Guduru
-
పార్టీ కోసం కష్టపడే వారిని జగన్ గుర్తుపెట్టుకుంటారు..
-
తిరుపతి జిల్లా గూడూరులో దారుణం
-
చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందంటున్న పెన్షనర్లు
-
ఏమైంది తల్లీ? కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి, తిరుపతి: తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలు విని చలించిపోయారు. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వాకాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం పరిధిలో కోతకు గురైన స్వర్ణముఖి నది లోలెవల్ కాజ్వే, వరి పంటలను పరిశీలించి ఆవేదనకు లోనయ్యారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురమల్లి రామ్కుమార్రెడ్డి, వాకాడు మాజీ ఏఎంసీ చైర్మన్ కొడవలూరు దామోదర్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బారులుదీరిన అభిమానం! ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు విద్యానగర్ నుంచి బాలిరెడ్డిపాళెం వరకు బారులు తీరారు. తమ రాకకోసం నిరీక్షిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. వృద్ధురాలి కన్నీటిని తుడుస్తూ.. ‘ఏడ్వకవ్వా.. నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. మానవత్వంతో స్పందించిన తీరుని చూసి వృద్ధురాలు సీఎం ముఖాన్ని పట్టుకుని ‘నువ్వ చల్లంగా ఉండాలి నాయనా’ అంటూ దీవెనలందించారు. అక్కడే ఉన్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ‘జగన్ మామయ్యా.. జగన్ మామయ్యా’ అంటూ దీనంగా తనవంక చూసి అరుస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి బుగ్గలు నిమిరారు. ‘బాగా చదువుకో’ అంటూ ముందుకు కదిలారు. ముఖాముఖి సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకుని వాటి పరిష్కరించాలని కలెక్టర్ని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీపైనా ఆరా తీశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య తమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు ఘన స్వాగతం.. వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి కోట మండలం, విద్యానగర్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత ఉన్నారు. కాగా హెలీప్యాడ్ వద్ద మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వరప్రసాద్రావు, సంజీవయ్య, మేకపాటి విక్రమ్రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇవి చదవండి: అపోహలొద్దు.. ఆదుకుంటాం -
మనుబోలు–గూడూరు మధ్య రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/మనుబోలు: విజయవాడ డివిజన్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు–తిరుపతి జిల్లా గూడూరు మధ్య మూడవ రైల్వే లైను పనుల్లో భాగంగా గూడూరు సమీపంలోని పంబలేరు నదిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించిన పొడవైన రైల్వే ఫ్లైఓవర్ను శుక్రవారం ప్రారంభించారు. మనుబోలు–గూడూరు మధ్య సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు ఉన్నాయి. వీటిలో గూడూరు సమీపంలోని పంబలేరు పెద్దది. దీంతో పాటు సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని 2.2 కిలోమీటర్ల దూరంతో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ రైల్వే ఫ్లైఓవర్ దక్షణ మధ్య రైల్వేలో 7వ పెద్ద ఆర్వోఆర్గా నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. జోన్లో అతి పొడవైన ఆర్వోఆర్ కూడా ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణంలో హైగ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలికల కోసం రూపొందించారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్ ఉపకరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుంచి రేణిగుంట, చెన్నై మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇక అంతరాయం ఉండదు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఫ్లైఓవర్ను నిరి్మంచడంలో కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్వీఎన్ఎల్ సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. -
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్లాండ్లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కిషన్రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
కాలేజీ యాజమాన్యం వేధించి చంపేసింది..
గూడూరు: ‘మా బిడ్డ సౌమ్యుడు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదు. ఫీజుల విషయంలోనే యాజమాన్యం వేధించి చంపేసింది..’ అంటూ తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విద్యార్థి ధరణేశ్వర్రెడ్డి (21) బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన ఓబుల్రెడ్డి వెంకటకృష్ణారెడ్డి, గంగమ్మ కుమారుడు ధరణేశ్వర్రెడ్డి శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యమే చంపేసిందంటూ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదన అందరినీ కలచివేసింది. కళాశాల యాజమాన్యమే తమ బిడ్డను పొట్టనబెట్టుకుందంటూ విలపించారు. తాము గూడూరు వచ్చేవరకు కూడా ఆగకుండానే మృతదేహాన్ని హాస్టల్ గది నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను చంపేసి, కుటుంబకలహాల కారణంగానే అంటూ కట్టుకథ అల్లి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో యాజమాన్యం వేధించిందని, తమవద్ద సీసీ కెమెరాల పుటేజీ ఆధారాలున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు సమీపంలోనే ఉన్న హాస్టల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 1వ పట్టణ ఎస్ఐ పవన్కుమార్, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో బలైన ఎందరో విద్యార్థుల్లో తమ బిడ్డ కూడా ఒకడయ్యాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు పేర్కొన్నారు. తమకు పోలీసులపై నమ్మకం ఉందన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి ఓబులరెడ్డి ధరణేశ్వర్రెడ్డిది అనుమానాస్పద మృతి అని ఆదివారం విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు. కళాశాల హాస్టల్లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థి ధరణేశ్వర్రెడ్డి చాలా సౌమ్యుడని, చదువులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నాడని, విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు గూడూరు 1వ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యార్థి మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్లో కొంతకాలం చేసి, మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!
గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్లైన్లో పంపించాడు. ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు. ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘ఇక ప్రాసెస్ మొత్తం పూర్తయింది. రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్టౌన్ ఎస్ఐ హజరత్బాబు తెలిపారు. గతంలోనూ మహిళకు టోకరా... అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెన్నై–గూడూరు సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు.. ► పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్ప్రెస్ను ఈ నెల 16న చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్ల మీదుగా దారి మళ్లింపు. ► ఇండోర్–కొచువేలి ఎక్స్ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు. ► ధన్బాద్–అలప్పుజ ఎక్స్ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు. ► చెన్నై ఎగ్మోర్–ముంబై సీఎస్టీ ఎక్స్ప్రెస్ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లింపు. -
‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’
గూడూరు: ‘కాళ్లు మొక్కుతా.. దళితులం.. పంట నాశనం చేయకండి’.. అంటూ ఓ పోడు రైతు అటవీ అధికారి కాళ్లు మొక్కాడు. అయినా కనికరం చూపకుండా అటవీ అధికారులు పంటను ధ్వంసం చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు పోడు భూముల్లో శుక్రవారం జరిగింది. కొన్ని నెలలుగా బొల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 1 నుంచి 30 గల పోడు భూముల్లో స్థానిక దళిత, గిరిజన రైతులు 1985కు ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఆ భూమి అటవీ శాఖది పేర్కొంటుండడంతో ఏడాదిగా అధికారులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకోవడంతో నాటి గొడవలు సద్దుమణిగాయి. దీంతో రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. అయితే శ్రీను అనే రైతు మిర్చి పంట వేసుకోగా శుక్రవారం డీఎఫ్ఓ కిరణ్ సమక్షంలో మానుకోట అటవీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అటవీ భూమిగా పేర్కొంటూ పంటను ధ్వంసం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ రైతు ఏకంగా డీఎఫ్ఓ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపకుండా పంటను నాశనం చేసి వెళ్లిపోయారు. చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్ -
రాళ్లతో కొట్టి భిక్షగాడి దారుణ హత్య
సాక్షి, గూడూరు: గుర్తుతెలియని వ్యక్తులు ఓ భిక్షగాడిని రాళ్లకొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండో పట్టణంలోని జీఎస్ రాయులు కూడలిలో శుక్రవారం రాత్రి జరిగింది. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించే ప్రయత్నించారు. భిక్షగాడి హత్య మిస్టరీగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. హతుడు ఏడాదికిపైగా ఇక్కడే ఉంటున్నాడు. అతనికి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడుతుంటాడని తెలుస్తోంది. అతను పగటి వేళల్లో బయటకు వెళ్లి భిక్షాటన చేసుకుని రాత్రి వేళ స్థానికంగా రేకుల షెడ్డు కింద వండుకొని తిని, నిద్రపోతుంటాడు. అయితే భిక్షగాడ్ని హతమార్చే అవసరం ఎవరికొచ్చింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసమే అతన్ని హత్య చేశారా? అనుకుంటే అతని జేబులో రూ.2 వేల నగదు ఉంది. అయితే భిక్షగాడి వద్ద భారీగా నగదు ఉండొచ్చని, ఈ నగదు కాజేసే ప్రయత్నంలో ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వేసుకున్న జేబులో డబ్బులు గుర్తించలేక వదిలేసి వెళ్లి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అర్బన్ సీఐ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్తో ప్రయత్నం చేశామన్నారు. జాగిలం ఘటనా స్థలం వద్ద కలియ తిరిగి అక్కడి నుంచి విందూరు వైపు వెళ్లే రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయిందన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించి, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు వెళ్తేనే.. మేమెళ్తాం!
గూడూరు : రైల్వే గేట్ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు పరిశీలించి ఏదీ లేకున్నా జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటుగా వచ్చే వాహనదారులు పోలీసులు తనిఖీలు ముగించాకే అక్కడి నుంచి వెళ్లాలని ఇలా రోడ్డుపై వాహనాలను నిలిపి రోడ్డుపై వేచి ఉండటం గమనార్హం. ఉధృతంగా గోదావరి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం బాసర వద్ద నది నిండుగా కనిపించింది. మంజీర, గోదావరితోపాటు ఉప నదుల నీరంతా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద కలుస్తుంది.ఈ నీరంతా గోదావరిలో కలవడంతో ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం బాసర వద్ద నదిలోని కొత్తనీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. – భైంసా (ముధోల్) -
Covid Vaccination: వ్యాక్సిన్ కోసం ఇంత పేద్ద లైనా..!
గూడూరు: ఇంతకాలం వ్యాక్సిన్ అంటే భయపడిన వారు కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కు బుధవారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 9 గంటలకే తరలివచ్చారు. టీకా ఆవశ్యకతపై గ్రామాల్లో అధికారులు ప్రచారం చేస్తుండడంతో వ్యాక్సిన్ కోసం తరలివచ్చిన ప్రజలు ఇలా బారులు తీరి కనిపించారు. క్యూలో నిలుచున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే, కరోనా భయంతో టీకా కోసం వచ్చిన వారిలో చాలా మంది మాస్క్ ధరించకపోగా, భౌతిక దూరాన్ని విస్మరించి దగ్గరదగ్గరగా నిల్చోవడం గమనార్హం. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ను ధరించాలని, భౌతిక దూరంపాటించాలని.. వైద్యారోగ్యశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడ చదవండి: స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలంగాణకు 3.60 లక్షల వ్యాక్సిన్లు -
పాచిపోయిన లడ్డూలు పవన్కు రుచిగా ఉన్నాయా?
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. -
గురుమూర్తి ఫై నారాలోకేష్ వ్యాఖ్యలు దారుణం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మరికొన్ని రోజుల్లో వివాహ బంధంతో జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ఆ కుటుంబంపైకి ట్రెయిలర్ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువుతోపాటు ఆమె తల్లి, సోదరుడు, బాబాయి, పిన్ని, ఆటో డ్రైవర్ కన్నుమూశారు. – సాక్షి, మహబూబాబాద్ ఏం జరుగుతుందో ఆలోచించే లోగానే... సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాటోతు కస్నానాయక్–కల్యాణి (45) దంపతుల కుమార్తె ప్రమీల అలియాస్ మరియమ్మ (23) వివాహం డోర్నకల్ మండలం చాంప్లా తండా గ్రామ పరిధిలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ వెంకన్న–లలిత దంపతుల ప్రథమ కుమారుడు వినోద్తో నిశ్చయమైంది. వచ్చే నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి బట్టల కొనుగోలు కోసం వరంగల్కు శనివారం వెళ్దామని చెప్పిన ప్రమీల తండ్రి కస్నా నాయక్ పనికి వెళ్లగా శుక్రవారమే బట్టలు కొంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రమీల, ఆమె తల్లి కల్యాణి, సో దరుడు ప్రదీప్ (25), బాబాయి జాటోతు ప్రసాద్ (42) చిన్నమ్మ లక్ష్మి (39) కలసి జాటోతు రాములు నాయక్ (33) ఆటోలో శుక్రవారం ఉద యం 10 గంటలకు గూడూరు మీదుగా వరంగల్ బయలుదేరారు. సుమారు 40 నిమిషాల ప్రయాణం అనంతరం మర్రిమిట్ట–భూపతిపేట మధ్యలో జాతీయ రహదా రి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్కు చెందిన ట్రెయిలర్ లారీ ఎదురుగా వస్తూ అతివేగంగా ఆటోను ఢీకొట్టడమే కాకుండా దాన్ని సుమారు 150 మీటర్లు తోసుకెళ్లింది. దీంతో ఏం జరిగిందో తెలిసేలోపే ఆటోలోని వారు విగత జీవులుగా మారారు. ఫలితంగా మల్లంపెల్లి–సూర్యాపేట జాతీయ రహదారి రక్తపు మడుగుగా మారింది. లారీ డ్రైవర్ ధరావత్ కిషన్ అతివేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లోకి ఎక్కించారు. మృతదేహాలను ట్రాక్టర్లో తరలిస్తుండగా అడ్డుకుంటున్న స్థానికులు స్థానికుల ఆందోళన... రోడ్డు ప్రమాద వార్త తెలుసుకొని ఎర్రకుంట తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకొని రోడ్డుపై ధర్నాకు దిగారు. తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయడం, చర్చల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో రాత్రి వరకు మృతదేహాల తరలింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. చివరకు విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఘటనాస్థలికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎన్హెచ్ కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. చివరకు కాంట్రాక్టర్ ద్వారా రూ. 5 లక్షల చొప్పున, ప్రభుత్వం నుంచి రూ. లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయమే చంపేసింది! నేషనల్ హైవే నిర్మాణ కాంట్రాక్టర్కు మొరం ఇచ్చేందుకు ఎవరూ సహకరించలేదు. దీంతో జాటోతు కస్నా నాయక్ తనకు సంబంధించిన మూడెకరాల బంజరు భూమి నుంచి మొరం తీసుకెళ్లేందుకు సమ్మతించాడు. ఈ మేరకు భూమిలో మొరం తీసేందుకు వినియోగించే ప్రొక్లెయిన్ తీసుకురావడానికి లారీతో డ్రైవర్ భూపతిపేట నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే కస్నానాయక్ కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో సాయం చేయాలని ముందుకు రావడమే తన కుటుంబీకులను పొట్టన పెట్టుకుందంటూ కస్నా నాయక్ రోదించాడు. మర్రిమిట్ట ప్రమాదంపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు వెంటనే అందించాలని ఆదేశించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ - ఆటో ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. దుస్తుల కొనుగోలు కోసం వరంగల్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో గూడూరు శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇటీవల పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమె పెళ్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. కాగా, ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. లారీ కింద కూరుకుపోయిన ఆటోను పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. లారీని ప్రొక్లెయిన్తో పక్కకు నెట్టారు. అయితే ప్రమాదానికి లారీ అతివేగంగా రావడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
నాద నిలయంలో వేదం పలకాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల స్వార్జితంతో నిర్మించుకుని నివసించిన ఇంటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామికి అప్పగించారు. ఆ ఇంట్లో వేదం పలకాలన్న ఆకాంక్షతో రూ. కోట్లు విలువైన తన తల్లిదండ్రుల జ్ఞాపికను ఆ పీఠానికి అప్పగిస్తున్నట్లుగా అప్పట్లో బాలు వివరించారు. తాను తరచూ నెల్లూరుకు వచ్చి వేదనిలయం అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని కూడా చెప్పారు. ఈ ఇల్లు అంటే బాలు తల్లి శకుంతలమ్మకు మమకారం. తాను చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నారు. బాలు ప్రతి నెలా వచ్చి తల్లితో గడిపి వెళ్తుండేవాడు. నాద నిలయంగా ఉన్న ఇల్లు వేద నిలయంగా కూడా మారాలనే తల్లి కోరికతో ఆ ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. తండ్రి తొలిగురువు.. 2015 అక్టోబర్ 3న సాంబమూర్తి విగ్రహావిష్కరణ నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో బాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తన తొలిగురువని, ఆయన తనను నాటక రంగానికి పరిచయం చేయడంతో పాటు నేపథ్య గాయకుడిగా మారడానికి ప్రోత్సాహించారని చెప్పారు. జీవితంలో సర్వస్వం అయిన నాన్నకు విగ్రహం పెట్టి జన్మ ధన్యం చేసుకున్నానని తెలిపారు. తొలిమెట్టు గూడూరులో.. గూడూరు: ఎస్పీ బాలు గాన ప్రస్థానానికి తొలిమెట్టు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకాళిదాస కళానికేతన్. సంగీత పోటీలు నిర్వహించడానికి షేక్ గౌస్బాషా, ప్రభాకర్రావు తమ మిత్ర బృందంతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1962లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న బాలుకు మొదటి బహుమతి లభించింది. 1963లో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతగా గానకోకిల జానకి వచ్చారు. ఈ పోటీల్లో బాలుకు 2వ బహుమతి వచ్చింది. సంస్థ ఆనవాయితీ ప్రకారం ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందినవారితో పాటలు పాడించేవారు. ఈ క్రమంలో బాలు పాడిన పాట ఆహూతులను మంత్రముగ్దుల్ని చేసింది. ‘‘నీలాంటి వారు సినిమాల్లో పాడాలి’’ అంటూ జానకి బాలును ప్రోత్సహించారు. 1964లో భానుమతిని కలసిన సందర్భంలో బాలు పాడిన పాట ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దేశం గర్వించదగ్గ గాయకుడిగా ఎదుగుతావంటూ ఆమె బాలును దీవించారు. నిగర్వి అయిన బాలు వంటి మహానుభావుని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరమని శ్రీకాళిదాస కళానికేతన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ గౌస్బాషా కన్నీటి పర్యంతమయ్యారు. -
పట్టుకోండి చూద్దాం!
గూడూరు తహసీల్దార్ ఏసీబీ అధికారులనే ముప్పుతిప్పలు పెడుతోంది. ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ తన బినామీ చిక్కిన వెంటనే అప్రమత్తమైన ఆమె.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆపై స్థావరాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతోంది. బుధవారం అనంతపురంలో చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకుంది. ఎలాగైనా అరెస్ట్ చేసి బోనులో నెలబెట్టేందుకు ఏసీబీ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగానే ఆశ్రయమిచ్చిన కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు చేసి, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కోడుమూరు/కర్నూలు సిటీ: కోర్టు వివాదంలో ఉన్న భూమికి వెబ్ల్యాండ్లో డిజిటల్ సిగ్నేచర్ తొలగింపు కోసం రూ.4లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడిన గూడూరు తహసీల్దార్ హసీనాబీ కోసం ఏసీబీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 7న గూడూరు తహసీల్దార్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సెల్ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసుకొని హసీనాబీ పరారీలో ఉన్నారు. నిందితురాలిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం అనంతపురంలో తమ బంధువుల వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లేలోగా, విషయం గమనించిన నిందితురాలు పరారైనట్లు సమాచారం. కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు గూడూరు తహసీల్దార్ హసీనాబీ, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య గతంలో కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో పని చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇతడి సహకారంతోనే తప్పించుకు తిరుగుతున్నట్లు గ్రహించిన ఏసీబీ అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ నెల 8న ఎంపీడీఓ గిడ్డయ్య కూడా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుసుకుని అతడు నివాసం ఉంటున్న సీక్యాంపు సెంటర్ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్కు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో కల్లూరు తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో తాళం పగులగొట్టి సోదాలు నిర్వహించారు. తహసీల్దారు, ఎంఈడీఓ కలిసి దిగిన ఫొటోలు, కీలక పత్రాలు, తహసీల్దారు ఊత కర్ర, గుర్తింపు కార్డు లభ్యమయ్యాయి. దీంతో ఎంపీడీఓపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఆరు హాస్టళ్లలో నివాసం.. గూడూరు తహసీల్దార్పై కేసు నమోదైన అనంతరం ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. కర్నూలులోని వివిధ ప్రాంతాల్లోని ఆరు హాస్టళ్లలో నివాసముంటున్నట్లు ఏసీబీ పోలీసులు గుర్తించారు. ఆరు ప్రాంతాల్లో నిందితురాలికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు హాస్టళ్లకు నెలనెలా అద్దె చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారులకు హాస్టళ్ల యజమానులు తెలియజేశారు. ఒకే వ్యక్తి ఆరు చోట్లా నివాసముండేందుకు హాస్టళ్లలో ఎందుకు అద్దె కడుతుందనే విషయం అంతుపట్టడం లేదు. కాగా కొత్తపల్లి గిడ్డయ్య కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ అడ్వకేట్లను సంప్రదించి కేసు నుంచి ఎలా బయటపడాలి, నేరుగా కోర్టుకు హాజరైతే బాగుంటుందా అనే విషయాలపై అడ్వకేట్లను అమరావతిలో కలిసి చర్చించినట్లు సమాచారం. -
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
-
బీరు సీసాలతో విచక్షణారహిత దాడి
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి కారణమైన బాలుపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. వివరాలు.. మంగళవారం రాత్రి రవి మద్యం కొనేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమం బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది రవిని డిమాండ్ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సహనం కోల్పోయిన దుకాణ సిబ్బంది రవిపై మద్యం సీసాతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కాగా విషయం గమనించిన స్థానికులు రవిని ఆస్పత్రితో చేర్పించగా.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మానవత్వం చాటిన గూడూరు సబ్కలెక్టర్
సాక్షి, నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్కలెక్టర్ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్బైక్పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్స్టేషన్ సమీపంలో మోటారుసైకిల్పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్కలెక్టర్ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సబ్కలెక్టర్ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందే సమాచారం అందుకున్న తమ్ముడు పీహెచ్సీకి చేరుకుని అక్క వెంట వెళ్లాడు. కళ్ల ముందే ప్రమాదం జరిగినా మనకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్లే రోజుల్లో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సబ్కలెక్టర్ను పలువురు అభినందించారు. -
బాబాయ్ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..
సాక్షి, కర్నూలు : స్థానిక కటిక వీధికి చెందిన షంషావలి ఇంటిలో చోటు చేసుకున్న చోరీ ఘటన అతని అన్న కుమారుడి పనేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొమ్మును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వతేదీ షంషావలి.. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న షంషావలి అన్న కొడుకు అనిఫ్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బీరువాలోని రూ. 5 లక్షల విలువైన పది తులాల బంగారు బిస్కెట్, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తు కెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ పని లేకుండా తిరుగుతున్న నిందితుడు జల్సాల కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడని, రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ విజయభాస్కర్, ఏఎస్ఐ గోపాల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కిడ్నాపర్ను పట్టుకున్న గ్రామస్తులు
సాక్షి, గూడూరు(వరంగల్) : చిన్న పిల్లలను అపహరించబోతున్న కిడ్నాపర్ను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండల కేంద్రంలోని కట్టుకాల్వకు చెందిన తూరాల రాజు, లక్ష్మి దంపతులు ప్రతీ సంవత్సరం సంచార జీవనం గడుపుతూ పెరిగే చెట్లకు మందులు సరఫరా చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం వాళ్లు గుండెంగ వస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు జీవన్(4), రమేష్(3). కాగా, భార్య లక్ష్మి చనిపోగా ఇద్దరు చిన్నారులతో 4 రోజుల క్రితం గుండెంగకు చేరుకున్న రాజును భార్య ఎక్కడికి పోయిందంటూ గ్రామానికి చెందిన హోటల్ యజమానులు దేవా, వాసు అడిగారు. తన భార్య లక్ష్మి చనిపోయిందని పిల్లలు నాతో పాటు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ఇద్దరు హోటల్ యజమానులకు మగపిల్లలు లేకపోవడంతో ఆ ఇద్దరిని పెంచుకుంటామని చెప్పి నాలుగు రోజులుగా వారి వద్ద ఉంచుకుంటున్నారు. కాగా, చెన్నారావుపేట మండలం బోజెర్వుకు చెందిన అంగడి సమ్మయ్య, సరోజన దంపతులు హైదరాబాద్లో కూలీ చేసుకుంటూ ఉంటారు. వారిద్దరు సాయంత్రం 4 గంటలకు గతంలో పరిచయస్తుడైన తూరాల రాజు వద్దకు చేరుకుని ఇద్దరు చిన్న పిల్లలను తాము హైదరాబాద్కు తీసుకెళ్తామని చెప్పి రూ.1 లక్ష ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ముందుగా ఇస్తేనే పిల్లలను ఇస్తానని రాజు చెప్పగా, వారు తర్వాత ఇస్తామన్నారు. అయినా రాజు వినకపోవడంతో అంగడి సమ్మయ్య.. రాజుకు మద్యం తాగించాడు. అనంతరం సమ్మ య్య భార్య సరోజన వారికి కొద్దిదూరంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పట్టుకొని ఓ కిరాణ షాపు పక్కన ఉన్న ఆటో వద్దకు బలవంతంగా తీసుకెళ్తోంది. దీంతో పిల్లలు భయపడి ఏడ్వడం మొదలుపెట్టారు. గమనించిన సమీపంలోని హోటల్ యజమాని భార్య వచ్చి చిన్నారులను ఎటు తీసుకెళ్తున్నావని అడగ్గా ఆమెను నెట్టివేసింది. వెంటనే పిల్లలను ఎత్తుకెల్లే వ్యక్తిగా గుర్తించిన ఆ మహిళ అరిచింది. దీంతో సరోజన పిల్లలను వదిలేసి పారిపోయింది. ఆ తరువాత అక్కడకు చేరుకున్న సమ్మయ్య ఆమె తన భార్యగా చెప్పడంతో అసలు విషయం తెలిసిపోయింది. ఆ తరువాత రాజు వారిద్దరు పిల్లలను ఇస్తే రూ.1 లక్ష ఇస్తామన్నారని, డబ్బులు ముందు ఇస్తే ఇస్తానన్నానని, తాను మద్యం మత్తులో ఉండగా పిల్లలను పట్టుకెళ్తున్నారన్నారు. వెంటనే వారు ఆ వృద్ధుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సంఘటనా వివరాలు తెలుసుకొని వృద్ధుడు, ఇద్దరు పిల్లలతో పాటు వారి తండ్రి రాజును స్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఎస్సై ఎస్కే.యాసిన్ వివరణ అడగ్గా, ఫిర్యాదు ఏమీ రాలేదని, పిల్లల తండ్రి, కిడ్నాపర్ మద్యం మత్తులో ఉన్నారని, ఐసీడీఎస్ వారిని రప్పించి పిల్లలను వారికి అప్పగిస్తామని, అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు. -
రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్
సాక్షి, గూడూరు: రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు పని చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా గూడూరు పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. రైతును రాజును చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రారాజును చేయడానికి రైతు భరోసా పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సుచించారు. రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ మాఫీ రుణాలు రైతులకు అందెలా చూడాలని కోరారు. పంటల బీమా సౌకర్యం ప్రతి రైతుకు అందేలా సహకార బ్యాంకులు పని చేయాలని కోరారు. -
ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం
సాక్షి, గూడూరు: గూడూరులోని స్టాంప్స్ అండ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్కసారిగా ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, సీఐలు కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా సోదాలు చేసిన ఏసీబీ అధికారులు లెక్కల్లో లేని రూ.1,39,150 స్వాధీనం చేసుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ భానుమతి వద్ద ఎవరెవరికి ఎంత నగదు చెల్లించాలన్న విషయాలు రాసి ఉన్న ఒక స్లిప్ దొరికిందని, దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ వివరాలను వెల్లడించారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, ఇళ్లు ఇతర ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారి నుంచి భారీఎత్తున లంచాలు తీసుకుంటున్నారని బాధితుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు చేసినట్లు చెప్పారు. ఇంకా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సిబ్బందితోపాటు సోమవారం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని బాధితులు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట సీఐలు రమేష్బాబు, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు. పొలం విషయమై.. గూడూరు రూరల్ పరిధిలోని ఓ గ్రామంలో పొలానికి సంబంధించిన విషయమై బాధితులు వారంరోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారి పని చేసేందుకు పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందని, ఈక్రమంలోనే దాడులు జరిగాయని తెలుస్తోంది. కాగా అధికారులు ఇంకా రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గూడూరు జిల్లా రిజిస్ట్రార్ గంగిరెడ్డిని పిలిపించి విచారించారు. ఇదిలా ఉండగా కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడుల విషయం పట్టణంలో చర్చనీయాంశమైంది. కొందరు బాధితులు ‘తమ వద్ద ఇంత తీసుకున్నారని.. మమ్మల్ని ఇంత డిమాండ్ చేశారని.. నగదు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ పెడతారనే భయంతో డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాం’ అని కొందరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తీరు మారలేదు గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పలు పర్యాయాలు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయినా కార్యాలయ సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. చిన్న పని కూడా చేయకుండా, రైటర్ల ద్వారా బేరసారాలు కుదుర్చుకుని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పాపం.. కవిత
ఏడాది క్రితం గూడూరుకు చెందిన సునీల్, కవితలకు వివాహమైంది.. కవిత నవమాసాలు నిండి ప్రసవానికి ముందుగా ఆమెకు ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేరింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు పరీక్షించారు.. తలలో రక్తం గడ్డ కట్టిందని, వైద్యం చేయాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేదలైన ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో అప్పు చేసి కొంత, స్నేహితుల సాయంతో మరికొంత నగదు సమకూర్చి వైద్యం చేయించారు.. ఇంకా నగదు అవసరమై వైద్యం కోసం ఎదురుచూస్తున్న కవిత గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. సాక్షి, గూడూరు: గూడూరు పట్టణంలోని కటకరాజవీధిలో అన్నం నాగమణి, సురేష్ దంపతులు జీవిస్తున్నారు. వారికి గాంధీ, సునీల్ అనే ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు గాంధీ పూర్తిగా మానసిక, శారీరక దివ్యాంగుడు. భర్త సురేష్ 2002లో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో నాగమణి అన్నీతానైనే కుటుంబాన్ని పోషిస్తోంది. సునీల్ 10వ తరగతి వరకూ చదువుకుని గత మూడేళ్లుగా ఒక ఆటో మొబైల్ కంపెనీలో మెకానిక్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. సునీల్కు 2018 జూన్ 25న నాయుడుపేట మండలం కాపులూరు గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. కవిత గర్భవతై నవమాసాలు నిండాయి. ఈ నెల 2వ తేదీ ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చాయి. హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కుమారుడు జన్మించాడు. 5వ తేదీన కవితకు మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు ఎమ్మారై తీయాలని సూచించారు. దీంతో ఆమెను గూడూరుకు తీసుకెళ్లి ఎమ్మారై తీయించగా తలలో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా వైద్యులు అదేరోజు రాత్రి ఇక మేమేం చేయలేం తీసుకెళ్లండని చెప్పారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక వారు అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని, వెంటనే రూ.50 వేలు చెల్లిస్తే వైద్యం ప్రారంభిస్తామని, అయినా గ్యారంటీ లేదని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఏం చేయాలో తెలీక అప్పులు చేసి, సునీల్ స్నేహితులు అందజేసిన మొత్తంతో ఇప్పటివరకూ రూ.2.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించారు. అయినా రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆ మొత్తం వారి వద్ద లేక.. రూ.లక్షలు తీసుకొచ్చి వైద్యం చేయించలేక.. కవితను ఎలా కాపాడుకోవాలో తెలీక.. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8186810313(నాగమణి) ఫోన్నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఆ యువకులు మృత్యుంజయులు
సాక్షి, నెల్లూరు : రూరల్ పరిధిలోని పోటుపాళెం జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన శశిధర్, గణేష్లు బైక్పై నెల్లూరు నుంచి గూడూరుకు వస్తున్నారు. కూడలి వద్ద మలుపు తిరిగే క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపునకు వెళుతున్న కంటైనర్ బైక్ను ఢీకొంది. దీంతో బైక్ కంటైనర్ కిందికి వెళ్లి దెబ్బతింది. ఈ ప్రమాదంలో శశిధర్, గణేష్లకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో శశిధర్ ఒక్కసారిగా భీతిల్లిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణులకు ఆసరా.. పీఎంఎంవీవై
సాక్షి,చిల్లకూరు: పెళ్లయిన ప్రతి మహిళ తొలిసారి మాతృత్వం పొందాలని తపన పడుతుంటారు. దీంతో పలు జాగ్రత్తలు పాటించి బిడ్డకు జన్మనిచ్చి మురిసి పోతారు. అయితే నేటి కాలంలో ఎక్కువగా రక్తహీనత ఏర్పడడంతోపాటు సరైన జాగ్రత్తలు పాటించక ఎంతోమంది బిడ్డలు పురుడు పోసుకునే సమయంలో మృతి చెందుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఎంవీవై (ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన) పథకం ద్వారా తొలిసారి గర్భందాల్చిన మహిళలకు విడతల వారీగా రూ.6 వేలను అందిస్తోంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా తల్లీబిడ్డ క్షేమంగా ఉండేందుకు దోహదపడుతుంది. మండలంలో 300 మంది గర్భిణులు మండలంలోని చిల్లకూరు, చింతవరం, వల్లిపేడు, వరగలి గ్రామాలలోని పీహెచ్సీల పరిధిలోని 31 గ్రామ పంచాయితీలలో ఇప్పటివరకు సుమారుగా 300 మంది వరకు గర్భిణులు ప్రతినెల పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. వీరిలో తొలిసారి గర్భందాల్చిన వారు సుమారు 100 మంది వరకు ఉన్నారు. వీరికి పీఎంఎంవీవైలో లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరు తమ పేర్లను స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వద్ద నమోదు చేసుకుంటే వారికి బ్యాంకుల ద్వారా నగదు అందే ఏర్పాటును చేస్తారు. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. తొలిసారి గర్భందాల్చిన గర్భిణులు మూడవ నెలలో తమ పేర్లను ఆరోగ్య కార్యకర్తల వద్ద నమోదు చేసుకోవాలి. మొదటి విడతగా వారికి వెయ్యి అందిస్తారు. ప్రసవానికి ముందు రూ.2 వేలు, ఖాతాలో జమ చేస్తారు. ప్రసవం అనంతరం మొదటి టీకా (డోసు) వేయించుకున్న తరువాత మరో రూ.2 వేలను అందిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే గర్భిణులు తమ బ్యాంకు పుస్తకం జెరాక్స్తోపాటు ఆధార్ కార్డును ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వాలి. ప్రత్యేక ప్రోత్సాహం కింద ఇచ్చే ఈ నగదు విషయంలో తొలిసారి గర్భందాల్చిన వారు ఏ కారణం చేతనైనా గర్భం విచ్చిన్నమైతే రెండవసారి గర్భందాల్చిన తరువాత తొలిసారిగా ఇచ్చిన వెయ్యి నగదును మినహాయించుకుని మిగిలిన రూ.4 వేలు అందించేలా చర్యలు తీసుకుంటారు. పేద మహిళలలకు ఇలా నగదు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వారు గర్భందాల్చిన సమయంలో పౌష్టికాహారం తీసుకుని మాతా శిశుమరణాలు తగ్గించే వీలుంటుంది. ఖాతాలలోనే జమవుతుంది పీఎంఎంవీవై పథకం కింద దరఖాస్తు చేసుకున్న గర్భిణులకు రూ.5 వేలు విడతల వారీగా అందిస్తారు. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించకుంటే అదనంగా మరో వెయ్యి అందిప్తారు. దీంతో మొత్తంగా ఆరువేల నగదు గర్భిణుల ఖాతాలలోనే జమ అవుతుంది. ప్రోత్సాహంగా ఇచ్చే నగదుతో పౌష్టికాహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. – బ్రిజిత, చిల్లకూరు, వైద్యాధికారి -
సమస్యలు మరచిన పాలకులు
సాక్షి, గూడూరు రూరల్: కొన్నేళ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంగా మారింది. గూడూరు పట్టణంలో దాదాపు 30 వేల జనాభా ఉంది. పదేళ్లుగా బుడగలవాని చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా అభివృద్ధి చేసి శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోకుండా వదిలేశారు. గూడూరు నుంచి కొత్తకోట, గూడూరు నుంచి కోడుమూరు వరకు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారాయి. దీంతో మూడు దశాబ్దాలుగా బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును వేసి బస్సులు నడపాలని జిల్లా అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు, మండల వ్యాప్తంగా ఎల్లెల్సీ కాలువ కింద ఆయకట్టు 15000 ఎకరాలకు పైగా ఉంది. అయితే కాలువల్లోని పలు చోట్ల మరమ్మతులకు నోచుకోక శిథిలమవడంతో సక్రమంగా సాగునీరు రాకపోవడంతో వర్షాధారంపై రైతులు ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. బూడిదపాడు, పెంచికలపాడు, చనుగొండ్ల, జూలకల్ హైస్కూళ్లల్లో క్రీడా మైదానాలు పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆటలు ఆడేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మునగాల, చనుగొండ్ల, బూడిదపాడు, మల్లాపురం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరు ముందుకు వెళ్లక రోడ్లపైనే పారుతూ కంపుకొడుతున్నాయి. సమస్యలను తీర్చాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. మండలంలో కొన్నేళ్లుగా సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ లబ్ధి
వాకాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా నాంది పలికిన నవరత్నాలు అన్ని వర్గాల్లోని ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుందని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్రావు పేర్కొన్నారు. ఆదివారం కొడవలూరు దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని యరగాటిపల్లి, బాలిరెడ్డిపాళెం, వాలమేడు పంచాయతీల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్రావుతోపాటు సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి పలువురు నాయకులు కలసి వరప్రసాద్రావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బుర్లవారిపాళెంలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీని ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సాగు, తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్రావు మాట్లాడుతూ మాట ఇస్తే మడమతిప్పని వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏదైనా చేయగల్గితేనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మాట ఇస్తారే తప్ప అబద్ధాలు చెప్పడం ఆయన ఇంటా వంటా లేదన్నారు. ఈ సారి మనందరికీ సంక్షేమ పథకాలతో న్యాయం జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్శేఖర్రెడ్డి, కొడవలూరు ధనంజయరెడ్డి, పల్లంపర్తి గోపాల్రెడ్డి, దువ్వూరు అజిత్కుమార్రెడ్డి, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, సన్నారెడ్డి రామచంద్రారెడ్డి, వాకాటి జనార్దన్రెడ్డి, నేదురుమల్లి గౌరవసాయిరెడ్డి, మారంరెడ్డి కిరణ్కుమార్రెడ్డి, ద్వారకానాథరెడ్డి, ఏనుగు సుధాకర్నాయుడు, గూడూరు సుధాకర్రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, దువ్వూరు భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
అవి ఎప్పటికీ మర్చిపోలేను: వైఎస్ జగన్
సాక్షి, గూడూరు (నెల్లూరు జిల్లా) : ‘పాదయాత్రలో ప్రజలు నాతో చెపుకున్న బాధలు, నేను చూసిన వారి కష్టాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వరప్రసాద్, తిరుపతి లోక్సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. మీ అందరికీ నేనన్నానే భరోసా ఇస్తున్నా. నిమ్మరైతుల ఆవేదనను నేను విన్నాను.. గిట్టుబాటు ధరలేక రైతులు పడ్డ కష్టాలు చూశాను. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నేను విన్నాను. ఈ జిల్లాలోనే జరిగిన అలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సకాలంలో 108 రాక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆవేదన విన్నా.. పక్షపాతం వచ్చి ఆరోగ్య శ్రీ అందక వీల్చైర్లో వచ్చి నాతో చెప్పుకున్న బాధితుల పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలను చదివించడం కోసం కూలీ పనులకు వెళ్తున్న అక్కాచెల్లెమ్మల బాధలు విన్నా. విభజన చట్టంలో దుగరాజుపట్నం పోర్టు నిర్మించాలని ఉన్నా.. కృష్ణ పట్నం పోర్ట్ చాలంటూ చెప్పడానికి చంద్రబాబు ఎవరన్నా? అని మీరు ప్రశ్నించిన మాటలు మర్చిపోను. రెండు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎదురు చూసిన నిరుద్యోగులను చూశాను. కండలేరు నుంచి రూ.63 కోట్లతో నీళ్లిచ్చిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్దే. ఆ పథకం కూడా సరిగ్గా నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు చెప్పారు. గూడూరు-1, గూడూరు-2లను కలిపే ఫ్లై ఓవర్ నిర్మాణం అంగుళం కూడా కదల్లేదు. ఇలా మీ కష్టాన్ని చూశా.. మీ బాధలను విన్నా.. మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను.. మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నాను. చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోని మోసం మోసం తప్పా మరొకటి కనిపించలేదు. రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ప్రతిరోజు ఒక మోసం.. ఒక కుట్ర. మరో 12 రోజుల్లో ఎన్నికల్లో జరుగబోతున్నాయి. ఈ కుట్రలు మరింత ఉదృతంగా తయారవుతాయి. రోజుకో డ్రామా చంద్రబాబు చూపిస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజన్న రాజ్యాన్ని జగనన్నా పాలనలో చూస్తామని.. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పిండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ ఇస్తామని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
ఓటర్లకు నేను విశ్వాసంగా ఉన్నా: వరప్రసాద్
సాక్షి, గూడూరు (నెల్లూరు) : తిరుపతి ఎంపీగా గెలిపించిన ఓటర్లకు తాను విశ్వాసంగా ఉన్నానని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని మాజీ ఎంపీ, గూడూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వరప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను ఎంపీగా గెలిపించిన గూడూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కూడా ఇక్కడి ప్రజలు గెలిపించారని, కానీ ఆ ఎమ్మెల్యే అమ్ముడుపోయి గెలిపించిన ఓటర్లకు తీవ్రని అన్యాయం చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిందే కాకుండా సొంత ఇంటికి వెళ్లినట్లు ఉందని సిగ్గులేకుండా చెప్పారన్నారు. ఆయన గెలుపు కోసం అహర్నిషులు కృషి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే 250 కేసులు పెట్టించారని వరప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రతి ఊరు తిరుగుతానని, ప్రతి ఇంటికి వస్తానని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటానన్నారు. తనను గూడూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఐఏఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో నిధులు తీసుకొచ్చి గూడూరు అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. చంద్రబాబూ నీవు ముఖ్యమంత్రివా? ప్రత్యేకహోదాను ఏనాడు చంద్రబాబు కోరలేదని, ఆయన మేనిఫెస్టో అంతా అబద్ధాలమయమని మండిపడ్డారు. 600 హామీలిచ్చి ప్రతీ ఒక్కరినీ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఐదేళ్ల నుంచి యువకుల ఉద్యోగాల గురించి చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను బాబు మోసం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని, రుణమాఫీ కాదు కదా.. రుణాలపై వడ్డీలను కూడా మాఫీ చేయలేదన్నారు. చంద్రబాబును నమ్మిన యువకులను నట్టేటా ముంచారని, మత్సకారులు, దళితులు సహా అందర్నీ చంద్రబాబు మోసం చేశారన్నారు. విభజన హామీలు తీసుకురాలేని చంద్రబాబు ఒక అసమర్థత ముఖ్యమంత్రని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తారని, నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శించారు. -
అభివృద్ధికి దూరంగా గూడూరు..
సాక్షి, గూడూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వేకువనే నిద్ర లేస్తూ.. పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి పట్టణంలో ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. మాంసం మార్కెట్లో ఎదురైన దుర్భర పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ వస్తున్న దుర్వాసన ఎలా తట్లుకుంటున్నారంటూ అక్కడి వ్యాపారులను అడిగారు. ఇదేనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ విమర్శించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూతన మార్కెట్ను కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తే... ఎమ్మెల్యే ఆ పనులను సాగనివ్వలేదంటూ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మార్కెట్కు శంకుస్థాపన చేస్తానని, లేదంటే తనను నిలదీయాలని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో మహిళలు యూరిన్కు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, నాయకులు పడియాల శ్రీహరి, రుదీప్రెడ్డి, ఎస్సీసెల్ నాయకులు నర్సయ్య, మనోహర్, చంద్రనీల్, సురేష్, వినీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటా గూడూరు రూరల్: తనను గూడూరు ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపితే నిబద్ధతో పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్రావు అన్నారు. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు యద్దల నరేంద్రరెడ్డి నివాసానికి వెళ్లి గూడూరు మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. నామినేషన్ వేసిన తరువాత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావును శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, వెందోటి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సునీల్రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గూడూరు నిమ్మ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని వెలగలపల్లి వరప్రసాద్రావు తెలిపారు. పట్టణ సమీపంలోని నిమ్మ మార్కెట్లో ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, నాయకులు పొనకా శివకుమార్రెడ్డి, తలమంచి సిద్దారెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, డాక్టర్ రాధా జోత్స్నలత, పిట్టి నాగరాజు తదితరులతో కలసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నిమ్మ పంటపై ఆధారపడిన రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
ఉత్త డప్పే.. జాబేదీ?
సాక్షి, గూడూరు : ‘జాబు రావాలంటే.. బాబు రావాలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మర్చిపోయారు. కొత్త ఉద్యోగాల సృష్టి దేవుడెరుగు.. కనీసం ఖాళీ పోస్టులను భర్తీ చేయండని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు. కూలీనాలి చేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు’ అంటూ నిరుద్యోగులు ఆక్రోశం వెలిబుచ్చారు. ‘పరిశ్రమల కోసం భూములిచ్చినా ఉపయోగం లేకపోయింది. నాయుడుపేట, తడ ప్రాంతాల్లో సెజ్లున్నా ఉద్యోగాలు రాలేదు. ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు చివరకు అదికూడా సక్రమంగా ఇవ్వలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘జాబు రావాలంటే బాబు గద్దె దిగాలి. మా బాగోగులు చూసే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కడతాం’ అని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పెద్ద మసీదు సమీపంలోని రచ్చబండ వద్ద కూర్చొని ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికలు తిరగేస్తున్న యువతను కదిలించగా వారి మనోగతాన్ని వెలుబుచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీని పునరుద్ధరించని ఫలితంగా గ్రూప్ 1, 2 వంటి 25 వేల పోస్టులు భర్తీ కావట్లేదు. గ్రూప్ 4, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘జాబు’ రాసి మరీ ఆత్మహత్య చంద్రబాబు హయాంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనే దానికి 2017 ఏప్రిల్ 17న విశాఖలో చోటుచేసుకున్న ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మర్రిపాలెంకు చెందిన నిరుద్యోగి పితాని శివదుర్గా ప్రసాద్.. చంద్రబాబు గెలిస్తే తన కష్టాలు తీరిపోతాయని భావించాడు. తన ఓటు టీడీపీకే వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా ఉద్యోగం రాలేదు. ఉపాధి సైతం దొరకలేదు. దీంతో ఆ యువకుడు సీఎం చంద్రబాబుకు తన బాధను, అవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘జాబు లేదని నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇది నాలాంటి నిరుద్యోగ యువతకు కనువిప్పు కావాలి’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. నిరుద్యోగ యువత తనలా అత్మహత్యకు పాల్పడవద్దని, హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు మోసం చేశారు మా నాన్న నజీర్ కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నన్ను బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివించాడు. చదువు పూర్తయ్యాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రాజెక్ట్ పూర్తవగానే ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఉద్యోగావకాశాల కోసం తిరుగుతున్నా ఫలితం లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. – ఎస్కే జిలానీబాషా, గూడూరు ఉద్యోగాలు రావడం లేదు ప్రభుత్వ విధానాలవల్లే ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలు రావడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు గొప్పలు చెప్పి నాలుగున్నరేళ్ల తర్వాత అందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో 1.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గ్రూప్–4 పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. – కె.నేతాజీ, బీటెక్, గూడూరు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐటీఐ డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాను. చదువు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను ఏటా భర్తీ చేస్తే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ఇలా అయితే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి. – కె.నవీన్, గూడూరు -
ఎవరికి ఏ దోసెలు కావాలి..!
సాక్షి, గూడూరు (ప్రకాశం): ఎన్నికల ప్రచారంలో స్థానికులతో మమేకం కావడానికి పార్టీ నేతలు చిత్రవిచిత్ర శైలితో ఆకట్టుకుంటున్నారు. గూడూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద్రావు తరఫున గూడూరు పట్టణంలోని 3వ వార్డు పరిధి జనార్దన్రెడ్డి కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ పొణకా దేవసేనమ్మ ప్రచారం నిర్వహించారు. అక్కడే తోపుడు బండిపై దోసెలు వేస్తున్న వారితో మాటలు కలిపారు. రోజుకు రాబడి ఎంత వస్తుందంటూ దుకాణం యజమానితో మాట్లాడారు. ఇదే సమయంలో నేను దోసెలు పోస్తానంటూ దేవసేనమ్మ దోసెలు పోస్తూ.. ఎవరికి ఏ దోసెలు కావాలో అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పలు రకాలు దోసెలు పోసిచ్చారు. -
అక్రమ కేసులు..భయంతో కుటుంబ సభ్యులు
సాక్షి, గూడూరు రూరల్: అధికారపార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నారు. కొందరు వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండో వర్ కేసులు నమోదు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కె.నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దపాడులో ఒకరు, కె.నాగలాపురంలో ఏడుగురు, సల్కాపురంలో తొమ్మిది, పర్లలో నలుగురు, మార్కాపురంలో ఏడుగురు, బూడిదపాడులో 11 మందిపై పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేశారు. అయితే ఈ కేసులను నమోదు చేసిన వారిలో అత్యధికంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులే ఉన్నారు. తమపై ఎలాంటి నేరారోపణలు, క్రిమినల్ కేసులు లేకపోయినా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. పోలీసుల తీరుపై కోర్టులో ప్రైవేట్ కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బైండోవర్ కేసు నమోదు చేశారు ఎలాంటి క్రిమినల్ కేసులు లేని నాపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. నేనేం తప్పు చేశానని కేసు నమోదు చేశారని పోలీసులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. –నరసింహారెడ్డి, కె.నాగలాపురం భయాందోళనకు గురి చేస్తున్నారు పోలీసులను మా ఇళ్లకు పంపి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. గత మూడేళ్లుగా నేను వైఎస్సార్సీపీ కార్యకర్తగా పని చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేసి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. – కొండారెడ్డి, బూడిదపాడు. ఆదేశాలు ఉన్నాయి ప్రతి రోజు 10 మందికి తగ్గకుండా బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. –గోపీనాథ్, కె.నాగలాపురం ఎస్ఐ -
యువతిపై నలుగురు యువకుల లైంగికదాడి
సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. సూళ్లూరు, బొగ్గులకాలనీకి చెందిన నలుగురు యువకులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన 24 ఏళ్ల యువకుడు, విజయనగరానికి చెందిన 20 ఏళ్లబాధితురాలు శ్రీసిటీ సెజ్లోని ఓ సెల్ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారు. స్నేహితులైన వీరు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం మీదున్న కుర్చీల్లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో సూళ్లూరు, బొగ్గుల కాలనీకి చెందిన నలుగురు యువకులు గంజాయి తాగిన మత్తులో ఆ యువకుడ్ని కొట్టి యువతిని బొగ్గుల కాలనీ వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ లోపు పోలీసుల గస్తీలో భాగంగా రైల్వేస్టేషన్ వైపు రావడంతో పోలీస్ సైరన్ విన్న బాధిత యువకుడు ఎస్ఐ పి.విశ్వనాథరెడ్డిని ఆశ్రయించి జరిగిన ఘటనను వివరించారు. దీంతో సీఐ, ఎస్ఐ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులొస్తున్నారని పసిగట్టిన నలుగురు యువకులు ఆ యువతిని బట్టల్లేకుండా కొంత దూరం నడిపించి అక్కంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ టన్నెల్ కిందకు తీసుకెళ్లి తెల్లవార్లూ ఆమెపై పైశాచికంగా అత్యాచారం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆ యువతిని అక్కంపేట రైల్వేస్టేషన్లో సబర్బన్ రైలు ఎక్కించి పంపారు. ఆదివారం రాత్రి నుంచి యువతి కోసం గాలిస్తున్న పోలీసులు ఆమెను గుర్తించి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా
పుట్టుకకు చావుకు ఉందా ధర్మం వ్యాధికీ బాధకూ ఉందా మతం నీటికీ నిప్పుకూ ఉందా భేదం మనుషులందరికీ అంతిమంగా ఉండాల్సింది సంస్కారం... ఆ యువతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది... కట్టుకున్న భర్తతోపాటు, మామ కూడా మంచానికే పరిమితమైనా.. మొక్కవోని దీక్షతో వారిద్దరికీ సపర్యలు చేస్తూ... ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి, వారిద్దరి వైద్యానికి ఖర్చు చేసింది. ఈ కష్టానికి ముప్పులా ఆదివారం (అక్టోబర్ 21) ఆమె మామ మృతి చెందాడు. మృతదేహాన్ని తమ సొంతింటికి తీసుకురాగా, దానిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అడ్డుగా నిలిచాడు. శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఏకమై, వారి బాకీని వారంలోగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో, మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ తర్వాత ఆ యువతే కొడుకులా నిలిచి, హిందూ ధర్మం ప్రకారం తానే బద్దె వేసుకుని, కాటివరకూ వచ్చి, శ్మశానంలో తన మామకు తలకొరివి పెట్టింది. టీవీ సీరియళ్లలో దుర్మార్గమైన కోడళ్లను చూపుతున్న ఈ కాలంలో ఈ కోడలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏం జరిగింది? గూడూరు గమళ్లపాళానికి చెందిన పర్వతాల రమణయ్య, రమణమ్మల ఏకైక కుమారుడు శ్రీనివాసులు. తండ్రి రమణయ్య చెన్నై దుకాణదారులకు అవరసమైన వస్తు సామాగ్రిని తీసుకొచ్చి అందజేస్తూ సీజ వ్యాపారం చేస్తుండేవారు. శ్రీనివాసులు కూడా తండ్రికి చేదోడుగా, అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి అవసరమైన వారికి సామాగ్రిని తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం తల్లి రమణమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. దాంతో తండ్రి బాగోగులు కొడుకు శ్రీనివాసులు ఒక్కడే చూసుకుంటూ ఉన్నాడు.రెండేళ్ల క్రితం శ్రీనివాసులుకు రెహానా అనే యువతితో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టిన రెహానా ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. అయితే ఏడాది క్రితం రమణయ్యకు కూడా క్యాన్సర్ వ్యాధి సోకింది. కొత్త కోడలు మామ సేవలను చూసుకుంటూ ఉండగా, శ్రీనివాసులు సీజ¯Œ వ్యాపారం చేస్తూ ఇల్లు లాక్కొచ్చేవాడు. విధికి అంతటితో సంతృప్తి కలగలేదు. మూడు నెలల క్రితం శ్రీనివాసులు కూడా అనారోగ్యానికి గురయ్యాడు.రోజురోజుకూ శుష్కించిపోతూ మంచం పట్టాడు. దీంతో రెహానాకు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. డబ్బు అవసరమయ్యింది. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి తాముంటున్న ఇంటిని తాకట్టుపెట్టి 3 లక్షలు తీసుకుని, భర్తతోపాటు, మామకూ వైద్యం చేయిస్తూ బతుకుబండిని లాక్కురాసాగింది. ఇంతలో మరో అశనిపాతం. ‘‘ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేయాల్సిందే’’నని ఇంటిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కరాఖండీగా చెప్పాడు. చేసేదిలేక రెహానా, తన మామ రమణయ్యతోపాటు, శ్రీనివాసులును తీసుకుని నెల్లూరుకు వెళ్లి, అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని, ఉన్న కాస్త డబ్బుతో మామ, భర్తలకు వైద్యం చేయిస్తూ బతుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో, తిరుపతికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రమణయ్య ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో రెహానా బతుకులో చీకట్లు మరింత చిక్కనయ్యాయి. ఒకవైపు మంచంలో ఉన్న భర్త, మరోవైపు మృతి చెందిన మామ... చేసేది లేక నెల్లూరులోని అద్దె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్తే రానివ్వరని, అంబులెలో గూడూరుకు తీసుకొచ్చింది. తాము తాకట్టుపెట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చి ఉన్నారని తెలియడంతో, రమణయ్య పార్ధివ దేహాన్ని ఎక్కడ ఉంచి అంత్యక్రియలు చేయాలా... అని ఆందోళనకు గురైంది. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నవారికి సంగతి తెలిసింది. వారంతా రమణయ్య మృతదేహాన్ని సొంతింటికే తీసుకురావాలని సలహా ఇచ్చారు. దాంతో మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఈలోగా ఇల్లు తాకట్టుపెట్టుకున్న వ్యక్తికి సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించనంటూ తలుపునకు అడ్డుగా నిలుచున్నాడు. అది న్యాయం కాదంటూ కొందరు చెప్పిచూశారు. కొంత వాగ్వివాదం జరిగాక కూడా ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ససేమిరా అన్నాడు. ఆ ఇంటి పక్కనే రమణయ్య సోదరులూ ఉన్నారు. ‘‘మీరైనా ఇంట్లోకి రానివ్వ’’మంటూ రెహానా ఎంతో ప్రాధేయపడింది. అయినా వారికి కనికరం కలగలేదు.మా ఇంట్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా కలసి, ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వారిపై ఎలాంటి కనికరం చూపించకుండా, తానేమీ చేయలేనని పోలీసు కేసు పెట్టుకోండంటూ పంపేశారు. దీంతో చేసేది లేక, అర్ధరాత్రి వరకూ ఆ ఇంటి బయటే మృతదేహాన్ని ఉంచారు. దాంతో ఆ ఇంట్లో అద్దెకున్నవారు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తాకట్టుపెట్టుకున్న వ్యక్తి మాత్రం తాను వెళ్లిపోకుండా గడియపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ల మనసు కరిగింది. వారు అతడిని పిలిచి... ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని, ఇలా శవాన్ని బయట ఉంచడం బాగుండదని, ఈలోపు తమదీ పూచీ అని హామీ ఇవ్వడంతో శవాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా ముస్లిం యువతి అయిన రెహానా తన మామకు సోమవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆమే కుమారుడిలా బద్దె వేసుకుని, ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకూ వెళ్లింది. అక్కడ హిందూ ధర్మం ప్రకారం తానే తలకొరివి పెట్టి, అంత్యక్రియలు జరిపించింది. మధ్యలో దింపుడు కళ్లం వద్ద కూడా మామ పేరును తానే మూడుసార్లు పిలవడం, అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇదిరా ప్రేమంటే. కలసిన మనసులకు ఉదాహరణ ఆ దంపతులేరా’’ అంటూ రెహానాను చూసి కంటతడి పెట్టారు. ఆ సంఘటనకు చలించిపోయిన ఆ ప్రాంతంలోని వారంతా కూడా సాయం అందించి రెహానాకు బాసటగా నిలిచారు. యావత్ స్త్రీ జాతికే రెహానా ఆదర్శమంటూ కొనియాడారు. దాతలు ముందుకొచ్చి ఆ త్యాగమూర్తికి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, సాక్షి, గూడూరు -
సూపర్ వాస్మల్ తాగి వ్యక్తి ఆత్మహత్య
గూడూరు: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సూపర్ వాస్మల్ 33 అనే తైలం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గూడూరు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని అడివయ్యకాలనీలో ఉన్న హిందూశ్మశాన వాటిక షెల్టర్లో మంగళవారం వెలుగుచూసింది. రెండో పట్టణ ఎస్సై హుస్సేన్బాషా సమాచారం మేరకు.. ఒకటో పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు ప్రాంతానికి చెందిన యనమల మురళి (35) కుటుంబ కలహాలతో మద్యంలో వాస్మల్ కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు మంగళవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ..
గూడూరు : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గూడూరు శివారు తోటదస్రుతండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గీసుకొండ మండలం నంద్యానాయక్ తండాకు చెందిన కేలోతు ఈర్యా, ఈరమ్మల కూతురు కవిత(26)ను గత ఎనిమిది సంవత్సరాల క్రితం గూడూరు శివారు తోటదస్రుతండాకు చెందిన తేజావత్ లాల్సింగ్తో వివాహం చేశారు. కట్నకానుకలు అన్నిముట్టచెప్పిన తర్వాత లాల్సింగ్ మరో రూ. 70 వేలు ఇవ్వాలంటూ గత రెండు రోజుల క్రితం భార్య కవితను తీసుకుని నందనాయక్తండాకు చేరుకున్నాడు. అక్కడ అ త్తామామలను డబ్బులు అడగుగా మీకిచ్చే డబ్బులు అన్నీ ఇ చ్చామని, కావాలంటే మరికొన్ని డబ్బులు తర్వాత చెప్పా రు. దీంతో కోపోద్రిక్తుడైన లాల్సింగ్ గురువారం మధ్యాహ్నం దస్రుతండాకు బయలుదేరాడని, ఇంతలోనే ఈ ఘట న జరిగిందని వాపోయారు. అత్తింటి వారే తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుం బ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా పురుగుల మందు తాగి కవిత ఆత్మహత్య చేసుకుందని లాల్సింగ్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇదే విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోగా ఎస్సైలు యాసిన్, రామారావు సిబ్బందితో చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్య
గూడూరు: నారాయణ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన మాచిరాజు విజయభాస్కర్రాజు, సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీసాయి (20) గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏం జరిగిందో.. ఏమో ఆ విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. లక్ష్మీసాయి గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. గత శుక్రవారం (ఈ నెల 15న) గూడూరులోని అశోక్నగర్ ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్న తన స్నేహితుడు ఎ.మనోజ్ వద్దకు వెళ్లాడు. తనను కళాశాల హాస్టల్ నుంచి పింపించివేశారని 2 రోజులు రూమ్లో ఉంటానని చెప్పడంతో మనోజ్ సరేనన్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో లక్ష్మీసాయిని రూమ్లోనే ఉంచి మనోజ్ ఊరికి వెళ్లి, మంగళవారం తన రూమ్కు చేరుకున్నాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీని తొలగించి చూడగా.. లక్ష్మీసాయి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. లక్ష్మీసాయి ఫీజు చెల్లించాల్సి ఉండటంతో యాజమాన్యం అతడిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని.. సకాలంలో చెల్లించకపోవడంతో హాస్టల్ నుంచి పంపించివేసిందని విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే లక్ష్మీసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
సారు లేరు.. సమాచారం దొరకలేదు
ఇతని పేరు పంకజ్. మహారాష్ట్ర వాసి. ఆదివారం తను వెళ్లాల్సిన రైలు సమయానికి రాలేదు. అతనికి తెలుగు రాదు. సమాచార కేంద్రంలో ఎవరూ లేకపోవడంతో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ సమాధానం తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గూడూరు: భారీ వర్షాలు ఓ పక్క.. మరో పక్క రైల్వే ట్రాక్ పనులు, సిగ్నె ల్స్ మరమ్మతులు తదితర కారణాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతోంది. ఈ సమయంలో రైళ్లు ఏ సమయానికి వస్తాయనే సమాచారం చెప్పేందుకు విచారణ కేంద్రంలో ఎవరూ లేక ప్రయాణికులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఎవరిని అడిగినా సమాధానం సక్రమంగా రాకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గూడూరు రైల్వేస్టేషన్లో ఉన్న విచారణ కేంద్రంలో ఆదివారం ఒకటన్నర గంటలపాటు ఎవరూ లేకపోవడంతో ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందలేదు. ప్రస్తుతం నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతోంది. గూడూరు జంక్షన్ కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు ఈ స్టేషన్ కేంద్రం రాకపోకలు సాగిస్తున్నారు. అ లాగే దసరా పండుగకు ఊళ్లకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు రైళ్లపై ఆధారపడ్డారు. దీంతో రైల్వేస్టేషన్లు ప్ర యాణికులతో కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో విచారణ కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ఏం చేయాలో తెలియని ప్రయాణికులు టికెట్లు ఇచ్చే వారి వద్దకెళ్లి తాము వెళ్లాల్సిన రైలు ఎప్పుడొస్తుందని ఆరాతీశారు. వారు పక్కనున్న విచారణ కేంద్రంలో అడగండని కొందరికి, ఇంకొందరికి తెలియదని చెప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలియకపోవడంతో కొందరు బస్సులపై ఆధారపడ్డారు. ఆలస్యంగా.. ఆదివారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. బిలాస్పూర్ నుంచి తిరుపతికి వచ్చే బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకు గూడూరు రైల్వే జంక్షన్కు రావాల్సి ఉండగా, అది 2.30 గంటల ఆలస్యంగా 4.30 గంటలకు చేరుకుంది. అదే విధంగా మధ్యాహ్నం 1.45 రావాల్సిన నవజీవన్ కూడా సాయంత్రం 4.45 వరకు రాలేదు. అదే విధంగా పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి. సమాధానం చెప్పేవారేరీ విచారణ కేంద్రంలో గంటన్నరపాటు ఏ రైలు ఎప్పుడొస్తుందో చెప్పే వారులేక, విషయం తెలియక తీవ్ర ఇబ్బంది పడ్డాం. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? ఇలాంటివారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. – నారాయణ, ప్రయాణికుడు బంధువులు మరణించారని వెళ్లారు విచారణ కేంద్రంలో పనిచేసే వ్యక్తి బంధువులు ఎవరో చనిపోయారని వెళ్లాడు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సిబ్బందిని ఏర్పాటుచేశాం.– వెంకటేశ్వరరావు, ఇన్చార్జి స్టేషన్ మాస్టర్ -
నన్నే నిలదీస్తాడా.. సంగతేంటో చూడండి: ఏపీ మంత్రి
► మంత్రిని ప్రశ్నించినందుకు రూ.3 వేల ఫైన్ ► గ్రామ కట్టుబాటుకు టీడీపీ రంగు సాక్షి, తోటపల్లి గూడూరు: గ్రామ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు రూ.3 వేల జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకన్నపాళెం పట్టపుపాళెం గ్రామంలో ఈనెల 11న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలపై వారు స్పందన అడిగారు. అనంతరం రామాంజనేయ ఆలయ ప్రాంగణంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంలో గ్రామానికి చెందిన పేటంగారి ఆదిశేషయ్య అనే వ్యక్తి టీడీపీ మూడేళ్ల పాలనలో గ్రామానికి ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అర్హులకు ఇళ్లు, పింఛన్లు మంజూరు కావడం లేదని, వెంకన్నపాళెంలో చెరువు డొంకకు కల్వర్టు నిర్మించడంలో జాప్యం చేస్తున్నారని మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో కంగుతిన్న మంత్రి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి వెనుదిరిగారు. ఆ తరువాత గ్రామ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ గ్రామానికి వస్తే ఇచ్చే మర్యాద ఇదా. అతిథిగా వస్తే నన్నే నిలదీస్తారా. అతడి సంగతేంటో చూడండి’ అని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన గ్రామ పెద్దలు మంత్రి సోమిరెడ్డిని ఓ సామాన్య వ్యక్తి ఇలా నిలదీయడం మంచి పద్ధతి కాదంటూ ఆదిశేషయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కట్టుబాటు ప్రకారం ఆదిశేషయ్య రూ.3 వేలు చెల్లించాలంటూ కట్టుబాట్ల పేరుతో బుధవారం జరిమానా విధించారు. మంత్రిని ప్రశ్నించినందుకు జరిమానా విధించడమేంటని, గ్రామ కట్టుబాటుకు రాజకీయ రంగు పులమడం సరికాదని గ్రామానికి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గ్రామంలో వర్గపోరుకు దారితీసింది. -
ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఓజిలి మండలం సగుటూరుకు చెందిన పలువురు మహిళలు గూడూరు రూరల్ మండలం చెన్నూరులో తమ బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా కొండాగుంట సమీపంలో చప్టా వద్ద ట్రాక్టర్ నుంచి ట్రక్ లింక్ విడిపోయి బోల్తాపడి పడింది. ఈ సంఘటనలో జీ చెంగమ్మ, మహాలక్ష్మమ్మ, కాంతమ్మ, చెంగమ్మ, అంకమ్మ, మస్తానమ్మతో పాటు మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురి నిందుతులు అరెస్ట్ చిట్టమూరు : వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్య హత్యకు గురైనట్లు పోలీసులు మిస్టరినీ ఛేదించారు. ఈ నెల 6న రాత్రి పాపయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్యకు ఇదే గ్రామానికి చెందిన బెల్లంకొండ చెంచయ్య భార్యతో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలిసిన చెంచయ్య పాపయ్య ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడన్నారు. అదను కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ నెల 6న పాపయ్య తన తాత సంవత్సరీకానికి పక్కనే ఉన్న వేముగుంటపాళెంకు భార్య, పిల్లలతో వెళ్లాడు. వేముగుంటపాళెంలో కార్యక్రమం అయ్యాక భార్య, పిల్లలను అక్కడే వదలి ఒంటరిగా వడ్డికండ్రిగకు చేరుకున్నాడు. మద్యం సేవించి ఇంట్లో ఒంటరిగా పడుకున్న పాపయ్యను గమనించిన చెంచయ్య తన మేనమామ చెంచుకృష్ణయ్య, స్నేహితుడు సముద్రాలుతో కలిసి పాపయ్యను దిండును ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. చెంచయ్య ఇనుప రాడ్డుతో పాపయ్య శరీరంపై కొట్టి చీరతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పాపయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని ఒంటిపై ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించారు. ఈ కేసును వాకాడు సీఐ అక్కేశ్వరావు, చిట్టమూరు ఎస్.గోపాల్, సిబ్బందితో కలిసి పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో నిందితులపై నిఘా ఉంచి గురువారం తాడిమేడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, దొంగిలించిన ఉంగరాన్ని చెంచయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
యువకుడి దారుణ హత్య
గూడూరు : ఇరువర్గాల మధ్య రగులుతున్న పాతకక్షలు ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీశాయి. ఈ సంఘటన గురువారం రెండో పట్టణంలోని రిల యన్స్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. రెండో పట్టణంలోని ఎగువవీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన వెడిచర్ల రమణయ్య సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకడైన చైతన్య (20) పాలిటెక్నిక్ వరకు చదివాడు. కొంత మందితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని జులాయిగా తిరుగుతూ గొడవలకు పాల్పడుతుండేవాడు. ఒకటో పట్టణ ం లోని బనిగీసాహెబ్పేటకు చెందిన శ్రీహరి అలియాస్ జెమిని, రాణీపేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ నారాయణతోపాటు మరి కొందరు జులాయిలుగా తిరుగుతూ గొడవలకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్ది కాలం క్రితం గొడవలు జరిగాయి. హతుడు చైతన్య స్నేహితుడిపై జెమిని దాడిచేసి గాయపరిచాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు, కక్షలు నెలకొన్నాయి. వినాయక చవితి సందర్భంగా జెమిని వర్గం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు చైతన్యతో పాటు మరికొందరు వచ్చి గొడవ పెట్టుకునేలా ప్రవర్తించారు. జెమిని వర్గం కూడా చైతన్య వర్గం ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి వారిని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించారు. ఈ క్రమం లో చైతన్యతో పాటు బయట ప్రాంతాలకు చెందిన మరికొందరు బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు Ðð ళ్లి బనిగీ సాహెబ్పేట, తాళమ్మగుడి ప్రాంతంలో ఉండడాన్ని చూసిన జెమిని, తదితరులు అదను కోసం ఎదురు చూస్తూ వారిని వెంబడించి రెండో పట్టణంలోని రిలయన్స్ పెట్రోలు బంకు సమీపంలో చైతన్య తలపై దుడ్డుకర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రికత్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుబ్బారావు, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
గూడూరు : విద్యార్థులు చదువయ్యాక ఉద్యోగానికే పరిమితం కాకుండా వ్యాపారం చేసి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్టెక్ గ్రూపు సీఈఓ విమాన్ అన్నారు. స్థానిక ఆదిశంకర కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విమాన్ మాట్లాడుతూ ఓ విద్యార్థి వ్యాపారవేత్తగా మారాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సన్నద్ధం కావాలన్నారు. తన అనుభవాలు చెప్పారు. కళాశాల ౖyð రెక్టర్ కష్ణకుమార్, డాక్టర్ విచమ్, మనీష్శర్మ, తిరుపతి వడకన్లు ప్రసంగించారు. ఎస్వీ రమణ, మల్లికార్జున, కొడాలి, ప్రభుకర్ తదితరులు పాల్గొన్నారు. -
మ్యాక్స్కేర్కు తరలిన నిండు గర్భిణి
గూడూరు : ప్రాణసంకటంలో హృదయవేదన పడుతున్న నిండు గర్భిణి వాంకుడోతు భారతిని గూడూరు శివారు అయోధ్యపురం పీహెచ్సీ వైద్యుడు అంబరీష్, ఆరోగ్య మిత్ర అబ్బు మహేందర్రెడ్డి వరంగల్లోని మ్యాక్స్కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ‘హృదయవేదన’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనాన్ని చదివిన మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ వెంటనే వరంగల్ డీఎంహెచ్ఓకు విషయం తెలిపాడు. అతను గూడూరులోని అయోధ్యపురం పీహెచ్సీ వైద్యుడు అంబరీష్, ఆరోగ్యమిత్ర మహేందర్రెడ్డికి సమాచారం ఇచ్చాడు. తర్వాత వారు కేశ్రతండాలోని వాంకుడోతు భారతి ఇంటికి చేరుకొని అమెను పరీక్షించారు. ప్రస్తుతానికి నాడీ వ్యవస్థ బాగానే ఉన్నట్లు, గుండె వైద్యుడు పరిశీలించిన రిపోర్టును పరిశీలించారు. అనంతరం ఆరోగ్యమిత్ర ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ సుమంత్రెడ్డికి తెలిపాడు. అక్కడ ఆన్లైన్లో ఆమె కథనం చదివిన ఆయన వరంగల్లోని మ్యాక్స్కేర్కు తరలించమని చెప్పారు. జిల్లా, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారుల సూచన మేరకు వెంటనే వైద్యుడు అంబరీష్ భారతి భర్త మహేందర్కు చెప్పి తరలించారు. కానీ భారతి నిండు గర్భిణి, పైగా గుండెజబ్బు ఉండడంతో ఆరోగ్యశ్రీలో వర్తిస్తుందా లేదా అన్నది కూడా వైద్యాధికారులు మ్యాక్స్కేర్ పరీక్షల అనంతరం తెలుస్తుందంటూ అనుమానాస్పదంగా బదులిచ్చారు. దీంతో భారతి పరిస్థితి ఆరోగ్యశ్రీ లో తీరుతుందా..లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తుందా అన్నది సందిగ్ధంగా ఉంది. -
'అధికార పార్టీ నేతలది అరాచక పాలన'
నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. మద్యం మాఫియాను కొనసాగించేది కూడా టీడీపీ నేతలే అని సునిల్ కుమార్ తెలిపారు. అధికార పార్టీ నేతల అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారని సునిల్ కుమార్ స్పష్టం చేశారు. -
విద్యార్థిని రవళి ఎందుకు చనిపోయింది..?
-
విద్యార్థిని రవళి ఎందుకు చనిపోయింది..?
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): కడపలో విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మరో విద్యార్థిని బలవన్మరణం చెందింది. స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా ఎయిడెడ్ కళాశాల హాస్టల్లో గురువారం ఓ విద్యార్థిని గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు... రాపూరు మండలం పెనుబర్తికి చెందిన తన్నీరు రవళి(17) డీఆర్డబ్ల్యూ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఆవరణలోనే ఉన్న హాస్టల్లో ఉంటోంది. కాగా గురువారం ఉదయం కళాశాలకు అందరితో కలిసి బయలుదేరిన ఆమె నోటుబుక్ మర్చిపోయానంటూ తోటివారికి చెప్పి తన గదికి వెళ్లి ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుంది. ఈ సంగతి మరో విద్యార్థిని గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు హుటాహుటిన ఆటోలో రవళిని సీఆర్రెడ్డి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. ఇంగ్లిష్ లెక్చరర్ కొట్టడంతోనే రవళి మృతి చెందినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారని.. వెంటనే ఆ లెక్చరర్ను విచారించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. రవళి బలవన్మరణానికి సీనియర్ల ర్యాగింగ్ కారణమని కొందరు చెబుతుండగా, కొంతమంది ఇంటిపై బెంగతోనే అఘాత్యానికి పాల్పడిందంటున్నారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మహేష్, సుజాతలు మాత్రం కుటుంబసభ్యులపై బెంగతో ఆత్మహత్యకు పాల్పడేంత పరిస్థితి లేదని తేల్చిచెబుతున్నారు. తమ కుమార్తె మరణంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కూరగాయల లారీ బోల్తా: డ్రైవర్కు గాయాలు
నెల్లూరు : డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని వెంకటగిరి బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వాహనం బోల్తా పడటంతో లారీలోని కూరగాయలన్నీ రహదారిపై పడిపోయాయి. దాంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు(గూడూరు): నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీలు చేపట్టిన గూడూరు పోలీసులు ఎర్రచందనం అక్రమరవాణాను గుర్తించారు. పట్డుబడిన వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కేసు నమోదు చేశారు. -
ఓఎల్ఎక్స్.... తోసేయండి...
నెల్లూరు : ఏదైనా అమ్ముకోవచ్చు' ఇది ఓఎల్ఎక్స్ అనే ఉచిత ఆన్లైన్ ప్రకటనల వెబ్సైట్ ప్రచార నినాదం. అదే ఓ వ్యక్తి కొంప ముంచింది. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కారు అమ్మకానికి పెట్టిన అతగాడికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన అశోక్ కుమార్... వెబ్సైట్లో తన కారును అమ్మకానికి పెట్టాడు. ఆ ప్రకటన చూసిన ఇద్దరు వ్యక్తులు కారు కొనేందుకు ముందుకు వచ్చారు. టెస్ట్ డ్రైవింగ్ చేద్దామంటూ ఆ ఇద్దరు...కారుతో బయల్దేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులో ఉన్న అశోక్ కుమార్ను వారిద్దరూ బలవంతంగా బయటకు తోసేసి...వాహనంతో పరారయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
వివస్త్రను చేసి.. అత్యాచారయత్నం
గూడూరు: పశువులు మేపే ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గండితండాలో ఆది వారం జరిగింది. బాధితురాలి తల్లి కథనం ప్రకా రం.. తండాకు చెందిన దంపతులకు పదమూడేళ్ల కుమార్తె ఉంది. నిరక్ష్యరాస్యురాలైన ఆమె పశువుల కాపరిగా పనిచేస్తోంది. ఉదయం పశువులను అడవిలోకి మేత కోసం తెలిసిన కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది. ఈ క్రమంలో వరుసకు సోదరులైన తండాకు చెందిన ఇద్దరు యువకులు అడవిలో కాపు కాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురిచేశారు. లైంగికదాడికి యత్నించిన ఆ యువకులు బాలికను వివస్త్రను చేసి బెదిరించారు. చివరకు వారి బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక కేక లు వేస్తూ తండాకు పరుగెత్తుకొచ్చింది. గమనిం చిన మహిళలు వారి చీరను కప్పి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులతో కలసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఏ ఒక్క ప్రాజెక్టు అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా?
-
కోట్లా.. ఇదెట్ల?
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి చెప్పులు తొడుగుతున్న వ్యవహారం చర్చనీయాంశమైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి ‘కోట్ల’ పాదాలకు తొడిగారు. అయినా మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు అడ్డు చెప్పకుండా చూస్తుండిపోయారు. - న్యూస్లైన్, గూడూరు -
‘అంగన్వాడీ’ల అందోళన
‘అంగన్వాడీ’ల అందోళన ూడూరు టౌన్ ‘అంగన్వాడీ’లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎన్ స్వరూపారాణి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం గూడూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్లు ముట్టడించి ఆందోళనకు దిగారు. అనంతరం ర్యాలీగా వెళ్లి టవర్క్లాక్ కూడలిలో మానవహారంగా నిలిచారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పని గంటలను పెంచి వేతనాలను మాత్రం పెంచకుండా వారి శ్రమను కొల్లగొడుతుందన్నారు. కార్యకర్తల విధులతో పాటు అదనంగా బీఎల్ఓ డ్యూటీలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఐసీడీఎస్ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వెంటనే మానుకోవాలన్నారు. అలాగే అమృతహస్తం, బాలబడులు, పెంచిన సెంటర్ అద్దెలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి సెంటర్కు గ్యాస్ సిలిండర్, నాసిరకం కొడిగుడ్లు కాకుండా మేలురకం గుడ్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, రమణయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాళ్లు హెప్సిబా, జ్యోతి, నాగమణి, సుశీల పాల్గొన్నారు. -
గూడూరులో YSRCPలోకి చేరిన ఇతర పార్టీ నేతలు
-
ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వరంగల్: ఇద్దరు పిల్లలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గూడూరులో బానోత్ లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ తన ఇద్దరు ఆడపిల్లలకు విషం ఇచ్చాడు. తాను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడితో లక్ష్మణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.