సాక్షి, బరంపురం: ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్స్టేషన్లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్స్టేషన్ ఐఐసీ అధికారి సుజిత్ నాయక్ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్ ప్రధాన్, మహేష్ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్ వర్మ, సూరజ్ విజయ్ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు.
గంజాయి మాఫియా గుట్టురట్టు
Dec 24 2017 8:32 AM | Updated on Nov 6 2018 5:21 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, కూకట్పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీర...
-
గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
పీలేరు : నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఐ ఎన్. మోహన్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీఐకు అందిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం స్థానిక...
-
గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
దేవరాపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇతర రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే 556 కేజీల గంజాయిని దేవరాపల్లి పోలీసులు బుధవారం శ్రీరాంపురం వై.జంక్షన్ వద్ద పట్టుకున్నా...
-
గంజాయి విక్రయిస్తున్న మహిళ, మరొకరి అరెస్టు
కడప అర్బన్: కడప నగరంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రాయల్థియేటర్ నుంచి గుర్రాల గడ్డకు వెళ్లే దారిలో పూల సరస్వతితో పాటు, మహమ్మద్ ఉమర్ అనే ఇద్దరు గంజాయిని విక్రయిస్తుండగా సీఐ ఎన...
-
రూ.90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.90 లక్షల విలువైన 300 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలివి. ఎక్సైజ్ సీఐ రహీమున్నీసా బేగం సిబ్బందితో ...
Advertisement