చిత్తూరు: ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రను ఆరంభిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతి నుంచి తన యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు మంగళవారం బాబు మీడియాకు తెలిపారు. ఈ యాత్రలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ వైఖరికి ఇదే నిదర్శమన్నారు. రాష్ట్ర విభజన అనేది పారదర్శకంగా జరగాలని బాబు తెలిపారు. ఈ మెయిల్స్ ద్వార విభజన చేస్తామంటే కుదరే పని కాదన్నారు.