
మళ్లీ విధుల్లోకి పళ్లంరాజు
ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2 నెలల నుంచి విధులకు దూరంగా ఉన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం. పళ్లంరాజు మళ్లీ తన కార్యాలయానికి వచ్చారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2 నెలల నుంచి విధులకు దూరంగా ఉన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం. పళ్లంరాజు మళ్లీ తన కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం ఇక్కడి శాస్త్రి భవన్లోని తన కార్యాలయంలో విధులు చేపట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినా.. అక్టోబర్ 4 నుంచి ఆయన తన అధికార నివాసం నుంచో లేదా మంత్రిత్వ శాఖ కమిటీ హాల్ నుంచో విధులు నిర్వర్తిస్తున్నారు. నెల రోజుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు పళ్లంరాజు మంత్రిత్వ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయన వస్తున్న సంగతి తమకు తెలియదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.