ఆర్టీసీ బస్సు ఢీకొని జీపు బోల్తా | Road accident in Atluru | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని జీపు బోల్తా

Published Tue, Sep 8 2015 5:38 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Road accident in Atluru

అట్లూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న జీపు పక్కనున్న గోతిలోకి బోల్తాపడింది. కడప నుంచి బద్వేలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా అరటికాయల లోడుతో వస్తున్న జీపును వేగంగా ఢీకొంది. దాంతో జీపు పైకి ఎగిరి పక్కనున్న గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement