వైఎస్ జగన్ ఆర్యోగంగా ఉండటం ప్రజలకు అవసరమని, ఆరోగ్యం క్షీణిస్తున్నందున నిరాహార దీక్ష విరమించాలని ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ ఆర్యోగంగా ఉండటం ప్రజలకు అవసరమని, ఆరోగ్యం క్షీణిస్తున్నందున నిరాహార దీక్ష విరమించాలని ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలసి నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రజానాయకుడు ముద్ద ముట్టకుండా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించి దీక్ష విరమింపజేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.