ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి శనివారం పోలీసుల తుపాకీల కాల్పుల మోతతో దద్దరిల్లింది.
ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి శనివారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. వైద్యం కోసం తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎట్టకేలకు పరారవుతున్న ఖైదీని పట్టుకున్నారు. కాగా పోలీసుల కాల్పులలో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం అతనికి చికిత్సకు తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.