Morning Star Bus Accident At Nellore | Nellore Crime News Updates- Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sat, Jun 2 2018 11:59 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road Accident in Nellore  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ముసునూరు జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్తున్నన్న సమయంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతిచెందగా, పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement