‘నంద్యాల మొత్తం శిల్పా మోహన్‌రెడ్డికే జై’ | people with silpa mohan reddy: koramutla srinivasulu | Sakshi
Sakshi News home page

‘నంద్యాల మొత్తం శిల్పా మోహన్‌రెడ్డికే జై’

Published Thu, Aug 3 2017 4:30 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

‘నంద్యాల మొత్తం శిల్పా మోహన్‌రెడ్డికే జై’ - Sakshi

‘నంద్యాల మొత్తం శిల్పా మోహన్‌రెడ్డికే జై’

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. నంద్యాలలో అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రోడ్ల విస్తరణ అంటూ సామాన్యులు, వ్యాపారులను రోడ్డున పడేశారని, ప్రత్యామ్నాయాలు చూపడకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అభివృద్ధి గురించి పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారని, ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ కొత్తగా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement