నెల్లూరు(గూడూరు): నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీలు చేపట్టిన గూడూరు పోలీసులు ఎర్రచందనం అక్రమరవాణాను గుర్తించారు. పట్డుబడిన వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కేసు నమోదు చేశారు.