ఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట లభించింది. రాజీవ్ గృహకల్ప సభ్యత్వం ఉన్న వారికి 4 వారాల్లోపు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకొని వారి ఇల్లు వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గతంలో సొసైటీలో సభ్యులుగా చేరి, డబ్బులు చెల్లించినా ఇల్లు మంజూరు కాని సభ్యులు న్యాయం కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.