఏఎస్ ల కేటాయింపు న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారుల్లో 44 మందిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి ఇది వర్తిస్తుంది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరు తెలంగాణ కేడర్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వారు కూడా తుది కేటాయింపుల ఉత్తర్వులు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కేడర్లో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది విభాగం సంయుక్త కార్యదర్శి పి.కె.దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారి పేరు బ్యాచ్ 1. డి.లక్ష్మీ పి. భాస్కర్ 1980 2. అశ్వినీ కుమార్ పరీద 1980 3. డాక్టర్ రాజీవ్ శర్మ 1982 4. కె.ప్రదీప్ చంద్ర 1982 5. శ్యాం కుమార్సిన్హా 1982 6. వినోద్ కుమార్ అగ్రవాల్ 1983 7. బిబూ ప్రసాద్ ఆచార్య 1983 8. టి.రాధ 1983 9. వి.నాగిరెడ్డి 1984 10. జె. రేమండ్ పీటర్ 1984 11. శైలేంద్ర కుమార్ జోషి 1984 12. అజయ్ మిశ్రా 1984 13. సురేష్ చందా 1985 14. హీరాలాల్ సమారియా 1985 15. ఎస్.నర్సింగ్రావు 1986 16. బి.అరవిందరెడ్డి 1986 17. బి.ఆర్.మీనా 1986 18. పూనం మాలకొండయ్య 1988 19. విజయకుమార్ 1988 20. సునీల్ శర్మ 1990 21. కె.రామకృష్ణ రావు 1991 22. హర్ప్రీత్ సింగ్ 1991 అధికారి పేరు బ్యాచ్ 23. జయేష్ రంజన్ 1992 24. వికాస్ రాజ్ 1992 25. బి.వెంకటేశ్వర రావు 1993 26. ఎన్.శివశంకర్ 1993 27. ఎం.జగదీశ్వర్ 1993 28. బి.కిశోర్ 1993 29. సి.పార్థసారథి 1993 30. వి.ఎన్.విష్ణు 1993 31. ఆర్.వి.చంద్రవదన్ 1993 32. సవ్యసాచి ఘోష్ 1994 33. జి.డి.అరుణ 1994 34. బి.వెంకటేశం 1995 35. వి.అనిల్కుమార్ 1995 36. సంజయ్కుమార్ 1995 37. బి.మహేష్ దత్ ఎక్కా 1995 38. బి.జనార్దన్రెడ్డి 1996 39. ఎల్.శశిధర్ 1996 40. లవ్ అగర్వాల్ 1996 41. శైలజా రామయ్యర్ 1997 42. ఎన్.శ్రీధర్ 1997 43. ఎ.అశోక్ 1997 44. అహ్మద్ నదీం 1997 -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల వాగ్వాదం
కార్యాలయం కేటాయింపుపై ఘర్షణ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం తోపులాట, వాగ్వాదం జరిగింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్లో ఉంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించారు. దీనికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. దీనిపై టీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు స్పందిస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని, ఇవన్నీ ఎవరో కావాలని సృష్టిస్తున్నారని చెప్పారు. -
విద్యాసంస్థలపై విభజన ఎఫెక్ట్
- తెలంగాణ నుంచి ఇంటర్ అడ్మిషన్లు నిల్ - జిల్లాలో ఒక్కసారిగా పడిపోయిన వైనం - కార్పొరేట్ హాస్టళ్లలో భర్తీకాని సీట్లు - పెరిగిన రాయలసీమ ప్రాంత విద్యార్థులు గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన ప్రభావం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతోపాటు విద్యాసంస్థలపైనా పడింది. విద్యారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యను అభ్యశించేందుకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రతి యేటా దాదాపు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు చెందిన హాస్టళ్లలో ఉండి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో విద్యనభ్యశిస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు పంపడం మానేశారు. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే తమ పిల్లలను వెంట పెట్టుకుని ఏప్రిల్, మే నెల మొదటి వారంలోనే తెలంగాణ జిల్లాల నుంచి తల్లిదండ్రులు ప్రతియేటా ఇక్కడికి వచ్చి కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అడ్మిషన్లు ఆశించినంతగా లేక కళాశాలలు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమ కాలంలోనూ తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలను ఇక్కడే చదివించిన తల్లిదండ్రులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్లోని విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నట్లు సమాచారం. ఇంటర్ ఎంఈసీ, సీఏ శిక్షణ కోసం ఖమ్మం జిల్లా నుంచి ప్రతియేటా పెద్దసంఖ్యలో విద్యార్థులు వచ్చి తమ హాస్టల్లో అడ్మిషన్లు పొందేవారని ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని జిల్లా కేంద్రంలోని ఒక సీఏ విద్యాసంస్థ డెరైక్టర్ న్యూస్లైన్కు స్వయంగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తమ సంస్థ శాఖల్లో తెలంగాణ జిల్లాల నుంచి గతేడాది వరకు ఐదు వేల వంతున అడ్మిషన్లు ఉండగా, ప్రస్తుతం 1,500 దాటలేదని మరో కార్పొరేట్ కళాశాల ప్రతినిధి పేర్కొన్నారు. రాయలసీమ నుంచి అడ్మిషన్లు.. తెలంగాణ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియెట్లో చేర్పించేందుకు హైదరాబాద్కు పంపుతుండగా.. రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాకు అడ్మిషన్లు పెరుగుతున్నాయని సమాచారం. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి గతంలో హైదరాబాద్కు విద్యార్థులను పంపించగా, ప్రస్తుతం సీమ నుంచి హైదరాబాద్కు అడ్మిషన్లు తగ్గిపోయి గుంటూరు జిల్లా వైపు సంఖ్య పెరిగిందని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. -
పాత లారీ.. ఇక ఖాళీ
తాడేపల్లిగూడెం, న్యూస్లైన్ : ‘కొత్త రాష్ట్రం.. కొత్త హద్దులు.. అదిరిందయ్యూ చంద్రం’ అనుకోకండి... ‘కొత్త రాష్ట్రం.. బెదురేనయ్యూ చంద్రం’ అనక తప్పని పరిస్థితులు తలెత్తనున్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్రంగా ఉండబోతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే ముంచుకొస్తోంది. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయేందుకు ఇక మూడు రోజులే గడువు ఉంది. అపాయింటెడ్ డే రోజున రెండు రాష్ట్రాలకు సరిహద్దులు ఏర్పడనున్నాయి. ఆయా ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటవుతున్నాయి. కొత్త నిబంధనల కారణంగా రవాణా రంగంపై పర్మిట్ల రూపంలో అదనపు భారం పడనుంది. నేషనల్ పర్మిట్ (జాతీయ అనుమతి) గల రవాణా వాహనాలను మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తారు. దీనివల్ల వస్తు రవాణాతోపాటు ఎరువులు, ధాన్యం రవాణా భారంగా మారనుంది. పాత లారీల కథ కంచికే... ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలోని పాత లారీలు 10 టన్నుల సరుకుతో ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దుల మధ్య ఏ మూలకైనా వెళ్లివచ్చేవి. ఇకపై అలాంటి అవకాశం ఉండదు. సీమాంధ్ర సరిహద్దుల్ని దాటి తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లాలంటే లారీల వంటి భారీ వాహనాలకు నేషనల్ పర్మిట్ ఉండి తీరాల్సిం దే. ఉదాహరణకు మన జిల్లాలోని జీలుగుమిల్లి, చింతలపూడి వంటి ప్రాంతాల నుంచి కూతవేటు దూరంలో గల అశ్వారావుపేటకు సరుకులు తీసుకువెళ్లాలంటే నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. లేదంటే.. కనీసం వారం రోజులలోపు మనుగడలో ఉండే తాత్కాలిక పర్మిట్ను రూ.వెయికి పైగా వెచ్చించి తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు రెండు రాష్ట్రాల మధ్య తిరగాలంటే లారీలకు నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. నేషనల్ పర్మిట్ ఇవ్వాలంటే వాహనం వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. ఇలాంటి లారీకి సంవత్సరానికి రూ.25 వేలు వర కు పర్మిట్ చార్జీలు చెల్లించాలి. ఇంత మొత్తం చెల్లించడమంటే లారీ యజమానుల్లో అందరివల్లా అయ్యే పనికాదు. మరోవైపు 12 ఏళ్ల వయసు దాటిన పాత లారీలు ఇకపై ఖమ్మం జిల్లా వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండదు. అవి కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సీమాంధ్ర జిల్లాలకే పరిమితం కావాలి. దీనివల్ల వాటికి కిరాయిలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో 10వేలకు పైగా లారీలు ఉండగా, వాటిలో 75 నుంచి 80 శాతం లారీలు 12 ఏళ్లకు ముందు కొన్నవే. అందువల్ల వీటిలో చాలా లారీలు ఖాళీగా ఉండాల్సిందే. ఎరువుల రవాణా మరింత భారం యూరియా, కాంప్లెక్సు ఎరువులు ర్యాక్ పాయింట్ ఉన్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కు గూడ్స్ వ్యాగన్లలో వస్తుంటారుు. వాటిని ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు లారీల్లో పంపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బొగ్గు, ధాన్యం వంటి వాటిని తీసుకొస్తుం టారు. తెలంగాణలో కొత్త చెక్ పోస్టులు ఏర్పాటైతే రెండు రాష్ట్రాల చెక్ పోస్టుల వద్ద అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లారీల యజమానులపై అధిక భారం పడుతుంది. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా అసలే అంతంతమాత్రంగా ఉన్న రవాణా రంగంపై మోయలేని భారం పడనుంది. ఫలితంగా ఈ రంగం మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమా దం పొంచివుంది. రవాణా రంగం చితికిపోతుంది టైర్లు, లూబ్రికెంట్లు, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, టోల్గేట్ ఫీజుల వడ్డింపు కారణంగా రవాణా రంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. వీటికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త చెక్ పోస్టుల వద్ద చెల్లింపులు ఈ రంగాన్ని మరింత నష్టాల్లోకి తోసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విజయవాడ తర్వాత ఎక్కువ లారీలు తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. యజమానులే డ్రైవర్గా మారి బతుకు బండిని ఈడుస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజన వల్ల రవాణా రంగం పూర్తిగా చితికిపోతుంది. దీనిపై ఉభయ ప్రభుత్వాలు ఏదైనా ఒప్పందం చేసుకోవాలి. - గురుజు సూరిబాబు, కార్యదర్శి, తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్ -
మరింత జనబాహుళ్యం, వైశాల్యం మండలాలు @64
సాక్షి, రాజమండ్రి :బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టుకు ఒక ఆటంకం తొలగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు ప్రాంతాల విలీనం అంశానికి బుధవారం తెరపడింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేస్తూ ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రాజెక్టులో ఇది ఒక కోణం అయితే..గ్రామాల విలీనంతో ఉభయగోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో మరో నాలుగు మండలాలు కలవనున్నాయి. భౌగోళికంగా జిల్లా మరింతగా విస్తరించనుంది. విలీనం అయ్యే గ్రామాలు ముంపు ప్రాంతాలే అయినప్పటికీ ఆ ప్రజలకు జిల్లా పరిధిలోనే పునరావాసం కల్పిస్తారు. ప్రాజెక్టులో మొత్తం తొమ్మిది మండలాలు, వాటి పరిధిలోని 276 గ్రామాలు వాస్తవ అంచనాల ప్రకారం ముంపునకు గురవుతున్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలోనే ఏడు మండలాలకు చెందిన 205 గ్రామాలు ఉన్నాయి. గోదావరి తూర్పుగోదావరి, ఖమ్మం సరిహద్దు తీరంలో చింతూరు, వరరామచంద్రపురం, భద్రాచలం, కూనవరం మండలాలకు చెందిన 123 గ్రామాలు, పశ్చిమగోదావరి, ఖమ్మం సరిహద్దుల్లో కుకునూరు, బూర్గంపహాడ్, వేలేరుపాడు మండలాలకు చెందిన 82 గ్రామాలు ఉన్నాయి. వీటిలో బూర్గంపహాడ్లో ఐదు గ్రామాలు మినహా మిగిలిన 200 గ్రామాలను ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైనట్టేనని అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడంతో ఈ మండలాల్లోని ముంపు ప్రాంతాలే కాక మిగిలిన గ్రామాలు కూడా ఉభయగోదావరి జిల్లాల్లో అంతర్భాగం కాబోతున్నాయి. ఈ రకంగా మొత్తం 397 గ్రామాలు రెండు జిల్లాల్లో కలవనుండగా జిల్లాలోకి 308 జనావాసాలు వచ్చి చేరుతున్నాయి. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండున ఈ గ్రామా లు లేని తెలంగాణ మాత్రమే ఆవిర్భవించనుంది. ‘తూర్పు’న మార్పు ఇలా...: ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా 10,807 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 58 మండలాలు 1404 గ్రామాలతో, 51.51 లక్షల జనాభా కలిగి ఉంది. కొత్తగా మరో 308 గ్రామాలు విలీనం అయితే గ్రామాల సంఖ్య 1712 కానుంది. మండలాల సంఖ్య (రెండు అర్బన్ మండలాలతో కలిపి) 64కు పెరగనుండగా జనాభా అదనంగా సుమారు మరో 1.32 లక్షల మంది చేరి 52.83 లక్షలకు చేరుకోనుంది. ఇక జిల్లా వైశాల్యం మరో 2006 చదరపు కిలోమీటర్ల మేర పెరిగి 12,813 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. నిర్వాసితుల్లో 64 శాతం వరకూ గిరిజనులున్నారు. దీంతో జిల్లాలో గిరిజన ప్రాంతం, గిరిజన జనాభా కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు వల్ల 28 వేల కుటుంబాలకు చెందిన 1.20 లక్షల మంది నిర్వాసితులవుతుండగా వారిలో తూర్పులో సుమారు 3,000 కుటుంబాలకు చెందిన 12,000 మంది, పశ్చిమాన 2,200 కుటుంబాలకు చెందిన సుమారు 10,000 మంది ఉన్నారు. కాగా నిర్వాసితుల్లో 23 వేల కుటుంబాలకు చెందిన 98,000 మంది ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. కాగా వాస్తవంగా ఎన్ని గ్రామాలు ఏయే జిల్లాల్లో విలీనం అవుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆర్డినెన్సులోని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
నెల రాజులేనా?!
ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకున్నాం.. వేతనం తక్కువైనా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతామన్న ఆశతో పని చేస్తున్నాం.. ఇప్పుడు మా పరిస్థితేంటి?.. నెల రోజుల తర్వాత మా తలరాత ఎలా మారుతుంది??.. ఇవే ప్రశ్నలు వేలాది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిచేస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగటిల్లజేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరి కొనసాగింపుపై ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జూన్ నెలాఖరు వరకు త్రిశంకు స్వర్గంలోకి నెట్టేయడమే ఈ పరిస్థితికి కారణం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయ్యింది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. రాష్ట్ర విభజన వారికి అశనిపాతంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి నెలరోజుల గడు వు ఇచ్చినప్పటికీ వారిని కొనసాగిండంపై మా త్రం మాట దాటవేశా రు. భవిష్యత్తు రాజ కీయ, స్వప్రయోజనాల ను ఆశించే ఇలా చేశార న్న సందేహాలకు బలం చేకూరుతోంది. వేలాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ వ్యవహారం కలవరపరుస్తోంది. కొనసాగించమంటే మాట దాటేశారు... రాష్ట్ర విభజన నేపథ్యంలో గవర్నర్ నర్సింహన్ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఓ విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇరురాష్ట్రాలకు విభజించారు. కానీ ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత వారి పరిస్థితి ఏమిటన్నది తేల లేదు. నిబంధనల ప్రకారం జూన్ 2లోగా తమను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు పాక్షికంగానే ఫలించాయి. జూన్ నెలాఖరు వరకు మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ మేరకు జూన్ 30 వరకే బడ్జెట్ కేటాయించారు. జూలైనుంచి వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 8వేలమంది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, డ్వామాలలో దాదాపు 2,500 మంది, వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 500 మంది, రెవెన్యూ శాఖలో దాదాపు 150 మంది, ఆర్ అండ్ బి శాఖలో దాదాపు 150మందితోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ వీరు పని చేస్తున్నారు. కాగా జూన్ 30 వరకే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం వీరంతా ఆందోళన చెందుతున్నారు. దూరాలోచనతోనే... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా జూన్ నెలాఖరు వరకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకునేముందు టీడీపీ పెద్దలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సంప్రదించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న టీడీపీ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావించారు. టీడీపీ పెద్దలు ఏం చెప్పారో తెలీదు కానీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జూన్ నెలాఖరు వరకే పొడిగింపునివ్వడం గమనార్హం. అంటే ఆ తరువాత తాము సూచించినవారికి, తమ అనుయాయులకు అవకాశాలు కల్పించేందుకే టీడీపీ పెద్దలు ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం తమ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి తమవారికి అవకాశాలు కల్పించుకోవాలన్న దూరాలోచనతోనే వ్యవహరించినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తమ రాజకీయ ప్రయోజనాలు, తమవారిని అందలం ఎక్కించాలన్న వ్యూహం జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. తమను కొనసాగిస్తారో... వేటు వేస్తారో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. -
మే 31, జూన్ 1నరిజిస్ట్రేషన్లు బంద్
మీసేవలో ఈసీ, సీసీల జారీ కూడా ఉండదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న సెంట్రల్ సర్వర్ను ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున 30వ తేదీ సాయంత్రం 6 నుంచి సర్వర్ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో మీసేవ కేంద్రాల్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు(ఈసీలు), సర్టిఫైడ్ కాపీల(దస్తావేజు నకళ్లు) జారీ ప్రక్రియ ఆగిపోనుంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
క్లిష్ట సమయంలో బాగా పనిచేశారు
కలెక్టర్లకు మహంతి ప్రశంసలు హైదరాబాద్: రాష్ట్ర విభజన.. వరుస ఎన్నికలు వంటి సంక్లిష్ట సమయాల్లో అద్భుతంగా పనిచేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ప్రశంసించారు. ‘అత్యంత క్లిష్టమైన సమయాల్లో కష్టపడి పనిచేసిన మీకు, జిల్లాల అధికార యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ వారిని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో మహంతి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్రాల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. ‘ఐఏఎస్లకు ప్రాంతీయ పరిధులు లేవు. మీరు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రెండు రాష్ట్రాల ప్రగతి మీ చేతుల్లో ఉంది’ అని అన్నారు. ఈ సదస్సులో భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు సీనియర్ ఐఏఎస్లు పాల్గొన్నారు. విభజన అనంతరం కొత్తలో సమస్యలు ఉండవచ్చని, వాటి పరిష్కారంలో కలెక్టర్లు కీలక భూమిక పోషించాలని కృష్ణారావు సూచించారు. -
‘ఇందిరమ్మ’కు విభజన సెగ
ఏలూరు, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ ఇళ్లనూ తాకింది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో మార్చి 15 తర్వాత లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాలో వివిధ వర్గాలకు మంజూరైన మొత్తం 39,951 ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేసేందుకు యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వీటిలో 10 వేల ఇళ్ల నిర్మాణం చివరి మజిలీలో ఉండగా మిగి లినవి వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్ర విభజన అంశం కారణంగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. మార్చి నెలలో 10 వేల ఇళ్లకు చెల్లింపులు నిలిచిపోగా ఏప్రిల్ నుంచి ఏ ఒక్క లబ్ధిదారుకూ బిల్లు చెల్లింపు జరగలేదు. సుమారు రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. బిల్లుల చెల్లింపులకు బ్రేక్ ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ ఖజానా శాఖలో ఆన్లైన్ లావాదేవీలు శనివారం నిలిచిపోవడంతో ఈ బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలను వేరు చేసే రెండింటికీ వేర్వేరు వెబ్సైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో బిల్లుల చెల్లింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లులు చెల్లింపు జరగవచ్చనని అధికారులు చెబుతున్నారు. అది కూడా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో వేసవిలో ఇళ్ల నిర్మాణాలకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ సీజన్లో సొంతింటిని పూర్తి చేసుకుందామని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది. రచ్చబండలో మంజూరైన ఇళ్లకు మోక్షం కలిగేనా? జిల్లాలో రెండో విడత రచ్చబండ కింద 89,771 ఇళ్లను ప్రభుత్వం ఆన్లైన్లో మంజూరు చేసింది. ఇప్పటి వరకు 10 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో వేలాది ఇళ్ల నిర్మాణాలకు కొత్త ప్రభుత్వంలో మోక్షం క లగటం అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్లో మూడో విడత రచ్చబండ సభల్లో వచ్చిన దరఖాస్తులకు దాదాపుగా 30 వేలపైనే ఇళ్ల మంజూరుకు ఆన్లైన్లో రిజిష్టర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం ముందు కూడా కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసం భారీ ఎత్తున ఇళ్లను ఆన్లైన్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రచ్చబండల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి టీడీపీ ప్రభుత్వం హయాంలో వారి లెక్క కింద చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొలువు తీరి ఇళ్ల నిర్మాణాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలోకి వచ్చేసరికి ఐదు నెలల కాలం పట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఎవరెటు
సాక్షి, ఏలూరు: వరుస ఎన్నికలతో క్షణం తీరిక లేకుండా పనిచేసిన జిల్లాలోని ఉగ్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యో గుల పంపకా ల సందడి జి ల్లాలోని ప్రభు త్వ కార్యాలయాల్లోనూ కనిపిస్తోంది. అధికారులలో ఎవరు ఎక్కడకు బదిలీ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన జిల్లాకు చేరువలో రాజధాని ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు, అన్ని శాఖల మంత్రులు రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగం, ప్రధాన కార్యాలయాలు మనకు దగ్గర్లోనే కొలువుదీరతాయి. ఆ ప్రభావం జిల్లాపై కచ్చితంగా పడుతుంది. జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లినా ఇదే చర్చ నడుస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ఫైళ్లను ప్రధాన కార్యాలయాలకు పంపిం చవద్దని ఆదేశాలందాయి. కేవలం విభజనకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే పంపించమంటున్నారు. ఈ కారణంగా జిల్లాకు రావాల్సిన బిల్లులు, ఇతర పాలనాపరమైన పనులు కొద్దిరోజుల పాటు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ శాఖలు 76.. ఉద్యోగులు 45,155 మంది జిల్లాలోని 76 ప్రభుత్వ శాఖల్లో 45,155 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో జిల్లాస్థాయి అధికారులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొందరు ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల విభజన జరుగుతోంది. దీంతో కలెక్టర్ సహా అధికారులు తాము కోరుకునే ప్రాంతానికి సంబంధించి ఆప్షన్లు ఇవ్వా ల్సి వస్తోంది. తెలంగాణ వారు అక్కడికి వెళ్లిపోయే అవకాశం ఉంది. అలా వెళ్లే వారు ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. ఇన్నాళ్లూ తమతో కలసి పనిచేసిన వారు ప్రాంతాల పేరుతో బదిలీపై వెళ్లాల్సిరావడంతో కొందరు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇదేవిధంగా తెలంగాణ ప్రాం తంలో పనిచేస్తున్న వారు కూడా మన జిల్లాకు రానున్నారు. అలా ఎవరు వస్తున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాస్థాయి అధికారులు రాష్ట్రం మారాల్సి వస్తుంటే.. కిందిస్థాయి సిబ్బంది జిల్లాలు, జిల్లాలోనే పలు ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు కావాల్సిన స్థానాల్లో పోస్టింగ్ పొందేం దుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పాలకులు మనకు సమీపంలోనే... కొత్త రాష్ట్రం జూన్ 2న అధికారికంగా ఏర్పడనుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుతీరుతుంది. రాజధాని ఎక్కడనే నిర్ణయం జరిగేంతవరకూ విజయవాడ-గుంటూరు మధ్య పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సీఎం క్యాంప్ ఆఫీసు గుంటూరులోనే ఉండబోతోంది. రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం కూడా సమీపంలోనే ఏర్పాటు కానున్నాయి. మన పాలకులు, ఉన్నతాధికారులు మనకు అత్యంత సమీపంలోనే ఉంటారు. ఇప్పటివరకూ జిల్లా పర్యటనలకు మంత్రులు వస్తున్నారంటే కనీసం ఒకరోజు ముందుగానే సమాచారం ఉండేది. కానీ కొత్త పాలకులు జిల్లా పర్యటనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చే అవకాశం ఉంది. తక్కువ దూరమే కావడంతో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు తరచూ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ అంశం అధికారులకు ఇప్పటినుంచే ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇక మీదట అత్యంత అప్రమత్తంగా పనిచేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడుతుంది. -
ఆంధ్రాకు రూ.7155 కోట్లు తెలంగాణకు 3756 కోట్లు
రెండు రాష్ట్రాల పీడీ ఖాతాల్లో నగదు నిల్వల లెక్కతేల్చిన అధికారులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యక్తిగత డిపాజిట్ల(పీడీ ఖాతా) లోని నగదు నిల్వలు రెండు రాష్ట్రాలకు జూన్ 2వ తేదీ నుంచి పంపిణీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పట్ణణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లోని నగదు నిల్వలను మరోసారి సరిచూసి ఈ నెలాఖరులోగా లెక్కలు తేల్చాల్సిందిగా అన్ని శాఖలను ఆర్థిక శాఖ శనివారం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిల్లో ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 72,547 పీడీ ఖాతాలున్నాయి. అందులో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 43,343 పీడీ ఖాతాల్లో రూ.7155.45 కోట్లు నిల్వ ఉండగా తెలంగాణలోని 10 జిల్లాల్లో 29,204 పీడీ ఖాతాల్లో రూ.3756.77 కోట్లు నిల్వ ఉన్నట్లు తేల్చారు. ఈ పీడీ ఖాతాల్లో నిల్వలను నెలాఖరులోగా సరి చూసి లెక్క తేల్చాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో నిల్వలను సరిచూసి జూన్ 2వ తేదీ నుంచి పీడీ ఖాతాల్లో కచ్చిత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 35 పీడీ ఖాతాలున్నాయని, ఆ ఖాతాలు జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త పీడీ ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్లు, కేంద్రాలకు చెందినవి 75 పీడీ ఖాతాలుండగా ఆ ఖాతాలు రెండు రాష్ట్రాలకూ చెందుతాయని పేర్కొన్నారు. -
ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ
కర్నూలు(రూరల్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలోని ట్రెజరీ ఉద్యోగులు బిజీ అయ్యారు. జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్, డీఏ బకాయిల మొత్తాలను చెల్లించేందుకు శనివారంతో గడువు ముగియనుంది. అలాగే ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోనుండటంతో ఈ శాఖలో కార్యకలాపాలను శనివారంతో బంద్ చేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను అన్ని ఉపఖజానా కార్యాలయాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా రాష్ట్ర శాఖకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరి వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ ఈనెల 21లో పూర్తి అయ్యింది. బిల్లుల స్వీకరణ మొదట మే 17 నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 19 వరకు అవకాశమిచ్చింది. వెంటనే ఆ తేదీని 21 వరకు పొడిగించింది. ఈ బిల్లుల క్లియరెన్స్ను ఈనెల 24లోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుంచి జీఓ నెం.86 రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు ఆ పనుల్లో తలమునకలయ్యారు. సాధారణంగా అయితే బిల్లులు క్లియరెన్స్కి సుమారు వారం, పది రోజులు పట్టేది.. విభజన నేపథ్యంలో ముందస్తుగా చెల్లించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే వ్యవధి ఇవ్వడంతో జీతాలు, ఇతర బిల్లులకు సంబంధించిన మొత్తాలు చేతికి అందుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడనున్నాయి. ఈలోగా ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం బిల్లుల చెల్లింపులను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సింది రూ. 62 కోట్లు... ఆర్థిక శాఖ నిర్ణయం ప్రకారం జిల్లాలో 30 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతాలు సుమారు రూ. 40 కోట్లు ప్రతినెలా చెల్లిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు 20 వేల మంది దాకా ఉంటారని, వీరికి రూ.22 కోట్లు పింఛన్ చెల్లిస్తున్నారు. మొత్తం కలిగి రూ. 62 కోట్లను నేటి సాయంత్రం లోపు చెల్లించాల్సి ఉంది. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 14 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా ఈ మొత్తాలను బట్వాడా చేయాలి. రాష్ట్ర విభజనకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్డేగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వారం రోజుల ముందుగానే చెల్లింపు చేయాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అత్యవసరంగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఎన్నికల కోడ్ రాక ముందుకు చేసిన పెండింగ్ బిల్లులు సైతం చెల్లించనున్నారు. కొందరు ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుకు గడువులోపు కుదరకపోవడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. జూన్ 20 తర్వాతే చెల్లింపులు పునఃప్రారంభం... జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. సీఎం ప్రమా ణ స్వీకారం తర్వాత మంత్రివర్గం కుదురుకునేసరికి మరో వారం రోజులు పట్టవచ్చు. జూన్ 20 తర్వాత గాని ట్రెజరీ బిల్లుల చెల్లింపు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే అది కూడా కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం మీద ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
విభజన ఫలితం.. శాఖల విలీనం!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: రాష్ర్ట విభజన యువతకు, పలు శాఖల ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం కానున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు తగ్గిపోతాయి. కొత్త రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా జీతాలు సకాలంలో అందుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. పలు ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలు సంబంధిత మాతృ శాఖల్లో విలీనం కానున్నాయి. ఇప్పటికిప్పుడు వీటిపై నిర్ణయాలు, జీవోలు వెలువడకపోయినా జూన్ రెండో తేదీ తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అన్ని స్థాయిలో రాష్ట్రా న్ని పునర్మిర్మించాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బం దులు, అవసరాలు, పొదుపు, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జీవో నెం.67 ద్వారా రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మంగళం పాడారు. భూసేకరణ యూ నిట్లలో ఉద్యోగుల సంఖ్యనుకుదించారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, తదితర శాఖలోలనూ ఉద్యోగుల కుదింపు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాలు త్వరలోనే అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖల విలీనం వల్ల ఉన్నతాధికార పోస్టులు, సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోతాయి. పదోన్నతులు తగ్గి.. సర్వీసు, సీనియారిటీ సమస్యలు పెరుగుతాయి. ఉన్న ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు, శాఖల విలీనం, పోస్టుల కుదింపు నిర్ణయాల వల్ల ఉన్న రెగ్యులర్ సిబ్బందిని ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉండవు.. కొత్త నియామకాలూ ఉండవు. దాంతో నిరుద్యోగులకు అవకాశాలు తగ్గిపోతాయి. పలు శాఖల్లో సమీప భవిష్యత్తులో జరిగే మార్పు చేర్పులు ఇలా ఉండొచ్చు. ఖజానా శాఖలో.. పే అండ్ అకౌంట్స్, వర్క్స్ విభాగాలు విలీనమవుతా యి. గణాంక శాఖ కూడా ఖజానాకు అనుబంధంగా ఉండాల్సి వస్తుంది. ఈ శాఖలకు ఒకే ఉన్నతాధికారి ఉంటా రు. దీంతో వివిధ క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోవడమే కాకుం డా కొంతమంది రివర్షన్ పొందవచ్చు. సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, వికలాంగుల సంక్షేమ శాఖ, నెడ్క్యాప్, తదితర విభాగాలు విలీనం కాన్నాయి. ఫలితంగా సంక్షేమ పథకాలు కుంటుపడతాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఐసీడీఎస్ తదితర విభాగాలు ఒక గూటి కి చేరనున్నాయి. ఇప్పటికే డీఆర్డీఏలో పలు విభాగాలు ఉన్నాయి. డ్వామా ద్వారా నీటి యాజమాన్య కార్యక్రమాలతో పాటు ఉపాధిహామీ, ఇందిర జలప్రభ, వంటి పథకాలు నిర్వహిస్తున్నారు. పని భారం ఎక్కువగా ఉంది. ఇవన్నీ విలీన మైతే ఒత్తిడి మరింత పెరుగుతుంది. జిల్లా పరిషత్లో.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, తదితర శాఖలు విలీనం కానున్నాయి. వ్యవసాయ శాఖలో.. హార్టికల్చర్, ఆత్మ, సెరికల్చర్, విత్తనాభివృద్ది, మార్కెటింగ్ తదితర శాఖలు, పరిశోధన కేంద్రాలు విలీనమయ్యే అవకాశం ఉంది. విద్యా శాఖలో.. ప్రాథమిక విద్యకు ఊతమిస్తున్న రాజీవ్ విద్యా మిషన్, మాధ్యమిక విద్యకు వసతులు సమకూర్చుతున్న ఆర్ఎంఎస్ఎ తదితర విభాగాలు చేరనున్నాయి. వెద్య ఆరోగ్య శాఖలో.. 104. 108, ఏపీ వైద్య విధాన పరిషత్, క్షయ, కుష్ఠు నియంత్రణ విభాగాలు కలిసిపోయే అవకాశం ఉంది. -
ఫుల్హ్యాపీ
పెండింగ్లో కొత్త లెసైన్సుల జారీ పాత లెసైన్సుల పొడిగింపుపై ఆశలు విశాఖపట్నం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనతో అంతా నష్టపోయామని బాధపడుతుంటే మద్యం వ్యాపారులు మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మద్యం లెసైన్సుల గడువు ముగియకముందే ఎన్నికలను నిర్వహించి మద్యం వ్యాపారులకు భారీ ఆదాయం సమకూరేలా చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త లెసైన్సులు జారీ చేయకుండా పెండింగ్లో పెట్టడంపై వీరంతా పండగ చేసుకుంటున్నారు. మరి కొన్నాళ్ల పాటు ఇలాగే లెసైన్సులు జారీ చేయకుండా ఉంచు దేవుడా అంటూ మొక్కుకుంటున్నారు. మద్యం వ్యాపారులపై ఏసీబీ కేసులు పెట్టి కొన్నాళ్లు హడలుగొట్టినా ఆఖర్లో మాత్రం ఆఫర్లపై ఆఫర్లు ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. వ్యాపారం ఫుల్లుగా సాగుతుండడంతో వారంతా ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. మద్య నిషేధాన్ని ఎత్తేసి వాడవాడలా బెల్టు షాపులకు మార్గం సుగమం చేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే తమ లెసైన్సుల గడువును కొంత కాలం పెంచుతారని ఆశపడుతున్నారు. వాస్తవానికి జూన్ 30 తేదీ నాటికి మద్యం లెసైన్సుల గడువు ముగుస్తోంది. ఈలోగానే కొత్త లెసైన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర విభజన నేపధ్యంలో మద్యం డిపోలను ఈ నెల 27 నుంచీ మూసేసి ఆదాయవ్యయాలను లెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్త లెసైన్సుల గందరగోళాన్ని సృష్టించుకోవడం లేదు. ఇదే మద్యం వ్యాపారులకు కలిసొచ్చింది. ఎలాగూ మరికొన్నాళ్లు లెసైన్సు గడువు పెంచుతార న్న ఆశల్లో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా కావల్సినంత మద్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులకు అవకాశమిస్తున్నారు. మద్యం డిపోలను మూసివేస్తున్నందున ఎలాంటి ఆంక్షలు లేకుండా కావల్సినంత మద్యం కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అప్పోసప్పో చేసి మద్యం నిల్వలను భారీ ఎత్తున విడుదల చేసి వ్యాపారులు గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. -
ఉడాకు సిబ్బంది కావలెను!
120 మందికిగాను 58 మందే విధుల్లో పదిహేనేళ్లుగా పోస్టులు ఖాళీ రెండున్నర రెట్లు పెరిగిన ఉడా పరిధి కేటాయించిన పోస్టుల భర్తీతోపాటు అదనంగా 300 మంది అవసరం ప్రభుత్వానికి నివేదించిన ఉడా చైర్మన్ వణుకూరి సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా)లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉండడం, ఒకే ఉద్యోగి రెండు, మూడు రకాల విధులు నిర్వర్తించడం ఉడాలో కొన్నేళ్లుగా సాగుతోంది. ప్రభుత్వానికి జీతాలపరంగా ఖర్చు తగ్గినా.. సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఉడా ఆవిర్భావంలో కేటాయించిన సిబ్బందిలో దాదాపు 30 శాతం ఖాళీలను భర్తీచేయకపోవడం, మిగిలిన 30 శాతం మంది పదవీవిరమణ చేసినా వారి స్థానాల్ని భర్తీచేయలేకపోవడంతో సిబ్బంది కొరత సమస్య తీవ్రమయింది. దీనికితోడు ఇప్పుడు ఉడా పరిధి భారీగా పెరగడంతో కొత్త పోస్టుల అవసరం ఏర్పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో వీజీటీఎం ఉడా నూతన రాష్ట్రంలో అతిపెద్దదిగా నిలుస్తుంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దదే. 1978లో అవిర్భవించిన ఉడా అప్పట్లో గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాలకే పరిమితమైంది. కాలక్రమేణ విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు రెండు జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీలు, 1400 గ్రామాల పరిధికి విస్తరించింది. 2012 వరకు ఉడా పరిధి కేవలం 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అప్పట్లో ఉడా పరిధి, కార్యకలాపాలను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ శాఖ 120 మంది సిబ్బంది నియామకాలకు వీలుగా పోస్టులు ఉడాకు కేటాయించింది. వారిలో 80 మందిని మాత్రమే తొలుత నియమించారు. ఆ తర్వాత నియామకాలు జరగకపోవడంతో ఖాళీలు అలాగే ఉన్నాయి. గడిచిన పదేళ్లలో సుమారు 30 మంది వరకు పదవీవిరమణ చేయడంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది సంఖ్య 58కు చేరింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఇక్కడ అధికంగా పనిచేస్తున్నారు. గతంలో వైస్ చైర్మన్లుగా పనిచేసిన అధికారులు ఉద్యోగుల భర్తీకి ప్రయత్నించకుండా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులతోనే నడిపించారు. ప్రస్తుతం ఉడాలో సుమారు 175 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 2012 వరకు కేవలం 1945 చదరపు కిలోమీటర్లకే పరిమితమైన ఉడా పరిధి ఒక్కసారిగా 5113 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఉడాకు ఆదాయం కూడా తగ్గిపోతోంది. ప్లానింగ్, ఇంజినీరింగ్, సిటిజన్ చార్టర్, ఎస్టేట్ విభాగం, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం, పరిపాలన విభాగాలు ఉన్నాయి. ఉడా పరిధిలో దాదాపు మూడు వేలకుపైగా ప్రైవేట్ వెంచర్లు ఉన్నాయి. ఇవికాక అనధికారికంగా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఉడా అనుమతిలేని వెంచర్లు ఉన్నాయి. ఉడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుని వారికి అపరాధరుసం విధించాల్సి ఉంటుంది. సిబ్బంది లేకపోవడంతో ఆ పని జరగడం లేదు. నూతన ప్రాజెక్టులు కాని, రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. హుడాను పరిగణనలోకి తీసుకోండి.. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా)ను పరిగణనలోకి తీసుకుని, దానికి సిబ్బందిని కేటాయించిన విధంగానే వీజీటీఎం ఉడాకు కేటాయించాలని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిసి సిబ్బంది పెంపు ఆవశ్యకతను వివరించి మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరి వినతిపత్రం అందజేశారు. దీనిపై మున్సిపల్ శాఖ కొంత కసరత్తు ప్రారంభించిన తరుణంలో రాష్ట్ర విభజన జరగడం, ప్రభుత్వం మారడం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడినట్లయింది. నూతన రాష్ట్ర రాజధాని కచ్చితంగా వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంతంలోనే ఏర్పాటవుతుందని అందరు విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది కొరత తీరకపోతే రాజధాని నిర్మాణంలో ఉడా క్రియాశీలక పాత్ర పోషించలేని పరిస్థితి తలెత్తుతుంది. గతంలో కంటే విస్తీర్ణం రెండున్నర రెట్లు పెరిగినందున.. కేటాయించిన సిబ్బంది సంఖ్యను రెండు రెట్లు పెంచాలని చైర్మన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కలుపుకొని 420 వరకు పోస్టులు కావాలన్నమాట. నూతన సీఎంకు విన్నవిస్తాం నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఉడాకు పోస్టులు పెంచాలని కోరతాను. ముఖ్యమంత్రిగా పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతాను. ఉడాను సీమాంధ్రలో అన్ని అంశాల్లో అగ్రగామిగా నిలపటమే నా ఎజెండా. ఆ దిశగా పనిచేస్తున్నాను. -వణుకూరి శ్రీనివాసరెడ్డి, చైర్మన్, వీజీటీఎం ఉడా -
విడిపోయినా.. రోమింగ్ ఉండదు!
-
చిరుద్యోగుల భవిష్యత్తుపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై రాష్ట్రంలోని సుమారు 3.84 లక్షల మంది చిరుద్యోగుల భవిష్యత్ ఆధారపడి ఉంది. విభజన పంపకాల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు, హోంగార్డులు, ఎన్ఎంఆర్లను మినహాయింపు ఇచ్చారు. రెగ్యులర్ పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ.. ఆ పోస్టులను ఖాళీగానే చూపించనున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, హోంగార్డులు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 3.84 లక్షల మంది పనిచేస్తున్నారు. వారి పదవీ కాలాన్ని మే నెలాఖరుకే ముగియనున్నా.. రెండు రాష్ట్రాలు విడిపోతున్నందున వారి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించారు. కానీ, వీరి భవిష్యత్ కొత్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.hh జూన్ 2న రాష్ట్రం విడిపోరుు రెండు ప్రభుత్వాలు ఏర్పడనుండగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాయూ లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
ఒక్క నెలలోనే రూ.10 వేల కోట్లు!
- విభజన నేపథ్యంలో ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లింపు - ఒక నెలలోనే రెండు జీతాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మే ఒక్క నెలలోనే ఉద్యోగులు, పింఛనుదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను చెల్లిస్తోంది. విభజన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలోనే ఉద్యోగులు రెండు జీతాలు తీసుకోనున్నారు. ఏప్రిల్ నెల వేతనాలను ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. జూన్ 2వ తేదీన రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులకు జూన్ 1వ తేదీ వరకు ఇవ్వాల్సిన వేతనాలను వారం ముందుగా ఇదే నెల 24న చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. దీంతో ఏప్రిల్, మే నెలల వేతనాలను ఉద్యోగులు ఒకే నెలలో తీసుకున్నట్లవుతోంది. పింఛనుదారులకు కూడా ఇదే రీతిన చెల్లించాలని నిర్ణయించారు. జీతాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల చెల్లింపులకు ఈ నెల 24 చివరి తేదీ కానుంది. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి చెల్లింపులు చేయరు. జూన్ 2న రెండు రాష్ట్రా లు ఏర్పాటయ్యాక ఏ రాష్ట్రానికి చెందిన బిల్లులను ఆ రాష్ట్రాలు చెల్లిస్తాయి. రూ.5 వేల కోట్ల అప్పు ఒకే నెలలో ఉద్యోగులకు రెండు జీతాలు చెల్లించాల్సి ఉన్నందున ఆర్థిక శాఖ ఈ నెలలో రూ. 5 వేల కోట్ల అప్పు చేయాలని నిర్ణయించింది. రెండు దఫాలుగా రూ.5 వేల కోట్లు అప్పు చేయనుంది. తొలి దశలో గురువారం మూడు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ ద్వారా వేలం పాటలో విక్రయించనున్నారు. తిరిగి ఈ నెల 27న మరో రెండు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నారు. జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఖజానాలలో కనీసం రెండు వేల కోట్ల రూపాయల చొప్పున అయినా నగదు నిల్వ ఉండేలాగ ఆర్థిక శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి రాష్ట్ర ఖజానాలో ఉన్న నగదు నిల్వలను ఆర్బీఐ జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 29 వేల కోట్లు అప్పు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు రూ. 2వేల కోట్లను అప్పు చేశారు. గురువారంతో పాటు 27న చేయనున్న అప్పుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లు అప్పు చేసినట్లవుతోంది. -
స్థానికతలో అక్రమాలపై కేసీఆర్ ఆగ్రహం
పంపిణీపై టీఆర్ఎస్ కమిటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను నిరోధించడంతో పాటు స్పష్టమైన విధానాన్ని, వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు బుధవారం కేసీఆర్ను ఆయన నివాసంలో కలిశారు. పలు స్థాయిల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియలో స్థానికత, బోనఫైడ్ పత్రాల సమర్పణలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రమోషన్లు, పోస్టింగుల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. నిరుద్యోగులకు కూడా అవకాశాలు రాకుండా పోతాయన్నారు. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ధ్రువీకరణ పత్రాలు, బోనఫైడ్లను రాష్ట్ర విభజన తర్వాత కూడా మరోసారి పరిశీలిస్తామని హెచ్చరించారు. దీనిపై అప్రమత్తంగా ఉండటానికి స్పష్టమైన విధానం, దాని అమలుకు వ్యూహం ఉండాలన్నారు. అందుకోసం తెలంగాణ భవన్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విభజన ప్రక్రియలో వచ్చే ఫిర్యాదులు, వినతులను అది పరిశీలిస్తుందన్నారు. సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికి పార్టీ ముఖ్య నేత టి.హరీశ్రావు నేతృత్వంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్లతో వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగానే విభజించాలని, ఏ రాష్ట్రంలో పుట్టి ఉంటే ఆ రాష్ట్రానికి పంపించాలని అన్నారు. నేడు ఉద్యోగులతో కేసీఆర్ భేటీ తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య అన్ని స్థాయిల ప్రభుత్వోద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకుంటున్న సమయంలో నగర శివార్ల ఉన్న కొంపల్లిలోని ఆర్.డి.కన్వెన్షన్ సెంటర్లో గురువారం సమావేశం అవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల, అన్ని స్థాయిల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు దీనికి హాజరవాలని కేసీఆర్ కోరారు. ఉద్యోగుల పంపిణీలో అనుసరించాల్సిన వ్యూహం, విధానంపై సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. ఈ భేటీ నేపథ్యంలో కేసీఆర్ గురువారం సందర్శకులకు అందుబాటులో ఉండరని ఆయన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. సందర్శకులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆడంబరాలకు, అట్టహాసాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని, కాబట్టి ఎవరూ పుష్పగుచ్ఛాలు, దండల వంటివి తీసుకురావద్దని కోరారు. -
ఖజానా సేవలు బంద్!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఖజా నా శాఖ ద్వారా అందుతున్న సేవలు పది రోజుల పాటు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఈ శాఖ కూడా రెండుగా విడిపోనుండడంతో ఈ శాఖలో కార్యకలాపాలను ఈ నెల 24 నుంచి నిలిపివేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సి న బిల్లులను అన్ని ఉప ఖజానా కార్యాల యాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా పంపించారు. ఇక బిల్లుల సమర్పణకు కూడా అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో మే 17 నాటికి బిల్లుల స్వీకరణ పూర్తి చేస్తామని చెప్పిన యంత్రాంగం తరవాత 19 వరకూ అవకాశమిచ్చింది. తరవాత ఆ తేదీని 21వ వరకూ పొడిగించింది. నాలుగైదు జిల్లాలను యూనిట్గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బిల్లుల స్వీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కొన్ని రోజులుగా ఖజానా శాఖ ఉద్యోగులు నానా హైరానా పడుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉన్న బిల్లులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి సర్వర్తో సమర్పణ కార్యక్రమాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. 21తో బిల్లుల స్వీకరణ, 24తో చెల్లింపులను నిలుపుదల చేసి, మళ్లీ ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్లులను మంజూరు చేయనున్నారు. అంత వరకూ ఖజానా శాఖ ద్వారా బిల్లులను నిలుపుదల చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన వ్యయాలను సమైక్యాంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించుకుని అనంతరం జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ద్వారా ఆయా యంత్రాంగాల ఆధ్వర్యంలో నిర్వహించడానికి వీలుగా ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నుంచి కార్యాలయ పరిధిలోని పనులే తప్ప బిల్లులకు సంబంధించిన పనులు మాత్రం చేసే అవకాశం లేదు. అభివృద్ధి పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల పనులకు విఘాతం కలగనుంది. ముఖ్యంగా గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు. 24 నుంచి బిల్లులు పాస్ కావు జిల్లాకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు తదితర బిల్లులు 24 తరవాత పాస్ కావు. ఇప్పటికే బిల్లుల సమర్పణ కూడా జరిగిపోయింది. బిల్లులను సమర్పించేందుకు కూడా గడువు బుధవారంతో(ఈ నెల 21తో) ముగిసిపోయింది. జూన్ రెండు తరవాతే బిల్లుల చెల్లింపులు, సమర్పణలు ఉంటాయి. ఇప్పటి వరకూ మా వద్ద పెండింగ్ బిల్లులు లేవు. - పి.వి. భోగారావు, ఖజానా శాఖ డీడీ, విజయనగరం -
విడిపోయినా.. రోమింగ్ ఉండదు!
ఒకే టెలికం సర్కిల్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాక్షి, హైదరాబాద్: అపాయింటెడ్ డే అయిన జూన్ 2న రాష్ట్రం విడిపోయినా... ఒక అంశంలో మాత్రం ఒకటిగానే ఉండిపోనుంది. టెలికం విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒకే సర్కిల్ కింద కొనసాగనున్నాయి. దీంతో ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి వచ్చినా.. సెల్ఫోన్లకు రోమింగ్ మోత ఉండదు. ఎప్పటి మాదిరిగానే సెల్ఫోన్ వినియోగదారులు సాధారణ చార్జీలపైనే వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార పనులపై తిరిగే ఇరు ప్రాంతాలవారికి రోమింగ్ బెడద ఉండదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తమ మాతృరాష్ట్రాల నుంచి విడిపోయినప్పుడు టెలికం సర్కిళ్లను విభజించలేదు. ఇప్పటికీ అవి వాటి మాతృరాష్ట్రాలతో ఒకే సర్కిల్లో కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోనున్నప్పటికీ టెలికం సర్కిల్ ఒకటిగానే ఉండనుంది. ముఖ్యంగా ట్రాయ్ నిబంధనలతో పాటు టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చే లెసైన్స్ కాలపరిమితి తదితర అంశాల నేపథ్యంలో టెలికం సర్కిళ్లను విభజించడానికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆ లెసైన్సుల కాలపరిమితి 30 నుంచి 40 ఏళ్లవరకు ఉండటంతో.. ఆ తర్వాతే సర్కిళ్ల విభజన జరిగే అవకాశం ఉంది. దానికితోడు ట్రాయ్ నిబంధనల ప్రకారం కూడా 2024 వరకు జరిగే రాష్ట్ర విభజనలకు రోమింగ్ వర్తించదు. అసలు ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రోమింగ్ చార్జీలను రద్దు చేసేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది.