office
-
ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్ను ముట్టడించిన మహిళా కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. -
బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్ - ఇదే..
టెక్ దిగ్గజం గూగుల్ (Google) బుధవారం బెంగళూరులో తమ కొత్త క్యాంపస్ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు పెట్టినట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. అంతర్జాతీయంగా తమకున్న భారీ కార్యాలయాల్లో ఇది కూడా ఒకటని పేర్కొంది.నేవిగేషన్కి సులభంగా ఉండేలా అనంతలోని ప్రతి ఫ్లోరు.. వీధుల నెట్వర్క్లాగా ఉంటుందని పేర్కొంది. చిరకాలంగా టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, దేశీయంగా అంకుర సంస్థలు .. యాప్ వ్యవస్థలు వృద్ధి చెందుతున్న తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కోట్ల మంది జీవితాల్లో పరివర్తన తెస్తున్నాయని వివరించింది.వివిధ ఉత్పత్తులు, ప్లాట్ఫాంలతో కోట్ల మంది యూజర్లకు చేరువ కావడానికి తమకు భారత్లో ప్రత్యేక అవకాశం లభించిందని తెలిపింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది.గూగుల్ అనంతలో 100 శాతం మురుగునీటి రీసైక్లింగ్, వర్షపునీటి సేకరణ.. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి పెద్ద స్మార్ట్ గ్లాస్ ఇన్స్టాలేషన్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కోసం దాదాపు పూర్తిగా స్థానికంగా ఉన్నవాటినే ఉపయోగించారు. భారతదేశం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని సూచిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసుల భద్రతా చర్యలు
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) నివాసం వద్ద కూటమి నేతలు తరచూ గొడవలు చేయడం, ఇటీవల ఆయన ఇంటిముందు పార్కుకు నిప్పుపెట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత(Police security) చర్యలు చేపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం(YSRCP central office) పరిసరాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ఉండే రోడ్డులో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాకపోకలను పరిశీలించే విధంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రధాన గేటు వద్ద రెండు సీసీ కెమెరాలు, భరతమాత సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు, కుంచనపల్లి–ప్రాతూరు అండర్ పాస్ నుంచి బకింగ్హామ్ కెనాల్ మీదుగా వడ్డేశ్వరం వెళ్లే మార్గాల్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం తాడేపల్లి సీఐతోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
టీడీపీ ఆఫీస్ లో రేషన్ షాప్..!
-
ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్: ఎన్ని కొట్లో తెలుసా?
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.బర్త్ డే సాంగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. -
అక్కడే పడుకుంటున్నా!: మస్క్ ఆసక్తికర కామెంట్స్
వాషింగ్టన్:అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)కి సంబంధించి ఆ సంస్థ హెడ్, ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. డీవోజీఈ హెడ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఆ సంస్థ ఆఫీసులోనే పడుకుంటున్నానని మస్క్ తన సన్నిహితులతో అన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.ఫెడరల్ ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థపై పట్టు సాధించేందుకు తన ఆఫీసునే బెడ్రూమ్గా మార్చుకున్నానని మస్క్ చెప్పారు.డీవోజీఈ ఆఫీసు వైట్హైజ్ పక్కనే ఉన్న ఇసెన్హొవర్ భవనంలో ఉంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ను డీవోజీఈ చీఫ్గా నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్కు గొప్ప హార్డ్ వర్కర్గా పేరుంది. ఆయన గతంలో బిజీ సమయాల్లో తన టెస్లా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ నేలపైనే నిద్రపోయినట్లు వార్తలొచ్చాయి. టెస్లా ఫ్యాక్టరీయే తన మొదటి ఇల్లు అని 2022లో మస్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాజాగా డీవోజీఈ ఆఫీసు విషయంలోనూ మస్క్ ఇదే తరహా విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
మాజీ ఎమ్మెల్యే శంకరరావు కార్యాలయంపై దాడి
పెదకూరపాడు/లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరులోని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కంభంపాడు గ్రామానికి చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఒక్కసారిగా శంకరరావును, ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయంలోనే ఉన్న కార్యకర్త నరేంద్రపై విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను చించివేసి శంకరరావు , ఆయన సతీమణిపై దుర్భాషలాడుతూ తీవ్రంగా భయభ్రంతులకు గురిచేశారు.ఈ విషయమై శంకరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఇలాంటి దాడులు ప్రజాస్వాయ్యంలో సరికాదన్నారు. కావాలనే దాడులకు పాల్పడ్డారని ఇకపై ఇలాంటివి సహించేదే లేదన్నారు. ఇదిలా ఉండగా, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం అరాచాకాలకు అడ్డు లేకుండాపోయింది. పెదకూరపాడు నియోజకవర్గ సీటు దక్కించుకున్న భాష్యం ప్రవీణ్ గెలిచిన తరువాత పెద్ద ఎత్తున , ఇసుక మాఫియా నడుపుతూ ప్రత్యర్థిపై దాడులకు పురిగొలుపుతున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.రాష్ట్రంలో రెడ్బుక్ పాలన: అంబటి, శంకరరావుగుంటూరులో పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడిచేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు శంకరరావును పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేశ్ ప్రోద్బలంతో రాష్ట్రంలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.ఈ దాడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ కంభంపాడు ప్రాంతానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు ఈ దాడిచేసినట్లు చెప్పారు. అనంతరం.. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండంపుడి నరేంద్రసాయి, కట్టబోయిన జగదీష్, చైతన్యరెడ్డి, సిద్ధు, మనోజ్, శ్రీనులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్ వస్తుందా?
న్యూఢిల్లీ: ‘‘ఆదివారాలు కూడా ఆఫీస్కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి’’అంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే విజయం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని, ఏది ఉన్నా ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ నుంచే ఇది అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతేకాదు, ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు మధ్యస్త వేతనం కంటే 534 రెట్లు అధికంగా రూ.51 కోట్ల వేతనాన్ని 2023–24 ఆర్థిక సంత్సరానికి సుబ్రమణియన్ తీసుకోవడంపైనా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘‘వారంలో 90 గంటలా? సండేని సన్ టు డ్యూటీగా ఎందుకు పేరు మార్చకూడదు. వారంలో ఒకరోజు సెలవుదినాన్ని ఒక భావనగా మార్చేయండి’’ అంటూ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కష్టపడి, స్మార్ట్గా పనిచేయడాన్ని తాను విశ్వసిస్తానన్నారు. జీవితాన్ని పూర్తిగా కార్యాలయానికే అంకింత చేయడం వల్ల విజయం రాకపోగా, అగ్గి రాజుకుంటుందన్నారు. ఉద్యోగం–జీవితం మధ్య సమతుల్యత అన్నది ఐచి్ఛకం కాదని, తప్పనిసరి అని పేర్కొన్నారు. మారికో చైర్మన్ హర్‡్ష మారివాలా కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని ఎక్స్పై వ్యక్తం చేశారు. ‘‘విజయానికి కష్టపడి పనిచేయడం అన్నది కీలకం. ఇందుకు ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. నాణ్యత, ఆ పని పట్ల అభిరుచి విజయాన్ని నిర్ణయిస్తాయి’’అని పేర్కొన్నారు. బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన సందర్భంగా దీనిపై స్పందించారు. ‘‘ఇది అగ్ర స్థాయి ఉద్యోగుల నుంచి ప్రారంభిద్దాం. ఫలితమిస్తుందని తేలితే అప్పుడు మిగిలిన వారికి అమలు చేద్దాం’’అని పేర్కొన్నారు. -
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
అడ్డగోలు కేసులతో అడ్డంగా దొరికిన పోలీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెట్టిన మంగళగిరి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్నారంటూ గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డిపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఇప్పుడు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ బాసులను సంతృప్తిపరిచేందుకు ముందువెనకా ఆలోచించకుండా కేసులు పెట్టిన పోలీసులు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన స్థితికి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నానంటూ సుబ్బారెడ్డి తగిన ఆధారాలను హైకోర్టు ముందుంచడంతో పోలీసులు హైకోర్టుకు దొరికిపోయారు. ఆ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో సుబ్బారెడ్డి తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే.. ఆయన టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నారని, ఇదే విషయాన్ని సాక్షులు కూడా రూఢీ చేశారంటూ సీఐడీ దర్యాప్తు అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. సుబ్బారెడ్డి టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని కూడా కౌంటర్లో చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే, అదే రోజున ఆయన టీడీపీ కార్యాలయం వద్ద ఉండటం ఎలా సాధ్యమని పోలీసులను ప్రశ్నించింది. అలా ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీని ఆదేశించింది. ఈ నెల 12న మధ్యాహ్నం 2.15 గంటలకు స్వయంగా తమ ముందు హాజరు కావాలని డీఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో..2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లేని వారిని కూడా నిందితులుగా చేర్చారు. అలా నిందితులుగా చేర్చిన వారిలో గుంటూరు 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సీఐడీకి బదలాయించింది. సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లో దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి టీడీపీ కార్యాలయం వద్దే ఉన్నారని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని తన కౌంటర్లో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి అక్కడ ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉందని వివరించారు.పోలీసులు చిక్కుకున్నారిలా..సుబ్బారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అడ్డగోలుతనానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానానికి తెలిపారు. మేనల్లుడి పెళ్లిలో ఉన్న వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొంటూ ఏకంగా హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసేంత సాహసం చేశారన్నారు. సుబ్బారెడ్డి ఘటన జరిగిన రోజున నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నారనేందుకు ఇప్పటికే ఆధారాలను కోర్టు ముందుంచామన్నారు. సీఐడీ డీఎస్పీ తన కౌంటర్లో సుబ్బారెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్టు పేర్కొన్న విషయాన్ని నాగిరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.పిటిషనర్ సీసీ టీవీలో ఎక్కడ ఉన్నారో చూపేలా డీఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లిలో ఉన్న సుబ్బారెడ్డి, ఘటనా స్థలం (టీడీపీ పార్టీ కార్యాలయం) వద్ద ఉండటమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ?
-
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
ఆఫీసుకు రాకుండా ఉండేదుకు ఉద్యోగులు వాడే ట్రిక్స్ ఇవే..
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాయి. ఈ జాబితాలో అమెజాన్ కూడా ఉంది. 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించింది. అందరూ ఆఫీస్ నుంచి పనిచేస్తే కలిగే ప్రయోజనాలను గురించి కూడా అమెజాన్ సీఈఓ 'ఆండీ జాస్సీ' వెల్లడించారు.ఇన్నిరోజులు ఇళ్లకు పరిమితమైన చాలా మంది ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలనే వార్తతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అభ్యర్థించారు. మరికొందరు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పించుకోవడానికి మూడు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు 'ఆండీ జాస్సీ' చెప్పుకొచ్చారు.కాఫీ బ్యాడ్జింగ్అమెజాన్ ఉద్యోగులు మాత్రమే కాకుండా.. చాలామంది ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్నారని తెలిసింది. అంటే సమయానికి ఆఫీసులకు వచ్చి పంచ్ వేయడం, అల్పాహారాని కొంత సమయం, కాఫీ తాగటానికి కొంత సమయం ఇలా కేటాయించుకుంటూ.. మళ్ళీ టైమ్ అవ్వగానే పంచ్ వేసి వెళ్ళిపోతారు. ఇదెలా ఉండేదంటే.. ఆఫీసులో కనిపించి, కాఫీ తాగి వెళ్లిపోవడం అన్నమాట. ఈ విధానం కొంత తగ్గుముఖం పట్టింది.హోమ్ వై-ఫై పేరు మార్చేయడంఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే పనిచేస్తూ.. హోమ్ వై-ఫైకి ఆఫీస్ వై-ఫై పేరు ఇచ్చేవారు. ఇలా చేసి ఉద్యోగి లాగిన్ అయినప్పుడు రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వారు ఆఫీసులో ఉన్నట్లు తెలిసేది. ఇలా కూడా చేసేవారు ఎక్కువయ్యారు. ఆఖరికి రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ను మరింత పటిష్టంగా చేయడంతో ఇది కొంత కనుమరుగైంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఆఫీసులో బ్యాడ్జ్ వదిలి వెళ్లడంమూడో ట్రిక్ ఏమిటంటే.. కొంతమంది ఉద్యోగులు తమ బ్యాడ్జ్ని ఆఫీసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ బ్యాడ్జ్తో సహోద్యోగి చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి చేస్తారు. ఇలా చేస్తే సదరు ఉద్యోగి ఆఫీసుకి వచ్చి వెళ్తున్నట్లు రిపోర్టులో చూపిస్తుంది. కానీ నిజానికి వారు ఆఫీసుకే రారని తెలుస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
YSRCP కార్యాలయంపై దాడి
-
'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్'
దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి 'రిటర్న్-టు-ఆఫీస్' విధానం చేపడుతున్నాయి. అమెజాన్ కూడా ఈ ఫార్ములానే అనుసరిస్తోంది. ఈ విధానం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికే.. అంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో పనిచేసిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'జాన్ మెక్బ్రైడ్' పేర్కొన్నారు.2023 జూన్ వరకు అమెజాన్ కంపెనీలో ఒక ఏడాది పనిచేసిన మెక్బ్రైడ్.. సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటనపై స్పందించారు. అమెజాన్ వర్క్ఫోర్స్ తగ్గింపు ప్రణాళిక ఐదు దశలుగా ఉందని వివరించారు. మొదటి దశలో 30000 మంది ఉద్యోగులను తొలగించారు. రెండవ దశలో రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేయడం జరిగింది.రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేసిన తరువాత కొందరు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నేను (జాన్ మెక్బ్రైడ్) ఆఫీసుకు వెళ్ళడానికి 20 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణమయింది. నాలాగే కొందరు ఉద్యోగులను వదులుకున్నారని వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?నాల్గవ, ఐదవ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు అప్పటికే పెండింగులో ఉన్న చాలా పనులను అప్పగించారు. దీంతో పనిభారం ఎక్కువైంది. ఇది మరికొందరు ఉద్యోగాలను వదిలిపోయేలా చేసింది. మొత్తం మీద కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి.. మళ్ళీ లాభాలబాట పట్టాలని సంస్థ చేస్తున్న చర్య అని అన్నారు.I’m a former AWS employee: most of the hot takes on Amazon's new strict return-to-office policy are wrong.Anyone who’s been paying attention saw this coming years ago. And ultimately, it comes down to taxes and economics.Here's their plan:Phase 1: layoff over 30k people.…— John McBride (@johncodezzz) September 18, 2024 -
ఆఫీస్కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్లో హాజరుకు ఉద్యోగుల లీవ్లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని అమెజాన్ డాట్ కామ్ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్లో తెలిపారు.సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ లో వినాయక చవితి ఉత్సవాలు
-
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.అసలేంటీ కాన్సెప్ట్? ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.ఎమోషనల్ డిపెండెన్సీ...హైదరాబాద్లోని ఒక ప్రముఖ కార్పొరేషన్లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.పుకార్లు షికారు... ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.మూడు నెలల థెరపీ...ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం. వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.ముందిలా చేయండి.. అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి. 2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. 4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్వర్క్ను రూపొందించండి, 6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comConnections corner -
ఆఫీసులో బాస్ కొత్త రూల్: పనివేళల్లో..
ఆఫీసులో పని చేసి అలసిపోయినప్పుడు ఉద్యోగులు మధ్యలో విరామం తీసుకోవడంలో భాగంగా కాఫీ కోసం బయటకు వెళ్లారు. ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ కోసం బయటకు వెళ్ళకూడదు ఆస్ట్రేలియన్ మైనింగ్ బాస్ & మినరల్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ 'క్రిస్ ఎల్లిసన్' ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ తాగాలని బయటకు వెళ్తే, కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ఎల్లిసన్.. రోజంతా ఉద్యోగులను ఆఫీసులోనే ఉంచడానికి కొత్త రూల్ పాస్ చేశారు. ఇందులో భాగంగానే ఆఫీసులోనే ఉద్యోగులకు కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సన్నద్ధమయ్యారు.ఉద్యోగుల కోసం ఆఫీసులోనే రెస్టారెంట్, జిమ్, స్టాఫ్ సైకాలజిస్ట్లు, క్రెచ్ వంటి సౌకర్యాలను ఏపాటు చేయడానికి ఎల్లిసన్ పెట్టుబడి కూడా పెట్టారు. ఇవన్నీ ఆఫీసులోనే ఉంటే ఉద్యోగి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఉద్యోగులు ఓ కప్పు కాఫీ కోసం రోడ్డుపైకి (బయటకు) వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్ఉద్యోగులు బయటకు వెళ్లడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కూడా సరైనది కాదని వెల్లడించారు. కోవిడ్ 19 తరువాత రిమోట్ వర్క్ విధానానికి అనుమతి ఇచ్చిన కంపెనీలను కూడా అయన విమర్శించారు. ఎల్లిసన్ గత ఏడాది వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి మంగళం పాడేసారు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
Bangladesh: పత్రికా కార్యాలయం ధ్వంసం.. మహిళా జర్నలిస్టుపై దాడి
బంగ్లాదేశ్లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సెట్ కాదు.. ఆఫీస్కి వచ్చేయండి’
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు. -
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం(ఆగస్టు7) ఎరుపు రంగు దుస్తులు వేసుకొని రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు నిరసనకు బయలుదేరారు. మహిళా నేతలను గాంధీభవన్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దేశంలో మహిళకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల పెరుగుదల వల్ల మహిళలపై పడుతున్న భారంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసులు ముట్టడించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. -
బీఆర్ఎస్ కార్యాలయాలపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. -
Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్ వెబ్సైట్ హ్యాక్
బంగ్లాదేశ్లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్సైట్లు హ్యాక్నకు గురయ్యాయి. ‘ది ఆర్3 సిస్టన్స్3’ అనే గ్రూప్ ఈ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్డౌన్, స్టాప్ కిల్లింగ్ స్టూడెంట్స్’ అనే సందేశం హ్యాక్ అయిన ఈ మూడు సైట్లలో కనిపించింది.‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు. మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. -
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై తొందరపడొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. స్టేటస్ కో(యధాతధ) స్థితిని కొనసాగించాలని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. అదే సమయంలో అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్సీపీ వివరణ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది.వైఎస్సార్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని కోర్టు పేర్కొంది. అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలన్న హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. కోర్టులో వాదనల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు పెట్టిన పచ్చ మూకలు
-
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మరో వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో
సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది.దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. “విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరొక వైయస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత కుట్రపై బయటపడ్డ సంచలన ఆడియో”తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పడు ఈ పార్టీ ఆఫీసునీ కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు. ఈ మేరకు కార్పొరేషన్… pic.twitter.com/HOj5nlm3Fx— YSR Congress Party (@YSRCParty) June 23, 2024 -
Gunshot: చంద్రబాబు ఎజెండా ఇదేనా ?
-
Big Question: పచ్చి అబద్దాలు.. కోర్టు ఆర్డర్ బయటపెట్టిన మాజీ ఏఏజీ పొన్నవోలు
-
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేతపై అంబటి రాంబాబు రియాక్షన్
-
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. -
ఢిల్లీ జల్బోర్డు ఆఫీసు ధ్వంసం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం(జూన్16) ఛాతర్పూర్లోని ఢిల్లీ జల్బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందరవందరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఆరోపించింది. దాడి చేస్తున్న వారిలో ఒక వ్యక్తి కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.BJP के नेताओं और कार्यकर्ताओं की सरेआम गुंडागर्दी ‼️देखिए कैसे ‘BJP ज़िंदाबाद’ के नारे लगाते हुए दिल्ली जल बोर्ड के दफ़्तर को तोड़ रहे हैं बीजेपी के कार्यकर्ता👇एक तरफ़ हरियाणा की BJP सरकार दिल्ली के हक़ का पानी रोके हुए है तो वहीं दूसरी तरफ़ बीजेपी दिल्ली की जनता की संपत्ति… pic.twitter.com/nVEWLdDwGA— AAP (@AamAadmiParty) June 16, 2024 ‘బీజేపీ జిందాబాద్ అని నినాదాలు చేసుకుంటూ జలమండలి ఆఫీసును ఎలా పగులగొడుతున్నారో చూడండి. ఓ వైపేమో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తాగేందుకు నీళ్లివ్వకుండా ఆపుతుంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారు’అని ఆప్ ఎక్స్(ట్విటర్)లో దాడి వీడియోను పోస్టు చేసింది. -
ఆప్ పార్టీకి సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: ఆప్ పార్టీ ఆఫీసు ఖాళీ చేసే గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే గడువును అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 10 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ పార్టీ ఆఫీసు జూన్ 15 లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఆప్ కార్యాలయం ఉన్న భూమిని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీ మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రానికి హైకోర్టు సూచించింది. జూన్ 15న ఆప్ ప్రస్తుత ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలిక ఆఫీసు కోసం కేటాయించాలని ఆప్ హైకోర్టును కోరింది. -
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. -
ఆఫీస్లో నోటీసులు.. షాక్లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
పార్టీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు: ‘ఆప్’ నేతలు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీ ఆఫీసును సీజ్ చేసి తమను లోపలికి వెళ్లకుండా చేశారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విటర్లో) ఆమె ఒక పోస్టు చేశారు. Aam Aadmi Party office has been sealed off from all sides. How can access to a national party office be stopped during the Lok Sabha election? This against the ‘level playing field’ promised in the Indian Constitution. We are seeking time with the Election Commission to… pic.twitter.com/wf9VdittvW — Atishi (@AtishiAAP) March 23, 2024 ఢిల్లీ నడిబొడ్డున్న ఉన్న తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు సమాన పోరాట వేదిక లేకుండా చేసే బీజేపీ కుట్రలో ఇది భాగమని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన -
జనసేన దుకాణం క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం. ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం తగలబెట్టిన దుండగులు
-
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్లోని భింద్లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
టీసీఎస్ బాటలో హెచ్సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్సీఎల్ అడుగులు వేస్తోంది. హెచ్సీఎల్ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్సీఎల్ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్సీఎల్ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?
హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది. వారంలో న్యాయం చేస్తాం... ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది. -
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్లపై ర్యాలీగా వచ్చారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పథకం ప్రకారమే దాడి.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు. వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు. టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
మంత్రి రజిని ఆఫీస్పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
మంత్రి రజిని ఆఫీసుపై దాడి..15 మంది గూండాలు అరెస్ట్
-
మంత్రి విడదల రజిని ఆఫీసుపై టీడీపీ, జనసేన రౌడీలు దాడి
-
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్ను మండలి వైస్చైర్మన్గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
‘శాడిస్ట్ బాస్కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ రెడ్డిట్లో.. రెస్టారెంట్లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
కంపెనీల్లో నయా ట్రెండ్, కాఫీ కప్పులతో ఉద్యోగులు.. బాసుల్లో గుబులు!
ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను రద్దు చేస్తున్నాయి. ఆఫీసుకు రావాలని పిలుపునిస్తున్నాయి. దీంతో సుదీర్ఘ కాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలని ఆదేశించడం ఉద్యోగులకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే కాఫీ బ్యాడ్జింగ్ అనే కొత్త ట్రెండ్తో సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ అంటే? కోవిడ్-19 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్లతో ఆఫీస్లకు కొత్త కళ వచ్చింది. దీంతో కరోనా మహమ్మారితో రిమోట్గా వర్క్ చేస్తున్న సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఎవరైతే ఆఫీస్లో పనిచేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆ ఉద్యోగులు.. ఆఫీస్లో ఐడీని స్వైప్ చేస్తారు. ఆ తర్వాత సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడే హెచ్ఆర్, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతుంటారు. ఆ తర్వాత డెస్క్కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అంటారు. ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే ఈ ఏడాదిలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ప్రతి 5 మందిలో 1 ఒకరు పూర్తిస్థాయిలో ఆఫీస్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది హైబ్రిడ్ వర్క్ను కోరుకుంటుంటే 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్ ల్యాబ్స్’ అనే సంస్థ తెలిపింది. రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్ ఓల్ ల్యాబ్స్ చేసిన అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడుతున్నారు. ధోరణి అక్కడితో ఆగలేదు. మరో 8 శాతం మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడడంతో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. సంస్థల్లో ప్రతి విభాగంలో ఒకరో, ఇద్దరో ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడినా కంపెనీలకు పెద్ద నష్టం ఉండేది కాదు. హై స్కిల్ ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీస్ పనిచేయకుండా కాఫీ కప్పులతో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేయడం యామాన్యాలకు మింగుడు పడడం లేదు. క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్లోపు ప్రాజెక్ట్లను పూర్తి చేయకపోవడం, ఇటు ఉద్యోగులు చేజారిపోకుండా కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. కాఫీ బ్యాడ్జింగ్ను పుల్ స్టాఫ్ పెట్టాలంటే 'కాఫీ బ్యాడ్జింగ్' ట్రెండ్ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. కమ్యూనికేషన్ను పెంపొందించాలి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఆఫీస్ వాతావరణం సైతం ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. -
ఆఫీస్లో కాసేపు పడుకోనివ్వండి!
ఆఫీస్ టైమ్లో చేసేపని కాస్త చాలెంజింగ్గా ఉంటే నిద్రకు అవకాశం ఉండదు. కానీ వర్క్లో ఎలాంటి చాలెంజ్ లేకుండా కూర్చొని చేసే కొన్ని పనుల్లో చాలాసార్లు నిద్ర వస్తూంటుంది. దాంతో ఉత్పాదకత తగ్గుతుంది. ఆఫీస్ టైమ్లో కొంతసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే జపాన్లో ఈ సంప్రదాయం ఉంది. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్ అవర్స్లో కొద్ది సేపు నిద్రపోవడం ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఆఫీస్ టైమ్లో న్యాప్ (కునుకు తీయడం) బ్రేక్ ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది చెప్పారు. మూడు శాతం మంది మాత్రం ఇలాంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆన్లైన్లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25–అక్టోబర్ 27 మధ్య ఈ సర్వే చేసినట్లు జీనియస్ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఆఫీస్ అవర్స్లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం మెరుగవుతుందని 82 శాతం మంది చెప్పగా, 12 శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది వెల్లడించారు. కానీ 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు. జపాన్లో పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్లో పడుకోవడం)’ విధానం మంచిదని, దాంతో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని 64 శాతం మంది చెప్పగా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది అన్నారు. ఇదీ చదవండి: రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే.. -
తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో మిస్సవుతున్న ఫర్నీచర్
-
పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే..
ఆఫీసు అంటేనే అక్కడ ఉన్న అందరితోనూ కలిసి పని చేయాలి. ఇలాంటప్పుడు ఎవ్వరితోనైనా కలిసి ఎలా పని చేయాలి? వర్కప్లేస్ ఎక్స్పర్ట్, స్పీకర్, రైటర్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పాడ్కాస్ట్ హోస్ట్ అమీ గలో కార్యాలయాలలో ఎలా ఉండాలో పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ‘గెటింగ్ ఎలాంగ్’ అనే ఈ బుక్ ఇప్పుడు పని ప్రదేశాల్లో ఉండే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలను అమీ గలో వివిధ రంగాల నుండి స్వయంగా సేకరించింది. ఈ యేడాది చదివి తెలుసుకోదగిన పుస్తకాలలో అమీ బుక్ ప్రముఖంగా నిలిచింది. వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలో అమీ సేకరించిన విషయాలు, సూచించిన పరిష్కారాలు ఉద్యోగులందరికీ ఎంతగానో తోడ్పడుతున్నాయి. పనిలో సంఘర్షణ ఉంటుంది. పనిచేసే చోట సంబంధాలు కఠినంగా ఉంటాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒత్తిడి ఉంటే మన సృజనాత్మకత, ఉత్పాదకత కూడా తగ్గుతుంది. స్పష్టంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ విషయాల గురించి రాత్రిపూట ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడపవచ్చు. ఈ ప్రవర్తన చేస్తున్న ఉద్యోగం వదులుకునేలా చేస్తుంది. చేస్తున్న పని నుండి బయటకు వచ్చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడవచ్చు. మీటింగ్లో కళ్లు తిప్పడం, ఎగరేయడం, సహోద్యోగులపై విరుచుకుపడటం లేదా మనం మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం కూడా మనల్ని ఉద్యోగం నుంచి వేరు చేస్తాయి. చాలావరకు నవ్వుతూ, వేరే మార్గం లేనట్టుగా వ్యక్తులను భరిస్తుంటారు. సరైన పరిష్కారాలు తెలియక హానికరమైన ప్రవర్తనలను భరిస్తుంటారు. ఇక్కడ చూడాల్సింది మనలోని చిత్తశుద్ధి, కెరియర్ మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్క్ప్లేస్ ఎక్స్పర్ట్ అమీ ‘గెటింగ్ ఎలాంగ్’లో కష్టతరమైన సహోద్యోగులను గుర్తించి, ఇలా మన ముందుంచింది. ►సరైన బాస్ లేకపోవడం: వీరిపై ఉద్యోగుల్లో విశ్వాసం ఉండదు. ఫలితంగా ఏదో విధంగా మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి బాస్ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించే ఎక్కువ ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి కష్టపడవచ్చు. ► నిరాశగా ఉండేవారు: ఇలాంటి వారితో సరైన ప్రోత్సాహం, కెరీర్లో పెరుగుదల ఉండదు. ► దూకుడుతనంగా ఉండటం: సహోద్యోగులు తమ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ధోరణి ఉండదు. తాము ఏదైనా తెలియజేయడానికి పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడానికి ఉన్నట్టు కనిపిస్తారు. ► అన్నీ తెలుసు అనే ఆలోచన: అత్యంత తెలివైన వారిగా చూపించుకోవడానికి తపన పడుతుంటారు. తగినంత సమాచారం లేకపోయినా, చెప్పేది తప్పు అని తెలిసినా తనదే కరెక్ట్ అనే ధోరణలో ఉంటారు. ► హింసించే వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే: సాధారణంగా ఒక సీనియర్ వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, అది మర్చిపోయి తన కింద ఉన్నవారితో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తన ప్రవర్తనతో ఇతరులు బాధపడుతున్నారా అనేది కూడా ఆలోచించరు. ►పక్షపాతంతో పనిచేసే సహోద్యోగి: పై స్థాయిలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వారిని పొగుడుతుంటాడు. ఏదైనా నీ కోసం చేస్తాను అంటారు. ► రాజకీయాలు చేసేవాళ్లు: ఈ వ్యక్తులు తమ కెరీర్ను ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకోసం అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. అబద్ధాలు చెబుతుంటారు. అభద్రత పెంచే భయం నాయకత్వ పాత్రను పోషించాల్సిన సందర్భంలో అభద్రత పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అధికారుల అతిపెద్ద భయం అసమర్థతే అని ఒక సర్వేలో తేలింది. సీనియర్ స్థానానికి ప్రమోట్ అయినప్పుడు పనితీరుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. కలిసిపోవడానికి ముఖ్యమైనవి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడానికి సహాయపడేది ముందుగా మన దృష్టి కోణం. అందుకు ఎదుటివారికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి గురించి తప్పుగా అనుకోకూడదు. సహోద్యోగి ఎంత సన్నిహితమైనా మన స్థాయిని మర్చిపోకూడదు. నియంత్రణలపై దృష్టి పెట్టాలి. సహోద్యోగిని మార్చమని పై అధికారులకు చెప్పే బదులు మనం విభిన్నంగా ఏం చేయగలమో వాటిపైన దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో నేరుగా పనులు చేసే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇ–మెయిల్ వంటి ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఒకరి దృక్పథాన్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే, సహోద్యోగి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వారు సహకరించకపోతే నేను మాత్రమే ఎలా పరిష్కరించగలను? ప్రతిదీ ప్రయత్నించాను.. కానీ, ఇప్పుడు ఎలా? ... ఇలాంటి ప్రశ్నలు కొన్ని సార్లు భయానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. పనిలో కష్టతరమైన సంబంధాలను కొనసాగించడానికి, వ్యక్తుల మధ్య మంచి బంధాలను పెంపొందించడానికి గెటింగ్ ఎలాంగ్ ఒక మంచి గైడ్లా ఉపయోగపడుతుంది. టీమ్ వర్క్ బాస్ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను గుర్తించాలి. సంవత్సరాంతపు లక్ష్యాలను చేధించడం, వర్క్పాలసీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఉద్యోగులపై ఉన్న అభద్రతా భావాలను తొలగించగలగాలి. పనిని ఉమ్మడిగా చేయడానికి ప్రయత్నించాలి. పై అధికారి దగ్గర సాధ్యమైనంతవరకు ‘మేము’ వాక్యాన్నే జోడించాలి. ఉదాహరణకు..‘ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి ‘మేమంతా’ కష్టపడ్డాం. టీమ్గా ఇంకా బాగా కనిపించాలనే మేమంతా కోరుకుంటున్నాం’ అని విజయం సాధించినప్పుడు బాస్కు తెలియజేయాలి. పనిలో టీమ్ సహకారం ఎంత ఉందో తెలియజేయాలి. ఆఫీసులో స్నేహాలు ‘గెటింగ్ ఎలాంగ్ కోసం నేను న్యూరోసైన్స్, వ్యక్తుల హావభావాలలో చూపించే తెలివి, చర్చలు, మేనేజ్మెంట్ సైన్స్.. వంటి వివిధ అంశాల నుండి విషయ సేకరణ చేశాను. స్నేహితుల బృందాలు ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. సపోర్టివ్గా ఉండే సహోద్యోగులతో ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల సమాచారం, ఆలోచనలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం, సాధన పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాలు ఎలా ఉంటున్నాయో కూడా దీని ద్వారా అర్ధమవుతుంది. స్నేహాలు కెరీర్కు కూడా మంచివి. స్నేహితులుగా భావించే సహోద్యోగుల బృందాలు, వారి పనితీరుపై చేసే పరిశోధనలో ఎక్కువ ఉత్పాదకత వచ్చింది. – అమీ గలో -
పోలీసు సిబ్బందిని భయపెడుతున్న దెయ్యం!
ఆదిలాబాద్టౌన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దెయ్యం ఉందంటూ పుకార్లు సాగుతున్నాయి. దీంతో రాత్రి వేళలో నిద్రిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వారు సైతం కార్యాలయంలో దెయ్యం ఉన్నట్లు సిబ్బందితో తెలిపిన ట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మాంత్రికుడిని తీసుకొ చ్చి అక్కడి మరుగుదొడ్లను చూపించగా.. అక్క డ దెయ్యాలున్నాయని చెప్పడంతో కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డీఈవో విషయాన్ని జన విజ్ఞాన వేదిక దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సిబ్బందితో పాటు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, రవీందర్రెడ్డితో పాటు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ రాత్రి సమయంలో కార్యాలయంలో నిద్రించారు. తమకు ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని, దెయ్యం ఉన్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా, దెయ్యాలు లేవని, కావాలనే కొంత మంది పుకార్లు చేస్తున్నారని వివరించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పదా న్ని పెంపొందించాలి్సన విద్యాశాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చోద్యంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కేసీఆర్కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు. బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
టీసీఎస్లో మరో కొత్త సమస్య! ఆఫీస్కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..
ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి దాదాపుగా స్వస్తి పలికాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ ఆఫీస్లకు రావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఆఫీల బాట పడుతున్నారు. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో మరో సమస్య ఎదురైంది. పని చేసేందుకు సీట్ల కొరత టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ఓ వైపు ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఆఫీస్కు వెళ్తున్న ఉద్యోగులకు మరో కొత్త సమస్య వచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీస్ నుంచి పనిచేసేందుకు రావడంతో వారికి తగినన్ని సీట్లు అందుబాటులో లేవు. దీంతో వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. దీంతో సీట్ల కొరత ఏర్పడింది. కారిడార్లు, లాబీల్లో.. అకేషనల్ ఆక్యుపేషన్ జోన్లు అని పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను కంపెనీ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఉద్యోగులందరికీ తగినన్ని సీట్లు లభించగా కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే రోజంతా ఇలా పనిచేయడానికి చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురించింది. (టీసీఎస్కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) ఆఫీస్కి రావాల్సిందే.. వారంలో ఐదు రోజులూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందేనని టీసీఎస్ ఉద్యోగులను అభ్యర్థిస్తోంది. కొన్ని బృందాలకు వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాలకే రావాలని, తమ ఇళ్లకు దగ్గరగా ఉండే ఆఫీస్లు కావాలంటే కుదరదని చెప్పడం గందరగోళానికి తోడైంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులందరికీ సాఫీగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని టీసీఎస్ హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని ఆఫీస్లు ఇరుగ్గా ఉండటం, మరికొన్నింటిలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. (TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!) అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని, లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని తమ టీం మేనేజర్లు తెలియజేసినట్లు కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 2,000-3,000 సిటీ అలవెన్స్ లభిస్తుంది. కానీ తమ సౌకర్యం కోసం కొందరు ఉద్యోగులు ఈ అలవెన్స్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
‘ఇంట్లోనే కూర్చోండి’.. ఉద్యోగులకు అమెజాన్ హెచ్చరిక!
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని అతిక్రమించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సమస్య తీవ్రతను బట్టి లేఆఫ్స్ ప్రకటిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ ఇటీవల సంస్థలో రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు సార్లు ఆఫీస్ రావాల్సిందేనని పట్టు బట్టింది. అయితే, సుదీర్ఘ కాలంలో ఇంటి వద్ద నుంచే పనిచేసిన సిబ్బంది ఆఫీస్కు వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం, వారానికి 3 రోజులు కూడా ఆఫీస్కి రాకపోతే ఎలా? అని ప్రశ్నించింది. పైగా ఆఫీస్కి వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగుల్ని తొలగించే వెసులుబాటును మేనేజర్లకు కల్పించింది. తొలగింపులపై ఇంటర్నల్గా వర్క్ ఫోర్స్కి సమాచారం అందించే పోర్టల్ నోటీసుల్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. ఆ నోటీసుల్లో రిటర్న్ టూ ఆఫీస్, ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా లేని ఉద్యోగులతో మూడు దశల్లో వ్యవహరించాల్సిన తీరును పొందుపరిచింది. మొదటి దశలో, మేనేజర్లు వారానికి మూడు సార్లు ఆఫీస్కు వచ్చే అవసరాన్ని పాటించని ఉద్యోగులతో వ్యక్తిగతంగా మాట్లాడి భవిష్యత్ కార్యచరణను రూపొందించాలి. మొదటి దశలో సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి 1 నుంచి 2 వారాల పాటు ఆఫీస్కి వచ్చేలా చూడాలి. అప్పటికి నిరాకరిస్తే, మేనేజర్ మరో సమావేశాన్ని నిర్వహించాలి. ఆపై సదరు వాళ్లనే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తిరిగి ఆఫీస్కి వచ్చేలా ప్లాన్ చేయడం తప్పని సరి. రెండో దశలో సరైన కారణం లేకుండా వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తూ వర్క్ కొనసాగడం క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇవ్వాలి. చివరిగా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగికి వ్రాతపూర్వక హెచ్చరిక లేదా ఫైర్ చేస్తూ హెచ్ఆర్ విభాగానికి తోడ్పాటు నందించేలా చూడాలని మేనేజర్లకు సూచించింది. చదవండి👉‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో -
వారంలో 3 రోజులు ఆఫీసుకు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వారంలో మూడు రోజులపాటు కార్యాలయానికి వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. సుదూర ప్రాంతం నుంచి పనిచేసే విధానం కొనసాగింపు సరైన ఆలోచనకాదంటూ కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయ్కుమార్ పేర్కొ న్నారు. వెరసి సంస్థ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీ సుకు హాజరై విధులు నిర్వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వారంలో ఏ మూడు రోజులు అన్న విషయంలో స్వల్ప వెసులుబాటు(ఫ్లెక్సిబిలిటీ) కలి్పంచనున్నట్లు తెలియజేశారు. కోవిడ్–19 కారణంగా ఇంటి నుంచే విధుల(వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి బీజం పడగా.. ఇటీవల పలు ఐటీ దిగ్గజాలు తిరిగి ఆఫీసునుంచి బా« ద్యతల నిర్వహణకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీసీఎస్ ఇప్పటికే..: బుధవారం క్యూ2 ఫలితాలు వెల్లడించిన టీసీఎస్ 6.14 లక్షల మంది సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించవలసిందిగా ఆదేశించినట్లు వెల్లడించిన విషయం విదితమే. ఇక మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల విధుల విషయంలో వెసులుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అత్యధిక శాతం సిబ్బంది ఆఫీసులకు తరలి వస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. సుదూర ప్రాంతాల నుంచి పనిచేయడం ద్వారా అటు సిబ్బందికి, ఇటు సంస్థకు ప్రయోజనకరంకాదని విజయ్కుమార్ వ్యా ఖ్యానించారు. ఇది సరైన ఆలోచనకాదని, దీంతో వారంలో మూడు రోజుల పని విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 60 శాతంమంది కార్యాలయాలకు హాజరవుతుండగా.. సిబ్బంది మొత్తానికి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. -
తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా కుంచనపల్లిప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో బయటవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్ఆర్ పేటకు చెందిన నాయుడు పవన్ ఉన్నారని చెప్పారు. -
ఆరు పట్టణాల్లో పెరిగిన గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్పేస్ - అక్కడే అధికం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల (గ్రీన్ సర్టిఫైడ్) ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో గడిచిన మూడున్నరేళ్లలో 36 శాతం పెరిగి 342 చదరపు అడుగులకు చేరుకుంది. 2019 నాటికి గ్రీన్ ఆఫీస్ స్పేస్ 251 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, వాణిజ్య సంఘం సీఐఐ సంయుక్తంగా ఓ నివేదిక రూపంలో తెలియజేశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈఎస్జీ నియంత్రణలపై దృష్టి సారించడం.. ఆధునిక, ప్రీమియం, పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులకు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో డిమాండ్ను పెంచుతుందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది. ఈఎస్జీ, దాని అమలుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆధునిక, టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ అనుకూల వసతులకు రానున్న త్రైమాసికంలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి పర్యావరణ అనుకూల కార్యాలయ వసతుల్లో 68 శాతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలోనే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్లో 51.9 మిలియన్ చదరపు అడుగుల మేర పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులు ఉంటే, బెంగళూరులో 104.5 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 70.2 మిలియన్లు, ముంబైలో 56.6 మిలియన్లు, చెన్నైలో 32.6 మిలియన్లు, పుణెలో 26.2 మిలియన్ చదరపు అడుగుల చొప్పున ఈ వసతులు ఉన్నట్టు వెల్లడించింది. పర్యావరణ అనుకూల, ఇంధన ఆదా కార్యాలయ భవనాలకు దేశీ, బహుళజాతి కంపెనీల నుంచి డిమాండ్ పెరిగినట్టు అర్బన్ వోల్ట్ సహ వ్యవస్థాపకులు అమల్ మిశ్రా ఈ నివేదికలో పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలపై పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శమన్నారు. -
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తమ జ్ఞాపకాలను నేతలు గుర్తుచేసుకున్నారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు. వైఎస్సార్ మనసున్న నాయకుడు. మనసుతో పాలన చేసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ అడుగుజాడల్లోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని సజ్జల అన్నారు. ‘‘వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో ఉండటం మన అదృష్టం. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి వైఎస్సార్. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో.. సీఎం జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రంలో 60 శాతానికిపైగా ప్రజలు తిరిగి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి భూమన నివాళులర్పించారు. వైఎస్సార్ మనల్ని విడిచి 14 ఏళ్లు అయినా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారనీ, ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్: మంత్రి పెద్దిరెడ్డి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో.. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఆఫీసు స్పేస్ అధరహో.. తాజా నివేదిక
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో 4-4.5 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరుగుతాయని కొలియర్స్ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ఆర్థికక దృక్పథంతో పాటు అమెరికా, యూకే, యూరప్ దేశాలకు ప్రధాన వ్యాపార వనరు ఇండియా కావటంతో ఇక్కడి ఆఫీసు స్పేస్పై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు రెపో రేట్లు స్థిరమైన దశలోకి చేరుకున్నప్పటికీ జీఎస్టీ వసూళ్లు, తయారీ, సేవా రంగాలు, ఈక్విటీ మార్కెట్ల వేగంతో ఈ వృద్ధి అవకాశాలున్నాయని కొలియర్స్ ఆఫీసు సర్వీసెస్ ఎండీ పీష్ జైన్ అన్నారు. ♦ ఆరు నగరాలలో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.01 కోట్ల చ.అ. స్థూల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. రెండో త్రైమాసికం (క్యూ2) నాటికి 46 శాతం వృద్ధి రేటుతో 1.46 కోట్ల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ1లోని ఆఫీసు స్పేస్ లావాదేవీలలో టెక్నాలజీ రంగం వాటా 24 శాతంగా ఉండగా.. 18 శాతం ఫ్లెక్సిబుల్ స్పేస్, 17 శాతం ఇంజనీరింగ్ మరియు తయారీ రంగం వాటాలున్నాయి. క్యూ2 నాటికి టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాలు 5శాతం వృద్ధిని సాధించాయి. ఇంజనీరింగ్, తయారీ రంగాలు క్యూ1తో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. కీలక రంగాలలో ఆరోగ్యకరమైన వృద్ధి, లీజుదారులకు విశ్వాసం పెరగడం వంటి కారణంగా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) నగరంలో 40-60 లక్షల చ.అడుగులు హైదరాబాద్లో క్యూ1లో13 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 19 శాతం వృద్ధి రేటుతో 15 లక్షల చ.అ.లకు పెరిగింది. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 40–60 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరుగుతాయని కొలియర్స్ అంచనా వేసింది. వివిధ విభాగాలలో డిమాండ్, వ్యాపార సెంటిమెంటే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్లో 37 శాతం, సింగపూర్లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్లతోనే సరి! తమకు మీటింగ్లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం
Atlassian CEO Scott Farquhar కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ సమయంలో కంపెనీలకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' బాగా ఉపయోగపడింది. కరోనా తగ్గిపోవడంతో దాదాపు అన్ని కంపెనీలు 'హైబ్రిడ్' విధానానికి స్వస్తి పలికి, ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నాయి. ముఖ్యంగా 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' విధానాన్ని సమర్ధిస్తున్న వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రముఖంగా నిలుస్తారు. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులనుంచి తక్కువ ఫలితం ఉంటుందనేది ఆయన వాదన. అయితే అట్లాసియన్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో బిలియనీర్ స్కాట్ ఫర్క్హార్ మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నాడు 2023లో 8.2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ఆస్ట్రేలియాలో 7వ అత్యంత సంపన్నుడైన స్కాట్ ఇంటి నుండి పని చేయడమే మేలు అంటాడు. తన ఉద్యోగులను కూడా ఇంటినుంచి పనికే ప్రోత్సహిస్తున్నాడు. Hello from @Atlassian India! This a key R&D hub for us and our fastest growing region. From hiring our first employee here five years ago to 1,700 people today and growing with 50% working remote. And already kicking goals as 8th Best Place to Work. I am so proud of this team. pic.twitter.com/spnEFigqOS — Scott Farquhar (@scottfarkas) August 11, 2023 డైలీ మెయిల్ ప్రకారం స్కాట్ తన కంపెనీలు చాలామంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతినిచ్చాడు. తద్వారా వారు పనిలో మరింత ఉత్పాదకతను కలిగి ఉంటారనీ, ఏకకాలంలో అటు ఉద్యోగం, ఇటు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది స్కాట్ విశ్వాసం. ఇళ్ల రేట్లు బాగా ఉండే ఖరీదైన నగరం సిడ్నీలో అట్లాసియన్ ప్రధాన కార్యాలయం ఉంది.ఇక్కడ అద్దెలు ఎక్కువే. దీనికి తోడు భయంకరమైన ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు రావాలంటే గంటల సమయం పడుతోంది. ఇదే తనను రిమోట్ వర్కింగ్పై మళ్లించిందని చెప్తాడు. అంతేకాదు స్వయంగా స్కాట్ ఫర్క్హర్ 3 నెలలకు ఒకసారి కార్యాలయానికి వెళ్తాడు. సిడ్నీలో హౌసింగ్ వెనుక భారీ మొత్తం చెల్లించే బదులు, ఉద్యోగులు మంచి జీవితాన్నిగడిపేలా నగరానికి కొంచెం దూరంగా బీచ్ సైడ్ అపార్ట్మెంట్లలో ఉండవచ్చని, అలాగే ఇంటినుంచి పనిచేస్తే ఆఫీస్కు వచ్చి పోయే సమయం కూడా ఆదా అవుతుంది అంటాడు. తన ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేశారనేది కాకుండా వారిచ్చే ఔట్పుట్ ఏంటి అనేదే తనకు ముఖ్యమని ఫర్క్హార్ చెప్పుకొచ్చారు. -
కోర్టు కాంప్లెక్స్లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
ప్రభుత్వాఫీస్లో అధికారి జల్సాలు..
లక్నో:ప్రజలకు సేవచేయాల్సిన స్థానంలో ఉండి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ప్రభుత్వ ఆఫీసులు తమ సొంత నివాసాలుగా భావిస్తుంటారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో జల్సాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో ఓ ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించాల్సిన సమయంలో కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని హర్డోయ్ జిల్లాలో కపూర్ సింగ్ అనే అధికారి స్వైజ్పూర్ రిజిస్టర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీస్కు వచ్చి టేబుల్ మీదే దర్జాగా మద్యం సేవించారు. ఓ చేతిలో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో మద్యం సేవిస్తూ స్థానిక మీడియాకు చిక్కారు. ఈ వీడియో వైరల్గా మారింది. #हरदोई- सरकारी दफ्तर में एक कर्मचारी का शराब पीते वीडियो वायरल,रजिस्ट्री ऑफिस सवायजपुर में तैनात चपरासी कपूर सिंह का दारू पीने का वीडियो हुआ वायरल,ऑफिस में जाम छलकते नजर आ रहा है कर्मचारी,हरदोई के सवायजपुर रजिस्ट्री ऑफिस का बताया जा रहा है @hardoipolice#ViralVideos @dmhardoi pic.twitter.com/5gVKmrEI6u — anuj Pal (@anujPal50037043) August 27, 2023 సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పంజాబ్లోని హోషియాపూర్లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్లోనే మద్యం సేవించిన ఘటన మరవకముందే యూపీలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. -
ఇలా కూడా నిద్రపోవచ్చా!..అబ్బా!.. వర్క్ప్లేస్లో కూడా..
సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్ కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్ పాడ్స్లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చు. ‘గిరాఫెనాప్’ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్ పాడ్స్ను రూపొందించారు. ఇది చూడటానికి పాతకాలం టెలిఫోన్ బూత్లా ఉన్నా, ఇందులో చాలా సౌకర్యాలే ఉంటాయి. ఇందులో కూర్చుని, డెస్క్పై పనిచేసుకోవచ్చు. నిలబడి కునుకు తీయాలనుకుంటే, ఇందులోని ఒక మీట నొక్కితే చాలు– కూర్చీ నిలువునా పైకి లేస్తుంది. ఇందులో తలవాల్చుకునేందుకు దిండు కూడా ఉంటుంది. మన ఎత్తుకు తగినట్లుగా దిండు ఎత్తును సవరించుకునే వెసులుబాటు కూడా ఉంది. పని ప్రదేశాల్లో నిద్రపోవడాన్ని అనుమతించే జపాన్లో ఇదొక కొత్త ఆకర్షణగా మారింది. (చదవండి: ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!) -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా
-
ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!
ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు...‘ఆఫీసు వర్క్ చేస్తారు’ అని మాత్రమే ఊరుకోనక్కర్లేదు. ‘భాంగ్రా డ్యాన్స్ కూడా చేస్తారు’ అని భేషుగ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిప్పుడు ఒక ట్రెండ్గా మారనుంది. విషయంలోకి వస్తే... డల్ వర్క్డేకు ఒక కార్పొరేట్ కంపెనీ ఫన్ ట్విస్ట్ ఇచ్చింది.‘పనిచేసింది చాలు. ఇప్పుడిక భాంగ్రా నేర్చుకోండి’ అంటూ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్, డ్యాన్సర్ సాహిల్శర్మను ఆఫీసుకు తీసుకువచ్చింది. ‘లెట్స్ డ్యాన్స్’ అంటూ శర్మ భాంగ్రా స్టెప్పులు స్టార్ట్ చేయడంతో ఉద్యోగులు ఎవరి డెస్క్ల దగ్గర వారు అతడిని అనుసరించి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ‘ఐ వాంట్ యాన్ ఆఫీస్ లైక్ దిస్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో 2.9 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘గుడ్ ఐడియా. 9 టు 5 జాబ్ వల్ల ఉద్యోగులు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. హుషారు వస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. View this post on Instagram A post shared by Sahil sharma (@sahil_sharma0007) (చదవండి: సిరియా భూకంప శిథిలాల్లో బొడ్డుతాడుతో దొరికిన మిరాకిల్ బేబి ఎక్కడుందో తెలుసా!) -
ఆఫీస్కు రావడం తప్పనిసరి కాదు.. భిన్నంగా ఆ ఐటీ కంపెనీ తీరు
Return to office not mandatory: వర్క్ ఫ్రం హోమ్కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు నానా అవస్థలు పడుతుంటే తమ ఉద్యోగులు ఆఫీస్కు రావడం తప్పనిసరి కాదు అంటోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో రవి కుమార్ స్వయంగా తెలిపారు. "ఉద్యోగుల్లో ఫ్రెషర్లు కూడా ఉన్న నేపథ్యంలో సమూహంగా పనిచేయడం అవసరమని మేము భావిస్తున్నాం. వారికి వారిని చేయి పట్టి నడిపించడం అవసరం. కానీ మేనేజర్లు, సీనియర్ ఉద్యోగులు ఆఫీస్కి రాకపోయినా ఎటువంటి ప్రభావం ఉండదు" అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తాజా ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి తమ ఫ్లెక్సిబుల్ రిటర్న్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఐటీ సేవల సంస్థలలో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించేందుకు అత్యంత దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఓ పెట్టుబడిదారుల సదస్సులో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ, పెద్ద నగరాల్లో 80,000 సీట్లను తగ్గించి, టైర్-2 నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్ఫోర్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్లను పెంచడానికి 400 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్ను ప్రారంభించింది. Google Back To Office Offer: గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ! -
భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
Tesla: ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశంలో టెస్లా (Tesla) కంపెనీ ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సంస్థ కోసం టేబుల్స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కోసం పూణే విమాన్ నగర్లోని పంచశీల్ బిజినెస్ పార్క్లో కార్యాలయ స్థలాన్నిఅద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టెస్లా బృందం గత వారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి సంబంధించిన ప్రోత్సాహకాలను, ప్రయోజనాలను గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్.. టెస్లా యూనిట్.. భారతదేశంలో టెస్లా యూనిట్ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. సుమారు 5,580 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్పేస్ కోసం నెలకు అద్దె రూ. 11.65 లక్షల వరకు ఉండనుంది. అద్దె 2023 అక్టోబర్ 01 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ స్పేస్ను 5 సంవత్సరాలు లీజుకి తీసుకున్నట్లు, ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 34.95 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ గడువును పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో ఒక సారి బెంగళూరులో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని సంస్థ యోచిస్తోంది. -
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్! ఏంటంటే ఇది..!
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్లు ఉంటాయి. అది కామన్గా అన్ని ఆఫీసుల్లోనూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కూడా. కానీ ఇక నుంచి వాటి తోపాటు వై బ్రేక్ ఉంటుందట. ఆ..! ఏంటి ఇది అనుకోకండి. అంటే విరామ సమయాన్ని తగ్గించేందుకు ఇలా యజమాన్యం చేస్తుందా అని డౌట్ పడోద్దు. ఎందుకంటే? ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనట. అసలేం జరిగిందంటే..భారతదేశంలో మిలియన్ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని ఓ సర్వేలో తేలింది. కొందరూ ఉద్యోగాలు ఆఫీస్లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంతవరకు అధికారులు సర్వేలు చేయడం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయడమే చేశారు అందరూ. కానీ ఇప్పుడూ సీరియస్గా తీసుకుని అందుకోసం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యాయి పలు సంస్థలు, ప్రభుత్వాలు. ఈ మేరకు గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్' అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో 'యోగా'ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేసి పని చేయగలిగే సామర్థ్యం పెంచుకునే ఓ సువర్ణావకాశాన్ని ఉద్యోగులు కల్పించేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే ఈ 'వై' బ్రేక్ని కార్యాలయాల్లోకి తీసుకురానుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్గా తయారవ్వతారని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు హ్యుమన్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్ మార్కస్ రాన్నీ ఈ విధానాన్ని స్వాగతించారు. ఆయన ఈ విధానం వల్ల ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్గా ఉండేదుకు దోహదపడుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుంది. అలాగే భావోద్వేగ ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఇందులో చేసే '"బ్రీథింగ్ ఎక్స్ర్సైజ్"లు కారణంగా.. లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుంది. అలాగే ఉద్యోగుల ధ్యాస వేరేవాటిపైకి పోకుండా ప్రస్తుత పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది యోగా. తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, సమస్యలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ 'వై బ్రేక్'ని కార్యాలయాల్లోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు ఫిట్గా ఉండి పని బాగా చేస్తారు. లీవ్ పెట్టే వాళ్ల సంఖ్య తగ్గిపోయి, పని సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా సంస్థ మంచి లాభాలను ఆర్జించగలదని అన్నారు. అలాగే జర్నల్ ఆప్ ఆక్యుపేషనల్ హెల్త్కి సంబంధించిన ఆరోగ్య నిపుణులు కూడా ఈ యోగా ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానిసింగ్ స్ట్రాంగ్ చేయగలదన్నారు. తాము జరిపిన అధ్యయనాల్లో ఆ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. దీన్ని క్షేత్ర స్థాయిలో అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హుడ్జ్ వ్యవస్థాపకుడు మార్కస్ చెప్పడం గమనార్హం. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
ఏం చేసినా పడుండాలా?, బాస్కి దిమ్మతిరిగేలా రిప్లై..డేరింగ్ లేడీ అంటున్న నెటిజన్లు!
కొత్త జాబ్, ఆఫీస్. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్ వాతావరణం, బాస్ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్కు రిజైన్ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్, ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు. ‘బాస్ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు. ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది. చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్.. మంచి నిర్ణయం తీసుకున్నావ్, నువ్వు డేరింగ్ లేడీ అంటూ అభినందిస్తున్నారు. I quit after 3 days by u/QueenMangosteen in antiwork చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
హెల్మెట్ పెట్టుకొని ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులు
-
బైజూస్ ఆఫీస్లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీసు ఇండియాలోనే..చూస్తే వావ్ అంటారు! (ఫోటోలు)
-
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలో ఎత్తైన భవనాలు, లగ్జరీ మాన్షన్స్ అనగానే మనకి దుబాయ్ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్ నిర్మాణం ఆసక్తికరంగా మారింది. పాపులర్ పెంటగాన్, బుర్జ్ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్ కేంద్రంగా. డైమండ్స్ అనగానే జెమ్ క్యాపిటల్, గుజరాత్లోని సూరత్ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేకింగ్ బిల్డింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గుజరాత్లోని సూరత్లో రానున్న భవనం పెంటగాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. (యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు ) Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv — Narendra Modi (@narendramodi) July 19, 2023 బెల్జియన్ నగరమైన ఆంట్వెర్ప్ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ నగరం ఇపుడు యుఎస్లోని ఆర్లింగ్టన్లోని పెంటగాన్, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్లో నిలిచింది. ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ప్రపంచంలో టాప్లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్ నిర్మించడానికి నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్తో అద్భుతమైన ఈ భవనంలో ఈ సంవత్సరం 65వేల ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది నవంబర్లో అఫీషియల్గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్ సీఈవో మహేష్ గాధవి మాటల్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్ను సూరత్లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
నిలకడగా ఆఫీస్ అద్దెలు.. హైదరాబాద్లో డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు అద్దెలు దేశవ్యాప్తంగా ఆరు ముఖ్య పట్టణాల్లో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ పట్టణాల్లో చదరపు అడుగు అద్దె సగటున రూ.95గా ఉంది. ఈ పట్టణాల్లో 32 శాతం అదనపు కార్యాలయ వసతి ఈ కాలంలో అందుబాటులోకి వచి్చంది. ఇక కార్యాలయ స్థలాల కోసం డిమాండ్ 2 శాతం పెరిగింది. హైదరాబాద్తో పాటు పుణె, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. స్థూల ఆఫీసు స్పేస్ లీజు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలో పోలి్చచూసినప్పుడు, 2 శాతం పెరిగి 14.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి లీజు కోసం డిమాండ్ పెరిగింది. ఢిల్లీల్లో వృద్ధి ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు 11 శాతం పెరిగి 3.1 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కొత్తగా కార్యాలయ స్థలాల అందుబాటు. 43 శాతం పెరిగి 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.94.20గా ఉంది. ముంబైలో ఆఫీస్ స్పేస్ లీజు 41 శాతం క్షీణించి 1.6 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. నూతన సరఫరా 79 శాతం తగ్గి 0.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు రూ.140.10గా నమోదైంది. పుణెలో లీజు పరిమాణం 1.7 మిలియన్ చదరపు అడులుగా ఉంటే, ఒక చదరపు అడుగు అద్దె రూ.76.70గా ఉంది. నూతర సరఫరా 52 శాతం పెరిగి 0.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. హైదరాబాద్లో డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు జూన్ త్రైమాసికంలో 22 శాతం క్షీణించి 1.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజు పరిమాణం 1.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనించొచ్చు. అయితే, కార్యాలయ స్థలాల నూతన సరఫరా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 19 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ కార్యాలయ వసతి అద్దె చదరపు అడుగుకు రూ.73.70గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.73.60గా ఉండడం గమనార్హం. చెన్నై మార్కెట్లో అత్యధికంగా ఆఫీస్ స్పేస్ లీజు మూడు రెట్లు పెరిగి 3.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ కొత్త సరఫరా 2.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఆఫీస్ అద్దె చదరపు అడుగుకు రూ.75.1గా ఉంది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్ అద్దె రూ.91.90గా నమోదైంది. ఆఫీస్ స్పేస్ లీజు పరిమాణం 22 శాతం తగ్గి 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నూతన సరఫరా రెండింతలు పెరిగి 3.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. -
భారత్లో ఆఫీస్ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని..
మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో ఇంటెల్ కోత విధించింది. తాజాగా, భారత్లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రూ.450 కోట్ల విలువైన ఆఫీస్ బిల్డింగ్ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల లీజ్కు అయితే, అమ్మకం పూర్తయిన త్వరాత అదే ఆఫీస్ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయనుంది. నిజమే.. అమ్ముతున్నాం బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న ఆఫీస్ను అమ్ముతున్నారనే నివేదికపై ఇంటెల్ ప్రతినిధులు స్పందించారు. అమ్మకం నిజమేనని, హైబ్రిడ్ ఫస్ట్ కంపెనీగా, మా ఉద్యోగులు ఆన్ సైట్లో పనిచేస్తున్నప్పుడు వారి కోసం వర్క్స్పేస్లను రూపొందించేలా స్పేస్ వినియోగాన్ని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకుంటున్నామని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 14,000 మంది ఉద్యోగులు బెంగళూరు ఇంటెల్ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. కంపెనీ చరిత్రలోనే భారీ నష్టం కోవిడ్-19 కారణంగా మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్బీసీ నివేదిక తెలిపింది. ఈ పరిణామాలతో ఇంటెల్ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సొంత ఆఫీస్ బిల్డింగ్ను అమ్మేసి.. లీజుకు తీసుకుంటుందని సమాచారం. చదవండి👉 29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా! -
బూట్లతో జాతీయ జెండా దిమ్మైపెకి..
మెదక్ : జాతీయ జెండా గద్దైపెకి ఓ పోలీసు అధికారిణి బూట్లతో ఎక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తన మొబైల్ ఫోన్లో వీడియో తీయడానికి అక్కడికి వచ్చిన ఏఎస్ఐ స్వరూపరాణి కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ జెండా గద్దైపెకి బూట్లు తీయకుండా ఎక్కారు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారి తీరుపై పలువురు విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన ఓ అధికారి ఇలా చేయడం తగదని అన్నారు. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
రిటర్న్ టు ఆఫీస్ గూగుల్ వార్నింగ్: ఉద్యోగులేమంటున్నారంటే!
న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి తీరాల్సిందే అంటూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాల పట్ల ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగులు ఒక ప్రకటన విడుదల చేశారు రాత్రికి రాత్రే ఉద్యోగుల పనితీరు వృత్తి నైపుణ్యాన్ని అవమానపరిచేలా, అస్పష్టమైన అటెండెన్స్ ట్రాకింగ్ పద్ధతులకు అనుకూలంగా మారిపోవడం విచారకరం అంటూ గూగుల్ ఉద్యోగి క్రిస్ ష్మిత్ పేర్కొన్నారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్కు చెందిన కొంతమంది కాంట్రాక్ట్ ,ప్రత్యక్ష ఉద్యోగుల తరపున ఆయన ఈ ప్రకటన జారీ చేశారు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో భౌతికంగా హాజరయ్యేలా మార్చిలో, గూగుల్ తన హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్డేట్ చేసింది. తాజాగా వారానికి మూడు రోజులు ఆఫీస్కు రాకుంటే చర్యలు తప్పవని గూగుల్ ఉద్యోగులకు గూగుల్ హెచ్చరించింది. అంతేకాదు రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులకు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ ఇవ్వనున్నామని, హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేసింది. అంటే అటెండెన్స్ సరిగా లేని వారికి శాలరీ హైక్స్, ప్రమోషన్స్లో ప్రభావం పడనుంది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర) ఉద్యోగులు చాలామంది తిరిగి ఆఫీసులకు వస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అలాగే హైబ్రిడ్ పని విధానం, ఇంటి నుండి పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పోల్చి చూసేలా దీన్ని డిజైన్ చేశామని గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోంట్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆఫీసులో టీంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఉద్యోగులను తిరిగి పనిలోకి రావాలంటున్న కంపెనీల్లో గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్ కూడా గతంలోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 2వేల మంది అమెజాన్ ఉద్యోగులు వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ఆదేశాలు, సామూహిక తొలగింపులు వ్యతిరేకంగా గతంలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగుల తాజా ప్రకటన చర్చకు దారీ తీస్తోంది. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
కోకాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
-
నిలువునా ముంచిన ముఠా టార్గెట్ ఇక్కడ యువతే..!
-
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
-
లవర్కి ఊహించని షాకిచ్చిన యువతి.. నేరుగా ఆఫీస్కు వెళ్లి
భోపాల్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి అతని ఆఫీస్కు వెళ్లి చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈ ఘటన బీహార్లో భాగల్పూర్లోని చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. భాగల్పూర్లోని మధుసూదన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భథోడియా గ్రామానికి చెందిన కరిష్మా అనే యువతి అదే గ్రామానికి చెందిన రోహిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా యువతి పెళ్లికి పట్టుబట్టడంతో రోహిత్ ఆమె నుదుటిపై సిందూరం పెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, రోహిత్ కుటుంబం కరిష్మాను కోడలిగా అంగీకరించలేదు. అంతేకాకుండా ఆమెను వారి ఇంటి నుంచి గెంటేసారు. దీంతో కరిష్మా అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో రోహిత్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత రోహిత్ బెయిల్పై బయటికి వచ్చాడని తెలిసి కరిష్మా నేరుగా అతన పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్లింది. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ అందరి ముందు కాలర్ పట్టుకుని నిలదీసింది. అతను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అందరూ చూస్తుండగానే షర్టు పట్టుకుని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకవేళ అతను పెళ్లికి నిరాకరిస్తే విషం తీసుకుంటానని బెదిరించింది. దీంతో రోహిత్ పని చేస్తున్న ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. తదుపరి విచారణ కోసం ఇద్దరి కుటుంబాలను కూడా పిలిపించారు. చదవండి: మెుబైల్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్.. -
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న టెన్షన్
-
ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్లో జైపూర్లోని యోజన భవన్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్లో బేస్మెంట్లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్మెంట్లోని అల్మార్్లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023 (చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!) -
'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు. కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్దళ్, పీఎప్ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ..బజరంగ్ దళ్ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సమానం అని కాంగ్రెస్ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం. (చదవండి: బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్) -
కర్ణాటక బీజేపీ ఆఫీస్లో కింగ్ కోబ్రా.. సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే..
బెంగళూరు: కర్ణాటక శిగ్గావ్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్లో కింగ్ కోబ్రా కన్పించడం కలవరపాటుకు గురిచేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్లో ఉన్న సమయంలో కోబ్రా కన్పించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. #WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7 — ANI (@ANI) May 13, 2023 #WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt — ANI (@ANI) May 13, 2023 కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 60-65 స్థానాలకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మంచి 130 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. అటు కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్ కేవలం 22 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం
-
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆయన ఆఫీస్ రిబ్బన్ను కట్ చేశారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్ విహార్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్ భేటీ అయ్యారు. మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్ గ్రౌండ్లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్లను సిద్ధం చేశారు. సూట్ రూమ్లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు. ఆంక్షలతో ఆలస్యం ఢిల్లీలోని వసంత్ విహార్లో 2021 సెప్టెంబర్ 2న కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇదీ చదవండి: ‘బీజేపీని తరిమికొట్టే టైం వచ్చింది’ -
ఆఫీస్లో కొత్త వర్క్ పాలసీ.. ఉద్యోగులు పాటించాల్సిందే! లేదంటే
‘త్వరలో ఆఫీసులో కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు! అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ కంపెనీ బాస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ మెమో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది. రెడిట్లో గుర్తు తెలియని యూజర్ చేసిన పోస్ట్లో ఇలా ఉంది. ‘ఉద్యోగులకు గమనిక! వర్క్ అంటే వినోదం కాదు. ఇది మీ బాధ్యత. ఆఫీస్ వర్క్ చేయకుండా.. బయట విషయాల గురించి అస్సలు చర్చించ కూడదు. పనివేళల్లో స్నేహానికి తావివ్వకూడదు. “work is not meant to be fun” by u/DiorRoses in mildlyinfuriating ఏదైనా మాట్లాడుకోవాలంటే అది ఆఫీస్ అవర్స్ తర్వాతే. ఆఫీస్ వేళల్లో మీ సహచర ఉద్యోగి.. ఆఫీస్ వర్క్ గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీతో మాట్లాడితే నన్ను సంప్రదించండి. పని మీ బాగోగులు చూసుకునే ‘డేకేర్’ కాదు. అంటూ సంబంధిత ఆఫీస్ బాస్ సంతకం చేసిన మెమోలో పేర్కొని ఉంది. ఈ నోటీస్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెడిట్లో పోస్ట్ చేసిన నాటి నుంచి సుమారు 26 వేల మంది కామెంట్లు చేశారు. బాస్ చాలా ప్రమాదకరంగా ఉన్నారే. ఆ ఆఫీస్ వర్క్ కల్చర్ చెత్తగా ఉంది. ఆఫీస్లో స్నేహపూరితమైన వాతావరణం ఉంటే వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది’ అని కామెంట్లలో చెబుతున్నారు యూజర్లు. చదవండి👉 ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన! -
గాజువాక మార్గదర్శి ఆఫీసులో సీఐడీ సోదాలు
-
అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?
లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది. దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్రాజ్లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లోని ఓ హోటల్లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
బీజేపీ ఆఫీసులో ఘనంగా డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
-
కాసేపట్లో హన్మకొండలో డీసీపీ కార్యాలయానికి ఈటెల
-
2050లో ఆఫీస్ అంటే ఇలా ఉంటుందట!
ఆఫీసు అంటే ఎలా ఉంటుంది?.. వరుసపెట్టి టేబుళ్లు, కుర్చీలు.. కంప్యూటర్లు.. హడావుడిగా పనిచేసుకునే ఉద్యోగులు.. మరి 2050లో ఆఫీస్ ఎలా ఉంటుంది?.. హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్.. వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ మీటింగ్లు.. చెప్పిన పనిచేసే రోబోలు.. కాసేపు కునుకు తీయడానికి బెడ్లు.. కాఫీ తెచ్చి ఇచ్చే డ్రోన్లు.. ..మరో 30 ఏళ్లలో అత్యధునిక టెక్నా లజీల సాయంతో ఆఫీసుల రూపురేఖలు, పనివాతావరణం ఎలా మారిపోతాయనే అంశంపై ‘ఫర్నీచర్ ఎట్ వర్క్’ సంస్థ అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపింది. ఉద్యోగుల నుంచి మరింత ‘పని’ ని రాబట్టుకోవడంతోపాటు వారికి ఆరోగ్యం, ఆహ్లాదం అందించేలా ఆఫీ సులు రూపొందుతాయని పేర్కొంది. ►అవసరానికి తగినట్టు సులువుగా మార్చుకోగలిగేలా.. కదిలే గోడలు, ఆధునిక ఫర్నీచర్ వస్తాయి. ►అవసరానికి తగ్గట్టు లైటింగ్, గాలి నాణ్యతను చెక్ చేస్తూ శుభ్రపర్చడం, ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ సమానంగా ఉంచడం వంటివి ఆటోమేటిగ్గా జరిగేలా సెన్సర్లతో ఆఫీసు భవనాలు ‘స్మార్ట్’గా మారుతాయి. ►పనితీరు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు వర్చువల్ రియాలిటీతో కూడిన శిక్షణ. ►ఆఫీసుకు వచ్చే సందర్శకులకు సమాచారం ఇవ్వగల హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్ ►వేలిముద్రల (బయోమెట్రిక్)తో తెరుచుకునే ఫ్రిడ్జ్లు ►ఉద్యోగులు లేచి వెళ్లాల్సిన పనిలేకుండా కాఫీ, టీలు తెచ్చే డ్రోన్లు ►ఆఫీసులో గాలి కాలుష్యాన్ని తొలగించేలా గోడలకు నానో పెయింట్లు ►పని అలసట నుంచి చిన్న కునుకుతో సేదతీరేందుకు న్యాపింగ్ బెడ్స్ ►ఒత్తిడిని తగ్గించుకునేందుకు వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీతో కూడిన మెడిటేషన్ గది ►ఒకరినొకరు సంప్రదించుకుంటూ పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ఓపెన్ ఆఫీస్ ►ఆఫీసులోకి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తించే ఫేస్ స్కానింగ్ వ్యవస్థ ►అవసరమైన సమాచారాన్ని చూసేందుకు, సమావేశాల కోసం వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ►ఆహ్లాదకరమైన, కాలుష్య రహిత వాతావరణం కోసం మాడ్యులర్ గ్రీన్ వాల్స్ ►పర్యావరణ హితమైన బయోఫిలిక్ ఫర్నీచర్ ►ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ‘యాంటీ డిస్ట్రా క్షన్ టెక్నాలజీ’ క్యాబిన్లు ►క్లీనింగ్తోపాటు వివిధ రకాల పనుల కోసం రోబోలు ►ఉద్యోగులు, ఆఫీసర్లు నేరుగా కలిసి మాట్లాడుకున్న అనుభూతి వచ్చేలా హోలోగ్రామ్ ఆధారిత వర్చువల్ సమావేశాలు ►చిన్న పిల్ల లున్న ఉద్యో గుల కోసం బేబీ సిట్టర్, ప్రత్యేక రూమ్ ►శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనించే రిస్ట్ బ్యాండ్లు – సాక్షి, సెంట్రల్డెస్క్ -
ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..
ఉత్తర ప్రదేశ్లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్ లాడెన్ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే సబ్ డివిజనల్ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్ లాడెన్ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూపీపీసీఎల్ చైర్మన్ ఎం దేవరాజ్ సీరియస్ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్లో ఫరుఖాబాద్ జిల్లాలోని కయామ్ గంజ్ సబ్డివిజన్ 2కి పోస్టింగ్ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. ఐతే విచారణలో.. గౌతమ్ లాడెన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..) -
ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
-
తండ్రి పెన్షన్ కోసం అంధ తనయుడి ప్రదక్షిణలు.. 11 ఏళ్లుగా
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేశారాయన. ఆ తర్వాత అనారోగ్యంతో కన్నుమూశారు కె.పాండు రంగారావు. తండ్రి పెన్షన్ నుంచి రావాల్సిన తన వాటా కోసం ఆయన కుమారుడు కె.రాఘవేంద్ర (గతంలో కెమికల్ రియాక్షన్తో రెండు కళ్లూ కోల్పోయాడు) పదకొండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పాటు రాష్ట్రపతి, గవర్నర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు గురువారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆయనను అడ్డుకున్న పోలీసులు పంజగుట్ట ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ అనంతరం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర ‘సాక్షి’కి తన దయనీయ పరిస్థితులను ఇలా వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ’మా నాన్న పాండురంగారావు పోలీసు విభాగంలో సబ్– ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీఎస్పీ, ఏసీపీ హోదాలో పలు జిల్లాల్లో పనిచేశారు. 1986లో పదవీ విరమణ పొందారు. మా అమ్మ 1994లో చనిపోగా.. నాన్న అనారోగ్యంతో 2010లో కన్నుమూశారు. నేను చెన్నైలో ఇంటీరియర్ డిజైనింగ్ పని చేసేవాడిని. 2009లో కెమికల్ రియాక్షన్ కారణంగా రెండు కళ్లనూ కోల్పోయాను. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన పెన్షన్లో 50 శాతం భార్యకు చెల్లించాలి. ఆమె కూడా లేని పక్షంలో వికలాంగులు, భర్తను కోల్పోయిన పిల్లలు ఉంటే వారికి 20 నుంచి 25 శాతం చెల్లించాలి. అంధుడిగా మారిన నేను.. మా తండ్రి పెన్షన్ నుంచి రావాల్సిన మొత్తం కోసం పదకొండేళ్లుగా పోరాటం చేస్తున్నాను. తోబుట్టువుల దయాదాక్షిణ్యాలతో.. ప్రస్తుతం నేను ఎల్బీనగర్లో నివసిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. భార్య దూరమైంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాలు చదువుతున్న పిల్లల ఆలనాపాలనా నేనే చూసుకోవాలి. నెలవారీ ఖర్చులతో పాటు పిల్లల చదువు కోసమూ తోబుట్టువులపై ఆధారపడ్డాను. నాకు రావాల్సిన పెన్షన్ కోసం సంబంధిత అధికారులను 2010లోనే సంప్రదించాను. మొత్తం 19 రకాలైన సర్టిఫికెట్ల కావాలంటూ సూచించడంతో అవన్నీ సేకరించి పదకొండేళ్ల క్రితం దరఖాస్తు చేశా. నలుగురు ఎస్పీలు, అయిదుగురు ఏసీపీలు, దాదాపు పది మంది ఇన్స్పెక్టర్ల వద్దకు వెళ్లి ఈ పత్రాలు సేకరించాను. అప్పటి నుంచి పెన్షన్ కోసం నగర పోలీసు కమిషనరేట్, డీజీపీ కార్యాలయం, ఏజీ ఆఫీస్, పెన్షన్ ఆఫీస్, కలెక్టరేట్ తదితర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. నా దీనావస్థను వివరిస్తూ ఇద్దరు రాష్ట్రపతులు (శీతాకాల విడిదికి వచ్చినప్పుడు), నలుగురు గవర్నర్లు, ఇద్దరు హోంమంత్రులకు వినతులు అందించినా ఇప్పటి వరకు ఫలితం లేకుండాపోయింది. సీఎంకు నివేదిద్దామంటే అవకాశం ఇవ్వట్లేదు గడిచిన పదకొండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తే ఇప్పటికి ఫైల్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం అక్కడే ఆగిపోయింది. నా పరిస్థితిని వివరించి, న్యాయంగా నాకు రావాల్సిన పెన్షన్ ఇప్పించాలని కోరడానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. కనీసం నా అభ్యర్థనను కూడా సీఎం వరకు తీసుకువెళ్లట్లేదు’ అని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్! -
గుడ్న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!
లండన్: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 35 శాతం పెరిగిన రెవెన్యూ.. వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి. ఉద్యోగులకు సంతృప్తి.. నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది. అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. మహిళలకే ఎక్కువ బెనిఫిట్.. ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్హార్ట్ చెప్పారు. చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..' -
ఎడ్లబండ్లపై కలెక్టర్ ఆఫీస్ కు రైతులు
-
అమెజాన్ ఉద్యోగులకు అలర్ట్: మే 1 నుంచి..!
సాక్షి,ముంబై: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కార్పొరేట్ ఉద్యోగులను కోరింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఫిబ్రవరి 17న సిబ్బందికి మెమో ద్వారా సమాచారం అందించారు. ఈ విధనం మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఎక్కువ సమయం ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి, సంస్కృతిన బలోపేతం కావడానికి ఎక్కువ దోహదపడుతుందని జెస్సీ తెలిపారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కారాలుసులభమవుతాయనీ, వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అలాగే తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ఆండీ జెస్సీ బ్లాగ్ పోస్ట్ సందేశంలో పేర్కొన్నారు. కాగా గ్లోబల్గా కరోనా పరిస్థితి చక్కబడుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. గత నెలలో, స్టార్బక్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది.డిన్నీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీసు నుంచి పని విధానం మార్చినుంచి ప్లాన్ చేసుకోవాలని డిస్నీ ఉద్యోగులను కోరుతోంది. వాల్మార్ట్ రెగ్యులర్ ఇన్-ఆఫీస్ పని దినాలను ప్లాన్ చేసు కోవాలని ఇటీవల తన టెక్ టీంలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
గూగుల్కు బాంబు బెదిరింపు కలకలం: హైదరాబాదీ అరెస్ట్
సాక్షి, ముంబై: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మహారాష్ట్ర పూణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న గూగుల్ ఆఫీస్కు కాల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో గందరగోళం సద్దుమణిగింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం రాత్రి 7.54 గంటలకు కాల్ వచ్చింది. దీనిపై సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూణే పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు నిర్వహించి, ఇది ఫేక్అని పూణే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) విక్రాంత్ దేశ్ముఖ్ తేల్చారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఈ కాల్ చేసినట్టు అధికారులు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అదుపులోకితీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
హైదరాబాద్లో మైక్రోచిప్ ఆఫీసు
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్కు మన దేశంలో హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్-ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్లు ఈ ప్రాపర్టీని కో-ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
కలెక్టర్ ఆదేశాలు.. గొల్లపూడి టీడీపీ ఆఫీస్ను తొలగించిన అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడి వన్ సెంటర్లో ప్రైవేట్ స్థలంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. శేషారత్నం పేరిట ఉన్న ఈ స్థలంలో గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్థలాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ శేషారత్నం కలెక్టర్ను ఆశ్రయించారు. దీంతో గిఫ్ట్ డీడ్ రద్దు చేశారు కలెక్టర్. శేషారత్నానికి ఆ స్థలాన్ని స్వాధీనం చేసి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతల ఆందోళనల నడుమ రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని కూల్చివేసి స్థలాన్ని శేషారత్నంకు అప్పగించారు. -
అమెరికా సంస్థలను దాటేసిన భారత కంపెనీలు
భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. చదవండి: కొత్త చిక్కుల్లో ఎలాన్ మస్క్.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది! -
ప్రతి సచివాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంగా మారబోతోంది : ధర్మాన
-
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
వారానికి ఒక్కరోజే ఆఫీస్..!
-
ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-
బుధువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
-
ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎల్లుండి (బుధవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గంలోని అద్దె భవనంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కార్యాలయం బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నవ చండీయాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ చండీయాగం నిర్వహించేందుకు యాగశాలను నిర్మించి అందులో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నవ చండీయాగంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం 12.37 నిమిషాల సమయంలో పూర్ణాహుతిలో పాల్గొంటారని వాస్తు నిపుణులు తేజ వెల్లడించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ వర్గాన్ని కూడా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీలును బట్టి భావసారుప్యత కలిగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగానే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు? -
ఈ నెల 14 న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
-
ఆ స్థలాల లీజింగ్లో దూసుకెళ్తున్న హైదరాబాద్!
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. చదవండి: పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్! -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జూపూడి ప్రభాకర్రావు పాల్గొన్నారు. చదవండి: Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. -
ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. శివసేన కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే ఈ కార్యాలయన్ని తొలగించినట్లు కల్యాణ్ డాంబివిల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటస్థలానికి కేటాయించిన స్థలంలో శివసేన కార్యాలయం ఉందని, అందుకే కూల్చివేశామని చెప్పారు. ఈ ఆఫీస్తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. ఉద్ధవ్ శివసేన వర్గం మాత్రం రాజకీయ ప్రతీకారంతోనే తమ కార్యాలయాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా ఈ కార్యాలయం ఉందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నించారు. చదవండి: సౌరాష్ట్ర ఎవరికి సై? -
మస్క్ సెటైర్లు : ట్విటర్ ఉద్యోగి లంచ్ ఖరీదు రూ.32వేలా..తిన్నారా? చేశారా?
ఎలాన్ మస్క్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల వ్యవధిలో ట్విటర్లో అనే నాటకీయ పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్ అంటూ ఇలా ప్రతి రోజు ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎలాన్ మస్క్ ట్విటర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ హాకిన్స్తో ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనంపై విమర్శలు చేశారు. హాకిన్స్ ఒక వారం క్రితం వరకు ట్విటర్లో ఉద్యోగులకు మధ్యాహ్నం ఫుడ్ అందించారు. గత 12 నెలల్లో ఉద్యోగులు ఎవరూ ఆఫీస్కు రాలేదు. కానీ ప్రతి రోజు ఒక్కో భోజనానికి $400 (రూ. 32,471.30) కంటే ఎక్కువ ఖర్చు చేశారు’. ఇలా ట్విటర్ లంచ్ కింద ఏడాదికి 13 మిలియన్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. మస్క్ విమర్శలపై హాకిన్స్ స్పందించారు. అబద్ధం..ఎలాన్ మస్క్తో పనిచేయడం ఇష్టం లేకనే ట్విటర్కు రాజీనామా చేశా. రాజీనామా ముందు వారం వరకు టిఫిన్ & భోజనం కోసం రోజుకు ఒక్కో ఉద్యోగికి $20-$25 డాలర్లు ఖర్చు చేశాను. ఆఫీస్కు వచ్చే ఉద్యోగల సంఖ్య 20-50% వరకు ఉందని చెప్పారు. కానీ సంస్థ రికార్డ్స్లో అలా లేదే అంటూ హాకిన్స్ ట్వీట్కు మస్క్ రిప్లయి ఇచ్చారు. లంచ్ అవర్లో పీక్ ఆక్యుపెన్సీ 25%, యావరేజ్ ఆక్యుపెన్సీ 10% కంటే తక్కువగా ఉంది. ఓహో..! ఇక్కడ తినే వాళ్ల కంటే..చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారే అంటూ మస్క్ ఘాటుగా రిప్లయి ఇచ్చారు. False. Twitter spends $13M/year on food service for SF HQ. Badge in records show peak occupancy was 25%, average occupancy below 10%. There are more people preparing breakfast than eating breakfast. They don’t even bother serving dinner, because there is no one in the building. — Elon Musk (@elonmusk) November 13, 2022 False. Twitter spends $13M/year on food service for SF HQ. Badge in records show peak occupancy was 25%, average occupancy below 10%. There are more people preparing breakfast than eating breakfast. They don’t even bother serving dinner, because there is no one in the building. — Elon Musk (@elonmusk) November 13, 2022 -
గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా
-
టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్లు.. ఐటమ్ సాంగ్లతో రెచ్చిపోయారు
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్లతో రెచ్చిపోయారు. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఆఫీస్లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి
ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సంగీతంతో సాంత్వన సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. పజిల్ గేమ్స్ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. ఇష్టమైన వారితో గడపండి కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్ గేమ్స్ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది. చదవండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ -
అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే!
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు మారడం.. యూకేలోని రాజకీయ అస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే పాలనాపరమైన నిర్ణయాలు దారుణంగా బెడిసి కొట్టడం.. సొంత పార్టీ నుంచే ప్రతికూలత నడుమ కేవలం 45 రోజులకే ట్రస్ ఆ పదవికి రాజీనామా చేయడం ఇక్కడ గమనార్హం. ఈ తరుణంలో.. ట్రస్ రాజీనామాపై సెటైర్లు సైతం పేలుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత తక్కువ కాలం పదవిలో కొనసాగిన కొందరి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం.. ► లిజ్ ట్రస్.. బ్రిటన్ అధికారిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో.. సెప్టెంబర్ 6వ తేదీన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో ప్రధాని పగ్గాలు చేపట్టారు లిజ్ ట్రస్. కానీ.. ఆర్థిక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు 45 రోజుల తర్వాత డౌనింగ్ స్ట్రీట్ను వీడుతూ ఆమె తన రాజీనామాను ప్రకటించారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. అంతకు ముందు ఆ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. క్షయ వ్యాధి బారినపడి ఆగస్టు 8వ తేదీన, 1827లో ఆయన మరణించారు. ► అటల్ బిహారీ వాజ్పేయి.. 16 రోజులు దేశ ప్రధాని పదవిలో కొనసాగారు. మే 16, నుంచి జూన్ 1వ తేదీ దాకా.. విశ్వాస పరీక్ష తీర్మానం నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి స్వచ్ఛందంగా దిగిపోయి రాజకీయాల్లో తనదైన నిజాయితీ ప్రదర్శించారనే ముద్ర వేసుకున్నారాయన. ► వాజ్పేయి కంటే ముందు.. గుల్జారీలాల్ నందా ఆపద్ధర్మ ప్రధానిగా కేవలం పదమూడు రోజులపాటు.. అదీ రెండు పర్యాయాలు కొనసాగారు. మొదటిసారి నెహ్రూ మరణం తర్వాత, రెండోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత గుల్జారీలాల్ నందా ప్రధాని పదవిలో కొనసాగారు. గుల్జారీలాల్ నందా మధ్యలో.. ప్రమాణం చేసిన గంటకే.. 1967లో సియెర్రా లియోన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సియాకా స్టీవెన్స్ ప్రధాని అయ్యారు. కానీ, పాపం గంటకే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. మిలిటరీ తిరుగుబాటుతో ప్రమాణం చేసిన గంటకే ఆయన్ని అరెస్ట్ చేసి కారాగారానికి పంపారు. అయితే.. తన మార్క్ రాజకీయంతో జైలు నుంచే చక్రం తిప్పిన ఆయన.. రెండువారాలకు మిలిటరీ తిరుగుబాటును అణచివేయగలిగారు. బయటకు వచ్చి మళ్లీ ప్రధాని పదవి చేపట్టి.. పదిహేడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అధ్యక్షులు కూడా.. ► అమెరికా ఆర్మీ అధికారి, ఆ దేశానికి తొమ్మిదవ అధ్యక్షుడు అయిన విలియం హెన్రీ హ్యారీసన్.. కేవలం 32 రోజులపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పదవిలో ఉండగా మరణించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా హ్యారీసన్ కావడం గమనార్హం. ► మెక్సికో అధ్యక్షుడు పెడ్రో లాస్కురెయిన్.. 1913లో కనీసం గంటపాటు కూడా పదవిలో కొనసాగలేదు. జనరల్ విక్టోరియానో హ్యూయెర్టో సారధ్యంలో జరిగిన మిలిటరీ తిరుగుబాటుతో పగ్గాలు చేపట్టిన 45 నిమిషాలకే పెడ్రో తన పదవి కోల్పోయారు. ► 1945, ఏప్రిల్ 30 జర్మనీ మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం.. నాజీ జర్మనీలో జోసెఫ్ గోయెబ్బెల్స్ ఛాన్స్లర్ పగ్గాలు చేపట్టారు. అయితే.. ఆయన జర్మనీ చాన్స్లర్గా కొనసాగింది ఆ ఒక్క రాత్రి మాత్రమే. ఉదయం కల్లా భార్య మాగ్దా, తన ఆరుగురు పిల్లలతో గోయెబ్బెల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజులు.. రాణులు కూడా! ► అధినేతల విషయంలోనే కాదు.. రాజరికంలోనూ అత్యంత తక్కువ కాలం సింహాసనం మీద కూర్చున్నవాళ్ల రికార్డులు ఉన్నాయి. ఫ్రాన్స్ రాజుగా లూయిస్ 19.. 1803లో కేవలం ఇరవై నిమిషాలపాటు మాత్రమే సింహాసనం మీద కూర్చున్నారు. చాలాకాలం ఆయన ఫ్రాన్స్కు దూరంగా గడిపారు. ► పోర్చుగల్ రాజుగా లూయిస్ పిలిపె కూడా అత్యంత తక్కువ సమయం(20 నిమిషాలే!) సింహాసనం అధిష్టించిన రికార్డు ఉంది. 1908 ఫిబ్రవరి 1న జరిగిన తండ్రి కార్లోస్ 1 హత్య జరగ్గా.. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు పిలిపె.. 20 నిమిషాలపాటు ప్రాణాలతో పోరాడాడు. ఆ 20 నిమిషాలను అతని సింహాసన కాలంగా గుర్తించింది పోర్చుగల్. ► నైన్ డేస్ క్వీన్గా గుర్తింపు పొందిన లేడీ జాన్ గ్రే.. తొమ్మిది రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్, ఐర్లాండ్లకు రాణిగా సింహాసనంపై కొనసాగింది. అదీ కేవలం 16 ఏళ్ల వయసులో. 1553 జులై 10 నుంచి 19 మధ్య ఆమె రాణిగా కొనసాగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు మరణ శిక్ష అమలు చేశారు. ► రష్యాలో.. మైకేల్ 2 అతితక్కువ సమయం సింహాసనంపై రాజుగా కొనసాగాడు. సోదరుడు సార్ నికోలస్ 2.. మార్చి 1997లో సింహాసనం నుంచి దిగిపోగా.. 18 గంటలపాటు రాజుగా మైకేల్ 2 కొనసాగాడు. అయితే.. తిరుగుబాటు నేపథ్యంలో అతన్ని చెరసాలలో బంధించగా.. ఆపై హత్యకు గురయ్యాడు. -
సింగపూర్లో అంబానీ ఎంట్రీ: ఈ ఏడాదిలోనే ఫ్యామిలీ ఆఫీసు!
సాక్షి,ముంబై: ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్కు విస్తరించనున్నారా? తాజా నివేదికలను ఈ ఊహలకు బలాన్నిస్తున్నాయి. ముఖేశ్ అంబానీ సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక మేనేజర్ను కూడా నియమించారని సమాచారం. అయితే దీన్ని ప్రైవేట్ వ్యవహారంగా పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అంబానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించనున్నారని టాక్. అయితే తాజా నివేదికలపై రిలయన్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. రిలయన్స్ఆయిల్ రిఫైనింగ్ పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి ఇ-కామర్స్, గ్రీన్ ఎనర్జీ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే క్రమంలో భారతదేశం వెలుపల కూడా విస్తరించే లక్క్ష్యంతోనే సింగపూర్లో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 2021లో రిలయన్స్ బోర్డ్లో ఆరామ్కో చైర్మన్ నియామకాన్ని ప్రకటించినప్పుడు, తన వాటాదారులతో మాట్లాడుతూ, రిలయన్స్ "అంతర్జాతీయీకరణకు నాంది" అని, రానున్న కాలంలో తమ అంతర్జాతీయ ప్రణాళికలపై అంబానీ సంకేతాలివ్వాడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్లూమ్బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు అంబానీ, సింగపూర్ ఫ్యామిలీ ఆఫీస్ను ఈ ఏడాదిలోగా ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ వ్యవహారంలో ఆయన సతీమణి నీతా అంబానీ కూడా సహకరిస్తున్నారట. కాగా తక్కువ పన్నులు, భద్రతా కారణాల రీత్యా గ్లోబల్ బిలియనీర్లంతా సింగపూర్ బాటపడుతున్నారు. తాజా పరిణామంతో అంబానీ, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ రే డాలియో ,గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సరసన నిలిచారు.మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంచనా ప్రకారం 2021 చివరి నాటికి 700 మంది. ఇది ఒక సంవత్సరం ఈ సంఖ్య 400 మాత్రమే. -
జెలెన్ స్కీతో ఫోన్లో సంభాషించిన మోదీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. అదీకూడా పుతిన్ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్లో సంభాషించుకోవడం విశేషం. పైగా పుతిన్ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్లో మోదీ....ఉక్రెయిన్లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: బంగ్లాదేశ్లో సగం పైగా జనాభా అంధకారంలోనే...) -
ఆఫీస్ స్థలం లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.61 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి అని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. పరిమాణం పరంగా ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని వివరించింది. ‘లీజింగ్ లావాదేవీల పరిమాణం మహమ్మారికి ముందస్తు త్రైమాసిక సగటును 6 శాతం అధిగమించాయి. మొత్తం లీజింగ్ పరిమాణంలో బెంగళూరు అత్యధికంగా 45 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ నగరంలో లీజింగ్ 71 శాతం దూసుకెళ్లి 73 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గత 18 నెలల్లో ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. కంపెనీలు కార్యాలయం నుంచి పని విధానాలను అమలు చేయడం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ఈ ఏడాది వార్షిక లీజింగ్ పరిమాణం 2019 రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాగా చెప్పారు. నగరాల వారీగా ఇలా.. ఆఫీస్ లీజింగ్ స్థలం ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 23 శాతం పెరిగి 24 లక్షల చదరపు అడుగులు, ముంబై 82 శాతం ఎగసి 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్ రెండింతలై 7 లక్షల చదరపు అడుగులు, కోల్కత రెండింతలకుపైగా దూసుకెళ్లి 3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఇక హైదరాబాద్ గతేడాదితో పోలిస్తే కార్యాలయ స్థలం లీజింగ్ 60 శాతం పడిపోయి 8 లక్షల చదరపు అడుగులు, పుణే 27 శాతం తగ్గి 7 లక్షల చదరపు అడుగులకు వచ్చి చేరింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల్లో కార్యాలయ స్థలం నూతనంగా 1.3 కోట్ల చదరపు అడుగులు జతకూడింది. ఇందులో బెంగళూరు 49 లక్షలు, హైదరాబాద్ 33 లక్షల చదరపు అడుగులు సమకూర్చాయి. మొత్తం లావాదేవీల్లో కో–వర్కింగ్ రంగం వాటా 23 శాతానికి చేరింది. చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు -
‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా సుమారు రెండున్నరేళ్లుగా బోసిపోయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల కార్యాలయాలు, ఐటీ కారిడార్లు మళ్లీ పాత కళను సంతరించుకుంటున్నాయి. కరోనా మూడో దశ ముగియడం, దేశంలో కరోనా కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరడంతో ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు చర్యలు వేగవంతం చేశాయి. కరోనా తొలి కేసు నమోదు కావడంతో 2020 మార్చి మొదటి వారంలో హైదరాబాద్ ఐటీ సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’విధానానికి శ్రీకారం చుట్టగా, కొద్ది నెలలుగా వారంలో ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వచ్చేలా ‘హైబ్రిడ్’పద్ధతిని అవలంబిస్తున్నాయి. అయితే ఇప్పటికే చిన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తిస్తుండగా, ప్రస్తుతం మధ్య తరహా, దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆఫీసులకు ఉద్యోగులను రప్పించడంపై దృష్టి కేంద్రీకరించాయి. యాపిల్, విప్రో, టీసీఎస్, మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్ వంటి పెద్ద ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాలంటూ మెయిల్స్, మెసేజ్లు పంపిస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో ఆఫీసులకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య 70 శాతం మేర ఉండొచ్చని ‘హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్’(హైసియా) అంచనా వేస్తోంది. ఐటీ కంపెనీల్లో వివిధ అంశాలపై తరచూ సర్వేలు నిర్వహించే హైసియా.. అక్టోబర్లో ఉద్యోగుల హాజరు శాతంపై తాజాగా సర్వేకు సన్నద్ధమవుతోంది. ఐటీ కంపెనీలను వెన్నాడుతున్న ‘మూన్ లైటింగ్’ ‘ఇంటి నుంచే పని’విధానంతో లభించిన వెసులుబాటువల్ల కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు ఐటీ సంస్థలు అనుమానిస్తున్నాయి. ‘మూన్ లైటింగ్’గా ప్రాచుర్యం పొందిన ఈ విధానంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను విప్రో సంస్థ తొలగించడంతో ఐటీ ఉద్యోగుల్లో ఉలికిపాటు కనిపిస్తోంది. అయితే మధ్య, చిన్న తరహా ఐటీ సంస్థలు మూన్లైటింగ్ సమస్యను అధిగమించేందుకు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడమే పరిష్కారంగా భావిస్తున్నాయి. చిన్నా, పెద్ద సంస్థలు తమ ఉద్యోగుల్లో ప్రతీ రోజూ కనీసం 70 శాతం మందిని ఆఫీసుకు రప్పించేలా రోస్టర్ను తయారు చేసి అమలు చేస్తున్నాయి. ఉద్యోగులను రప్పించేందుకు పలు కంపెనీలు, క్లయింట్ సంస్థలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. టీ షర్టులు, మధ్యాహ్న భోజనం, రవాణా సదుపాయం, కెఫెటేరియాలు, క్యాంటీన్లలో సబ్సిడీల వంటివి వర్తింపచేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఐటీ కారిడార్లో 3,500 పైగా హాస్టళ్లు సుమారు రెండున్నర లక్షల మంది ఐటీ, అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. -
ఆఫీస్ సంస్కృతి మళ్లీ పెరగాలి
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఆఫీస్ వర్క్స్పేస్ విభాగంలో అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించే ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం హైటెక్ సిటీలోని మై హోమ్ వేదికగా ప్రీమియం సెంటర్ ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... ఇలాంటి వినూత్న వేదికల వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. విభిన్న రీతిలో పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఉద్యోగులకు మళ్లీ ఆఫీస్లో పనిచేయాలనే ఆతృతను పెంచుతుందన్నారు. మహాభారత సంప్రదాయ ఇతివృత్తంతో రూపొందించిన సాఫ్ట్వేర్ స్పేస్ ఆకట్టుకుందని, ఇలాంటి వేదికలు మరింత విస్తరించాలని జూపల్లి రామేశ్వర్ రావు పేర్కొన్నారు. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ సీఈవో పాటిబండ్ల సుందరి మాట్లాడుతూ... వ్యాపార రంగంలో వినూత్న ఆలోచనలున్న వారిని మంచి ఎంటర్ప్రైజెస్గా మార్చడానికి అవసరమైన అంతర్గత నిపుణుల బృందం తమవద్ద ఉందన్నారు. నగరంలోనే కాకుండా విజయవాడ, చెన్నై, పూణే, బెంగళూరు, నోయిడా, గుర్గావ్, కోల్కతా, అహ్మదాబాద్, ముంబైలలో కూడా తమ వర్కింగ్ స్పేస్లను ప్రారంభించనున్నామన్నా రు. కార్యక్రమంలో సహ వ్యవస్థాపకులు శ్రీని, ప్రాజె క్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శేషు, మణివణ్ణన్ పాల్గొన్నారు. -
టైం వచ్చింది ప్యాక్ చేయండి.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా
ప్రైవేట్ దిగ్గజం టాటా గ్రూప్లో భాగమైన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా.. ప్రభుత్వ అధీనంలోని ప్రాపర్టీల నుంచి ఖాళీ చేయాలని నిర్ణయించుకుంది. విస్తార సహా గ్రూప్లోని ఇతర ఎయిర్లైన్స్తో పాటు వచ్చే ఏడాది మార్చి నుంచి ఒకే దగ్గర నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎయిరిండియా .. ప్రభుత్వ భవంతుల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ కాలనీల నుంచి ఖాళీ చేయాలంటూ తమ సిబ్బందికి ఎయిరిండియా మే నెలలోనే సూచించింది. తాజాగా ఈ నెల నుంచి ఖాళీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బంది తాత్కాలికంగా గురుగ్రామ్లోని కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న వాటికా కాంప్లెక్స్కి వచ్చే ఏడాది తొలినాళ్లలో మారతారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లతో పాటు టాటా గ్రూప్నకు విస్తార విమానయాన సంస్థలో 51 శాతం (సింగపూర్ ఎయిర్లైన్స్తో జేవీ), ఎయిర్ఏషియా ఇండియాలో 83.67 శాతం వాటాలు ఉన్నాయి. చదవండి: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్ ఆఫీసు పైకప్పు
సాక్షి, నిర్మల్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. -
ఇక్కడ ఉద్యోగమే..‘విరమణ’ లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఏళ్లకేళ్లుగా రిటైర్డ్ అధికారులే రాజ్యమేలుతున్నారు. పదవీ విరమణ పొంది దశాబ్దం గడిచినా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. సీఎంవో, విద్యుత్, నీటి పారుదల, ఆర్థిక శాఖ, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, జల మండలి, పౌర సరఫరాలు, మెట్రో రైలు వంటి ముఖ్యమైన శాఖలు, విభాగాల్లో రిటైర్డ్ అధికారులే పెత్తనం చెలాయిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన ఉన్నధికారులు రిటైరైతే.. రెండేళ్ల సర్వీసు పొడిగించేవారు. మరీ అవసరౖమెతే రెండేళ్లకోసారి అలా పెంచుకుంటూ వెళ్లేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వర్తించేలా (అన్టిల్ ఫర్దర్ ఆర్డర్) అధికారుల పదవీకాలాన్ని పొడిగించేస్తోంది. దీంతో ఆయా అధికారులు ‘అన్ లిమిటెడ్ సర్వీసు’ను పొందుతున్నారు. ఇలా రిటైర్డ్ అధికారులే ఏళ్ల తరబడి కీలక పోస్టుల్లో కొనసాగుతుండటంతో.. సీనియారిటీ ప్రకారం తమకు విభాగాధిపతులుగా రావాల్సిన అవకాశాలను కోల్పోతున్నామని తర్వాతి స్థాయిల్లో ఉన్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు విభాగాధిపతి వంటి పోస్టులు ఎప్పుడు లభిస్తాయని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ వారే..! ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బి.నర్సింగ్రావు, ప్రత్యేక కార్యదర్శులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కె.భూపాల్రెడ్డి, రిటైర్డ్ కేంద్ర సేవల అధికారి పి.రాజశేఖర్రెడ్డి తెలంగాణ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్నారు. 2014 జూన్ 6 నుంచి తెలంగాణ జెన్కో సీఎండీగా, అదే ఏడాది అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతల్లో దేవులపల్లి ప్రభాకర్రావు కొనసాగుతున్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా జి.రఘుమారెడ్డి 2014 జూలై నుంచి విధుల్లో ఉన్నారు. 2016 అక్టోబర్ నుంచి ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాల్రావు వ్యవహరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరు ఈ పోస్టుల్లో కొనసాగుతారని ప్రభుత్వం జీవోల్లో పేర్కొనడం గమనార్హం. ముగ్గురు సీఎండీలు కూడా దశాబ్దకాలం కిందే విద్యుత్ సంస్థల్లో పదవీ విరమణ చేశారు. ఇక విద్యుత్ సంస్థల డైరెక్టర్లలో అత్యధిక శాతం మంది తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్నారు. వారి విషయంలోనూ పదవీ కాలాన్ని నిర్దేశించకుండా కొలువులను పొడిగించారు. ఈఎన్సీలకు రిటైర్మెంటే లేదు! రాష్ట్రంలో పలు కీలక ఇంజనీరింగ్ విభాగాల ఈఎన్సీలు రిటైరైనా.. ప్రభుత్వం ఆ పోస్టుల్లో వారినే కొనసాగిస్తోంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్రావు 2011లో పదవీ విరమణ చేసి దశాబ్దకాలంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు మారినా, తెలంగాణ వచ్చాక కొత్త సీఎం వచ్చినా ఆయనకు పదవీకాలం పొడిగింపు లభించడం గమనార్హం. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఈ హమీద్ ఖాన్, అంతర్రాష్ట వ్యవహారాల ఎస్ఈ కోటేశ్వర్రావు పదవీ విరమణ తర్వాత కూడా అదే హోదా/పోస్టుల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ జలమండలి ఈఎన్సీ/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి 2016 జూలైలో రిటైరైనా ఇంకా అదే పదవిలో ఉన్నారు. మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) ఈఎన్సీ కృపాకర్రెడ్డి 2017 నవంబర్లో రిటైరైనా నాలుగున్నరేళ్లుగా అలాగే కొనసాగుతున్నారు. ఆర్అండ్బీ విభాగంలో ఈఎన్సీ (జాతీయ రహదారులు, భవనాలు) బి.గణపతిరెడ్డి 2017 ఫిబ్రవరిలో, ఈఎన్సీ (స్టేట్ రోడ్లు) పి.రవీందర్రావు 2016 జూలైలో రిటైరై ఇంకా కొనసాగుతున్నారు. అ‘విశ్రాంత’సేవలో మరికొందరు.. ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి 2017 నవంబర్లో రిటైరై ఇంకా కొనసాగుతున్నారు. ∙దేవాదాయ శాఖ కమిషనర్గా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అనిల్కుమార్కు మొదట రెండేళ్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. తర్వాత మళ్లీ పొడిగించారు. దానితోపాటు ఆయనకు పౌర సరఫరాల శాఖ కమిషనర్గా కూడా ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. ∙సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా రాజమౌళిని సైతం ఇటీవల తిరిగి నియమించారు. ∙యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ కిషన్రావు, మెట్రోరైలు శాశ్వత ఎండీగా ఐఆర్ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ∙పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల రిటైరైన సీనియర్ ఐఏఎస్ అదర్ సిన్హా పదవీ కాలాన్ని గత నెలలోనే ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ∙ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీందర్, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి ముత్యంరెడ్డి కూడా అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. -
రా..రమ్మని..! ఐటీ కంపెనీలు విజ్ఞప్తులు
సాక్షి, హైదరాబాద్: రా..రమ్మని..రా..రా..రమ్మని.. అంటూ ఓ సినిమా పాట తరహాలో మారింది నగరంలో టెకీల తీరు. నగరం కోవిడ్ నుంచి కోలుకోవడంతోపాటు.. ప్రస్తుతం అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థాయిలో ఊపందుకున్నాయి. కానీ ఇప్పటికీ ఐటీ రంగంలో పలు కంపెనీల ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆఫీసులకు రావడం లేదు. వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అవసరమైతే తప్ప కార్యాలయాల మెట్లు ఎక్కడం లేదు. దీంతో పలు కంపెనీలు, ఐటీ శాఖ వర్గాలు వీరిని పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు వారితో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ వర్గాలు సైతం ఉద్యోగులు ఆఫీసుల బాట పట్టేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఒకటికి మించి కొలువులు..? గ్రేటర్ పరిధిలో చిన్న,పెద్ద,బహుళజాతి సంస్థలకు చెందిన 1600కు పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో సుమారు 7.80 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ కాకపోయినా నగరానికి చెందిన పలు కంపెనీల ఉద్యోగులు ఏకకాలంలో రెండు కంపెనీల్లో పనిచేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండడం, రెండు కంపెనీల్లోనూ ఒకే రకమైన ప్రాజెక్టులు కావడం, రాత్రి వేళల్లో పనిచేసేందుకు పనివేళలు అనువుగా ఉండడం తదితర కారణాలే ఒకటికి మించి కొలువులు ఏకకాలంలో చేసేందుకు అవకాశం ఉందని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు. నచ్చినట్టుంటేనే.... ఇటీవలి కాలంలో నగర ఐటీ కంపెనీల్లో జంప్జలానీలు అధికమయ్యారని హైసియా తాజా అధ్యయనంలో తేలింది. వేతనాలు అధికంగా ఉన్నవి,ఇతర అలవెన్సులు, సెలవులు, పనివేళలు తమకు అనుకూలంగా ఉన్నవి, వర్క్ ఫ్రంహోంకు అనుమతించిన కంపెనీల్లో పనిచేసేందుకు టెకీలు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమైంది. ఇళ్లు వీడి విధిగా ఆఫీసుకు రావాలని కోరితే కొందరు ఉద్యోగులు ఏకంగా ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి బైబై చెబుతున్నారట. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు స్థిరంగా కొన్నేళ్లపాటు ఒకే కంపెనీలో పనిచేస్తారన్న నమ్మకం కాస్తా సడలినట్లు హైసియా వర్గాలు చెబుతుండడం లేటెస్ట్ ఐటీ ట్రెండ్గా మారింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ) -
సోనియా, రాహుల్కు భారీ షాక్.. ఆ ఆఫీస్కు ఈడీ సీల్
సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. ఇక హెరాల్డ్ హౌజ్ సీల్కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. Delhi | The Enforcement Directorate seals the National Herald office, instructing that the premises not be opened without prior permission from the agency. pic.twitter.com/Tp5PF5cnCD — ANI (@ANI) August 3, 2022 #CLARIFICATION | ED seals Young Indian office at the Herald House building in Delhi as no one was available in the office during the search & thus they were not able to complete the search The order reads that the "premises not be opened without prior permission" from the agency https://t.co/WgiCNwxqVm pic.twitter.com/UvX9iScyIH — ANI (@ANI) August 3, 2022 తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 10 జన్ఫథ్లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఆఫీస్కు ఈడీ సీల్ వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది.