హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి.
హైదరాబాద్: పొగమంచు ప్రభావం విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి.
ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలు గంట నుంచి 5 గంటల వరకు ఆలస్యంగా బయల్దేరనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఉత్తర భారతదేశంలో పొగమంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. విమానాలతో పాటు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి.