smuggler
-
Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పరారీలోవున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే ఆదివారం మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు.మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు పేర్కొన్నారు. నాడు ఆ నిందితులు బీహార్కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసుల కన్నుగప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
వీరప్పన్ బిడ్డకు ఎంపీ టికెట్
-
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ -
మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..
అది 1985, ఏప్రిల్ 22, నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఓ) 35 ఏళ్ల మహిళ గ్లోరియా ఒకాన్ను హెరాయిన్తో పాటు ఇతర హార్డ్ డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు నైజీరియాలోని అమీను కానో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె నుంచి 56.70 గ్రాముల మత్తు పదార్ధాలు, 301 డాలర్లు, 60 పౌండ్ల స్టెర్లింగ్, 20,000యెన్లు,19,000 ఇటాలియన్ లిరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె నైజీరియా నుండి ఇంగ్లండ్కు వెళుతోంది. గ్లోరియా ఒకాన్ చేస్తున్న మత్తుమందుల రవాణాకు సంబంధించిన వార్తలు స్థానిక, అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. నైజీరియన్లు ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపారు. ఎందుకంటే నాటి బుహారీ మిలిటరీ.. నిషేధిత డ్రగ్స్తో ఎవరైనా పట్టుబడితో మరణశిక్ష విధిస్తామని ప్రకటించింది. గ్లోరియా ఒకాన్ను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత అంటే 1985, ఏప్రిల్ 28న కస్టడీలో ఉన్న ఆమె వివాదాస్పద రీతిలో మరణించింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. అరెస్టు చేసిన సమయంలో ఆమెలో అనారోగ్య సంకేతాలు లేవని దానిలో పేర్కొన్నారు. తొలగని అనుమానాలు.. గ్లోరియా ఒకాన్ను కస్టడీలో ఉంచిన కస్టమ్స్ అధికారి మాట్లాడుతూ ఆమెను అరెస్టు చేసిన రోజున, ఆమె రైస్, బీన్స్ అడిగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యానని తెలిపిందన్నారు. ఆ తరువాత ఆమె మరణించిందని అన్నారు. అయితే ఆమె మరణానికి ముందు ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆమె ఒక క్లూని మాత్రంవదిలి వెళ్లింది. బస్సీ అనే పేరును విచారణలో ఆమె ప్రస్తావించింది. కాగా గ్లోరియా ఒకాన్ బంధువులెవరూ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి రాలేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నాటి పాలకుడు బాబాంగిడా బుహారీని అధికారం నుండి తొలగించిన తర్వాత, గ్లోరియా ఒకాన్ కేసు దర్యాప్తును తిరిగితోడేందుకు నైజీరియన్ న్యాయవాది గని ఫవేహిన్మి సిద్ధమయ్యారు. అయితే గ్లోరియా ఒకాన్ కేసులో ఎటువంటి ముగింపు లేకపోవడంతో నైజీరియన్లలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. Her mule, Gloria Okon was caught redhanded, reports claimed she was dead but infact she was secretly pardoned by Babangida, and Dele Giwa had proof of this, he even had a picture of this Gloria and Maryam Babangida in London, Chilling! pic.twitter.com/xs6muRlT48— Ronu Spirit (@ronuspirit) March 17, 2023 సాధారణ జీవితం గడుపుతూ.. గ్లోరియా ఒకాన్ నాటి నైజీరియన్ ఆర్మీ జనరల్ బాబాంగిడా కోసం పనిచేస్తున్నదని కొందరు భావించారు. అందుకే ఆమెను హత్య చేశారని అనుకున్నారు. గ్లోరియా ఒకాన్ మరణం అసహజమైనదని, ఆమె కుటుంబసభ్యులకు పంపిన మృతదేహం ఆమెది కాదని కొందరు వాదించారు. నైజీరియాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆమె సాధారణ జీవితాన్ని గడిపేదని కూడా అంటారు. జూన్ 2009లో నైజీరియన్ ప్రొఫెసర్ తైమివో ఒగునాడే ది నేషన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “గ్లోరియా ఒకాన్ అసలు పేరు చిన్యెరే. ఆమె ఛార్లెస్ "జెఫ్" చాండ్లర్ను వివాహం చేసుకుంది. అతను న్జియోగ్వు హత్య జరిగిన మర్నాడు హతమయ్యాడు. కాగా చిన్యేరే, మరియమ్, ప్రిన్సెస్ అట్టా మొదలైనవారంతా స్నేహితులు. వారందరూ మిలిటరీలోని వారిని వివాహం చేసుకున్నారు. నాటి రోజుల్లో మిలటరీలో పనిచేసేవారిని ఎంతో గౌరవించేవారు. కేసు రీఓపెన్ అవుతుందా? ఇమో స్టేట్కు చెందిన టివ్... చిన్యెరేను వివాహం చేసుకున్నాడు. భర్త మరణంతో చిన్యెరే వితంతువుగా మారింది. అనంతరం ఆమె యూకే- నైజీరియా మధ్య డ్రగ్స్ వ్యాపారాన్ని ఆశ్రయించింది. ఆపై ఆమె డ్రగ్స్తో పట్టుబడింది. కానో నుండి లండన్కు వెళ్లే విమానంలో చిన్యేరేను ఎక్కించిన మమ్మన్ వత్సా ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఈ నాటి వరకు గ్లోరియా ఒకాన్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగానే మిగిలింది. మూసివేసిన ఈ కేసును తిరిగి తెరవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేసు రీఓపెన్ అవుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. He doesn't know the Gloria Okon Saga story small kids pic.twitter.com/2iDxIDcCBF— LUCA BRASI -5.0 The UnderBoss (@donortez) November 14, 2022 ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. -
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
బడా స్మగ్లర్ కోసం వేట.. ‘ఆపరేషన్ మాణిక్యం’ ప్రారంభం
తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్ మాణిక్యం ఆపరేషన్ను పోలీసులు వేగవంతం చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఠాలో ఆ నలుగురే కీలకం శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు. వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్కుమార్, ఎం.అశోక్కుమార్ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్కు పాల్పడ్డాడు. శేషాచలంలో నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్ గీస్తాడు. ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు. ముగ్గురు చిక్కారు కరోనా లాక్డౌన్ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం. -
సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదకద్రవ్యాల అక్రమరవాణా ప్రయత్నానికి బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకట్టవేశాయి. మార్కెట్లో రూ.135 కోట్ల విలువచేసే 27 కేజీల హెరాయిన్ను భారత భూభాగంలోకి తీసుకొస్తున్న పాకిస్తానీ స్మగ్లర్ను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భారత్–పాక్ సరిహద్దు వెంట పర్సర్ బోర్డర్ ఔట్పోస్ట్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటాక(తెల్లారితే బుధవారం) 2.30–3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను బీఎస్ఎఫ్(జమ్మూ) ఐజీ ఎన్ఎస్ జామ్వాల్ వెల్లడించారు. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
గంజాయి స్మగ్లర్ బాబు ఖాలే అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన గంజాయి స్మగ్లర్ బాబు ఖాలేను హైదరాబాద్లో పట్టుకున్నారు. నగర శివారులో బాబు ఖాలేను అనూహ్య రీతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ఖాలే కోసం.. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్లో బాబు ఖాలే కీలక సూత్రధారి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దొరికిన గంజాయి స్మగ్లింగ్ వెనకాల బాబు ఖాలే హస్తం ఉంది. ఎన్సీబీ అధికారులు.. ఖాలేతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్ను అరెస్టు చేశారు. -
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
హోసూరు: ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. -
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
స్మగ్లింగ్ ముఠా అరెస్టు
పెద్దారవీడు (ప్రకాశం): వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కా బస్తాలు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి మార్కాపురం సబ్డివిజన్ పరిధిలో దేవారాజుగట్టు, రాయవరం, హనుమాన్జంక్షన్ కుంట, కోమటికుంటల పరిసరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. దేవరాజుగట్టు సెంటరు వద్ద మండలంలోని హనుమాన్ జంక్షన్ కుంట నుంచి వేగంగా వస్తున్న మూడు వాహనాలను అపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్లు ఆపకుండా వెళ్తుండటంతో సీఐ భీమానాయక్ రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి వాహనాల వెంటబడి పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేయగా నిషేధించిన పొగాకు, గుట్కా, ఖైనీ, గంజాయి నిల్వలు గుర్తించారు. వాటితో పాటు 11 మందిని అదుపులో తీసుకున్నారు. వీటిని చుట్టు పక్కల ప్రాంతాలైన గుంటూరు జిల్లా రెంటచింతల, నరసరావుపేట, గుంటూరు పట్టణం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కంభం, నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో సబ్ డీలర్లకు భారీగా సరఫరా చేస్తున్నారు. నిందితులైన నల్లారి రామాంజనేయులు, బాదా శివానందరెడ్డి, మిడియాల సత్యనారాయణ, పెరకలపాటి ధనుంజయ, పెబ్బి వెంకటరాముడు, ఎలూర నరేంద్ర, వెన్నపూస నాగర్జునరెడ్డిలు అనంతపురం జిల్లా చెందిన వారు. ప్రధాన ముద్దాయి నల్లారి రామాంజనేయులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి కేంద్రంగా నాలుగు టీంలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో ఉన్న సబ్ డీలర్లకు సరఫరా చేసేందుకు మనుషులను నియమించుకొని వాటిని సరఫరా చేస్తున్నాడు. సరుకు వేసిన అనంతరం డబ్బులు కూడా వారే వసూలు చేసుకొని యజమానికి ఇవ్వడం చేస్తున్నారు. 125 బస్తాల గుట్కా, ఖైనీల విలువ రూ. 30 లక్షలుగా గుర్తించారు. అలాగే రూ. 23,71,610 స్వాధీనం చేసుకున్నారు. కేజీ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి షాపుల యజమానులకు శాంపిల్స్ చూపించేందుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణం చెందిన తడికమళ్ల శేషగిరి, గుంటూరు జిల్లా రెంటచింతల చెందిన నామం కిశోర్, షేక్ సైదులు, గిద్దలూరుకు చెందిన భవనాశి వెంకటసుబ్బయ్యలకు నిషేధిత ఉత్పత్తులను నల్లారి రామాంజనేయులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరుకు ఉన్న వాహనం ముందు మరొక వాహనంలో ముగ్గురు ఉండి పైలెట్గా పోతూ వెనుక వచ్చే వాహనాల డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. 11 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐలు, పోలీసులకు జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెద్దారవీడు, మార్కాపురం టౌన్, రూరల్ ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల ఎస్సైలు పి. ముక్కంటి, జి. రామకోటయ్య, మల్లికార్జున, దేవకుమార్, రామకోటయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్లగట్టుపోడు పంచాయతీలోని కన్నెకుంట రోడ్డులో బుగ్గలవాగు పరిసర ప్రాంతాలలో గాలిస్తుండగా పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు, కట్టెలతో దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో భాగంగా చాకచక్యంగా అక్కడున్న ఐదు ఎర్రచందనం దుంగలను, ఒక మహేంద్ర గూడ్స్ వాహనం, ఒక హీరో హోండా బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన దంతం వెంకటేష్, అనంతపురం జిల్లా గుంతకల్కు చెందిన బెల్డోనా మల్లయ్య, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన నుగాలన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ఓబులవారిపల్లె మండలం వైకోట సమీపంలోని గుండాలేరు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దుంగలను , ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కె.బుడుగుంటపల్లె పంచాయతీ సమతానగర్కు చెందిన వెలుగు గంగయ్య, అల్లం మణి, రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన ఎలకచెర్ల సుదర్శన్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే చిట్వేలి మండలం రాజుకుంట సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన వెంకటేష్, కన్నెకుంట ఎస్టీ కాలనికి చెందిన కమ్మల వెంకటరమణ,, తమిళనాడుకు చెందిన పూచి గోవ్నరాజ్లను అరెస్ట్ చేశామన్నారు. పై మూడు దాడుల్లో 15 దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సాయినాథ్, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె , చిట్వేలి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, సత్యనారాయణ, డాక్టర్ నాయక్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పగలేమో డాక్టర్.. రాత్రేమో...
రైల్వేకోడూరు అర్బన్ : సమాజంలో ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీఐ సాయినాథ్ పర్యవేక్షణలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలంలు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎంతోకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డాక్టర్ ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కాల్వ నాగేశ్వర్రావు, ప్రొటెక్షన్ వాచర్లు సుధాకర్, పరశురాం, శ్రీనులను కోడూరు మండలం కుక్కలదొడ్డికి చెందిన అంకయ్య, చిత్తూరు జిల్లా మామండూరుకు చెందిన గురవయ్యలను అరెస్ట్ చేసి 9,28,000 రూపాయలు విలువచేసే 15 ఎర్ర చందనం దుంగలు, ఒక కారు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో మూడు బృందాలుగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. విచారణలో వీరు తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కూలీలను తీసుకువచ్చి వారిని అడవుల్లోకి తరలించి దుంగలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత నేరస్తుడితో సంబంధాలు స్మగ్లింగ్ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుకు పలు ఎర్రచందనం కేసులలో నిందితుడిగా ఉంటూ పరా రీలో ఉన్న స్మగ్లర్ భీమాతో సంబంధాలు ఉన్న విషయం పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. స్మగ్లర్ భీమాపై సుమారు 9 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతానికి వస్తే అరెస్ట్ చేస్తారేమోనని డాక్టర్ ద్వారా పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి మాచ్ఖండ్–లమతాపుట్ మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. లమతాపుట్, మాచ్ఖండ్, ఒనకఢిల్లీ, మొదలగు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. మాచ్ఖండ్, లమతాపుట్, జోళాపుట్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ జరుపుతుండగా లమతాపుట్–మాచ్ఖండ్ మార్గంలో సిందిపుట్ నదీ ఘాట్ వద్ద కొంతమంది గంజాయి తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆ సయంలో పోలీసులు అటువైపు రావటం చూచిన వారు గంజాయిని, వాహనాన్ని వదిలిపెట్టి పరారీ అయ్యారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీన పరచుకొన్నారు. మాచ్ఖండ్ తహసీల్దార్, మెజిస్ట్రేట్ కర్ణదేవ్ సమర్ధర్, నందపూర్ ఎస్డీపీవో శివరాం నాయిక్ సమక్షంలో తూయగా 40 క్వింటాళ్ల 40 కేజీలు ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో మాచ్ఖండ్ పోలీసు అధికారి తపన కుమార్ నాహక్, జోలాపుట్ పోలీసు అధికారి మహేశ్ కిరిససాని, లమతాపుట్ పోలీసు అధికారి శివప్రసాద్ షొడంగి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి మాఫియా గుట్టురట్టు
సాక్షి, బరంపురం: ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్స్టేషన్లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్స్టేషన్ ఐఐసీ అధికారి సుజిత్ నాయక్ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్ ప్రధాన్, మహేష్ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్ వర్మ, సూరజ్ విజయ్ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు. -
టాస్క్ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి
సాక్షి, కాశీనాయన/ చంద్రగిరి : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లోను, చిత్తూరు జిల్లా నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ సంఘఠనలో ఒక కానీస్టేబుల్ గాయపడ్డాడు. దాడిచేసినవారిపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 47 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎర్రచందనం కూలీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్ఎస్సై వాసు, డీఆర్వో పీవీఎన్.రావు బృందం బుధవారం అర్ర్థరాత్రి నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎర్రచందనం కూలీలకు పైలట్గా వచ్చానని అతను చెప్పడంతో, అతన్ని తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలోని పంప్హౌస్ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కూలీలు దుంగలు మోసుకొస్తూ కనిపించడంతో అధికారులు వారిపై దాడులు చేశారు. కూలీలు వారి వద్దనున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చేతికి గాయమైంది. దాంతో అధికారులు గాల్లో కాల్పులు జరపగా, ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చిన్నప్పయ్య, స్వామినాథన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఎర్ర కూలీల నుంచి సుమారు 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ పీసీ లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు తరలించారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు చెక్పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో అంతర్జాతీయ స్మగ్లర్ ఏటీ మైదీన్ను పోలీసులు పట్టుకున్నారు. మైదీన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా. చాయ్వాలాగా జీవితం ప్రారంభించిన మైదీన్ స్మగ్లింగ్ దిగి భారీగా ఆస్తులు కూడబెట్టాడు. అతని వద్ద నుంచి 66 ఎర్రచందనం దుంగలతో పాటు 2 బీఎండబ్ల్యు కార్లు, మరో 2 నిస్సాన్ కార్లు, ఒక టాటా క్సినాన్ పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద రూ. 55 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, 4 సెల్ఫోన్లు, పలు డాక్యుమెంట్లు గుర్తించారు. సుమారు రూ.78 కోట్ల స్థిర చర ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ విలేకరులకు తెలిపారు. అతనితో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
-
15 మంది స్మగ్లర్లు అరెస్ట్
13 ఎర్రచందనం దుంగలు స్వాదీనం ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ జింకల శ్రీలక్ష్మి తెలిపారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖాజీపేట మండలం లోని లంకమల్ల అడవుల్లోకి తమిళ స్మగ్లర్లు, మరికొందరు స్థానిక స్మగ్లర్లు దొంగచాటుగా ప్రవేశించి ఎర్రచందనాన్ని నరికి తీసుకు వచ్చి స్మగ్లింగ్ చేసేవారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. చెన్నముక్కపల్లె తెలుగుగంగ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 15 మంది స్మగ్లర్లతో పాటు 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరెస్టయిన స్మగ్లర్లు వీరే.. 1.ఆకుల జయరాముడు, 2. ఆకుమల్ల పెద్దరాముడు, 3.మద్దెల కిరణ్ 4. మద్దెల రజనీకాంత్, 5. మద్దెల చెప్పలయ్య, 6. మెల్ల జయరాముడు (చెన్నముక్కపల్లె) 7. తవ్వా స్వామి కొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 8. మధుర దొరబాబు (చెన్నముక్కపల్లె) 9. ఆకుమల్ల సుధాకర్ (చెన్నముక్కపల్లె) 10. తవ్వా బాలకొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 11. ఆకులమల్ల రామ్బాబు (చెన్నముక్కపల్లె) 12. మెల్ల రఘురాం (చెన్నముక్కపల్లె) 13. మల్లె బాబు (చెన్నముక్కపల్లె) 14. అబ్బిరెడ్డి ఓబుళరెడ్డి 15. పొట్టి ప్రతాప్రెడ్డి ఉన్నారు. పోలీస్, అటవీ అధికారులుగా బెదిరింపులు ఇక్కడి అడవుల్లో తమిళ కూలీల రాక పోకలు అధికంగా ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. దీనిని గుర్తించి స్థానిక స్మగ్లర్లు తాము అటవీ, పోలీసు అధికారులమని తమిళ కూలీలను బెదిరించి వారిపై దాడులు చేసేవారన్నారు. తమిళ కూలీలు వదిలిన 15 దంగలను తీసుకుని దువ్వూరు, చెన్నూరు, పెండ్లిమర్రి కి చెందిన వ్యక్తులకు అమ్మి రూ.2లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలిపారు. తమిళ కూలీల కదలిక పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారు ఎంతటివారైనా సహించేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎరక్కపోయి..ఇరుక్కుపోయాడు
దుబాయ్ పోలీసుల చెరలోపాతబస్తీ యువకుడు సాయం చేయబోరుు నిషేధిత మత్తు టాబ్లెట్లు ఉండటంతో అరెస్టు విషయం తెలిసి తప్పించుకున్న సూత్రధారులు సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పరిచయస్తులకు సాయం చేయబోరుు ఇబ్బందుల్లో పడ్డాడు. తనకు తెలియకుండానే స్మగ్లర్గా మారడంతో దుబాయ్ విమానాశ్రయంలో అధికారులకు చిక్కాడు. విషయం తెలిసి సూత్రధారులు తప్పించుకుని పారిపోగా... ఎరక్కపోరుు ఇరుక్కుపోరుున యువకుడు మాత్రం ప్రస్తుతం దుబాయ్లో విచారణ ఎదుర్కోబోతున్నాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం వెళ్తుండగా పాతబస్తీలోని బార్కస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత నెలలో ఉద్యోగం కోసం దుబాయ్ పయనమయ్యాడు. ఈ విషయం తెలిసిన పరిచయస్తులు దుబాయ్లోనే ఉన్న తమ వారికి స్వీట్లు తీసుకువెళ్ళాల్సిందిగా కోరారు. కేవలం మిఠారుులే కదా అనే ఉద్దేశంతో సదరు యువకుడు అందుకు అంగీకరించాడు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఆ పరిచయస్తులు ఓ స్వీట్ ప్యాకెట్ను పార్శిల్ చేసి తీసుకువచ్చి అతడికి ఇచ్చారు. తన లగేజ్తో పాటు దానిని తీసుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన యువకుడు దుబాయ్లో దిగిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యారుు. తనిఖీల్లో బయటపడిన ట్యాబ్లెట్స్... దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు సదరు యువకుడితో పాటు అతడు తీసుకువచ్చిన లగేజ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్వీట్ బాక్స్ అడుగున ఉన్న మూడు స్ట్రిప్స్ మత్తు ట్యాబ్లెట్లను గుర్తించారు. వీటిపై ఆ దేశంలో నిషేధం ఉన్నందున వీటిని కలిగి ఉంటే అక్కడి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో నిషేధిత ట్యాబ్లెట్లు తీసుకువచ్చిన యువకుడిని దుబాయ్ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ స్వీట్ ప్యాకెట్ తనది కాదని, పరిచయస్తులు దుబాయ్లో ఉన్న తమ వారి కోసం పంపించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఫోన్ చేయడంతో కథ అడ్డం తిరిగి... యువకుడు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు ఆ ప్యాకెట్ ఎవరికి అందించాల్సి ఉందో వారికి ఫోన్ చేసి రప్పించాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ఓ ఫోన్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అరుుతే నగర యువకుడు దుబాయ్లో వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన వారికి ఫోన్ చేయకుండా... నగరంలో దాన్ని తనకు ఇచ్చిన పరిచయస్తులకు కాల్ చేసి విషయం చెప్పాడు. తన ప్రమేయం లేకుండా తనను ఇబ్బందుల పాలు చేశారంటూ వాపోయాడు. దుబాయ్లో స్వీట్ ప్యాకెట్ తీసుకోవాల్సిన వారి వివరాలు వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడి అధికారులు అరెస్టు చేస్తారని భావించిన ‘పరిచయస్తులు’ వెంటనే ఫోన్ ద్వారా అక్కడి తమ వారిని అప్రమత్తం చేశారు. ఢిల్లీకి పారిపోరుు వచ్చిన సూత్రధారులు... హైదరాబాద్లో ఉన్న వారి ద్వారా విషయం తెలుసుకున్న ‘ప్యాకెట్ రిసీవర్లు’ తక్షణం దుబాయ్ వదిలేశారు. ఆఘమేఘాల మీద ఆ దేశం విడిచిపెట్టి, వివిధ దేశాలు తిరుగుతూ ఢిల్లీకి వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు సూత్రధారులకు సహకరించడానికే హైదరాబాద్ యువకుడు ఫోన్ చేిసినట్లు భావింస్తూ సదరు యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడి న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఢిల్లీ పారిపోరుు వచ్చిన, నగరంలో ఉన్న సూత్రధారులు చిక్కితే తప్ప పాతబస్తీ యువకుడు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకు నిషేధించారంటే... మత్తు ట్యాబ్లెట్స్ను దుబాయ్లో నిషేధించడానికి పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు ఈ తరహా ట్యాబ్లెట్లు అక్కడ కూడా లభించేవి. మరోపక్క దుబాయ్లో నివసిస్తున్న పాకిస్థానీయులు జర్దాను విరివిగా వినియోగిస్తున్నారు. ఆ దేశానికి చెందిన యువత మత్తు మందులు, డ్రగ్స దొరకని సందర్భాల్లో ఈ రెంటినీ శీతలపానీయాల్లో కలిపి తాగుతున్నారు. దీంతో నిషాలో జోగుతూ ఆ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు వదులుతున్నారు. వరుసగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అక్కడి అధికారులు మత్తు ట్యాబ్లెట్స్, జర్దా విక్రయాలను నిషేధించారు. కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే అనుమతులు తీసుకున్నాక పరిమితంగా విక్రరుుంచే అవకాశం ఉంది. -
లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!
• గుర్తించిన చిత్తూరు పోలీసులు • కళ్లు గప్పి తిరుగుతున్న స్మగ్లర్ • గాలింపు చర్యలు ముమ్మరం చిత్తూరు (అర్బన్): లక్ష్మణ్ - ఎర్రచందనం స్మగ్లింగ్లో పరిచయం అవసరంలేని వ్యక్తి. సింపుల్గా పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు చెప్పాలంటే రూ.వంద కోట్ల ఆస్తి, జిల్లాలో 20కి పైగా కేసులు, చిత్తూరు నుంచి చైనా వరకు ఎర్రచందనం దుంగల్ని రాచమార్గంలో తీసుకెళ్లగలిగే వ్యక్తి. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో పీడీ యాక్టు కింద ఉన్నాడు. ఓ పెద్ద స్మగ్లర్కు చెక్ పెట్టగలిగామని సంబరపడుతున్న పోలీసులకు అతని తమ్ముడు రమేష్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. విదేశాలకూ విస్తరించిన ‘ఎర్ర’ నెట్వర్క్ ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగిన లక్ష్మణ్ స్వస్థలం చెన్నై. ఇతన్ని రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన పోలీసులు తొలిసారిగా రెండుసార్లు పీడీ యాక్టు బనారుుంచి అతడిని కటకటాల్లోకి నెట్టగలిగారు. అయినా జైల్లో నుంచే లక్ష్మణ్ తన రెండో భార్య. ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్, మాజీ ఎరుుర్ హోస్టెస్ సంగీత ద్వారా హవాలా రూపంలో స్మగ్లర్లకు భారీగా నగదు పంపిస్తూ, ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న చిత్తూరు పోలీసులు సంగీతను కోల్కత్తాలో అరెస్టు చేయడం, భారీగా బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేయడం తెలిసిందే. అరుుతే, చిత్తూరులో పెండింగ్ కేసులు ఉన్నా న్యాయస్థానానికి హాజరుకాకుండా సంగీత తప్పించుకు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం రమేష్ అనే పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్కు స్వయాన తమ్ముడైన రమేష్ ఇప్పుడు ఎర్రచందనం రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. గత నెల 17న చిత్తూరు పోలీసులు కడపకు చెందిన అందాలరాముడు అనే స్మగ్లర్ను అరెస్టు చేశా రు. ఇతడిని విచారణ చేయగా లక్ష్మణ్ తమ్ముడు రమేష్తో కలిసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. చెన్నై కేంద్రంగా ’ఎర్ర’ వ్యాపారం లక్ష్మణ్కు ఇద్దరు తమ్ముళ్లు. కరుప్పన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. లక్ష్మణ్ జైలుకు వెళ్లిన తరువాత సంగీత ఆటలు సాగకపోవడంతో రమేష్ ఎర్రచందనం స్మగ్లింగ్లోకి దిగాడు. జిల్లా నుంచి ఎర్రచందనం దుంగల్ని చెన్నై, బెంగళూరుకు చేర్చడం, కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై కేంద్రంగా రమేష్ చేస్తున్న వ్యాపారాన్ని రట్టు చేసేందుకు చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది. రమేష్ పోలీ సులు త్వరలోనే పట్టుకోగలమనే పకడ్బందీ వ్యూహం తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేస్తే చెన్నైలో 80 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టనట్లే అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఐదుగురు బడా స్మగ్లర్లపై పీడీ యాక్టు
– ఓఎస్డీ సత్య ఏసుబాబు వెల్లడి కడప అర్బన్ : ఐదుగురు బడా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓఎస్డీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు కర్ణాటక రాష్ట్రం కటిగెనహళ్లికి చెందిన షేక్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయ్యో (40), బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ ప్రవీణ్కుమార్ అలియాస్ ప్రవీణ్ (38), తుంకూరు జిల్లా సిరా పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ రెహ్మాన్, చెన్నై రెడ్హిల్స్కు చెందిన కందస్వామి పార్తిబన్ అలియాస్ పార్తిపన్ (46) జిల్లాలోని బద్వేలుకు చెందిన రైస్మిల్ సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బిరెడ్డి అలియాస్ గాజులపల్లి సుబ్బారెడ్డి (48)లపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు ఓఎస్డీ తెలిపారు. ఫయాజ్పై 71 కేసులు నమోదుకాగా వైఎస్సార్ జిల్లాలో 45, చిత్తూరు జిల్లాలో 26 కేసులు ఉన్నాయన్నారు. హెచ్ఎస్ ప్రవీణ్కుమార్పై 22 కేసులు, షేక్ అబ్దుల్ రెహ్మాన్పై 27 కేసులు, కందస్వామి పార్తిబన్పై 28 కేసులు, రైస్మిల్ సుబ్బారెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయన్నారు. -
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ౖయెటింక్లయిన్కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సోమవారం పట్టుకున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు. స్థానిక శ్రీలంక షిర్కేక్వార్టర్స్ ఏరియాలోని పోచమ్మ గుడి వద్ద గంజాయి అమ్ముతున్న కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన మహ్మద్ యాకూబ్పాషా, పెద్దపల్లికి చెందిన సయ్యద్ షాహిద్ను కానిస్టేబుళ్లు జె.రమేష్, ఓ.కృష్ణారెడ్డిలు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.4,400 విలువచేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని కమాన్పూర్ తహసీల్దార్ హన్మంతరావుతో పంచనామా చేయించారు. -
గంజాయి స్మగ్లర్లపై కాల్పులు
-
గంజాయి స్మగ్లర్లపై కాల్పులు జరిపిన పోలీసులు
దేవరాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్లను విజయవాడ పోలీసుల సహకారంతో పశ్చిమ గోదావరిలోని మూడు మండలాల పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషను నిర్వహించి నిందితులను సినీఫక్కీలో వెంబడించారు. వారు ఎంత సేపటికి ఆగకపోవడంతో గాలిలోకి ఒక రౌండు కాల్పుల జరిపారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారినుంచి భారీ స్థాయిలో 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.నిందితులలోని ఎక్కువ మంది వరంగల్ కు చెందిన వారిగా తెలుస్తోంది. సాక్షి ఏనాడో చెప్పింది నర్సీపట్నం కేంద్రంగా గతకొంత కాలంగా పశ్చిమ గోదావరి, వరంగల్ మీదుగా హైద్రాబాద్ కు జోరుగా గంజాయి తరళిస్తున్నారని సాక్షి దినపత్రిక కథనాలను ప్రచురించింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే గంజాయి వ్యాపారులు రెచ్చిపోయారని తెలుస్తోంది. -
ప్రాణాలు బలిగొంటున్న ఇసుకాసురులు
మితిమీరిన వేగంతో ప్రమాదాలు గర్రెపల్లి నుంచి ట్రాక్టర్ల ద్వారా సరఫరా ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు చొప్పదండి : అక్రమ ఇసుక రవాణా అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పగలు రాత్రి లేకుండా కొనసాగుతున్న అక్రమ దందా మూలంగా గ్రామాల్లోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన అధికారుల ఉదాసీన వైఖరి రోడ్డు మీద ప్రయాణించే వారిపాలిట శాపంగా మారుతోంది. ఇసుక రవాణ చేసే వాహనాలతో ప్రమాదాల బారిన పడి ప్రతి సంవత్సరం ఒకరిద్దురూ ప్రాణాలు వదులుతున్నారు. అడ్డుకట్ట వేసేదెప్పుడో.. చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి చొప్పదండి కేంద్రంగా అనుమతి లేకుండనే పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక రవాణా కొనసాగుతోంది. చొప్పదండి మండలంతో పాటు, పరిసరాలలో ఇసుకకొరత ఉండడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చొప్పదండి శివార్లలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుండటంతో దళారులు కమీషన్ దందాలకు తెరలేపి ఇసుక అక్రమ రవాణాకు ఆజ్యాం పోస్తున్నారు. అక్రమ రవాణాపై కొరుఢా ఝులిపించాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో తూగుతుండడంతో ఇసుక దళారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇసుక తరలించే వాహనాల వల్ల చొప్పదండితో పాటు భూపాలపట్నం, వెదురుగట్ట, కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట గ్రామాల్లో రోడ్ల వెంట ప్రజలు వెళ్లేందుకే జంకుతున్నారు. జనావాసాలు మధ్య నుంచే ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో వెలుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల ఆగడాలను నిరోధించాలని స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు వవిజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిఘా కరువు చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు సీరియస్గా దృష్టి సారించడం లేదు. అప్పుడప్పుడు దాడులు చేసి నామమాత్రంగా జరిమానాలు విధించి వదిలేస్తుండటంతో, అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అధిక ధరలకు ఇసుక విక్రయిస్తూ జనాలను దోచుకుంటున్నారు. రూ. లక్షల్లో కొనసాగుతున్న దందాపై పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా దారుల వ్యవహారం బయటకు పొక్కడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
‘ఎర్ర’ స్మగ్లర్ల తెలివి తేటలు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు మారు వేషాలు వేస్తుంటే.. స్మగ్లర్లు తప్పించుకోవడానికి విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రచందనం దుంగలు తీసుకెళ్లే లారీలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లారీ లోపల టమాట, ఇతర కూరగాయలు పెట్టుకోవడానికి కమ్మీలు పెట్టి మధ్యలో ఎర్రచందనం దుంగలను ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు. ఇదే లారీల్లో స్మగ్లర్లు టమాట బుట్టల వెనుకవైపు కూర్చుని పోలీసులు తనిఖీలు చేస్తే తప్పించుకోవడానికి ప్రత్యేకంగా ఓ అత్యవసర దారిని సైతం తయారు చేయించుకుంటున్నారు. పోలీసులు లారీని తనిఖీ చేసేలోపు స్మగ్లర్లు బాడీ కింద ఉన్న అత్యవసర తలుపును తీసి కిందకు దిగి తప్పించుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో చిత్తూరు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ రెడ్లో స్వాధీనం చేసుకున్న లారీని ఇదే తరహాలో తయారుచేయించడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
అడ్డొస్తే అంతే..
మంత్రి ఇలాకాలోనే అధికారులపై దాడులు జిల్లావైపు కన్నెతి చూడని అమాత్యుడు ఓ డీఎస్పీ ‘మామూలు’ రూ.8 లక్షలపైనే ! ప్రత్యేక సమయంలోనే రవాణా కరీంనగర్ క్రైం : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నాయకులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇసుక స్మగ్లర్లు దేనికైనా బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఓపక్క ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ఇసుక స్మగ్లర్లు రవాణా శాఖ అధికారులపై దాడికి యత్నించడం గమనార్హం. మరోవైపు పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. జిల్లావైపు చూడని మంత్రి... జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్ మూడునెలల క్రితం మైనింగ్శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఇంటిలెజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన ఆయన అక్రమాలకు ఊతం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపారు. ఇసుక అక్రమ వ్యవహారంలో మహబూబ్నగర్ మైనింగ్ ఏడీగా పనిచేస్తున్న కృష్ణప్రతాప్పై సస్పెన్షన్ వేటువేశారు. అయితే సొంత జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్కు రవాణా అవుతున్న ఇసుకలో 80శాతం కరీంనగర్ నుంచే వెళ్తోంది. వీటిలో 45శాతం అక్రమంగా రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం ఒక్క ఇసుక క్వారీ నిర్వహించడం లేదు. పైగా క్వారీ దక్కించుకున్న వారిలో చాలామంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఉండడం గమనార్హం. దీంతోనే మంత్రి జిల్లాపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోట్ల విలువైన సహజ సంపద తరలిపోతోంది. ఏకంగా మంత్రి నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా రవాణాశాఖ అధికారులపై దాడులకు దిగడం స్మగ్లర్ల బరితెగింపునకు నిదర్శనం. నిబంధనలు గాలికి... ఇసుక రీచ్లు వేలంవేసే సమయంలో నిబంధనలు అమలుచేసే బాధ్యతను టీఎంఎన్డీసీకి అప్పగించారు. ఇసుక రవాణాలో పాదర్శకంగా అమ్మకాలు చేయడానికి పలు అంశాలను అందులో పొందుపర్చారు. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై నిబంధనలను గాలికొదిలేశారు. ఇసుక క్వారీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతీ లారీకి జీపీఎస్ ట్రాకర్లు అమర్చడం, చెక్పోస్టుల్లో ప్రత్యేక రికార్డ్లు ఏర్పాటుచేయాలి. అయితే ఇంతవరకూ ఏ ఒక్క క్వారీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల ఏర్పాటుచేసినా పనిచేయకుండా చేశారనే విమర్శలున్నాయి. రోజు జిల్లా నుంచి సుమారు 300 లారీల ఇసుక హైదరాబాద్కు రవాణా అవుతోంది. ఇందులో 60 శాతం వరకూ అక్రమంగా తరలిపోతోంది. ఇవన్నీ కూడా టీఎంఎన్డీసీ, పోలీసులు, మైనింగ్ అధికారులకు తెలిసినా వారు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఓ డీఎస్పీ వాటా రూ.8 లక్షలు..! జిల్లాలో ఇసుక క్వారీలు అధికంగా ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న ఓ డీఎస్పీకి ఇసుక అక్రమ రవాణాదారులు ప్రతీనెల రూ.8 లక్షలపైనే ముట్టజెబుతున్నారు. సదరు డీఎస్పీ నియంత్రణలో ఉన్న సుమారు 60 టిప్పర్లు రోజూ తెల్లవారుజామున ఓ ప్రత్యేక సమయంలో వెళ్లిపోతాయని సమాచారం. వాటి నంబర్లతో సహా చెక్పోస్టులో ఉండడంతో ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణా సాగిపోతోందని సమాచారం. గతంలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా వీటిని పర్యవేక్షించారని తెలిసింది. ఉన్నతాధికారులు మాత్రం ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటూ వారిపై బదిలీ వేటు వేసి దూరప్రాంతాలకు పంపించారు. అయితే సదరు డీఎస్పీ, సీఐలపై చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఇసుక క్వారీల ఉన్న ప్రాంతంలో ఉన్న పోలీస్స్టేషన్లు, సీఐలకు ఓవర్లోడు, అనుమతి లేకుండా రవాణా అవుతున్న ఒక్కో లారీకి నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారని తెలిసింది. పోలీసు అధికారులు కనుసన్నల్లోని చెక్పోస్టుల నుంచి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణాచేస్తున్నారని తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశముంది. దాడులకు వెనుకాడని మాఫియా... ఇసుక అక్రమ రవాణాకు అడ్డువస్తున్న వారికి మొదట డబ్బులు ఎరవేయడం... లేదంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడడంలేదు. నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేస్తున్నామని చెప్పుకుంటున్న క్వారీల కాంట్రాక్టర్లు మరి అధికారులపై దాడులు ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్న. ఇసుక రవాణా విషయంలో పోలీస్శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధికారులు స్పందించి కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందాకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దూకుడుగా మైనింగ్ విజిలెన్స్ ఓ వైపు సిబ్బంది కొరత ఉన్నా మైనింగ్ విజిలెన్స్ దూకుడుగా వ్యవహరిస్తోంది. రోజు ఎక్కడో ఒకచోట అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్న లారీలను అధికారులు పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే వాటికి రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధిస్తున్నారు. 2015–16లో కేవలం ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.61.87లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. వీరికి మరింత సిబ్బందిని మరిన్ని అధికారాలు ఇస్తే ఆదాయం పెరగడంతోపాటు అక్రమ రవాణా తగ్గుతుంది. -
అంతర్జాతీయ స్మగ్లర్ అజయ్పై పీడీ యాక్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలో ఏప్రిల్ 6న అజయ్ను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనాన్ని దేశవిదేశాలకు సుమారు 200 టన్నుల వరకు అజయ్ స్మగ్లింగ్కు పాల్పడ్డాడు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న అతనిపై పీడీ యాక్డు పెట్టాలన్న పోలీసులు ప్రతిపాదనకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అజయ్పై 13 కేసులు నమోదై ఉన్నాయి. -
స్మాగ్ ఫ్రీ .. రింగ్ గిఫ్ట్..
వాతావరణ కాలుష్యం.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని అనేక దేశాలు వణికిపోతాయి. దీని వల్ల కలిగే అనర్థాలకు అంతే లేదు. మొన్నీమధ్య కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని చైనా రాజధాని బీజింగ్లో ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సంఘటన చూసి డచ్కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్యచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఆ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత ్పత్తి చేస్తుంది. చూడడానికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్ టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్గా ఉంచగ లుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ను తొలిసారిగా సెప్టెంబర్లో బీజింగ్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు. హాలండ్లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు. -
అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అజయ్ అరెస్ట్
చిత్తూరు (అర్బన్) : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కేరళకు చెందిన అజయ్ (47)ను అరెస్ట్ చేసినట్టు ఓ ఎస్డీ రత్న తెలి పారు. ఆమె బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. శేషాచలం టూ దుబాయ్, హాంకాంగ్.. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలోని ఎడచే రి గ్రామానికి చెందిన అజయ్ పదో త రగతి ఫెయిల్ అయ్యాడు. 2004 వర కు ఇతను కేరళలోని పాలకాడ్లో ఉన్న శ్రీగంధం బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాడు. అక్కడ పనిచేసే మహిళల ద్వారా శ్రీగంధాన్ని తెప్పించి ఇతరులకు విక్రయిస్తూ కొంతమంది అనుచరులను తయారు చేసుకున్నా డు. అతను శేషాచలంలో కూలీలు, మే స్త్రీల ద్వారా ఎర్రచందనం దుంగల్ని తె ప్పించి చెన్నై, ముంబయి ద్వారా విదేశాలకు తరలించేవాడు. దుబాయ్లో ఉంటున్న సాహుల్భాయ్, హాంకాంగ్లోని సలీమ్కు కూడా ఎర్రచందనం ఎగుమతి చేశాడు. గత ఏడాది అరెస్టయిన చైనా స్మగ్లర్ ఛెయన్ ఫియాన్కు కూడా అజయ్ ఎర్రచందనం అందచేశాడు. ఇలా ఇప్పటి వరకు 200 టన్ను ల ఎర్రచందనాన్ని ఎగుమతి చేసిన అ జయ్ రూ.40 కోట్ల వరకు కూడ పెట్టాడు. గత ఏడాది చిత్తూరు పోలీసులు కేరళలో తనిఖీలు నిర్వహించి అతని అనుచరులు నాజర్, ఉమర్, లతీష్ను అరెస్టు చేశారు. ఏడాదిగా అజయ్పై నిఘా పెట్టారు. అజయ్పై 13 కేసులు.. అజయ్పై జిల్లాలోని తాలూకా, గుడిపాల, సదుం, మదనపల్లె, భాకరాపే ట, వెదురుకుప్పం, పుత్తూరు, నగరి, ఎస్ఆర్.పురం, కల్లూరు, విజయపురం పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా శ్రీగంధం స్మ గ్లింగ్ చేస్తూ కేరళ పోలీసులకు నాలుసా ర్లు చిక్కాడు. ఇతన్ని విచారించాల్సి ఉందని, ఇతనిచ్చే సమాచారంతో ప లువురుని అరెస్టు చేస్తామని ఓఎస్డీ పే ర్కొన్నారు. గుడిపాల ఎస్ఐ లక్ష్మీకాం త్, చి త్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు ఆదినారాయణ, చంద్రశేఖర్ను ఓఎస్డీ అభినందించారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలంలోని రాయలవారికోట సమీపంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించగా... దొంగలు తారసపడ్డారు. అధికారులను చూసిన దొంగలు ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. రూ.2 కోట్ల విలువజేసే 50 ఎర్రచందనం దుంగలతోపాటు... తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన చిన్నపయ్యన్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో మండలంలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ విద్యానికేతన్ సమీపంలో సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ కూంబింగ్లో 9 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుర్రంపల్లి శివారులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, అటవీ అధికారులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో కడప-కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 132 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు మూడు టన్నులు ఉంటుందని సమాచారం. అయితే, దాడుల సమయంలో స్మగ్లర్లు అటవీ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
పూతలపట్టు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు శుక్రవారం ఓ ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. మండలంలోని రంగంపేట క్రాస్రోడ్డు వద్ద చెన్నైకి చెందిన మద్ది కుమార్ (45)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 15 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
నెల్లూరు: ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచిన నేరంపై ఓవ్యక్తిని నెల్లూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అరవపెరిమిడి గ్రామానికి చెందిన పల్లం కృష్ణయ్య ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.4.50 లక్షల విలువైన 60 ఎర్ర చందనం దుంగలను ఈనెల 14న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కృష్ణయ్యను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ ఎం.రత్తయ్య తెలిపారు.మరో పాత నేరస్తుడు పాడేటి అశోక్కుమార్రెడ్డి పరారిలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. -
ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు
నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు వారిచ్చిన సమాచారంతో కర్ణాటకలో దాడులు రూ.కోటి విలువైన ఎర్ర దుంగల స్వాధీనం చిత్తూరు (అర్బన్) : జిల్లాలోని బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలోని ఆదివారం పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లరు పట్టుబడ్డా రు. వారిలో మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్(36), అన్నదమ్ములు ఎస్.అరుల్(25), ఎస్.శరవణ(22) ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిచ్చినసమాచారంతో చిత్తూరు పోలీ సులు కర్ణాటక రాష్ట్రంలో భారీగా ఎర్ర డంప్ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న ఈ మేరకు వివరాలు వెల్లడిం చారు. కర్ణాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ అలియాస్ మున్నాకు చెందిన మామిడి తోటలో సోదాలు నిర్వహించిన పోలీసులు 3 టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. అంజాద్ పారిపోయాడని, దుంగల విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు. నిందితుల వివరాలిలా.. మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు చేసిన పోలీసులు చిత్తూరు నగరంలోని జాన్స్ గార్డెన్కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్ను అరెస్టు చేశారని ఓఎస్డీ తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్న ఇతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్లో ఉన్నాడన్నారు. పేరు మోసిన స్మగ్లర్ షరీఫ్కు ముఖ్య అనుచరుడని, ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలువురు స్మగ్లర్లతో ఇతనికి పరిచయాలు ఉన్నాయని వెల్లడించారు. అల్తాఫ్పై ఇప్పటి వరకు జిల్లాలో ఆరు కేసులున్నాయి. ఇక బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తస్గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన అన్నదమ్ములు ఎస్.అరుల్, ఎస్.శరవణలను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరూ జేసీబీ డ్రైవర్లుగా పని చేసేవారని, గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్లో పెలైట్గా వ్యవహరిస్తున్నారని ఓఎస్డీ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బంగారుపాళ్యం, మదనపల్లె పోలీసుల్ని ఓఎస్డీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రూ. 25 లక్షల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు రైల్వేకోడూరులోని బాలుపల్లి చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. షేక్ దర్బార్ బాషా, మన్నూరు హుస్సేన్ అనే ఇద్దరు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హసన్ భాయ్ అనుచరులుగా గుర్తించారు. వీరి నుంచి 28 ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్లకు చెందిన వీరిని అరెస్ట్ చేయడంతో పాటు పది కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు దుబాయ్కు చెందిన అలీబాయ్ అనే బడా స్మగ్లర్ అనుచరులని పోలీసులు తెలిపారు. -
ఎర్రదొంగ దొరికాడు
అంతర్జాతీయ ఎర్ర చందన స్మగ్లర్ ముంబైకి చెందిన రాజూభాయ్ని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు వెయ్యి టన్నుల ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు రాజూభాయ్పై ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదన ద్వారా అతడు దేశ వ్యాప్తంగా రూ.600 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల పాటు ముంబైలో ఉచ్చుపన్నిన ఏపీ పోలీసులు చాకచక్యంగా రాజూభాయ్ ని అరెస్టు చేసినట్లు వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పది కేసుల్లో జితేంద్రమోహన్ అలియాస్ రాజాభాయ్ను నిందితునిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
80 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం కొండపేట సమీపంలో ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 ఎర్రచందనం దుంగలు, ఓ కంటెయినర్ స్వాధీనం చేసుకుని, ఐదుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ అధికారుల రాకతో 40 మంది తమిళ కూలీలు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
కడప: మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగరంలోని ఓ ఎర్రచందనం డంప్ను వైఎస్సార్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఐదుగురు స్మగ్లరు పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా మహబూబ్నగర్ జిల్లా బూత్పూరు మండలం అన్నాసాగరం గ్రామంలో ఓ గోదాములో నిల్వ ఉంచిన 2.2 టన్నుల బరువైన 171 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.67 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, ఎర్రచందనంతో చేసిన పూసలు, మూడు కార్లు, ఆయిల్ ట్యాంకర్, రూ.4.3 లక్షల నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్రెడ్డి, మహమ్మద్ అలీ, జంగాల వీరభద్రయ్య, రాజమోహన్రెడ్డి, సింహసముద్రం చెంగల్రావు లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం ఫారెస్ట్ అధికారులుల తనిఖీ నిర్వహించారు. మండలంలోని నాగయ్యవారిపల్లె వద్ద తనిఖీలు చేసిన అధికారులు 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు లారీ, వ్యానును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రూ.2.27 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం రవాణా అవుతోందనే సమాచారంతో అటవీ, పోలీసు అధికారులు సోమవారం ఉదయం మాధవరం గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. మూడు కార్లలో తరలిస్తున్న 102 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. కార్ల డ్రైవర్లు పరారు కాగా దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు విశ్వనాథరెడ్డి, సుదర్శన్, ప్రవీణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.2.27 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దుంగలతో పాటు మూడు కార్లను, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇండికా, బొలేరో వాహనాల్లో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పూజితా నీలం మీడియాకు తెలిపారు. వీటి విలువ రూ7 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, 5 గరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసలు తెలపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు(గూడూరు): నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీలు చేపట్టిన గూడూరు పోలీసులు ఎర్రచందనం అక్రమరవాణాను గుర్తించారు. పట్డుబడిన వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
సోమశిల: అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం గోవిందమ్మపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఇళ్లలో ఎర్రచందనాన్ని దాచి ఉంచారనే సమాచారం అందుకున్న సోమశిల పోలీసులు గోవిందమ్మపల్లిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాక్ స్మగ్లర్కు శిరచ్ఛేదం
రియాద్: హెరాయిన్, కొకేయిన్ వంటి మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తూ తమ పౌరులను వాటికి బానిసలుగా మార్చుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీకి.. సౌదీ అరేబియా అధికారులు మరణదండనను అమలుచేశారు. పాకిస్థాన్కు చెందిన షా ఫైజల్ అజీమ్ షా అనే స్మగ్లర్ కు శుక్రవారం శిరచ్ఛేదం అమలుచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఈ ఏడాది సౌదీలో అమలుచేసిన మరణ శిక్షల సంఖ్య 109కి చేరింది. పలుమార్లు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డ అజీజ్.. కొద్ది రొజుల కిందట పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి మరణశిక్ష ఖరారయింది. అయితే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 50 రోజుల పాటు మరణ దండనలకు విరామం ప్రకటించిన సౌదీ అధికారులు.. అజీన్ శిరచ్ఛేదంతో తిరిగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు. సౌదీలో నేరాలకు పాల్పడి, మరణదండనకు గురైన వీదేశీయుల సంఖ్య 2014లో 87 శాతం ఉండగా ఈ ఏడాది 125 శాతానికి పెరిగింది. షరియత్ చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల అక్రమరవాణా, అత్యాచారం, హత్య, ఆయుధాలతో దోపిడీ, మతధర్మాలను మీరడం లాంటిచర్యలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. ఆయా కేసుల్లో దోషులకు మరణదండన ఖాయం. -
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
కడప టౌన్: అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ జైపాల్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 14న హర్యానాలో జైపాల్ను కడప టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శనివారం కడపలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో జైపాల్పై పలుకేసులు నమోదయ్యాయి. అతనికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో నేపాల్కు చెందిన లక్షణడాంగ్, ఢిల్లీకి చెందిన టింకూశర్మ ఇద్దరిని టాస్క్పోర్స్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరిని ఢిల్లీ నుంచి కడపకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మాధవరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మేడ్చల్ సీఐ శశాంక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావల్కోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గూడూరు మాధవరెడ్డి గురువారం రాత్రి మునీరాబాద్ నుంచి వస్తుండగా కడప పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ చూపి, వాహనం దిగాలని సూచించారు. వెంటనే మాధవరెడ్డి స్టీరింగ్ కేసి తలను బాదుకుని, కేకలు వేయటం ప్రారంభించాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవటంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మాధవరెడ్డి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారంటూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని శుక్రవారం ఉదయం కడప జిల్లా పోలీసులు తెలపటంతో మేడ్చల్ పోలీసులు బిత్తరపోయారు. మాధవరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడని తెలియగానే ఆశ్చర్యపోయారు. వారిచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు మాధవరెడ్డి ఇంటిపై దాడి చేసి, నాలుగు ఎర్రచందనం దుంగలు లభించటంతో కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలేవీ తమకు తెలియదని మేడ్చల్ సీఐ శశాంక్రెడ్డి అంటున్నారు. వివాదాస్పదుడు..రౌడీషీటర్ మాధవరెడ్డి మొదటి నుంచి వివాదాస్పదుడు. పదేళ్ల క్రితమే మేడ్చల్ పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరిచారు. తాండూర్, చేవెళ్ల పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. అతన్ని అరెస్ట్ చేయడానికి రావల్కోల్ గ్రామానికి వెళ్లిన చేవెళ్ల పోలీసులపై కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. చిల్లర కేసుల్లో ఉండే మాధవరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలియగానే మండల ప్రజలు విస్తుపోయారు. -
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్
-
రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎన్ కౌంటర్ లో కొందరు స్మగ్లర్లు తప్పించుకున్న నేపధ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఎర్రచందనంతో పాటు ముగ్గురు తమిళకూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రవాణా యధేచ్ఛగా సాగుతోంది. తాజాగా అక్రమంగా తరలిస్తున్నఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరికొంత మంది తప్పించుకుని పారిపోయారు. వీరి నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు. స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులపైకి రాళ్లు, రంపాలతో దాడికి దిగారు. (రైల్వేకోడూరు) -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్సార్ కడప జిల్లా ఓబులవారిపల్లెలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మండలంలోని బాలిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ నిల్వ ఉంచిన దుంగలను పట్టుకుని, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. -
రోజాపై దాడిలో ఎర్రచందనం స్మగ్లర్ కీలక పాత్ర
నియోజకవర్గనేత తనయునికి సన్నిహితుడు బియ్యం, ఇసుక, లిక్కర్ మాఫియాలో టీడీపీ ముఠా: రోజా పుత్తూరు: నగరి పట్టణంలో వారం కిందట జరిగిన గంగ జాతర ఉత్సవాల్లో నగరి ఎమ్మెల్యే రోజాపై చోటుచేసుకున్న దాడి సంఘటనలో నగరికి చెందిన టీడీపీ నాయకుడు, ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర ఉందనే విషయం తెలిసింది. దాడికి ప్రోత్సహించడంతో పాటు రోజాపై వ్యతిరేకంగా ధర్నాలకు సహకరించిన శ్రీనివాసులు ఎర్రచందనం తరలిస్తూ శుక్రవారం వడమాలపేట పోలీసులకు పట్టుపడ్డారు. ఇతనితోపాటు స్నేహితుడు చంద్రబాబు, నగరిపట్టణం సత్రవాడకు చెందిన రమేష్కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలో మండల యువత అధ్యక్షుడి హోదాలో కొంతకాలం, ప్రస్తుతం మండలస్థాయి నాయకుడి హోదాలో పట్టణంలోని బేరి వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ప్రతిరోజూ లక్షల్లో ఫైనాన్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు టీడీపీ నియోజకవర్గనేత, మాజీ ప్రజాప్రతినిధి తనయుడితో సన్నిహితంగా ఉంటున్నారనేది ఆ పార్టీ వర్గాల వాదన. దీనిని పరిశీలిస్తే ఆపార్టీ నేతకు నగరిలో ఇసుక, బియ్యం స్మగ్లింగ్తోపాటు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. దొంగలు దొంగ లు కలసి ఊర్లు పంచుకున్నట్లుగా అధికారపార్టీకి చెందిన నాయకులు ఇలా బరితెగిస్తున్నరంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా నగరి గంగజాతరలో రోజాపై జరిగిన దాడిలో టీడీపీకి చెందిన ఆరుగురిని ప్రోత్సహించి కీలకపాత్ర వహించడంలో శ్రీనివాసులుపై ఎర్రచందనం దొంగలించినట్లుగా కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది. పట్టుపడ్డ వారు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో వారిని బహిరంగంగా చూపించడలో ముఖానికి ముసుగు వేసి పోలీసులు జాగ్రత్త వహించారనే వాదనలు లేకపోలేదు. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన తమిళ తంబీలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారి ముఖాలు కనిపించే విధంగా పోలీసు, అటవీ శాఖ అధికారులు వాహనాలతో సహా ఫోటోలు దిగారు. అయితే ఇందుకు భిన్నంగా వడమాలపేటలో పోలీసు అధికారులు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ముందుగా పోలీసుల దృష్టికి తెచ్చా నగరిలో బియ్యం, లిక్కర్, ఇసుక మాఫీయాతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్లో టీడీపీ నాయకులు ఉన్నారనే విషయాన్ని ముందుగానే పోలీసుల దృష్టికి తెచ్చాను. కాగా ఈనెల 12 వ తేదీన నగరిలో నిర్వహించిన జాతర సందర్భంగా అమ్మవార్లు ఊరేగింపులో నాపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు. -ఆర్కే. రోజా, నగరి ఎమ్మెల్యే -
‘ఎర్ర’ స్మగ్లర్ వసంత్ లొంగుబాటు
చిత్తూరు(అర్బన్): తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి, చిత్తూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఎర్రచందనం తరలింపులో ఇతనిపై భాకరాపేట, చిత్తూరు వన్టౌన్, టూటౌన్తో పాటు జిల్లాలో దాదాపు 6 వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఇతను గురువారం సాయంత్రం తన న్యాయవాదిని వెంట తీసుకొచ్చి చిత్తూరు వన్టౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఇతడిని ఇంకా అధికారికంగా అరెస్టు చూపలేదు. కేవీపల్లెలో వేణుగోపాల్రెడ్డి అరెస్ట్ కేవీపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం కటారుముడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వేణుగోపాల్రెడ్డిని కేవీపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరి చారు. ఎస్ఐ మాట్లాడుతూ ఐదేళ్లుగా వేణుగోపాల్రెడ్డి గజ్జల శీన్రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. గత ఏడాది నవంబర్ నుంచి అతను పరారీలో ఉన్నాడని, గురువారం జిల్లేళ్లమంద పంచాయతీ దేవాండ్లపల్లి బస్టాప్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ పీలేరురూరల్: ఎర్రచందనం స్మగ్లింగ్లో జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా గుర్తించిన శ్రీశైలం బాబును అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపినట్లు పీలేరు సీఐ టీ.నరసిం హులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అనంతపు రం జిల్లా తలపుల మండలం పులిగుండ్లపల్లెకు చెందిన చిన్న సల్లప్ప కుమారుడు శ్రీశైలం బాబు అలియాస్ సారాయి బాబు, అలియాస్ శ్రీశైలం వేమనారాయణ (44) 15 ఏళ్ల క్రితం పీలేరుకు వచ్చి సారా వ్యాపారం సాగించేవాడు. అనంతరం ఏడేళ్లుగా ఎర్రచందనం వ్యా పారం చేస్తున్నాడు. పీలేరు, భాకరాపేట, గానుగచింత, ఎర్రావారిపాళెం, కేవీ పల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు కొని చిత్తూరు, బెంగళూరులో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. 2011లో కల్లూరు పోలీసులకు, 2013 లో ఎర్రావారిపాళెం పోలీసులకు పట్టుబడి జైలుకు వెళా ్లడు. గురువారం పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎర్రావారిపాళెం పోలీసులు ఎర్రావారిపాళెం మండలంలోని యల్లమందలో అతన్ని అరెస్ట్ చేశారు. -
రియాజ్కు బెయిలు
సాక్షి, చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్ రియాజ్కు గురువారం బెయిలు మంజూరైంది. భాకరాపేట స్టేషన్లో నమోదైన ఎర్రచందనం కేసుకు సంబంధించి ఇతనికి బెయిల్ వచ్చింది. కర్ణాటకకు చెందిన రియాజ్ స్మగ్లర్ వీరప్పన్తో కలిసి సత్యమంగళం అడవుల్లో శ్రీగంధం స్మగ్లింగ్ చేసేవాడు. వీరప్పన్ మరణం అనంతరం ఇతను ఎర్రచంద నం స్మగ్లింగ్కు అలవాటు పడ్డాడు. ఇతనిపై దాదాపు 20 కేసులు ఉన్నాయి. నెలన్నర కిందట రియాజ్ను చిత్తూరు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. ఇతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని అప్పటి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రకటించారు. అయితే కలెక్టర్ సిద్ధార్థజైన్ పీడీ నమోదులో నిర్లక్ష్యం వహించారు. ఈ కారణంగానే రియాజ్కు బెయిల్ మంజూరైంది. రియాజ్ నెలకు 15 కోట్ల రూపాయలు స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్నాడు. రియాజ్తో పాటు తక్కిన అంతర్జాతీయ స్మగ్లర్లకు కూడా త్వరలో బెయిల్ రానున్నట్లు తెలుస్తోంది. -
ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులకు మధ్య కాల్పులు
కడప: అక్రమ ఎర్రచందనం సరఫరాకు పాల్పడుతున్న స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు బుధవారం సాయంత్రం జరిగాయి. వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బాలపల్లి అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో తమిళనాడుకి చెందిన ఎర్రచందనం కూలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో కాల్పుల జరిపామని పోలీసుల తెలిపారు. -
దుంగల దొంగలు
బాపట్ల టౌన్: అడవులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోవడం దొంగల చేతికి తాళం ఇచ్చినట్టుగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా అడవిలోని జామాయిల్, సరుగుడు, జీడిమామిడి చెట్లను నరికి మార్కెట్కు తరలించి సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. బాపట్ల, కర్లపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో అడవులు ఉన్నాయి. పేరలి, ముత్తాయ పాలెం సెక్షన్ల పరిధిలో జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు సుమారు 25 వేల హెక్టార్ల పరిధిలో ఉన్నాయి. రూ. లక్షలు హెచ్చించి ఈ తోటలు పెంచుతున్నారు. అయితే అవి పెరిగిన తరువాత వేలం నిర్వహించాలి, లేదంటే టన్నుల ప్రకారం కలపను విక్రయించాలి. వచ్చిన సొమ్ముతో మిగిలిన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తోటలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుండటం వల్ల రాత్రికి రాత్రే వందల సంఖ్యలో జామాయిల్ బాదులను మార్కెట్కు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియదన్నట్లుగా అధికారులు వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. అక్రమంగా తరలించేదిలా... కొందరు స్మగ్లర్లు రాత్రికి రాత్రే అడవిని నరికి కలపను పడవల సాయంతో కాలువలు దాటించడం ఆ తరువాత ట్రాక్టర్లు, ఆటోలతో వేరే ప్రాంతానికి తరలించడం పరిపాటిగా మారింది. ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పేందుకు పట్టణంలోని వివిధ అడితీల్లో కలప కొనుగోలు చేసినట్లుగా ఫోర్జరీ బిల్లులు సృష్టిస్తున్నారు. నిప్పటించి నరుకుతున్నారు : పచ్చని చెట్లు నరికి తరలిస్తే అటవీశాఖాధికారులు పట్టుకుంటారనే భయంతో పది పదిహేను రోజులు ముందుగా చెట్లపై పెట్రోలు, డీజిల్ పోసి నిప్పంటిస్తున్నారు. ఆ తర్వాత వాటిని నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. గతంతో ఫారెస్ట్ అధికారులు అడవిలోని కలపను ఎవరైనా వేరేప్రాంతాలకు తరలిస్తే తనిఖీలు నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం చర్యలు కాదుకదా, కనీసం తనిఖీచేసే నాథుడే కరువయ్యారు. ఇదే అదనుగా భావించిన దొంగలు రోజుకు కనీసం 500 నుంచి వెయ్యి చెట్లు నరికి తరలించుకుపోతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం అక్రమంగా కలపను తరలిస్తున్న వారిపై దృష్టి సారిం చాం. ఇప్పటికే కొంత మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాం. అయితే ఏఏ బీట్ల్లో ఎక్కువగా కలప అక్రమంగా తరలిపోతుందో గమనించి సంబంధిత బీట్ ఆఫీసర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - రమణారెడ్డి, రేపల్లె రేంజ్ ఫారెస్టు ఆఫీసర్ -
పోలీసుల అదుపులో బుల్లెట్ సురేష్ ?
ఆయిల్ రమేష్ కూడా చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం చిత్తూరుకు తరలింపు! సాక్షి, చిత్తూరు: పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజు లుగా అజ్ఞాతంలో ఉన్న సురేష్ విదేశాలకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లగా అక్కడ తమిళనాడు, ఆంధ్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్కు చిక్కినట్లు సమాచారం. సురేష్తోపాటు మరో ఎర్రచందనం స్మగ్లర్ ఆయిల్ రమేష్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుల్లెట్ సురేశ్పై 9 కేసులున్నాయి. కొంతకాలం గా టీడీపీ నేతల ఆశీస్సులతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినపుడు చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ నివాసంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సురేష్ కలిశారు. ఈ విషయంపై ఈనెల 17న ‘మర్మమేమిటి గోపాలా?’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అలాగే 3 కేసులున్న వారిపై పీడీయాక్టు నమోదు చేయాలనే నిబంధన ఉందని, కానీ 9 కేసులున్నా బుల్లెట్ సురేష్ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఈనెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసుకవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసులు సురేష్పై ప్రత్యేక దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సురేశ్ నేరచరిత్రను చెప్పే కేసులు ఇవే.. క్రైం నెంబరు నమోదైన స్టేషన్ 62-2011 చిత్తూరు తాలుకా 18-2011 చిత్తూరు టూ టూన్ 32-2011 భాకరాపేట 95-2010 యాదమరి 60-2012 చిత్తూరు వన్టౌన్ 120-2012 చిత్తూరు వన్టౌన్ 153-2012 ఆర్మ్యాక్టు వీటితోపాటు మరో రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎర్ర చందనం స్మగ్లర్లపై పొలీసుల కాల్పులు
-
స్మగ్లర్లపై ఉక్కుపాదం
రైల్వేకోడూరు రూరల్, న్యూస్లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రచందనం పార్కులో రాజంపేట, తిరుపతి డివిజన ఫారెస్టు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ రాజంపేట డివిజన్ ఫారెస్టు వైఎస్సార్ జిల్లా పరిధిలోకి వస్తుందని, బాలుపల్లె ఫారెస్టు డివిజన్ చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. దీంతో కొంత సమన్వయ లోపం ఉందన్నారు. ఇకపై సమన్వయంతో పనిచేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ బాలుపల్లె చెక్పోస్టు వద్ద సీసీ కెమెరాలు అమర్చుతామన్నారు. ఇకపై ప్రతి చెక్ పోస్టు పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కోడూరులో తిరుపతి టాస్క్ఫోర్స్ ఎస్ఐ ప్రవర్తించిన తీరుపై తిరుపతి టాస్క్ఫోర్స్ ఓఎస్డీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి రాజంపేట డీఎస్పీ జీవీ రమణ, స్క్వాడ్ డీఎఫ్ఓ పవన్ కుమార్, తిరుపతి డీఎఫ్ఓ నాగరాజు, రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. -
స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అరెస్ట్
తిరుపతి : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పోలీసులు అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇతడు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు. -
బడా స్మగ్లర్లపై పోలీసు కన్ను
- చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు - మూడో రోజూ రహస్య విచారణ - శేషాచలం కొండల్లో కొనసాగుతున్న కూంబింగ్ - చెక్పోస్టుల్లో పోలీసు సిబ్బంది మోహరింపు సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాల పోలీసులు బడా స్మగ్లర్లపై దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకు జిల్లాలోని స్థానిక స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న వీరు ప్రస్తుతం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల కోసం వేట ముమ్మరం చేశారు. చెన్నై స్థావరంగా ఎర్రచందనం స్మగ్లింగ్లో పేరుమోసిన బడా స్మగ్లర్ను అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాగా ఉన్న కటికనహళ్లి గ్రామంలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు మరో బృందాన్ని పంపించారు. చెన్నై, బెంగళూరు పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఎలాగైనా ప్రధాన స్మగ్లర్లను పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు తిరుమల కొండల్లో అటవీ, పోలీసు శాఖలతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు కూంబింగ్ చేస్తున్నాయి. చామల, తిరుపతి, మామాండూరు అటవీ రేంజ్ల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై జిల్లాకు ప్రత్యేక బృందాలు డీఎఫ్వో వైల్డ్లైఫ్, తిరుపతి అర్బన్ ఎస్పీల సంయుక్త ఆధ్వర్యంలో తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు ప్రాంతాలకు పోలీసు, అటవీ శాఖల సంయుక్త బృందాలను పంపి అక్కడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శేషాచల కొండ ల్లో ఎర్రచందనం నరికేందుకు వస్తున్న వారిలో ఎక్కువ మంది తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, జవ్వాదిహిల్స్ ప్రాంతాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండా చేయాలనే వ్యూహంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. పోలీసుల మోహరింపు జిల్లాలోని ఎర్రవారిపాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పోలీసుస్టేషన్లతోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్పోస్టుల్లో పోలీసుల సంఖ్య పెంచాలని కలెక్టరు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగం గా జిల్లా పరిధిలో ఈ మార్పు చేశారు. చిత్తూరు, గుడిపాల సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పీడీ యాక్టు పెట్టే యోచన పోలీసులు ఇప్పటికే తాము అదుపులోకి తీసుకున్న స్థానిక స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టారు. జిల్లా తూర్పు అటవీ శాఖ పరిధిలో కూడా ఎర్రచందనం దొంగలపై ఐపీసీ కేసులు నమోదు చేసి పీడీ యాక్టు మోపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న జిల్లాకు చెందిన నలుగురు స్మగ్లర్లను రహస్య ప్రదేశంలో విచారిస్తూనే ఉన్నారు. వీరినుంచి ఇంకా కొన్ని వివరాలు రాబట్టిన తర్వాత అరెస్టులు చూపించే అవకాశముంది. బుధవారం తిరుపతికి రానున్న కాబోయే సీఎం చంద్రబాబునాయుడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి చేపట్టిన చర్యల గురించి ఎస్పీలు వివరించనున్నారు. రేణిగుంటలో మరో నలుగురు.. రేణిగుంట, న్యూస్లైన్: స్మగ్లర్గా గుర్తించిన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన శేషు(35)తోపాటు మరో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రేణిగుంట డీఎస్పీ బాదేపల్లి శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి రూ.10.09 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు, కత్తి, స్కార్పియో వాహనం, బంగారు చైను, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రేణిగుంట అర్బన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఆంజనేయపురం చెక్పోస్టు వద్ద సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు భాస్కర్ నాయక్, మధుసూదన్రావు, రఫీ నిఘా వేశారు. స్కార్పియోలో కోడూరు వైపు నుంచి అతివేగంగా వస్తుండగా వెంబ డించారు. శేషుతోపాటు డ్రయివర్ నగేష్(20), నరసింహులు(40), వీరయ్య(37)ను అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్ తిరుమల శేషాచల అడవుల్లో ఇటీవల జరిగిన అటవీ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ హత్యల కేసులో నిందితుడు కర్ణాటక రాష్ట్రం కటికనహళ్లికి చెందిన జమాల్ఖాన్ అలియాస్ జమాల్ అహ్మద్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
స్మగ్లింగ్ రూటే సపరేట్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్ : ఎర్రచందనం మాఫియాకు జిల్లా అడ్డాగా మారుతోంది. ఇతర దేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉండటం, అనతి కాలంలో కోట్లు గడించే అవకాశం ఉండటంతో అనేక మంది స్మగ్లర్లు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. జిల్లాలోని రాపూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50 వేల హెక్టారుల్లో ఎర్రచందనం ఉన్నట్లు అధికారులు అంచనా. ఒక్కో దుంగ లక్షల్లో పలుకుతోంది. జిల్లాలో అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెంచడంతో స్మగ్లర్లు సరికొత్తగా పంధాను మార్చారు. ఇటీవల కాలంలో పట్టుబడిన ఎర్రచందనం ఇందుకు ఉదాహరణ. కొందరు స్మగ్లర్లు నిమ్మకాయల బస్తాలు, ఇసుక బస్తాలు, మామిడి కాయలు, పొట్టు, తవుడు మాటున ఇలా అనేక మార్గాల్లో జిల్లాను దాటి చెన్నైకు తరలిస్తున్నారు. స్మగ్లర్ల ఎత్తుగడలను అటవీశాఖాధికారులు పసిగట్టి ఛేదిస్తుండటంతో సరికొత్త పంధాను మార్చారు.తాజాగా లారీ అడుగు భాగంలో అరగా తయారు చేసి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. ఇటీవల రాపూరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల కొత్త ఎత్తుగడను కూడా ఛేదించారు. ప్రతి రోజు జిల్లాలో ఎక్కడో ఒకచోట ఎర్రచందనం పట్టుబడుతుందంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్ల కాలంలో అటవీశాఖ అధికార లెక్కల ప్రకారం 1001.059 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2292.053 లక్షలు ఉంటుందని అంచనా. అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎంత నిఘా పెట్టినప్పటికి పూర్తి స్థాయిలో నివారించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్థానికుల సహకారంతోనే ఎర్రచందనం అక్రమ రవాణాకు స్థానికులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులతో స్మగ్లర్లు చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తున్నారన్న విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొండ కింద ఉన్న ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఎర్రచందనం తరలుతోంది. గ్రామాల్లో చైతన్యం రావాలి : ఎర్రచందనం అక్రమ రవాణాను శక్తి వంచన లేకుండా అడ్డుకుంటున్నాం. ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను ఎదుర్కొంటున్నాం. స్మగ్మర్లు నాటు తుపాకులు, ఇనుపరాడ్లు, కత్తుల వంటి ఆయుధాలును ఉపయోగిస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమ రవాణాను ఎంచుకోవడంతో ఇబ్బందిగా మారింది. వారిని ఎదుర్కొనే క్రమంలో అటవీ సిబ్బంది గాయాలు పాలైన సందర్భాలు ఉన్నాయి. - అల్లాభక్షు, రాపూరు రేంజ్ అధికారి -
33 మంది ‘ఎర్ర’ కూలీల అరెస్ట్
చిత్తూరు (క్రైమ్),న్యూస్లైన్: శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్న 33 మంది కూలీలను చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అలాగే 15 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్నట్లు చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డిగుంట వద్ద శనివారం కాపుకాశారు. ఈ నేపథ్యంలో ఇరవై మందికిపైగా కూలీలు తమిళనాడు వైపు వెళుతున్న వాహనాలను ఆపి పారిపోవడానికి సిద్ధమయ్యారు. సీఐ సాదిక్ అలీ హుటాహుటిన దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశా యి. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికి చెన్నైకి తరలిస్తున్నామని నిందితులు తెలిపారు. ఒకే వాహనంలో వెళితే పట్టుబడతామని ఎర్రచందనం దుంగలను రెడ్డిగుంట సమీపంలోని విజయా డెయిరీ పక్కన ఉన్న చెట్లపొదల్లో దాచి పెట్టామన్నారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిగుంట సమీపంలో చెట్లపొదల్లో ఉన్న 15 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరికొందరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 33 మంది కూలీలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన కూలీలందరూ విల్లుపురం జిల్లాకు చెందిన వారేనని విచారణలో తేలింది. స్మగ్లర్ను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. -
జిల్లాలో... పులి చర్మం స్మగ్లర్లు
అట్టాడ (జామి)న్యూస్లైన్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లరు అటవీశాఖ అధికారులపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా చంపేసిన వార్త నుంచి ఇంకా తేరు కోకముందే పులులను వేటాడే స్మగర్లను జిల్లాలో అరెస్ట్ చేశారన్న వార్త సంచలనం రేపింది. ఈ ముఠా సభ్యులు 15 రోజులుగా జామి మండలంలో మకాం వేశారు. రెండేళ్లుగా వారి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు మండలంలోని అట్టాడ పంచాయతీ కోరుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అన్నదమ్ములు సబ్బీర్భాటియా, జగదీష్భాటియా, రంజిత్ సింగ్భాటియా కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతూ వాటి చర్మాలను అంతర్జాతీయస్థాయిలో విక్రయిస్తున్నారు. ఈ ముగ్గురి కోసం పోలీసులు రెండేళ్లుగా తీవ్రంగా గాలిస్తున్నా రు. వీరు ఇప్పటివరకు సుమారు 150కిపైగా సెల్ సిమ్లను, తరచూ మకాంలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నారు. అయితే వారు ఉపయోగిస్తున్న సెల్ఫోన్ సిగ్నల్స్ ప్రాంతాన్ని మొబైల్ట్రాక్ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కొత్తవ లస కోర్టుకు తరలించారు. న్యాయస్థానం అనుమతి మేరకు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసు లు తెలిపారు. ఎనిమిది కుటుంబాలపై కేసులు కోరుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన సంచార జాతులు ఎనిమిది కుటుంబాల వారు గుడారాలు వేసుకుని 15 రోజులుగా ఉంటూ ప్లాస్టిక్ బొమ్మలు విక్రయి స్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితులు కూడా వీరితో కలిసే ఉంటున్నారు. అనుమానాస్పదం గా ఉన్న ఈ ఎనిమిది కుటుంబాలకు చెందిన 15 మందిని జామి ఎస్ఐ బి.లూథర్బాబు పోలీస్స్టేషన్కు తరలించి, తహశీల్దార్ ఆదేశాల తో వీరిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, తిరుపతి / భాకరాపేట, న్యూస్లైన్: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంలో భాగంగా పోలీసు, అటవీ శాఖ సంయుక్త టాస్క్ఫోర్స్ ఆదివారం రూ.3 కోట్ల విలువ చేసే 312 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ఉదయ్కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కర్ణాటకలోని బెంగళూరు రూరల్ కటికనహళ్లికి చెందిన సయ్యద్హాదీక్, ముక్తి యార్ అనే కీలక ఎర్రచందనం నిందితులను పలమనేరు పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్బాబు టాస్క్ఫోర్స్ ఛేదించిన రెండు ప్రత్యేక ఆపరేషన్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. భాకరాపేట అడవిలో ఎర్రచందనం దుంగలు లారీలో తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 201 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భాకరాపేట నుంచి ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా వెనుక ఉన్న చిత్తూరుకు చెందిన హాలీమ్ అలియాస్ సలీమ్ అనే స్మగ్లర్ను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. మరొక కేసులో మామాండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన తిరువణ్ణామలై, వేలూరు జిల్లాలకు చెందిన 22 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ సహకారంతో అరెస్టు చేసినట్లు వెల్లడిం చారు. వీరి నుంచి 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, తిరుపతి అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. 101 దుంగలు స్వాధీనం చిన్నగొట్టిగల్లు ఊరి చివరన ఉన్న నర్సరీ వద్ద రూ.కోటి విలువైన 101 ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు సీఐ బీ. పార్థసారథి తెలిపారు. శనివారం రాత్రి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఏపీ16 టీయూ 7779నంబర్ గల ఈచర్ వాహనాన్ని భాకరాపేట ఎస్ఐ డీ.నెట్టికంఠయ్యు, పీఎస్ఐ రహివుుల్లా ఆధ్వర్యంలో పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లు చెప్పారు. వాహనంలో ఉన్న చెన్నైకు చెందిన వీ.శశికుమార్, అరుణ్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ర్ట ముఠా ఆధ్వర్యంలో ఈ ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో భాకరాపేట ఏఎస్ఐ రాజు, పోలీసులు కాలేషా, హేవుసుందర్, ప్రతాప్రెడ్డి, రఘు, దావుు, సారథి, బాలసుబ్రవుణ్యం, గంగరాజు, తులసి, వల్లీ, పురుషోత్తం, వెంకట్రవుణ, చెంగల్రాయుులు పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ సీజ్ చేసిన ఎర్రచందనం వివరాలు టాస్క్ఫోర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచి రెండున్న ర నెలల కాలంలో 27 కేసులను ఛేదించినట్లు ఓఎస్డీ ఉదయ్కుమార్ వెల్లడించారు. 149 మంది స్మగర్లను, ఎర్రచందనం నరికే కూలీలను అరెస్టు చేశామన్నారు. 18,079 కిలోల బరువున్న 733 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 17 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రూ.2.95 లక్షల నగదును కూడా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు రూ.రెండు కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టుకోవడమేగాక ఇద్దరు కర్ణాటక స్మగ్లర్లను అరెస్టు చేయటంలో కీలకంగా పనిచేసిన టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బందికి అర్బన్ ఎస్పీ ఎస్వీ. రాజశేఖర్బాబు ఆది వారం క్యాష్ రివార్డు అందజేశారు. ఓఎస్డీ ఉదయ్కుమార్ సిఫారసు మేరకు ఒక్కొక్కరికి రూ.500 క్యాష్ రివార్డు అందించారు. రివార్డు అందుకున్న వారిలో టాస్క్ఫోర్స్ సీఐ మద్దయ్యాచారి, ఎస్ఐ అశోక్కుమార్, ఎఫ్ఎస్వో నాగరాజు, కానిస్టేబుల్స్ రియాజ్, వెంకట్, మ్యాగీ, రంగ, సోనూ ఉన్నారు.