psr nellore
-
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్): సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్కో మూడో యూనిట్ను జాతికి అంకితం చేసి.. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు
దుత్తలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)/ పామూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళన చెంది ఇళ్లలోంచి పరుగులు తీశారు. కాగా, కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాళెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాళెం ప్రాంతాల్లో శనివారం రాత్రి 9.11 గంటల సమయంలో నాలుగు సెకన్లపాటు పెద్ద శబ్ధంతో భూమి స్వల్పంగా కంపించింది. పామూరులో.. ప్రకాశం జిల్లా పామూరు తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం సుమారు 5.20 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు రెండు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆకులవీధి, కాపువీధి, ఎన్జీవో కాలనీతోపాటు మండలంలోని ఇనిమెర్ల, నుచ్చుపొద, వగ్గంపల్లె, రావిగుంటపల్లె సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదిలాయి. ఆకులవీధి, కాపువీధిలోని ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి వచ్చారు. -
టీడీపీ పాలనలో నిర్లక్ష్యం.. కావలివాసులకు విషమైన ‘అమృత్’
కావలి పట్టణ ప్రజలకు తాగునీటిని పుష్కలంగా అందించేందుకు ఉద్దేశించిన ‘అమృత్’ పథకం ఆలస్యం.. శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సిన పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పనులకు తీవ్ర జాప్యం ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కారణంగా పనులు చేపట్టలేకపోయామని, మరి కొంత సమయం కావాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతిపాదన మేరకు మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. ఈలోగా సంస్థ వేరే చోట కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడంతో.. గడువు తీసుకున్నా.. తిరిగి పనులు ప్రారంభించడంలో సంస్థ మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కావలి: ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపాలిటీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ‘అమృత్ పథకం’ ప్రజలకు విషంగా మారితే.. మున్సిపాలిటీకి పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. నాలుగేళ్లుగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడానికి అవసరమైన నిర్మాణాలు, మురికినీటిని శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రణాళిక. రూ.86.92 కోట్ల పథకం అంచనాలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.16.92 కోట్లు, కావలి మున్సిపాలిటీ రూ.38 కోట్ల వాటాగా ఉంది. 2018 ఏప్రిల్లో ఈ పథకం పనులు ప్రారంభమయ్యాయి. 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాల్సి ఉంది. అయితే కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా.. ఆ నాటి ప్రభుత్వం, మున్సిపాలిటీ తమ వాటాలను చెల్లించకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసింది. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూపించి నిధులు మంజూరు చేసి, గడువు ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ కోరింది. ఈ మేరకు 2020 ఆగస్టు వరకు గడువు పొడిగించింది. అయితే ఈ గడువు తీరి మరో రెండేళ్లు గడిచినా పనుల పురోగతి లేకుండాపోయింది. మున్సిపాలిటీపై వడ్డీ భారం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడమే కాకుండా, కావలి మున్సిపాలిటీ వాటా రూ. 38 కోట్లు కూడా జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే మున్సిపాలిటీ వాటాలో రూ. 23 కోట్లు ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ నుంచి రుణంగా తీసుకొని అమృత్ పథకానికి జమ చేసింది. బ్యాంక్ రుణం కు వడ్డీ కింద మున్సిపాలిటీ ప్రతి నెలా రూ. 15 లక్షలు చెల్లిస్తూనే ఉంది. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక గుదిబండగా మారింది. అదే పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే.. కుళాయిలకు డిపాజిట్లు, నీటి పనులు వసూలు చేసే అవకాశం ఉండేది. పనులే జరగకపోవడంతో ఏ విధంగా నిధులు సమకూరే అవకాశం లేక బ్యాంక్కు అప్పు చెల్లించలేక.. వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతోంది. ఏమైందంటే.. ఈ పథకానికి సంబంధించి నిర్మాణ పనులు 2018లో ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు, పాలకులు హడావుడి మొదలు పెట్టింది. అమృత్ పథకం అమల్లో భాగంగా వీధుల్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన కుళాయిలన్నింటినీ తొలగించేశారు. దీంతో స్థానికులు, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీకి నిర్దిష్టమైన డిపాజిట్ చెల్లించి, ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందే అని మున్సిపాలిటీ అధికారులు తేల్చి చెప్పారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా తాగునీటి వసతి మెరుగు పడాలంటే కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందేనని మున్సిపాలిటీ అధికారుల మాటలనే సమర్థించారు. దీంతో స్థానికులు నిస్సహాయులై మౌనంగా ఉండిపోయారు. మున్సిపాలిటీ తన వాటా కింద చెల్లించాల్సిన రూ.38 కోట్లు కూడా జమ చేయకుండా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.16.92 కోట్లు కూడా ఈ పథకానికి చెల్లించలేదు. దీంతో పనుల్లో జాప్యమైంది. నత్తనడకన పనులు అమృత్ పథకంలో రూ.57.92 కోట్లు తాగునీరు సరఫరాకు సంబంధించి పనులు, రూ.29 కోట్లు మురికి నీటి శుద్ధి కేంద్రం పనులు చేయాలి. తాగునీటి పనుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద రోజుకు 14 లక్షల మిలియన్ లీటర్లు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ 77.85 కిలో మీటర్లు పైప్లైన్లు, మద్దూరుపాడు, బుడమగుంట, ఐడీఎస్ఎంటీ ప్లాట్స్లో ఒక్కో ఓవర్ హెడ్ ట్యాంక్, ముసునూరులో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్లు నిర్మాణం పూర్తయ్యాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి 70 శాతం, మురికి నీటిని శుద్ధి చేసే కేంద్ర పనులు 75 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ పనులు వేగవంతమయ్యేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మూడు నెలల్లో పూర్తయ్యేలా చేస్తాం నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఈ పథకం పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, రానున్న మూడు నెలల్లో అమృత్ పథకం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజలకు తాగునీటిని సత్వరమే అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. – విజయలక్ష్మి, డీఈ, పబ్లిక్హెల్త్ డిపార్ట్మెంట్, కావలి ఇది కూడా చదవండి: పోర్టులను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు -
పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్వాసితులు సైతం ఉద్యోగాల కల్పన, ప్రాంతం బాగుపడుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు అనేది మా కలగా ఉండేది. ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ, మీ ప్రభుత్వంలో అది నిజం కావడం సంతోషంగా ఉందన్నా. 70 శాతం ఉద్యోగాల కల్పన హామీపై సంతోషం అన్నా. ఎకరం భూమిని ఇచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సంతోషంగా ఉన్నాం. మత్స్యకార భరోసా, వడ్డీలేని రుణాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. సంక్షేమ పథకాలు అందిస్తున్న మీరే పది కాలాల పాటు సీఎంగా ఉండాలన్నా.. -సీఎం జగన్ను ఉద్దేశించి నిర్వాసితురాలు సుజాత, మొండివారిపాలెం గ్రామం పోర్టు రావడం సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పండుగ జరుగుతోంది. రామాయపట్నం పోర్టు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. మా కల. మా కలను నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. మత్స్యకారులకు నేరుగా అకౌంట్లోకి సంక్షేమ నిధులు వేస్తున్నారు. డీజిల్ విషయంలోనూ సానుకూలంగా స్పందించారు అని ఆవాల జయరాం అనే నిర్వాసితుడు పేర్కొన్నాడు. -
40వేల మందికి ఉపాధికల్పనే లక్ష్యంగా నిర్మాణం
-
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోర్టు ఏరియాలో భారీ బందోబస్తు
-
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు
సాక్షి,తోటపల్లిగూడూరు: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు అన్నారు. మండలంలోని నరుకూరు, పేడూరు, పాపిరెడ్డిపాళెం, ఇస్కపా ళెం, మల్లికార్జునపురం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోని దాదాపు 58,075 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో ఇళ్లు 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసేందుకు రానున్న 15 రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు రాబోయే రెండు నెలల్లో 90 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన లబ్ధిదారులకు కావాల్సిన అన్ని రకాల రా మెటీరియల్స్ను లేఅవుట్లలోనే అందుబాటులో ఉంచేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ఆగస్ట్ నాటికి 30 వేల ఇళ్ల నిర్మాణాలను రూఫ్ లెవల్కు పూర్తి చేయాలనే లక్ష్యాని పెట్టుకున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల విషయంలో పెద్ద లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేక గౌడన్లను ఏర్పాటు చేసి స్టీల్, సిమెంట్, ఇసుకను డంపింగ్ చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి కింద హౌసింగ్ లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామలమ్మ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, గృహ నిర్మాణశాఖ నెల్లూరు డివిజన్ ఈఈ దయాకర్, మండల ఏఈ ముక్తార్బాషా, వర్క్ ఇన్స్పెక్టర్ సుమన్, వెలుగు సీసీ సైదా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్కుమార్కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ నుంచి భరత్కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్కుమార్ నాన్లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
కవల పిల్లలను కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేసిన తండ్రి
-
నెల్లూరులో దారుణం.. కన్న బిడ్డలపై క్షుద్ర పూజల కలకలం!
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో పిల్లలకు చంపేందుకు కన్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. కాగా, తండ్రి వేణు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. అనంతరం, చిన్న పాప నోట్లో కుంకుమ పోసి తండ్రి వేణు.. పాప గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు పాపను రక్షించారు. కాగా, పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పారిపోయిన వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, వేణు.. శాంతి పూజల కోసమా లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. కన్న బిడ్డలనే ఇలా వేణు చంపాలని చూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు! -
యువతీ యువకుడి అత్మహత్య.. ఒకరు చదువు కోసం, మరొకరు ఉద్యోగం కోసం..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): యువతీ, యువకుడు రైలు కిందపడి తనువు చాలించిన సంఘటన నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో రైలు పట్టాలపై శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే, స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి(21) ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 10వ తేదీన కళాశాలకు వెళ్లేందుకు ఆమెను తండ్రి అయ్యప్పగుడి సెంటర్లో వదలివెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. రాత్రయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి శనివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా డైకస్రోడ్డుకు చెందిన జి.నితిన్(27) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అతను ఈనెల 10వ తేదీన ఇంటర్వ్యూ నిమిత్తం సూళ్లూరుపేటకు వెళ్తున్నట్లు ఇంటి నుంచి వచ్చాడు. రాత్రయినా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు సైతం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 10.30 ప్రాంతంలో కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలు పట్టాలపై యువతీ, యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్సై ఎన్.హరిచందన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభ్యమైన వివరాలు, బైక్ ఆధారంగా మృతులు భాగ్యలక్ష్మి, నితిన్గా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం
-
నిప్పు కణిక.. నెల్లూరు పొణకా కనకమ్మ గురించి ఈ విషయాలు తెలుసా?
పొణకా కనకమ్మ సుప్రసిద్ద సామాజిక కార్యకర్త. నెల్లూరు పట్టణంలోని కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రం కనకమ్మ స్థాపించినదే. కనకమ్మ 1892 జూన్ 10 న జన్మించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళల్లో కనకమ్మ ఒకరు. తనే కాదు, తన కుటుంబం మొత్తాన్నీ ఆమె సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా ప్రేరణ కలిగించారు. ఖద్దరు ధరించమని ప్రచారం చేశారు. రాజకీయరంగంలో కనకమ్మకు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. సాహిత్య రంగంలో కూడా ఎంతో కృషి చేశారు. 1930 సత్యాగ్రహ ఉద్యమకాలంలో జైలుకు వెళ్లారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. 1963 సెప్టెంబర్ 15న మరణించారు. కనకమ్మ రాసిన ఒక పద్యంలో పంక్తులు ఈ విధంగా సాగుతాయి : ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి / తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి / జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి. దీనిని బట్టి పొణకా కనకమ్మలో స్త్రీవాద కోణం కూడా గోచరిస్తుంది. -
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
నయా ట్రెండ్.. తందూరీ ఛాయ్.. భలే టేస్టీ గురూ
టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు. నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే.. ఏంటిదీ.. తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది. ఎలా చేస్తారంటే.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్కు తందూరీ రుచి.. వాసన వస్తుంది. రుచి.. అదుర్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్ను ప్రారంభిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): వివాహిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ (28) సుమారు 11 ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీ మాస్టర్గా పనిచేస్తున్న వేణును ప్రేమ వివాహం చేసుకున్నారు. నవాబుపేట రామచంద్రాపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి సంజన, జయశ్రీ కుమార్తెలు. పొదలకూరురోడ్డులోని ఓ పెట్రోల్ బంక్లో సేల్స్గర్ల్గా ఆమె పనిచేస్తున్నారు. మనస్పర్థల నేపథ్యంతో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ నగర్కు చెందిన ఆటోడ్రైవర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. ఆటోడ్రైవర్ ఆమె ఇంటికి శుక్రవారం రాత్రి వచ్చివెళ్లారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ సంపూర్ణ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు అమ్మమ్మ జయమ్మకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని కుమార్తెను నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉంది. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు నవాబుపేట ఎస్సై వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా -
అయోమయంలో రైతులు.. దిగజారుతున్న నిమ్మధరలు
సాక్షి,పొదలకూరు(నెల్లూరు): నిమ్మధరలు రోజురోజుకూ దిగుజారుతున్నాయి. నిమ్మతోటల్లో కాయల దిగుబడి పెరుగుతున్నా ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిమ్మకాయలు అధికంగా యార్డుకు వస్తున్నాయని, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది రైతులు ఆశించిన స్థాయి కన్నా ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం నిమ్మమార్కెట్ యార్డులో లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. పొదలకూరు మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి నిమ్మధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ఊహించని రీతిలో ధరలు బస్తా రూ.16 వేల వరకు పలికి రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ధరలు పెరిగినా దిగుబడి లేదు ఈ ఏడాది నిమ్మ ధరలు రూ.16 వేలకు పైబడి లూజు(బస్తా) పలికి నెల రోజులపాటు ధరలు నిలకడగా ఉండడం వల్ల వ్యాపారులు, కొందరు రైతులు ఆశించిన స్థాయిలో లబ్ధిపొందారు. అయితే ఎక్కువ మంది రైతుల తోటల్లో సీజన్లో కాయల దిగుబడి లేక పోవడం వల్ల ఆదాయం పొందలేకపోయారు. తమ పక్కతోట రైతుకు కాయలు విరగ్గాస్తే తన తోటలో కాయలు లేని విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు. ఇపుడు చాలామంది రైతుల తోటల్లో కాయల దిగుబడి పెరిగినా ధరలు రోజురోజుకూ దిగజారుతుండడంతో అయోమయంలో ఉన్నారు. తోటల నుంచి కాయలు యార్డుకు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందంటున్నారు. చదవండి: ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది -
ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది
సాక్షి,ఆత్మకూరు(నెల్లూరు): జిల్లాలోని సీతారామపురం నుంచి రాపూరు వరకు విస్తరించిన నల్లమల, వెలగొండ, పెంచలనరసింహ అభయారణ్యాలు ఉన్నాయి. 28 శాతానికిపైగా అడవులు, దక్షిణ, పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా సరిహద్దులుగా పెంచల నరసింహ అభయారణ్యం విస్తరించి ఉంది. మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల ప్రాంతాలు ఈ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. ఈ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రాణులు వేటగాళ్లకు బలవుతుంటే.. మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అరుదైన వన్యప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడనుంది. జిల్లాలో ఈ అటవీ ప్రాంతాల మధ్య ఉండే నెల్లూరు– ముంబయి, నకిరేకల్– ఏర్పేడు జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆయా రోడ్లపై రాత్రి పూట కూడా వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు దారి తప్పి.. మరికొన్ని దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఏఎస్పేట తదితర మండలాల పరిధిలో జింకలు, దుప్పిలు రోడ్డుపైకి వచ్చి వాహనాల ప్రమాదంలో గాయపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల రెండు జింకలు తీవ్రంగా గాయపడడంతో ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంరక్షించేందుకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది గుర్తుతెలియని వాహనం ఢీకొని బూదవాడ వద్ద మృతి చెందిన చిరుత (ఫైల్) కొరవడిన భద్రత ఆత్మకూరులోని ఇంజినీరింగ్ కళాశాల, చేజర్ల మండలం చిత్తలూరు వద్ద ఏడాది వ్యవధిలో రెండు చిరుతలతో పాటు ఓ అడవి పంది, జింక, దుప్పులు కలిపి 9 మృతి చెందాయి. గతేడాది ప్రారంభంలో బూదవాడ సమీపంలో కృష్ణాపురం మార్గంలో ఓ చిరుత పులి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. అది జరిగిన మరో రెండు నెలలకే ఓ చిరుతపులి పులి పిల్ల వాహనం ఢీకొనడంతో మత్యువాత పడింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జింక దాహార్తి తీర్చుకొనేందుకు ఓ ఇంట్లోకి రావడంతో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నందవరం, చుంచులూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ గుర్తుతెలియని వాహనాలు ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమశిల జలాశయం వద్దకు నీరు తాగేందుకు వచ్చి ఓ జింక నీటిలో పడి మృతి చెందింది. ఇలా పలు వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ చర్యలు చేపడితే... జాతీయ రహదారులు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సరైన చర్యలు చేపడితే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అడవి నుంచి రహదారిపైకి వచ్చే మార్గాలను గుర్తించి వాటిని వెంటనే రహదారిపైకి రాకుండా ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేదా కంప వేసి వాటిని అడవులకే పరిమితం చేయొచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగునీరు లభ్యమయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతం నుంచి రహదారులపైకి వచ్చే చిన్నపాటి దారులను మూసివేసేలా మొక్కలు పెంచాలి. దీనికి తోడు వేటగాళ్ల బారిన పడకుండా అటవీశాఖ వాచర్లు తరచూ ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే అనుమానాస్పద వ్యక్తులను వారు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి తొలగించేలా చూడాలి. తద్వారా వన్యప్రాణాలను కాపాడుకోవచ్చు. సిబ్బందికి గట్టి సూచనలు ఇటీవల కొన్ని వన్యప్రాణులు గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన విషయం వాస్తవమే. ఒకటి, రెండు జింకలను గాయపడిన సమయంలో గుర్తించి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాం. అయితే కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చి అటవీ ప్రాంతంలో పలు చోట్ల తాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలు కురవడం కొంత మేలైంది. దీంతో వన్యప్రాణులు రహదారులపై రావడం తగ్గుతుంది. – హరిబాబు, రేంజర్, ఆత్మకూరు అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు దారి తప్పో.. దాహార్తి తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. రాత్రి పూట రహదారులపైకి రావడంతో వాహనాలు ఢీకొని మృత్యువు పాలవుతున్నాయి. జిల్లా అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే చిరుతలు సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాయి. దుప్పిలు, జింకలు, అడవి పందులు అయితే లెక్కలేనన్ని మృత్యువాత పడుతున్నాయి. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
నెల్లూరు కావ్య కేసు: సురేష్ది వన్సైడ్ లవ్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కావ్య-సురేష్ రెడ్డి మృతి కేసులో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. సురేష్ది వన్ సైడ్ లవ్ అని, పెళ్లి ప్రతిపాదనను కావ్య ఒప్పుకోని కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు నెల్లూరు ఎస్పీ విజయరావు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే కావ్యను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత అంతా భావించారు. అయితే.. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారాయన నెల్లూరు ఎస్పీ విజయరావు. సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని, అయితే తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందని ఎస్పీ తెలిపారు. అంతేకాదు.. ఘటన జరిగిన సమయంలో కావ్య సోదరి ప్రత్యక్ష సాక్షిగా ఉందని వెల్లడించారు. సురేష్ కావ్యపై కాల్పులు జరిపినప్పుడు.. మొదటి బుల్లెట్ నుంచి ఆమె తప్పించుకుంది. అయితే రెండో బుల్లెట్ తలలోంచి దూసుకెళ్లి ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దాడి సమయంలో.. అడ్డుకునే ప్రయత్నం చేసిన కావ్య చెల్లెల్ని సురేష్ పక్కకి తోసేశాడని ఎస్పీ తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. వన్సైడ్ లవ్! కావ్య విషయంలో సురేష్ది వన్సైడ్ లవ్ అని నెల్లూరు ఎస్పీ విజయరావు మీడియాకు వివరించారు. కావ్య కుటుంబం వద్ద గత నెలలో సురేష్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. కానీ, సురేష్ ప్రపోజల్ను అమ్మాయి కుటుంబం తిరస్కరించింది. ఆ కోపంలోనే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారాయన. వయసు తేడా! ఇదిలా ఉంటే.. ఘటనపై కావ్య దగ్గరి బంధువు ఒకరు స్పందించారు. సురేష్ వయసు 35 సంవత్సరాలు. కావ్య వయసు 22 ఏళ్లు కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని తెలిపారు. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే.. అతను వయసు ఎక్కువ కావడం, పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతని పెళ్లి ప్రపోజల్ను తిరస్కరించినట్లు ఆ బంధువు వెల్లడించారు. -
నెల్లూరు: యువతిని కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: ఒకే ఊరి వాళ్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఈ క్రమంలోనే ఆ యువతితో పరిచయం పెరిగింది. అది ప్రేమగా తీసుకున్నాడు యువకుడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ యువకుడ్ని పెళ్లి చేసుకోవాలని యువతి అనుకోలేదు. దీనిపై ఇద్దరి మధ్య తరచు వాగ్వాదం జరుగుతూనే ఉంది. మరోసారి సోమవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడు మళ్లీ గొడవ పడ్డాడు. ఆ యువతిని రివాల్వర్తో కాల్చి చంపి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతిని తుపాకీతో కాల్చిన.. ఆపై తాను కాల్చుకుని అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని సురేష్గా గుర్తించారు. బాధితురాలిని కావ్యగా గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతులిద్దరూ తాటిపర్తి వాసులే కాగా.. చెన్నైలో ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఇది వన్సైడ్ లవ్ కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయి కాల్పుల ఘాతకానికి ఒడిగట్టాడు. -
నాడు అవినీతి, నేడు పారదర్శక పాలన
కొడవలూరు : గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు, స్థలం, పింఛన్ ఇలా ఏ పథకం పొందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. కొడవలూరు ఇరిగేషన్ అతిథిగృహంలో కొడవలూరు, మానేగుంటపాడు గ్రామ వలంటీర్లతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు గ్రామ, మండలస్థాయి అధికారులను లెక్క చేసే వారు కాదని, అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నా చేయలేని పరిస్థతి ఉండేదని చెప్పారు. నేడు సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కొడవలూరులో రెండు చోట్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మానేగుంటపాడులో సైడ్ డ్రెయిన్కు రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కోవూరు నియోజకవర్గానికి గడిచిన రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.450 కోట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఓటీఎస్ లబి్ధదారులకు రిజి్రస్టేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వెంకటశేషయ్య, సర్పంచ్లు పాలిచర్ల శ్రీనివాసులురెడ్డి, కామాక్షి, ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన తానా పూర్వ అధ్యక్షుడు
సాక్షి, నెల్లూరు: ‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’ తెలుగు భాషా అభివృద్ధికి గొప్ప కృషి చేస్తుండడం ప్రసంశనీయమని తానా పూర్వ అధ్యక్షులైన డా.తోటకూర ప్రసాద్ అన్నారు. బుధవారం నాడు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల వివరాల్ని ఆయన పరిశీలించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య డి. మునిరత్నం నాయుడు కేంద్రంలో పూర్వం జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే ప్రాజెక్టుల వివరాల్ని వాటి ఉద్దేశ్యాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత డా. తోటకూర ప్రసాద్ అక్కడి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ...తానా అనే సంస్థ తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న కృషిని కూలంకషంగా వివరించారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను చదువుతున్న విద్యార్థులకు, పరిశోధకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంతో కలిసి పనిచేస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా మాతృభాషా ఔన్నత్యాన్ని దశదిశల వ్యాపింపజేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషిని చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, విద్యాత్మక సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ దిగజారుడు రాజకీయాలు సరికాదు.. ఆనం అరుణమ్మ ఫైర్
నెల్లూరు(పొగతోట): మహిళలపై జరిగిన ఘటనల విషయంలో ప్రతిపక్ష నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడారు. మహిళలపై జరిగే ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేపట్ట లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇటువంటి ఘటనలపై శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చదవండి👉🏼 టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం దారుణం జరిగితే మహిళలకు అండగా నిలువాలే తప్ప ఆమెను మానసికంగా చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు గర్హనీయమన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన దారుణంపై పోలీసులు 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారన్నారు. 9 నెలలోపు నిందితులకు శిక్ష పడేలా చేసిందన్నారు. పోలీసు శాఖను మహిళలుగా అభినందిస్తున్నామన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహ¯రెడ్డి మహిళల సంరక్షణకు దిశ యాప్ను ప్రారంభించి ఆపదలో ఉన్న మహిళలు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసు శాక వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. 100, 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. పెళ్లకూరు ఆత్మకూరు జెడ్పీటీసీలు ప్రిస్కిల్లా ప్రసన్నలక్ష్మి పలువురు పాల్గొన్నారు. చదవండి👉🏾 పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. -
నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మీడియా అద్దం లాంటిదని, అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడు తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హో దాలో నెల్లూరు ఎఫ్ఎంకు శంకుస్థాపన చేశామని, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకో వడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సంచలనాలకోసం కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలన్నారు. చానళ్లలోని చర్చల్లో సభ్యత, సంస్కారంతో గౌరవప్రదమైన పదాలు వాడాలన్నారు. ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని వారికి అనువుగా ఉండేలా సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు పత్రికలు, మీడియా మాధ్యమాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎన్. వేణుధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊరికో సేవాలయం ఉండాలి ప్రతి ఊరిలో ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దేవాలయం లాగా ఒక సేవాలయం కూడా ఉం డాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను ఆయన ప్రారంభించారు. దేవిరెడ్డి శారదమ్మ విగ్రహం వద నివాళులర్పించారు. -
అనిల్తో విభేదాలు లేవు: మంత్రి కాకాణి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. సీఎంను కలవడంలో పెద్ద విశేషం లేదన్న కాకాణి.. అభివృద్ధి, సంక్షేమం, జిల్లా పనులకు సంబంధించే విషయాలపైనే చర్చించడం జరిగిందని చెప్పారు. కొత్త జిల్లాల ఇంఛార్జిల నియామకం నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందన్నారు. ‘మా జిల్లా అభివృద్ధి విషయాలపై సీఎంతో చర్చించాం. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ చెప్పారు. మా మధ్య విభేదాలు ఉంటే కదా చర్చించడానికి!.. అనిల్తో విభేదాలన్నది మీడియా సృష్టే...పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ అనిల్, నేను కలిసే పనిచేశాం. అనిల్ నాకు సోదరుడి లాంటి వాడు. కావాలనే మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి. -
భానుడి భగభగ.. అనూహ్యంగా పెరిగిన ధర.. కేజీ 160.. చరిత్రలో తొలిసారి!
ఈ ఏడాది నిమ్మ రైతుల పంట పండింది. అనూహ్యంగా ధరలు పెరుగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో కేజీ రూ.140 నుంచి రూ.160 వరకు పలికింది. ధరలు బాగుండడంతో అప్పుల ఊబి నుంచి బయట పడుతున్నామంటూ అన్నదాతలు సంతోషంగా చెబుతున్నారు. సాక్షి,గూడూరు/సైదాపురం: నిమ్మ ధరలు పసిడి ధరలను తలపిస్తున్నాయి. చరిత్రలో ఇప్పటివరకూ రాని ధరలు ఆదివారం పలికాయి. లూజు బస్తా కనిష్టంగా రూ.11 వేల నుంచి గరిష్టంగా రూ.13 వేల వరకూ చేరింది. కిలో రూ.140 నుంచి రూ.160 వరకూ ధర పలికింది. అదేవిధంగా పండ్లకు రూ.110 నుంచి రూ.130 వరకూ రావడంతో రైతుల ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వారంరోజుల నుంచి నిమ్మ మార్కెట్లో ఆశించిన మేర ధరలు వస్తుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆపిల్ ధర కన్నా నిమ్మ ధరలే అధికంగా ఉన్నాయంటూ సంతోషంగా చెబుతున్నారు. కాపు లేకపోవడంతోనే.. ఒక్క రోజులో ఢిల్లీ మార్కెట్కు కాయలు తీసుకొచ్చే దూరంలో ఉన్న భావానగర్లో, మహారాష్ట్రలోని బీజాపూర్లో, మన రాష్ట్రంలోని రాష్ట్రంలోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కాపు లేకపోవడంతోనే ఈ ధరలు నమోదువుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అలాగే మన ప్రాంతంలో తీవ్ర వర్షాల కారణంగా ఆలస్యంగా పూత ఆలస్యమైంది. ఇలా అనేక అంశాలు కలిసి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మూడేళ్లగా ఈ సీజన్లో నిమ్మకాయలకు విపరీతమైన ధరలు వస్తుండడంతో రైతులు నష్టాల ఊబి నుంచి బయటపడున్నారు. మంచి డిమాండ్ గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్లకు ఢిల్లీ మార్కెట్ గుండెలాంటిదని చెబుతుంటారు. అక్కడ ధరలు బాగా పలుకుతుంటేనే ఇక్కడి నిమ్మ మార్కెట్ కళకళలాడుతుంది. అటు నార్త్ ఢిల్లీ, సౌత్ చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి రెండు రోజులుగా కాయలు కావాలంటూ స్థానిక మార్కెట్లలోని వ్యాపారులను అడుగుతున్నారు. ఎప్పుడూ చూడలేదు నిమ్మకాయల ధరలు ఇప్పటి వరకూ ఈ స్థాయిలో పలికింది లేదు. నాకు తెలిసే కాకుండా, మా పెద్దల కాలంలో కూడా ఇలా ధరలు రాలేదు. 2009లో లూజు బస్తా గరిష్టంగా రూ.9 వేలు పలికితే అబ్బో అన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొన్నాళ్లు నిలబడితే చాలు. – జగన్నాథం, రైతు, వెంకటేశుపల్లి ఆనందంగా ఉన్నాం నిమ్మ ధరలు ఇప్పటి వరకూ ఇంత పలికిందే లేదు. జగనన్న పాలనలో రైతులే రాజులుగా మారారు. అందుకు నిదర్శనమే నిమ్మకాయల ధరలు ఈ స్థాయికి చేరడం. కాయలుంటే ధరల్లేక, ధరలుంటే కాయల్లేక ఇబ్బందులు పడే నిమ్మరైతుల కష్టాలు తేరినట్లే.. చాలా ఆనందంగా ఉన్నాం. – వజ్జా అనిల్రెడ్డి, రైతు, వెందోడు -
క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
సాక్షి,డక్కిలి(నెల్లూరు): రాపూరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావు (36) ఆదివారం డక్కిలిలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నాగేశ్వరరావు తన స్నేహితులతో కలిసి డక్కిలి ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్నేహితులు గుర్తించి అతడిని వెంటనే డక్కిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మండలంలోని మిట్టవడ్డిపల్లిలో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి చేరుకుని భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుల్కు భార్య, ఐదేళ్లు, రెండేళ్ల వయస్సున్న కుమార్తెలున్నారు. డక్కిలి ఎస్సై నరసింహారావు విచారణ చేసి కేసు నమోదు చేశారు. చదవండి: Pub Drugs Case: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. -
గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
CM Nellore Tour Updates: సీఎం జగన్ కీలక నిర్ణయం.. బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు
Updates: ► గౌతమ్ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం. -సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ►ముందు నుండి వైఎస్ఆర్ కుటుంబం తమకు అండగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని ఈ సందర్భంగా తెలిపారు. తమ కుటుంబపై చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. -మేకపాటి రాజమోహన్ రెడ్డి ► రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు పోలేదు. అందరు నేతలతో కలిసి మెలిసి ఉండేవారు. - మంత్రి అనిల్ ► గౌతం రెడ్డి మరణం పార్టీకి, నెల్లూరుకు తీరని లోటు. - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపై అభిమానంతో ఆయన చిత్ర పటాలతో ఇంతియాజ్ అనే దివ్యాంగుడు.. భగవద్గీతను తయారు చేశాడు. సంస్మరణ సభలో గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్ది చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డికి ఆ భగవద్గీతను అందించారు. ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్మెహన్ రెడ్డి ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి సీఎం నివాళులు అర్పించారు. గౌతమ్రెడ్డి సంస్మరణ సభకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్మెహన్ రెడ్డి. ► నెల్లూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ► రేణిగుంట నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ► గన్నవరం నుండి సీఎం జగన్మెహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ► సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి.. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు రానున్నారు. దీంతో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆదివారం నగరంలోని ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు విధుల్లో పాల్గొననున్న సిబ్బందితో ఎస్పీ సీహెచ్ విజయారావు సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. సీఎం పర్యటన ఆధ్యంతం అప్రమత్తంగా ఉండాలన్నారు. హెలిప్యాడ్, కన్వెన్షన్ సెంటర్ వద్ద ముందస్తు అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే ముఖ్యమంత్రి వద్దకు అనుమతించాలన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనీఖలు చేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. సిబ్బంది అందరూ విధిగా యూనిఫాం, ఐడీలు ధరించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, విధులకు గైర్హాజరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.40 రోడ్డు మార్గాన బయలుదేరి 11.50కు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. 11.50 నుంచి 12.40 వరకు మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. అనంతరం హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రేణిగుంటకు బయలుదేరి వెళుతారు. 1.20 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. సీఎం వెళ్లే మార్గంలో రాకపోకలను నిషేధించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. నగరంలో ట్రయల్ కాన్వాయ్ నెల్లూరు నగరంలో ఆదివారం ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ప్రారంభమైన ట్రయల్ కాన్వాయ్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని అక్కడ నుంచి తిరిగి పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుంది. ట్రయల్ కాన్వాయ్ను ఎస్పీ విజయారావు పర్యవేక్షించారు. హెలికాప్టర్ సైతం ట్రయల్రన్ నిర్వహించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మార్చి 28న నెల్లూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం (మార్చి 28) ఉదయం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకొని జిల్లా నాయకులతో మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకొని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు. -
ఓ పావురమా.. పందెం గెలువుమా
పావురం.. స్వేచ్ఛకు ప్రతిరూపం. శాంతికి చిహ్నం. రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరే ఆ కపోతాలను చూసి మది పులకిస్తుంది. అనేకమంది ఏ గింజలో వేసి వాటిని తింటున్న ఆ పావురాలను చూస్తూ మైమరచిపోతారు. అటువంటి పావురాలకు కూడా పోటీలు పెడుతున్నారు కొందరు. ఆ పోటీల్లో పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. సాక్షి, నెల్లూరు: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే కార్ రేసింగ్, బైక్ రేసింగ్లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లోనే కాదు.. మన దేశంలోను ఇవి జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్లు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడు కేంద్రంగా వెలిసిన క్లబ్ల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. చెన్నై ప్రాంతానికి చేరువగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో భారీ ఎత్తున బెట్టింగ్లు చేస్తున్నారు. ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్లు ఉన్నాయి. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్ సొసైటీలున్నాయి. చెన్నైలో అధికారికంగా రిజిస్టర్ చేసుకుని, పోలీస్, అటవీశాఖల అనుమతి తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్ కార్డ్స్తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇటీవల పందేల కోసం తీసుకొచ్చిన పావురాలను పోలీసులు పట్టుకోవడంతో పావురాల రేసింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి పావురాల రేసింగ్కు సిద్ధపడుతుండగా పోలీసులు ఏడుగురిని అరెస్టుచేసి 500 పావురాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో బెట్టింగ్ విషయం బయటపడింది. ఇటీవల ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద పోలీసులు దాదాపు వెయ్యి పావురాలను స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కర్నూలు జిల్లాలో పీజియన్ రేసింగ్ క్లబ్లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు పందెం రాయుళ్లు ముందుగా చెన్నై నిర్వాహకులతో కలిసి పావురాల రేసింగ్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ముందుగా వచ్చిన పావురంపై బెట్టింగ్ కాసిన దానికి రెండింతల సొమ్ము వస్తుంది. ముందుగా కోడింగ్ ఉన్న ట్యాగ్లను ప్రత్యేక ఆన్లైన్లో ఉంచుతారు. అలా ఆన్లైన్లో చూసిన బెట్టింగ్ రాయుళ్లు తనకు నచ్చిన పావురంపై పందెం కాస్తారు. బెట్టింగ్ల నిర్వహణకు ప్రత్యేక టీం ఉంటుంది. ఒక్కో పందెంలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయంటే ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాతావరణ అనుకూలత దృష్ట్యా ఏటా శీతాకాలంలో మాత్రమే ఈ పందేలు జరుగుతాయి. ఈ క్లబ్ల సభ్యులు పెద్దసంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు. ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు. పావురం పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలికి క్లబ్కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్ కార్డ్తో కూడిన ట్యాగ్ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్కు వస్తున్నాయి. పావురాన్ని వదిలిన ప్రాంతం నుంచి యజమాని ఇంటికి చేరిన వెంటనే ట్యాగ్ను స్క్రాచ్ చేసి, అక్కడున్న సంఖ్యను ప్రత్యేక యాప్ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తుంటారు. దీన్లోని సమాచారం ఆధారంగా గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్లకూ చేరవేస్తారు. ఇప్పటికీ బ్రిటీష్ బ్లడ్లైనే.. కపోతాల్లో బ్లడ్లైన్ (వంశం) ఉంటుంది. బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్లకు చెందిన పావురాల బ్లడ్ లైనే (ఉమర్స్) ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలోని చాలా క్లబ్లు ఉమర్స్ జాతి పావురాలనే ఎక్కువగా పందేలకు ఉపయోగిస్తున్నాయి. ఈ పావురాల శక్తి సామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించి అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి అంచనా వేస్తారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే ఈ పావురాలకు ప్రొఫైల్ ఉంటుంది. వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబరు ఆధారంగా పెడిగ్రీగా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. పందెం పావురాలను స్వాధీనం చేసుకున్నాం నాయుడుపేట పరిధిలో పావురాల బెట్టింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఒక వాహనంలో ఉన్న పక్షులకు అనుమతి ఉన్న పత్రాలు చూపించారు. మరో వాహనంలో ఉన్న వాటికి మాత్రం ఫేక్ అనుమతి చూపించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి చేర్చాం. ఏడుగురు ని«ందితులను అరెస్ట్ చేశాం. బెట్టింగ్లు జరుగుతున్నాయని విచారణలో తేలింది. – వై.సోమయ్య,సీఐ, నాయుడుపేట -
పరీక్ష రాయలేదని వంకతో విద్యార్థినిని గదిలోకి పిలిపించుకుని..
సాక్షి,సైదాపురం(నెల్లూరు): విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సైదాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితులు బుధవారం తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమ్మలతలుపూరులో మైకా మైన్ ఉన్నత పాఠశాల ఉంది. అందులో ఆగ్రామానికి చెందిన 11 ఏళ్ల గిరిజన బాలిక ఆరో తరగతి చదువుకుంటోంది. (చదవండి: ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న హత్య కేసు మిస్టరీ ) మంగళవారం హిందీ టీచర్ మల్లికార్జున ఆ విద్యార్థిని విరామ సమయంలో గదిలోకి పిలిపించుకున్నారు. నీవు పరీక్ష రాయలేదుగదా.. ఆ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు తీసుకో అంటూ దగ్గరకు పిలుచుకుని తాకరానిచోట తాకుతూ పైశాచిక ఆనందం పొందారని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు వెళ్లగా ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లారు. దీంతో వారు తహసీల్దార్ కృష్ణకును కలిశారు. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరును ఆ బాలిక తహసీల్దార్కు వివరించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారించాలని తహసీల్దార్ పోలీసులకు ఆదేశించారు. గతంలో కూడా ఈ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయన ప్రవర్తన సరిగాలేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు జరిమానా విధించారని, దేహశుద్ధి కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయి. -
వలంటీర్ల వ్యవస్థ విప్లవాత్మకం
కోవూరు/నెల్లూరు (పొగతోట): ఆంధ్రపదేశ్లో ఏర్పాటు చేసిన వలంటీర్లు్ల, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు విప్లవాత్మక మని మహా రాష్ట్ర అధికారుల బృందం పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా ఉందని ప్రశంసించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ఏడుగురు అధికారులు శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆ బృందంలో ఉన్న పుణె డిప్యూటీ సీఈవో మిలింద్ నమేడియో టోనప్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రకాష్ భగవత్ ఖాతల్, డీఏహెచ్వో డాక్టర్ శివాజీ భీమాజీ విధాతే, బీడీవో సుధీర్ పాండురంగ్ భగవత్, విద్యాధికారి శేఖర్ అరవింద్ గైక్వాడ్, జేఏవో శివరామ్ డైనోబా షెడాగె, డీపీవో వికాస్ మహాడియో కుదావె కోవూరు మండలం ఇనమడుగులో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఇనమడుగు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయురాలు తాళ్ళూరు సునీత 1వ తరగతి విద్యార్థులకు నేర్పించిన ఇంగ్లిష్ స్టోరీని అదే పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బొడ్డు విజిత చెప్పడంతో ఆ చిన్నారిని అభినందించారు. అధికారులతో సమావేశమైన అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటే ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం విప్లవాత్మక మార్పు గా అభివర్ణించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటు గా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. తరువాత నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పనితీరును జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, ఎంపీడీవో ధనలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధి హామీ పథకం, జగనన్న శాశ్వత భూహక్కు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, పీఎం ఆదర్శ గ్రామయోజన తదితర పథకాల గురిం చి పుణె అధికారులు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు ఆర్డ బ్ల్యూఎస్ ఎస్ఈ మేడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్రెడ్డికి నివాళులు అర్పించారు. చదవండి: అశ్రునయనాలతో మంత్రి గౌతమ్రెడ్డికి తుది వీడ్కోలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి
Minister Mekapati Goutham Reddy: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. అప్పటికే మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్లో ఉంచారు. తన తండ్రి భౌతిక కాయంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు. తండ్రి యదపై సున్నితంగా తన చేయితో నిమురుతూ కుమారుడు బోరున విలపించాడు. కృష్ణార్జున రెడ్డిని చూస్తూ పట్టరాని దుఃఖంతో మేకపాటి కుటుంబం గుండెలవిసేలా రోధించింది. -
గౌతమ్రెడ్డికి తల్లిదండ్రులు, స్నేహితులంటే ప్రాణం.. ఒక్కసారి పరిచయం అయితే చాలు
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. ధనవంతుల ఇంట్లో జన్మించినా ఎక్కడా అహం, దర్పం లేని నిరాడంబరుడు. వ్యాపార వేత్తగా, రాజకీయ నేతగా, మంత్రి హోదాలో ఉన్నా.. ఏనాడు అధికారాన్ని అసలు చూపించలేదు. అందరితో స్నేహం చేయడం, సన్నిహితులతో గడపడం చాలా ఇష్టం. ఒకసారి తన మనస్సుకు నచ్చితే వారి స్నేహాన్ని వదలరు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఆయనకు ఎందరో స్నేహితులు, సన్నిహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా, పారిశ్రామిక రంగాల్లో కీలక వ్యక్తులు ఆయనకు సుపరిచితులే. గౌతమ్తో ఒక్కసారి పరిచయం అయితే చాలు.. ఎప్పటికీ గుర్తు పెట్టుకునే స్నేహశీలి. చదవండి: గౌతమ్ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి గౌతమ్రెడ్డి పుట్టింది నెల్లూరులో అయినా ఆయన బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. పదో తరగతి వరకు తమిళనాడులోని ఊటీలో చదివినా ఆపై హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. మాంచెస్టర్లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశాలకు (విదేశాల్లోనైనా) వెళ్లి సందర్శించడం ఆయనకు సరదా. ట్రెక్కింగ్, హంటింగ్, కారు డ్రైవింగ్ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు. కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చేవారు. స్నేహితులతో పాటు బంధుమిత్రులను కూడా అమితంగా ప్రేమించేవారు. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు. చదవండి: హైదరాబాద్తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ.. చదవండి: Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ గౌతమ్రెడ్డికి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, తల్లి మణిమంజరి అంటే ఎనలేని ప్రేమ. హైదరాబాద్లో ఉంటే నిద్రలేచిన తర్వాత జిమ్కు వెళ్లి అటు నుంచే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రావడాన్ని దిన చర్యలో భాగంగా మార్చుకున్నారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, కష్టసుఖాలను తల్లిదండ్రులతో పంచుకొనేవారు. ప్రతిరోజూ తన తల్లిదండ్రులతోపాటు సోదరులు మేకపాటి విక్రమ్రెడ్డి, మేకపాటి పృథ్వీరెడ్డిని కలిసేవారు. చెరగని చిరునవ్వు రాజకీయ నాయకుల జీవితం ప్రజలతో మమేకంమై ఉంటుంది. వారు చేసే ప్రతి పనిని ప్రజలు దగ్గరగా గమనిస్తుంటారు. అందువల్ల కొందరు చిరునవ్వును కృతిమంగా సృష్టించుకుంటారు. కానీ మేకపాటి గౌతమ్రెడ్డి మాత్రం ఎప్పుడూ చెరగని చిరునవ్వుతోనే ఉంటారు. అభిమానులు, స్నేహితులు, కార్యకర్తలు వచ్చినప్పుడు చిరు నవ్వుతోనే వారికి సమాధానం చెబుతుంటారు. ఎన్నో సమస్యలతో వచ్చిన వారు కూడా ఆయన చిరునవ్వుతో బాధలు మరిచిపోయి ఆనందంగా తిరిగి వెళ్లేవారు. స్నేహానికి విలువిస్తారు మేకపాటి గౌతమ్రెడ్డి స్నేహానికి విలువిస్తారు. ఆయనతో మాకు బంధుత్వం ఉంది కానీ బంధువుకన్నా స్నేహితుడిగానే నన్ను అభిమానిస్తారు. రాజకీయ ప్రవేశం ముందు ఆత్మకూరులో జరిగిన పాదయాత్ర టూర్ షెడ్యూలంతా నాపైనే పెట్టారు. నేను ఆయన షెడ్యూల్ తయారు చేసి ముందుండి నడిపించాను. గౌతమ్రెడ్డి మంచి మనస్సున్న వ్యక్తి. 2012లో జరిగిన బైపోల్స్లో ఆయన తండ్రి విజయానికి ఎంతో కష్టంచి పనిచేయడమే కాకుండా మాతోను చేయించారు. – నరేష్చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం అనుకున్నది సాధిస్తారు గౌతమ్రెడ్డి నాకు చిన్న వయస్సు నుంచి తెలుసు. చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విశ్రమించరు. అతను ఏ విషయంలో తొందరపాటు చేయర. చాలా కూల్గా ఉంటూ పని చేసుకుంటారు. ధైర్యం కూడా ఎక్కువే. జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశం ఉంటే చాలు అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తారు. అంతటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. – వేమారెడ్డి వినీత్రెడ్డి, కోవూరు -
రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత
సూళ్లూరుపేట: భారీ మొత్తంలో శ్రీగంధం దుంగలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వెల్లడించారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్ఐలు శ్రీనివాసులురెడ్డి, రోజాలత సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన లారీని తనిఖీ చేయగా 484 శ్రీగంధం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లారీకి పైలెట్లుగా వచ్చిన రెండు కార్లను కూడా పట్టుకున్నారు. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన లారీ డ్రైవర్ తుపాకుల మునీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన మోడిబోయిన మురళీకృష్ణ, దగదర్తి చింతోడు సెంటర్కు చెందిన ఉప్పు రామచంద్రయ్య, నెల్లూరు నగరం భక్తవత్సలనగర్కు చెందిన కర్నాటి మాలకొండయ్య, గూడూరు మండలం మిట్మాత్మకూరుకు చెందిన కర్రా పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధాగుంటకు చెందిన కనియపల్లి వెంకటరమణయ్య, పొదలకూరు మండలం వనంతోపునకు చెందిన నల్లు మణి, రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వెలుగు అంకయ్య ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని వెల్లడించారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఏడుగురిని జిల్లాలో పలుచోట్ల గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన శ్రీగంధం దుంగల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
నెల్లూరు: ఈఎంఐ కట్టాలని మెసేజ్.. వెలుగులోకి ఎస్బీఐ ఉద్యోగి మోసం
సాక్షి, నెల్లూరు: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి బ్రాంచిలో పనిచేస్తున్న షేక్ రబ్బానీ అనే ఉద్యోగి (క్లర్క్) ఓ ఖాతాదారునికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్పై సదరు ఖాతాదారునికి తెలియకుండా రుణం తీసుకున్న కేసుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా మరో ఇద్దరి అకౌంట్ల నుంచి లోన్ కింద రూ.9.26 లక్షలు డ్రా చేసుకున్న కేసులో నిందితుడు రబ్బానీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగమల్లేశ్వరరావు కథనం మేరకు.. వెంకటగిరి ఎస్బీఐలో పనిచేస్తున్న క్లర్క్ రబ్బానీ తన తల్లి, తమ్ముడు, స్నేహితుడిపై ఉన్న మూడు ఖాతా లను రాపూరు ఎస్బీఐ బ్రాంచ్ నుంచి వెంకటగిరి బ్రాంచ్కు మార్చుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి అయిన రబ్బానీ ఆ కౌంట్లకు ఉన్న పరిమితులను కార్పొరేట్ తరహాగా మార్చుకుని వాటిలో ఓ అకౌంట్ నుంచి రూ.3.22 లక్షలు, మరో అకౌంట్ నుంచి రూ.6.02 లక్షలను రుణం కింద తీసుకున్నాడని తెలిపారు. ఇక బ్యాంక్కు వచ్చిన ఓ ఖాతాదారుడికి ఓ యాప్ ద్వారా రబ్బానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అయితే ఖాతాదారుడికి తెలియకుండా ఆ ఫిక్స్డ్ డిపాజిట్పై రబ్బానీ రూ.1.35 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ రుణంకు సంబంధించి ఈఎంఐ కట్టాలని మెసేజ్ ఖాతాదారుడికి వెళ్లింది. దీంతో తాను తీసుకోని రుణంకు వాయిదా చెల్లించాలంటూ మెసేజ్ రావడంపై ఆయన బ్యాంక్ మేనేజర్ను సంప్రదించాడు. ఈ వ్యవహారంపై బ్యాంక్లో విజిలెన్స్ విచారణ జరిపి మోసాలకు కారణమైన రబ్బానీపై బ్యాంక్ మేనేజర్ ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు ఆదివారం నిందితుడు రబ్బానీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే.. ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం -
ఇద్దరి మృతదేహాలు లభ్యం
సంగం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై బీరాపేరు వంతెన వద్ద గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో వాగులో గల్లంతైన ఐదుగురిలో ఇద్దరి మృతదేహాలను శనివారం గుర్తించారు. గురువారం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహించారు. ప్రమాదంలో గల్లంతైన కర్రా పుల్లయ్య(60), కర్రా నాగరాజు (40) మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు తండ్రి, కొడుకు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్రా సంపూర్ణమ్మ, కర్రా పద్మ, దివానపు ఆదెమ్మ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. వారి ఆచూకీ కోసం ఫైబర్ బోట్లు, నాటు పడవలతో, వలలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. -
దొరకని ఆ ఐదుగురి జాడ
సంగం: నెల్లూరు–ముంబై రహదారిపై గురువారం రాత్రి లారీ ఢీకొనడంతో వాగులో ఆటో పడిపోయిన ఘటనలో గల్లంతైన ఐదుగురి జాడ శుక్రవారం రాత్రి వరకు తెలియరాలేదు. కుటుంబ సభ్యుడి కర్మకాండలు ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో నెల్లూరు జిల్లా సంగం సమీపంలో గురువారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన కర్రా నాగరాజు, భార్య పద్మ, కర్రా పుల్లయ్య, అతని భార్య సంపూర్ణమ్మ, దివానపు ఆదెమ్మ గల్లంతైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏడుగుర్ని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ వారిలో బాలిక నాగవల్లి (14) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. గల్లంతైన వారి కోసం జాయింట్ కలెక్టర్ హరేంద్రప్రసాద్, ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆధ్వర్యంలో బృందాలు బీరాపేరు వాగులో గాలిస్తున్నాయి. వాగులో ప్రవాహ ఉధృతి శుక్రవారం మరింత పెరగడంతో ఎంత వెతికినా ఒక్కరి జాడ కూడా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ఆటోను వాగులోంచి బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బీరాపేరు వాగంతా జల్లెడ పట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆదేశాల మేరకు కృష్ణపట్నం నుంచి మరబోటును తెప్పించి క్రేన్ సహాయంతో కిందకు దింపారు. -
అమెరికన్ ‘కార్గిల్’ చేతికి నెల్లూరు వంట నూనెల రిఫైనరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం కార్గిల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని వంట నూనెల శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్ట్ వద్ద ఉన్న ఈ రిఫైనరీని దక్కించుకోవడానికి, అలాగే ఆధునీకరణకు మొత్తం సుమారు రూ.262.5 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. 2022 మే నాటికి ఈ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తద్వారా దక్షిణాదిన సంస్థ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుందని కార్గిల్ వంట నూనెల విభాగం భారత ఎండీ పియూష్ పట్నాయక్ తెలిపారు. 2001లో భారత్లో అడుగుపెట్టిన కార్గిల్ ప్రస్తుతం నేచుర్ఫ్రెష్, జెమిని, స్వీకార్, లియోనార్డో, సన్ఫ్లవర్ వంటి బ్రాండ్లలో వంట నూనెలు, కొవ్వుల వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశీయంగా 10 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. -
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం
సాక్షి, తిరుపతి/కడప/నెల్లూరు, సాక్షి నెట్వర్క్: చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు మొదలవ్వడం ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా తొణికిసలాడుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజాగా తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ ప్రకటించింది. వర్షం ఆగిన సమయంలో నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసి వేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కూలిన వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యాంల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఆ నీరు తిరుపతిలోని కపిలతీర్థం నుంచి తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది. శేషాచలం కొండల్లో నుంచి వచ్చే వరద నీరు కళ్యాణీ డ్యాంకు చేరుతుండడంతో నీటి విడుదల యథాతదంగా కొనసాగుతోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న అరణియార్, కాళంగి రిజర్వాయర్, కల్యాణి డ్యాం, రాయలచెరువును పరిశీలించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. అవసరమైతే దిగువ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి.. ప్రజలకు, పంటలకు ఇబ్బంది లేకుండా దిగువకు వదలాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సమయంలో నెల్లూరు జిల్లా వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కొంత మంది భయంతో ముందస్తుగా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు తరలిపోతున్నారు. చిత్తూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నవంబర్లో 142.6 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా, రెండు పర్యాయాలు వచ్చిన తుపాను కారణంగా 438.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిట్వేలి–రాపూరు మధ్య రాకపోకలు నిలిపివేత తుపాను ప్రభావంతో వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీటితో నిండి ఉండగా, మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టులు, చెరువులు, రహదారుల్లో బ్రిడ్జిల వద్ద, నీటి ప్రవాహం ఉన్న చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా–నెల్లూరు జిల్లాల మధ్య రాకపోకలు ఆదివారం నిలిచిపోయాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి–రాపూరు మధ్య ఘాట్ రోడ్డులో రాళ్లు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహనాలను నిలిపివేశారు. కడప–తిరుపతి మధ్య చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. బాలుపల్లె వద్ద శేషాచలం అడవుల నుంచి వర్షపు నీరు రోడ్డుపై పారుతోంది. గండికోట ప్రాజెక్టు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు మైలవరం ప్రాజెక్టుకు వస్తోంది. ఇక్కడి నుంచి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. పార్నపల్లె వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రాయచోటి పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడప నగర సమీపంలోని ఊటుకూరు చెరువును డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాష, నగర మేయర్ సురేష్బాబులు వర్షంలోనే పరిశీలించారు. యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. సోమవారం పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్టున ఉన్న నరశరాంపేట వద్ద భూమి కోతకు గురై రెండు భవనాలు ఆదివారం ఉదయం కూలిపోయాయి. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాలతో వంద మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు, ఉలవపాడు, చీరాల మండలాల్లో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి మండలాల్లో ఒక మోస్తరు వాన పడింది. గుడ్లూరు మండలంలో ఉప్పుటేరు ఉధృతంగా పారుతోంది. రాళ్లపాడు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 7,700 క్యూసెక్కుల వరద నీటిని మన్నేటికి విడుదల చేశారు. చీరాలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సోమశిలకు గంట గంటకూ పెరుగుతున్న ఇన్ఫ్లో సోమశిలకు ఆదివారం ఉదయం 48 వేల క్యూసెక్కులు ఉన్న వరద రాత్రి 8 గంటలకు 96,107 క్యూసెక్కులకు చేరింది. జలాశయం నుంచి 88 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదితో పాటు మామిడి కాలువలకు నీటి ప్రవాహం పెరుగుతోంది. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల మధ్య వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలను నిలిపివేశారు. పెళ్లకూరు మండలంలో 9 గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. అనంతసాగరం మండలం పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కలువాయి ముస్లింపేటలో రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతసాగరం మండలం బీవడ్డిపాళెంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం గుంటూరు నగరంలో 7.6 సెంటీ మీటరు, నెల్లూరు జిల్లా చిల్లకూరులో 12.18 సెంటీమీటర్ల వర్షం పడింది. కృష్ణా, అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. పెన్నాపై అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత అనంతపురం జిల్లాలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యామ్ నుంచి నెల్లూరు బ్యారేజీ వరకు పెన్నా నది ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో జల వనరుల శాఖ అధికారులు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. పెన్నా నది చరిత్రలో ఇలా ఇదే తొలిసారి. రెండు దశాబ్దాల తర్వాత అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు నిండటం గమనార్హం. రానున్న రెండు రోజుల్లో వర్షాల కారణంగా పెన్నా నది ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పును తప్పించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టుల్లో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచడానికి గేట్లు ఎత్తేశారు. పెన్నా నదిపై ప్రాజెక్టుల్లో నీటి నిల్వ వివరాలు ప్రాజెక్టు పేరు నీటి నిల్వ సామర్థ్యం (టీఎంసీలు) ప్రస్తుత నిల్వ (టీఎంసీలు) ఇన్ఫ్లో (క్యూసెక్కులు) అవుట్ఫ్లో (క్యూసెక్కులు) అప్పర్ పెన్నార్ 1.81 1.68 1,388 1,000 పెన్న అహోబిలం 11.1 5.94 880 600 మిడ్ పెన్నార్ 5.17 4.73 1,995 3,963 చాగల్లు 1.8 0.87 1,500 4,500 గండికోట 26.85 23.77 15,500 20,000 మైలవరం 6.65 0.74 20,000 20,000 సోమశిల 78.0 68.67 70,552 88,052 సంగం బ్యారేజ 0.45 0.26 64,825 64,825 నెల్లూరు బ్యారేజీ 0.26 0.18 65,000 65,000 నేడు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కోమరిన్ ప్రాంతం, శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మన రాష్ట్రంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. -
AP Rain Alert: 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30–40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులెవ్వరూ సోమవారం వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
చంద్రబాబుకు బీపీ.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ అసహనం!
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై విపక్షాలు, పచ్చ మీడియా ప్రచారం చేస్తోన్న అసత్యాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. నెల్లూరులో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవం గురించి అసెంబ్లీలో వెల్లడించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నెల్లూరు పర్యటనకు వచ్చారు. సెంటర్కు వచ్చిన చంద్రబాబు.. ప్రజలను ఉద్దేశించి.. ‘‘ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అందాయా’’ అని ప్రశ్నించారు. అందుకు జనాలు అందాయి అని తెలిపారు. ఈ సమాధానం విన్న చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు’’ అని బాలినేని తెలిపారు. (చదవండి: నాయకుడు అనేవాడు డ్రామాలు చేయకూడదు: సీఎం జగన్) ‘‘ఒక్క నెల్లూరులోనే కాదు.. అన్ని ప్రాంతాల్లో.. పూర్తిగా 100 శాతం బాధితులకు అన్ని సహాయక చర్యలు అందాయి. ప్రభుత్వ చర్యలు చూసి చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. అసెంబ్లీలో తనకు ఏమో జరిగిందని.. ఓదార్చాలని జనాలు కోరుతున్నారు. మరో వైపు కొంతమంది తెలుగు దేశం నాయకులు.. సోమశిల ప్రాజెక్ట్ దెబ్బతిన్నది.. ముంపుకు గురవుతారని జనాలు భయందోళనకు గురి చేస్తున్నారు’’ అని బాలినేని విమర్శించారు. (చదవండి: పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు: సీఎం జగన్) ‘‘వరద సహాయక చర్యలు పారదర్శకంగా సాగుతున్నాయి. వరద బాధితులను కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందించింది’’ అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది -
ఏపీలో కొలువుదీరిన పాలకవర్గాలు.. నెల్లూరు మేయర్గా పొట్లూరి స్రవంతి
సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. -
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
కుప్పం మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ సుధీర్ ప్రమాణం
కృష్ణా జిల్లా ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన రంగాపురం రాఘవేంద్ర ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా 32 ఏళ్ల రాఘవేంద్ర. ►వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస ►చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. పశ్చిమగోదావరి జిల్లా ►కొలువుదీరిన ఆకివీడు నగర పాలక సంస్థ తొలి పాలక వర్గం ►తొలి నగర పంచాయతీ చైర్ పర్సన్గా జామి హైమావతి ఎన్నిక ►వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు ►ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీ హిమాన్షు శుక్లా తూర్పు గోదావరి జిల్లా ఇవాళ ఏజెన్సీ ఎటపాక ఎంపీపీ ఎన్నిక ►టాస్ పద్ధతిలో ఎంపిక నిర్వహించనున్న అధికారులు ►మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ 4, సీపీఎం 1, సీపీఐ ఒకస్థానం గెలుచుకున్నారు. ►వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి సమాన స్థానాలు రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక కృష్ణాజిల్లా ►కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా ►కేశినేని నాని కోర్డును మభ్యపెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు ►కోర్టుకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ►డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం ►చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరాం ►మా విజ్ఞప్తి మేరకు అధికారులు ఎన్నికను వాయిదా వేశారు -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చిత్తూరు ►కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం ►వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ, 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. -
భారీ వరద.. ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గల్లంతు..
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా దామర మడుగు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యాడు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్లాడు. నీటి ఉధృతికి కానిస్టేబుల్ వేసుకున్న లైఫ్జాకెట్ ప్రవాహంలో ఊడిపోయింది. దీంతో కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. దీంతో సహచరుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మరోమారు సమీక్ష నిర్వహించారు. ఈ ఉదయం ఒకసారి కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, మరోమారు వారితో ఫోన్లో మాట్లాడారు. మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి వారితో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. కురుస్తున్న వర్షాలు, ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చదవండి: (అనంతపురం జిల్లా నాయకుల్ని అభినందించిన సీఎం జగన్) భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.1,000 రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చదవండి: (అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్) వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్నా వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం స్పష్టంచేశారు. సంబంధిత డిపార్ట్మెంట్లకు చెందిన శాఖాధిపతులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిచ సాయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
-
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 స్థానాలను (8 స్థానాలు ఏకగ్రీవం) క్లీన్స్వీప్ చేసి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయాన్ని సాధించింది. 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించారు. మరో 6 చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ) దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021 -
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
-
స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో పాల్గొన్న అమిత్ షా
-
మంత్రి అనిల్కుమార్ యాదవ్ భారీ ప్రచార ర్యాలీ
-
‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’
-
నెల్లూరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
-
ప్రజాక్షేత్రంలో తలపడలేక టీడీపీ కుట్రలు చేస్తోంది
-
విదేశీ వలస విహంగాలొచ్చేశాయ్....
దొరవారిసత్రం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అతిథులు వచ్చేశాయ్. ప్రస్తుతం వందల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తున్నాయి. విదేశీ వలస పక్షుల్లో రారాజుగా ప్రసిద్ధి చెందిన గూడబాతులు (పెలికాన్స్) గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం 200కి పైగా గూడబాతులు విడిది చేస్తున్నట్లు వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలిపారు. వీటితోపాటు సీజన్కు ముందే ఇక్కడకు విచ్చేసిన నత్తగుళ్ల కొంగలు (ఓపెన్ బిల్స్టార్క్స్) 500, తెల్లకంకణాయిలు (వైట్ఐబీస్) 200, పెద్ద నీటికాకులు (కార్మోరెంట్స్) 100కి పైగా విడిది చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!) ఇంకా తెడ్డుముక్కు కొంగలు, నారాయణ పక్షులు, పాముమెడ కొంగలు వంటి పక్షులు రావాల్సి ఉంది. అయితే.. ప్రసిద్ధి చెందిన గూడబాతులకు స్థానికంగా వాతావరణం అనుకూలించకపోతే మాత్రం అవి వెనుతిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు కురిసిన వానలకు అత్తిగుంట, నేరేడుగుంట, మారేడుగుంట చెరువుల్లోకి అరకొరగా మాత్రమే నీళ్లు చేరుకున్నాయి. విడిది కోసం వచ్చిన విహంగాలు అడుగంటిన నీళ్లలోనే జలకాలాడుతూ సంచరిస్తున్నాయి. పుష్కలంగా వర్షాలు కురిసి చెరువుల్లో çపూర్తి స్థాయిలో నీళ్లు ఉంటే ఇప్పటికే వేల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తూ ఉండేవి. చదవండి: ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి.. -
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న వైస్సార్సీపీ శ్రేణులు
-
గొట్టిప్రోలు కోటదిబ్బ.. 2వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యం
నాయుడుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గొట్టిప్రోలు గ్రామం ఉంది. ఊరి ముఖద్వారానికి ఎడమవైపు ఎత్తైన కొండలాగా ఓ దిబ్బ కనిపించేది. పిచ్చిమొక్కలతో నిండి వుండే ఈ దిబ్బ మీద మేకలు, గొర్రెలు మేపే కాపరులకు వర్షాకాలంలో ఇక్కడ కుండ పెంకులు, పాతరాతి యుగానికి సంబంధించిన వస్తువులు లభించేవి. వాటిని చూసి అప్పటి పెద్దలు ఇక్కడ రాజులు వుండేవారట అని ముందు తరాలవారికి చెప్పెవారు. గ్రామంలోని కోట దిబ్బలో ఓ మూలన పల్లవులనాటి విష్ణుమూర్తి విగ్రహం గ్రావెల్(గులకరాళ్లు) తవ్వకాల్లో బయటపడడంతో గ్రామ ప్రజలు అప్పటి నుంచి పూజలు చేసేవారు. కోట దిబ్బగా పిలువబడే ప్రాంతం 40 ఎకరాలు స్థలంలో వుంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం కొంత మంది పెత్తందారులు కోట దిబ్బను ద్వంసం చేసి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పురాతన వస్తు సామగ్రి ఓక్కోక్కటిగా బయటపడడంతో గ్రామస్తులు కొంత మంది అక్రమ రవాణా చేయరాదంటూ అడ్డుకున్నారు. విషయం పురవస్తుశాఖ అధికారుల దృష్టికి చేరింది. ఏడాది తరువాత ఆర్కియాలజీ అధికారులు స్పందించారు. కోట దిబ్బ చుట్టూ నలబై ఎకరాలకు చుట్టు హద్దులు వేశారు. ఇందులోకి బయటవ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించరాదంటూ దండోరా వేయించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి పురావస్తుశాఖ సారద్యంలో తవ్వకాలు చేపడుతామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఇక్కడి పరిస్థితిపై వివరించారు. డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాలోని అన్ని ప్రదేశాలను చిత్రీకరించారు. గ్రామంలోని వంద మందికిపైగా కూలీలతో పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు. తొలిదశలో పెంకులు, చిన్న చిన్నరాతి ముక్కలు బయటపడ్డాయి. వీటిపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేయాలని ఆశాఖ పరిశోధనశాలలకు పంపడం జరిగింది. పల్లవులు, రోమన్లు, శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టి పరిశోధనలు చేస్తే తప్ప ఓ కొలిక్కిరాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. రెండువేల ఏళ్లనాటి పురాతన కట్టడాలు.... పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డ కట్టడాలు రెండు వేల ఏళ్ళనాటి మధ్య యుగంనాటి చరిత్ర పురాతన కట్టడాలని శాసననాలు చెబుతున్నాయి. స్వర్ణముఖినది బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా వుండడంతో రోమన్లతో వర్తక వ్యాపారాలు కొసాగించేందుకు ఇక్కడ కట్టడాలు చేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో చతుర్ముఖి ముఖం కలిగిన విష్ణుమూర్తి విగ్రహంతో పాటు నాణ్యమైన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు,నాణ్యాలు, జాడీలు గృహాపకరణాలు బయల్పడ్డాయి. పల్లవుల కాలం నాటివిగా భావిస్తున్న విగ్రహాలు అలనాటి శిల్పకళను చాటిచెప్పే విధంగా వుండటమే కాక నాటి చరిత్రను వివరిస్తున్నాయి. రెండువేళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ, భారీ ఘన ఇటుకలతో చుట్టూ వలయాకారంలో గోడ నిర్మాణం, 48–49 వెడల్పు కలిగిన ఇటుకల వుండడంతో.. ఇవి అమరావతి, నాగార్జున కొండ శాతవాహనుల కాలంనాటి నిర్మాణంలో వాడిన ఇటుకలుగా తెలుస్తోంది. సముద్రతీరం ప్రాంతానికి దగ్గరగా వ్యాపార వాణిజ్య పరంగా అనువైన ప్రాంతం కావడంతో కోట దిబ్బను ఎంచుకుని.. ఇక్కడ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు బయల్పడ్డాయని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. గొట్టిప్రోలు గ్రామం కోటదిబ్బలో చేపట్టిన పురావస్తుశాఖ తవ్వకాలను ఆశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ బిస్ట్ పరిశీలించారు. తవ్వకాల్లో శాతవాహన కాలంనాటి ఆనవాళ్లు కోటదిబ్బలో బయల్పడిన ఆ ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ చూశారు. ఇక్కడ బయల్పడిన కట్టడాలు శాతవాహనుల కాలంలో ఏర్పాటు చేసుకున్న కోటలో రాజులు, పరిపాలకులు, లోపలభాగంలోనే కోర్టు, సెక్యూరిటీ వంటి పురాతన కట్టడాల మాదిరి కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు వర్తక వాణిజ్యపరంగా ఇక్కడి నుంచే జరిగి వుంటాయని స్పష్టం చేశారు. గొట్టిప్రోలు శాతవాహన కాలంనాటి కట్టడాలు బయటపడడం చరిత్రగా మారనుందని అన్నారు. వీటిని కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులకు ప్రదర్శించి.. శాతవాహనుల చరిత్ర అర్థమయ్యేలా చూపాలన్నారు. గొట్టిప్రోలులో పురావస్తు కట్టడాలు ఉన్నట్లు ఎలా గుర్తించారు..! గొట్టిప్రోలు గ్రామానికి శివారుప్రాంతంలో 30 అడుగులు ఎత్తుగల దిబ్బవుండేది. ఇక్కడ గ్రావెల్ విరివిగా వుండడంతో ఇది కొందరికి కల్పతరువుగా మారింది. దిబ్బను సొంతం చేసుకుని ప్రకృతి సంపదను దొచుకుంటే కోట్లు గడించవచ్చని దీనిపై దృష్టిసారించారు. దాదాపుగా 30 అడుగులు ఎత్తు ఉండే దిబ్బ ప్రస్తుతం 7 అడుగులు ఎత్తుకు తగ్గింది. అప్పటికే కోటలో కట్టడాలు ఒక్కొక్కటిగా బయల్నడుతూ వచ్చాయి. అది గమనించిన గ్రామంలోని ఓ విద్యావంతుడు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటూ వచ్చాడు. అదేక్రమంలో పురావస్తుశాఖ అధికారులకు సందేశాలు పంపుతూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2018 నవంబర్లో పురవాస్తుశాఖ అధికారులు స్వర్ణముఖినది తీరాల వెంబడి గ్రామాల ఆలయాలు, పురావస్తు కట్టడాలు ఎక్కడెక్కడ వున్నాయోనని పరిశీలించారు. ఈసమయంలో గొట్టిప్రోలు వద్ద కోట దిబ్బలో పురావస్తు కట్టడాలు వున్నట్లు శాసనాలలో గుర్తించారు. -
తండ్రి అడుగుల్లో తనయి.. మొదటి గురువు ఆయనే.. ఆరేళ్లకే
సాక్షి, నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆ చిన్నారికి పట్టుమని 11 ఏళ్లు. అయినా కూచిపూడి నాట్యకళాకారిణిగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో ప్రదర్శనలు. గిన్నీస్బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. చిన్నారి నృత్య, అభినయానికి పలువరి ప్రసంశలు కూడా అందుకుంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి విజయ హరిణి. తండ్రి అడుగుల్లో అడుగులువేసి.... మద్దులూరి సురేష్, అలేఖ్య దంపతులు నెల్లూరు రామలింగాపురం వాసులు. సురేష్ వెస్ట్రన్ డ్యాన్సర్గా రాణించి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్గా స్థిరపడ్డాడు. తండ్రి డ్యాన్సును చిన్నప్పటి నుంచి చూసిన హరిణికి డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి తానే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని తనయికి నేర్పాడు. తొలి గురువుగా తాను చేసి ప్రయత్నం ఫలించింది. అతి తక్కువ సమయంలోనే హరిణి నృత్యకళాకారిణిగా ఎదిగింది. తండ్రి తనయుల నృత్య ప్రదర్శన, గిన్నీస్ బుక్లో స్థానం నవరసాలను అభినయిస్తూ, కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై నృత్య రూపకాలతో తన ప్రతిభను చాటింది. పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ఎదిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందోనని ఈ తండ్రి కూతుళ్లు తమ నృత్యంతోనే జవాబిచ్చారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని నృత్యం మరింత పెనవేసింది. దీంతో విజయ హరిణి కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తుంది. విజయానికి తొలి అడుగు ఇంటి నుండే ప్రారంభమై దేశవ్యాప్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఆ చిన్నారి ఆకాంక్ష. కాళికామాత అభినయంలో హరిణి హరిణి నృత్య ప్రస్థానం ఇలా... – 2016లో ఆరేళ్ల వయసులో నెల్లూరు టౌన్ హాలులో మొదటి ప్రదర్శనతో నృత్య కిషోర్ అవార్డును అందుకుంది. – 2018లో తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. – 2018లో లేపాక్షిలో జరిగిన ఉత్సవాల్లో తెలుగు బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. – 2019లో హైదరాబాద్లో జరిగిన పోటీల్లో నృత్య తరంగిణి అవార్డును మాజీ గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అందుకుంది. – 2019లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. – 2020లో చెన్నైలో త్యాగయ్య టీవీ ఆధ్వర్యంలో లార్జెస్ట్ కూచిపూడి లెవెన్లో తన తండ్రి సురేష్తో పాటు పాల్గొని గిన్నీస్బుక్ఆఫ్వరల్డ్ రికార్డులో స్థానం సాధించింది. – ప్రతి ఏడాది షిర్డీలో బాబా ఉత్సవాల్లో బాబా సమాధి వద్ద క్రమం తప్పని నృత్య ప్రదర్శన. హరిణి నృత్య ప్రదర్శన -
ఊరు కోసం ప్రాణదానం.. గొల్లభామగా మహిమలు
ఆత్మకూరు: సముద్రాన్ని తలపించేలా పేరుకు తగినట్టుగా ఉన్న ‘అనంతసాగరం’ చెరువును 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరసుచే నిర్మించబడింది. అనంతరం కొంత కాలానికి ఆయన శిష్యుడు రాయసం కొండ మురసయ్య ఈ చెరువుకు కట్ట నిర్మిస్తుండగా ఓ చోట పెద్ద గండి పడింది. దీంతో గ్రామం నీట మునిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పెద్దలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచక తలలు పట్టుకున్నారు. ఆ సమయంలో మానవబలి ఇస్తే గండి పూడుతుందని ఆకాశవాణి పలికిందట. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ యాదవ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి ఆ గండిలో నిలబడింది. దీంతో వరద ప్రవాహం నిలిచిపోయిందని, ఆమె త్యాగానికి గుర్తుగా చెరువు కట్టపై శిలను ఏర్పాటు చేసి బలిదానమైన ఆమెకు గుర్తుగా గొల్లభామ శిలగా అప్పట్లో పెద్దలు నామకరణం చేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికి గొల్లభామ విగ్రహం వద్ద స్థానికులు ఆది, మంగళవారాల్లో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ గొల్లభామ స్థంభం కింద గుప్త నిధులు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేయడంతో 2003వ సంవత్సరంలో కొందరు జేసీబీ వంటి యంత్రాలతో తవ్వించేందుకు ప్రయత్నించగా గొల్లభామ శిల మహిమో, మంత్ర మహిమో కాని ఆ జేసీబీ ఆగిపోయి మరమ్మతులకు గురై నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా నిధుల కోసం గుంత తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంతలో తెల్లవారడంతో గ్రామస్తులు వారిని పోలిసులకు పట్టించారు. అప్పటి నుంచి గొల్లభామ మహిమ మరింత విస్తృతమై స్థానికులు మరింత భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. -
ఏమండీ ఎక్కడున్నారు.. ‘సెకండ్ వైఫ్’ దగ్గర
నెల్లూరు సిటీ: ఇంట్లో సరుకులు అయిపోవడంతో నెల్లూరు సిటీకి చెందిన ఓ ఇల్లాలు తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడున్నారండీ అంటూ ఫోన్లో అడిగింది. భర్త అటునుంచి నేను ‘‘ సెకండ్ వైఫ్’’ దగ్గర ఉన్నానంటూ బదులు ఇచ్చాడు. ఇది విన్న వెంటనే ఇల్లాలు కోపం నషాలానికి అంటింది. నాకు అన్యాయం చేస్తున్నారా అంటూ ఇల్లాలు ఆ భర్తను ఫుల్గా తిట్టడం మొదలుపెట్టింది. తిట్టించుకుంటూనే నవ్వడం మొదలుపెట్టాడు ఆ భర్త. అసలు విషయం చెప్పడంతో ఆమె నాలుకర్చుకుంది. వ్యాపారులు కొత్త ఆలోచనలు.. వెరైటీ పేర్లు.. వ్యాపారులు తమ వ్యాపారం పెంచుకునేందుకు రుచికరమైన ఆహారం తయారు చేయడం... పరిశుభ్రంగా ఉంచడం... తక్కువ ధరలకే ఆహారాన్ని అందించడం.. వంటి ఆలోచనలు చేస్తుంటారు. మరికొందరు వ్యాపార కేంద్రాలకు సరికొత్త పేర్లు పెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే ఓ వ్యాపారి చేశారు. నగరంలోని రామ్మూర్తినగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద ‘‘2nd Wife’’ పేరుతో ఫుడ్కోర్టును ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో యువతకు ఆ ఫుడ్కోర్టు బాగా నోటెడ్ అయింది. నెల్లూరు నగరంలో కొందరు వ్యాపారులు కూడా ఇదే దారిలో వెళుతున్నారు. రామ్మూర్తినగర్లోనే ఓ టీ దుకాణ యజమాని తన షాపుకు ‘‘ఊటీ ’’ పేరును పెట్టారు. ఇలా నగరంలో కొందరు వ్యాపారులు సరికొత్త పేర్లుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాగుంటలేఅవుట్లో ‘‘చికెన్ ఎఫైర్’’ రెస్టారెంట్, దర్గామిట్టలో ‘‘బుజ్జిగాడు బిరియానీ’’, వేదాయపాళెంలో ‘‘చోప్ స్టిక్స్’’ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇలా నగరంలో వ్యాపారులు సరికొత్త పేర్లుతో తమ వ్యాపార కేంద్రాలకు పెట్టుకుంటున్నారు. ప్రజలను కూడా ఈ పేర్లు ఆకర్షిస్తున్నాయి. -
మహాత్ముడు మెచ్చిన జిల్లా.. ఏకంగా ఐదు సార్లు పర్యటన
నెల్లూరు సిటీ: భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీకి నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ ఐదు సార్లు పర్యటించారు. 1915–1946 సంవత్సరాల మధ్యలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు గాంధీ. నెల్లూరు నుంచి వెంకటగిరి వరకు, సంగం నుంచి అనంతసాగరం వరకు, కావలి నుంచి సూళ్ళూరుపేట వరకు అనేక గ్రామాల్లో పర్యటించారు. 1915వ సంవత్సరం మే 14వ తేదీన తొలిసారిగా మహాత్మాగాంధీ భార్య కస్తూర్బాగాంధీతో నెల్లూరుకు వచ్చారు. అప్పట్లో మద్రాసు రాష్ట్ర రాజకీయ మహాసభ నెల్లూరులో జరగడంతో ఆయన పాల్గొన్నారు. 1921 ఏప్రియల్ 7వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో పెన్నానది తీరాన నిర్మించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే పర్యటనలో నెల్లూరులో తిలక్ విద్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు టౌన్హాల్లో జరిగిన మహిళా సమావేశంలో, వీఆర్ కళాశాల ఆవరణంలో మతసామరస్య సరస్సులో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాధున్ని దర్శించుకున్నారు. 1929వ సంవత్సరంలో గాంధీజీ ఐదురోజులు పాటు జిల్లాలో ఉన్నారు. మే 10వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొనడంతోపాటు యల్లాయపాళెం, రాజుపాళెం, గండవరం, పార్లపల్లి, విడవలూరు, మోపూరు, అల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో బుచ్చిరెడ్డిపాళెంలో ఖాదీ నిధికోసం రూ.7వేలు నగదు సేకరించారు. 11వ తేదీన కావలి, ఉలవపాడు, సిద్దనకొండూరు, చింతలపాళెం, పామూరు, కందుకూరు ప్రాంతాల్లో, 12వ తేదీన సంగం, మైపాడు, గంగపట్నం, ఇందుకూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ప్రజలకు స్వాతంత్ర స్పూర్తిని నింపారు. ఈ పర్యటనలోనే కస్తూరిదేవీ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. నాలుగోసారి 1933 డిసెంబర్ 30వ తేదీన జిల్లాకు వచ్చిన జాతిపిత బిట్రగుంట, కావలి, అల్లూరు, గండవరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, వెంకటగిరి, నాయుడపేట గ్రామాల్లో పర్యటించారు. ఐదవసారి 1946 జనవరి 21వ తేదీన బిట్రగుంట నుంచి మద్రాసు వరకు పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. లక్షలాది మంది ఆయన వెంట నడిచారు. జిల్లాలో జాతిపిత పర్యటనకు గుర్తుగా పత్తి సుబ్బారావు అనే వ్యక్తి నెల్లూరు నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గాంధీబొమ్మ సెంటర్గా పిలుస్తున్నారు. -
ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!
నెల్లూరు సిటీ: నెల్లూరంటేనే మంచి ధాన్యం, నాణ్యమైన నాగరికత, పెన్నానదీ, ఆ నదీతీరాన వెలసిన రంగనాయకులస్వామీ గుర్తుకు వస్తారు. ఒకప్పుడు ఇదీ దండకారణ్యంలో ఒకభాగం. సింహాలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల సింహాపురి అనే పేరు వచ్చిందని ఒక వాదన. నెల్లూరును ఎక్కువ కాలం పాలించిన పల్లవులకు ‘సింహా’ అనే బిరుదు ఉండేది. అందువల్ల ‘సింహాపురి’ అనే పేరు వచ్చిందనేది ఇంకో వాదన. బృహత్పల్లవుల్లో మొదటివాడైనా సింహవిష్ణువు తన పేరిట విక్రమ సింహపురాన్ని నిర్మించారనేది ఒక అభిప్రాయం. నెల్లూరు నగర వ్యూ ముక్కంటి రెడ్డి అనే అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. అతడికి ఒకరోజు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద గల శివలింగానికి ఆలయం కట్టించవలసిందిగా కోరాడు. ముక్కంటి రెడ్డి ఆలయం కట్టించి నిత్యోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు. ఆ ఆలయమే ఇప్పుడు మూలాపేటలో ఉన మూలస్థానేశ్వరాలయం. (చదవండి: స్టోన్హౌస్పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా) నెల్లూరు నగర వ్యూ అప్పట్లో నెల్లూరు పట్టణం మూలాపేట, రంగనాయకులపేట, సంతపేట, దర్గామిట్టలకు పరిమితమై ఉండేది. ‘నెల్లి’ అంటే ఉసిరిక చెట్టుగనుక ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు కొందరు. పినాకినీ నదీ తీరాన ఈ నగరం ఉండడంతో, వరి పంటకు ప్రసిద్ధి. నెల్లు అంటే వడ్లు గనుక వడ్లు ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు మరికొందరు. నెల్లూరు పట్ల ఇన్నీ రకాల అభిప్రాయాలు ఉండడం విశేషం. (చదవండి: AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!) -
418 కేజీల వెండితో సీఎం జగన్ చిత్రపటం
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా నవరత్నాల అమలుతో ప్రజల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నారు సీఎం జగన్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమంలో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు. జనం మెచ్చిన సీఎంగా చెరగని స్థానం సంపాదించుకున్నారు జగన్మోహన్రెడ్డి. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం జగన్పై నెల్లూరు నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేకంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. వెండి ఆభరణాలతో సీఎం జగన్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఏకంగా 418 కేజీల వెండితో సీఎం జగన్ చిత్రాన్ని తయారు చేయించి తన అభిమానానికి హద్దులు లేవని నిరూపించారు. కాగా.. కోయంబత్తూర్లోని కళ్యాణ మండపంలో వెండి ఆభరణాలతో ఆమర్చిన భారీసైజు సీఎం ప్రతి రూపాన్ని ఆవిష్కరించారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్తో ఛైర్మన్ ద్వారకానాథ్ తన ఆలోచనలను పంచుకోవడంతో.. వెండీ పట్టీలతో కళాత్మకంగా ఎంతో వ్యయప్రయాసలతో 12 గంటల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. ‘‘మహానాయుకునికి... మనఃపూర్వకంగా’’ అంటూ సీఎం జగన్పై తన అభిమానాన్ని చాటుకోగా, ఈ చిత్రం పలువురి ప్రసంశలను అందుకుంటోంది. చదవండి: దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు -
స్టోన్హౌస్పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా
నెల్లూరు సిటీ: ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులు, ప్రముఖుల పేర్లను ప్రాంతాలు, వీధులకు పేర్లుగా పెడుతున్న విషయం తెలిసిందే. అయితే బ్రిటీష్ పాలనలో నెల్లూరులోని ఓ ప్రాంతానికి అప్పటి కలెక్టర్ పేరును పెట్టారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేయడంతో సదరు కలెక్టర్ పేరునే ఆ ప్రాంతానికి పెట్టుకున్నారు. అదే స్టోన్హౌస్పేట. ఆ వివరాలు.. ఆంగ్లేయులు పాలించే రోజుల్లో తూర్పు నెల్లూరుగా పిలుస్తున్న ఆ ప్రాంతానికి 1835వ సంవత్సరంలో ‘‘టీవీ స్టోన్హౌస్’’ను కలెక్టర్గా నియమించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టోన్హౌస్పేట ప్రాంతంలో బ్రిటీష్ కాలంలోనే వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉండేది. జిల్లా అంతటికీ ఈ ప్రాంతం నుంచే సరుకులు సరఫరా చేస్తుండేవారు. అలా వ్యాపారంలో ఆలస్యమైన సందర్బాలలో దూర ప్రాంత ప్రజలు ఇక్కడే సేదతీరేవారు. ఆకాలంలో అక్కడ దొంగల భయం ఎక్కువుగా ఉండేది. పరిస్థితి సమీక్షించిన కలెక్టర్ టీవీ స్టోన్హౌస్ ప్రత్యేక చొరతీసుకుని రాత్రి సమయాల్లో వ్యాపారులకు రక్షణగా రక్షక భటులను నియమించడం, నూనె దీపాలను వీధుల్లో పెట్టించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంత ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా కలెక్టర్ చేసిన సేవలకు సంతోషం వ్యక్తం చేసేవారు. దాంతో ఆయన సేవలకు గుర్తుగా కలెక్టర్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు. ప్రస్తుతం స్టోన్హౌస్పేట అన్నీ రకాల వ్యాపారాలకు కేంద్ర బిందువుగా కోట్లు రూపాయాల ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. -
28 అంతర్జాతీయ రికార్డుల ‘సాహసపుత్రుడు’
నెల్లూరు (స్టోన్హౌస్పేట): చిన్నతనంలో స్నేహితులతో తరుచూ దెబ్బతినే చిన్నారిని ఆత్మస్థైర్యం కోసం కరాటే శిక్షణకు పంపింది తల్లి ఖాజాబీ. ఆ బాలుడు నేడు ఏకంగా 28 అంతర్జాతీయ కరాటే రికార్డులను సొంతం చేసుకున్నాడు. బాల్యం నుంచి క్రమం తప్పని సాధనతో పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. అతనే కరాటే మాస్టర్ ఇబ్రహిం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న షేక్ మహబూబ్, ఖాజాబీల కుమారుడు షేక్ ఇబ్రహిం. చిన్నతనంలో ఆడుకునేటప్పుడు స్నేహితులతో గొడవలు, దెబ్బతిని ఇంటికి రావడం చూసి తల్లి ఖాజాబీ తట్టుకోలేకపోయింది. ధైర్యం నింపేందుకు కరాటే మాస్టర్ వద్ద చేర్చింది. నిరంతరం సాధనతో ఇబ్రహింలో ధైర్యంతో పాటు కరాటే పట్ల ఆసక్తి పెరిగింది. ప్రదర్శనలిస్తూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో 28 రికార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక, నేపాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. తాను ప్రదర్శించడమే కాకుండా తాను శిక్షణనిచ్చిన వందలాదిమంది శిష్యులతో కలిపి భారీ కరాటే ప్రదర్శన ఇవ్వడం ఇతని ప్రత్యేకత. చిన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం మొదలైన కరాటే ప్రస్థానం రికార్డుల పరంపర సాగిస్తుంది. కరాటే విద్యే చిన్నారులకు నేర్పుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ.... ఇబ్రహిం జీవనం సాగడం విశేషం. 2016 నుంచి ప్రారంభమైన రికార్డుల ప్రదర్శనలు 2020కి వచ్చేసరికి కరాటేలోని వివిధ రకాల విన్యాసాలతో ప్రదర్శనలతో సాధించిన పలు రికార్డులు.. 666 మందితో కటా ప్రదర్శన చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు (2016) 5220 మందితో కరాటే ప్రదర్శన (2017) 4250 మందితో కరాటే ప్రదర్శన లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2017) 600 మందితో కలాం వరల్డ్ రికార్డు (2018) 60 మందితో మెరాకిల్ వరల్డ్ రికార్డు (2018) ఆర్హెచ్ వరల్డ్ రికార్డు (2018) ఏఎస్ఎస్ వరల్డ్ రికార్డు ( ఒక్క నిమిషంలో మోచేత్తో 195 స్టిక్లను బల్లమీద కొట్టడం (2019) ఒక్క నిమిషంలో 60 మంది 2లక్షల 15 పంచ్లు (2019) రియల్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2019) సాహసపుత్ర రికార్డు (2019) యూనివర్శల్ రికార్డు (2019) ఎక్స్లెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (2020) వజ్రా వరల్డ్ రికార్డు (2020) అఫిషియల్ వరల్డ్ రికార్డు (2020) లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2020) గిన్నిస్బుక్ అటెంప్ట్ – (2020) గిన్నిస్ రికార్డు ఎల్బో స్ట్రైకింగ్స్ (2020) కలామ్స్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2021) -
వల్లకాడే ఊరు.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు
నెల్లూరు(అర్బన్): అక్షరం ముక్క రాని అభాగ్యులు. దారిద్ర్యంలో అతి దరిద్రులు. నిత్యం శవాల కాలే చమురు వాసనలే వారికి సువాసనలు. మనిషి పుర్రెలతోనే పసిబిడ్డలు ఆటలాడుకుంటారు. సమాధులే వారికి పట్టు పరుపులు.. ఉండేందుకు జానెడు జాగా లేక వల్లకాడు(శ్మశానం)లోనే దశాబ్ధాల తరబడి కాపురాలు ఉంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు. విక్రమసింహపురిగా ఖ్యాతి గాంచిన నెల్లూరు బోడిగాడితోట శ్మశానంలో కాపురాలుంటున్న నిరుపేదల దయనీయ స్థితి. నెల్లూరు పెన్నానది ఒడ్డున విశాలమైన బోడిగాడితోట హిందువుల అతిపెద్ద శ్మశాన వాటిక. సుమారు 8 లక్షల జనాభ ఉండే నగరంలో మనిషి మరణిస్తే ఎక్కువ భాగం బోడిగాడితోటలోనే ఖననం చేస్తారు. ఆ శ్మశాన వాటికను ఆనుకుని ఒక వైపు పెద్ద, పెద్ద భవంతులున్నాయి. ఎంతో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయి. శ్రీమంతులున్నారు. మరో వైపు నివాస స్థలం లేకపోవడంతో శ్మశానంలో సమాధులనే ఇళ్లుగా చేసుకుని పట్టలు కట్టుకుని, పూరి కప్పు వేసుకుని నివసించే వందలాది కుటుంబాలున్నాయి. వీరి బాధలు చూసిన వారి మనస్సు చివుక్కు మనిపించక మానదు. జానెడు పొట్ట నింపుకునేందుకు ఇన్ని బాధలా.. ఇంత దుర్భరమైన బతుకా అని మనస్సు కలత చెందడం ఖాయం. (చదవండి: బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం) బతుకు దుర్భరం ఈ శ్మశానంలో సుమారు 500 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. చిన్న పూరింట్లోనే నలుగురైదుగురు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న వీరు వారి తాత, ముత్తాతల కాలంలో ఇక్కడికి వలస వచ్చారు. అందరూ తమిళం మాట్లాడుతారు. వీరిలో ఎక్కువ భాగం చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకోవడం వాటిని అమ్ముకోవడం ద్వారానే బతుకు బండి లాగిస్తున్నారు. మరికొంతమంది మంది మహిళలు వీధి, వీధి తిరుగుతూ చిక్కు వెంట్రుకలు సేకరించి వాటిని అమ్మడం చేస్తారు. ఇంకొంతమంది ఇళ్లలో పాచి పని చేసి బతుకీడిస్తున్నారు. వచ్చే అరకొర సంపాదనతో ఏపూటకాపూట బతుకుతున్నారు. (చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!) ఇది చాలదన్నట్టు చదువు సంధ్య లేని వారు కావడంతో మద్యం లాంటి అలవాట్లతో ఎదుగూ బొదుగూ లేకుండా జీవిస్తున్నారు. వర్షం వస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఒక వైపు తడుస్తూ.. మరో వైపు పనులు లేక పస్తులతో గడుపుతుంటారు. జబ్బు చేస్తే దవాఖానాకు పోయేందుకు పైసలు లేక అల్లాడి పోతుంటారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు అవుతున్నా వారికి చీకటి బతుకుల్లో వెలుగు రావడం లేదు. (చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం) తమ ఓట్లు పొందుతున్న నాయకులు తమకు పక్కా ఇళ్లు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధలు స్వయంగా పరిశీలించిన నెల్లూరు సిటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారికి టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి ప్రభుత్వం ద్వారా హౌసింగ్బోర్డు కాలని వద్ద టిడ్కో ఇళ్లు కట్టించి ఇవ్వడంతో కొంతమంది ఆ ఇళ్లలోకి కాపురం మార్చారు. త్వరగా పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి: శాంతి, స్థానికురాలు మాతాత, ముత్తాతల నుంచి తాము ఇక్కడే నివాసం ఉంటున్నాం. మా బిడ్డలకు కూడా పెళ్లిళ్లు చేశాం. ఘోరిల మధ్యనే ఉంటున్నాం. కడుబీదరికంలో బతుకుతున్నాం. ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించింది. వారు వెళ్లారు. మిగతా వారికి కూడా ఇళ్లు కట్టిస్తామంటున్నారు. త్వరగా ఇళ్లు కట్టించి ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తాం. చదవండి: విధి ఆట.. గెలుపు బాట -
'మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి'
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ విమర్శలపై ఎదురుదాడి చేశారు. కాలువ కట్టపై నివాసాలు తొలగించే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు. సాలుచింతలో పేదల ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చిన ఘనత టీడీపీది. టీడీపీ నేతల్లాగా పదవులు అడ్డం పెట్టుకొని నేను డబ్బులు సంపాదించలేదు. మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నా. ఇళ్లు కట్టుకోలేని బికారిని కాను. ఇప్పటికీ రూ.50 కోట్ల ఆస్తిపరుడినే. ఏ సంపాదన లేకుండా టీడీపీ నేతలు విలాసవంత జీవితం ఎలా గడుపుతున్నారు. మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే గుణపాఠం తప్పదు అని మంత్రి అనిల్ హెచ్చరించారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్సిగ్నల్) -
భార్య కాపురానికి రాకపోవడంతో...
-
ట్రస్ట్బోర్డ్ సభ్యులను అభినందించిన మంత్రి అనిల్ కుమార్
-
నెల్లూరు జిల్లా పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్లకు ఊరట
-
నెల్లూరు జిల్లా పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్లకు ఊరట
సాక్షి, అమరావతి: 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్లపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: కోర్టు ధిక్కార కేసులో.. పలువురు ఐఏఎస్లకు జైలుశిక్ష ) 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.. ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్సింగ్ రావత్కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా.. అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా.. అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్వీ చక్రధర్లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు. చదవండి: అగరబత్తీల విషయంలో జోక్యం చేసుకోలేం -
నెల్లూరు: యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్
నెల్లూరు: నెల్లూరుజిల్లాలో యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరుజిల్లా రామకోటయ్య నగర్కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్ని అతడితో కలిసి నమ్మి నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఉషను కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి రక్తం కారుతున్న ఆ దుర్మార్గుడు కనికరం చూపించలేదు. అంతటితో ఆగకుండా .. ఈ కీచక పర్వాన్ని అతని మిత్రుడితో వీడియో తీయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కలువాయి ప్రాంతంలో వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మరో నిందితుడు శివకుమార్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శివకుమార్పై గతంలో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని కఠినంగా శిక్షించాలని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్పీని కోరారు. చదవండి: సైదాబాద్ ఘటన దారుణం: కోమటిరెడ్డి -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులను నెల్లూరు హరనాధపురంకి చెందిన వారిగా గుర్తించారు. తమ కుమారుడిని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని సుధాకర్ రావు(76), అరుణ(34)లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం -
పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అవార్డులకు ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను అందిస్తున్నారు. దేశంలోని మూడు జిల్లాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా.. అందులో రెండు జిల్లాలు రాష్ట్రానివే కావడం విశేషం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. చదవండి: Gold News: బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో -
టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి
-
రక్షాబంధన్ రోజు విషాదం
రాపూరు/ఆత్మకూరు/చెన్నూరు: రక్షాబంధన్ రోజు రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరు మూలాపేటకు చెందిన మల్లేశ్వరరావు (35), రాము (22) బైక్పై పెంచలకోన క్షేత్రంలో మిత్రుడి పిల్లలకు తలనీలాలు సమర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాపూరు మండలం రామకూరు ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్నారు. మల్లేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. రామును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నెల్లూరు–ముంబై రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై సంతోష్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (35) ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నెల్లూరుపాలెం వద్ద బోయలచిరువెళ్లకు చెందిన కృష్ణయ్య (67) లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్పై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో అక్కాతమ్ముడు వైఎస్సార్ జిల్లా చెన్నూరు పెన్నా నది బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెరువు మల్లేష్ (45), ఆయన సోదరి ఇండ్ల వెంకట లక్షుమ్మ (47) మృతి చెందగా మేనకోడలు లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. చెరువు మల్లేష్ రాఖీ పర్వదినం సందర్భంగా కడప అల్మాస్పేటలో ఉంటున్న తన అక్క లక్షుమ్మ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి అక్కతోపాటు మేనకోడలిని తీసుకుని బయలుదేరాడు. చెన్నూరు పెన్నాబ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కిందపడడంతో మల్లేష్ చేయి, తలకు, లక్షుమ్మకు తలతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య కాలు తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది. వీరిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకట లక్షుమ్మ, మల్లేష్లు మృతి చెందారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో అక్క మృతి.. ఆ బాధతో తమ్ముడి కన్నుమూత అనకాపల్లి టౌన్: 75 ఏళ్లకుపైగా అనుబంధం వారిది. చివరకు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేకపోయారు. ఇద్దరూ రక్షాబంధన్ రోజునే కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్క రాజా సాగి లలితాదేవి (85) ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె తమ్ముడు ఎస్ఆర్ఎన్ఎంఆర్ రాజు (76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. లలితాదేవి తన భర్త మృతి చెందాక కుమార్తె పద్మినీరాణితో కలసి తమ్ముడు రాజు (76)తోనే 30 ఏళ్లుగా ఉంటున్నారు. అక్క మరణంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి రాజు ఇంటికి చేరుకున్నారు. తర్వాత భోజనం చేసి బంధువులతో ఫోన్లో తన అక్క మృతి విషయం మాట్లాడుతూ గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చాలాకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. -
ఆకట్టుకుంటున్న సీఎం జగన్, దిశ యాప్ శైకత శిల్పాలు
సాక్షి, నెల్లూరు: ఆపదలో ఉన్న ఆడబిడ్డలకు సత్వర సాయం అందేందుకు తోడ్పడుతున్న దిశ యాప్పై ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ప్రశంసలు కురిపించారు. రాఖీ పండగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, దిశ యాప్ శైకత శిల్పాలను ఆయన రూపొందించారు. దిశ యాప్ రూపకల్పనతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ భద్రత కల్పిస్తున్నారని, మహిళలపై జరిగే ఆటవిక చర్యలను ఈ యాప్ ద్వారా అరికట్టడం గొప్ప విషయమని సనత్ కుమార్ పేర్కొన్నారు. మహిళలందరికీ దిశ యాప్ రక్షా బంధన్ లాగా పనిచేస్తుందని తెలిపారు. -
జగనన్న కాలనీ పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పర్యటించారు. వెంకటగిరిలో జగనన్న కాలనీని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తొలివిడతలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న మహిళా లబ్ధిదారులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి తమ సొంతింటి కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేద మహిళా లబ్ధిదారులు తెలిపారు. అనంతరం వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి హజరయ్యారు. చదవండి:ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి -
అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు
సాక్షి, నెల్లూరు : గ్రావెల్ అక్రమాలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈ కృష్ణమోహన్ తెలిపారు. ఉదయ్కుమార్రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్రెడ్డిలపై కేసుపెట్టామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు. గ్రావెల్ తవ్వకాలు ఆపాలని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ ఇచ్చినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. రిజర్వాయర్ కెపాసిటీ పెంచే ఉద్దేశంతోనే మట్టితవ్వకాలు అనుమతిస్తాం. భవిష్యత్తులో ఫొటో ఐడీతో పాటు పూర్తి వివరాలతో అనుమతిస్తాం’’ అని అన్నారు. -
మిగిలిన మునిసి‘పోల్స్’కు కసరత్తు
సాక్షి, అమరావతి: నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలతో పాటు ఇంతకుముందు ఎన్నికలు ఆగిపోయిన 11 మునిసిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు ఆ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి నెలలో రాష్ట్రమంతటా మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో 75 మునిసిపాలిటీలు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా.. వివిధ కారణాలతో 32 మునిసిపాలిటీలతో పాటు 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. వాటిలో అకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), కుప్పం (చిత్తూరు), బేతంచర్ల (కర్నూలు), కమలాపురం (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం) మునిసిపాలిటీలతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కోర్టు ఆటంకాలు ఏవీ లేవని మునిసిపల్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల తయారీ, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అంచనా వేసుకుని, ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోనున్నట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఎన్నికలకూ సన్నద్ధం గ్రామాల్లో నిలిచిపోయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆరా తీశారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులతో సాహ్ని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయిన అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. మరోవైపు అప్పట్లో గ్రామ పంచాయతీల విలీనం, వర్గీకరణ వంటి కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన 259 చోట్ల సర్పంచ్, వాటి పరిధిలోని వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు వివరించారు. నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల నిలిచిపోయిన వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 223 వార్డుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 452 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కౌంటింగ్ నిర్వహించే అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. మిగిలిన గ్రామీణ సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారు: సజ్జల
-
మొన్న చాక్ లెట్లు ... తాజాగా కూల్ డ్రింక్స్ పడేసిన వైనం
-
దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారు: సజ్జల
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘‘పేదలందరికీ ఇళ్లు’’ పథకం అమలుపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని సజ్జల అన్నారు. అంతే కాకుండా ‘‘కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు
సాక్షి, నెల్లూరు : రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కాబట్టే కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ టీడీపీలో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. రైతాంగం కోసం అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధం. లిఫ్ట్ ఇరిగేషన్పై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి?’’ అని డిమాండ్ చేశారు. -
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు మేకపాటి,అనిల్
-
నెల్లూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి,గౌతమ్ రెడ్డి,అనిల్ కుమార్ పర్యటన
-
పాములా ఉన్నా.. పాము కాదు.. మరేంటి?
సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లీ మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లిలో మంగళశారం ఓ వింత జీవి కలకలం సృష్టించింది. సన్నగా దారంలా ఉన్న ఈ జీవి పాము లాగా పాకుతున్న దీన్ని గ్రామంలోని కత్తి కొండమ్మ ఇంట్లో గ్రామస్తులు గుర్తించారు. అయితే ఇది పాము కాదని వారు అంటున్నారు. అటవీ ప్రాంతం నుంచి తరుచుగా ఇలాంటి జీవులు గ్రామంలోకి వస్తాయని అన్నారు. -
ఎన్జీటీని ఆశ్రయించిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగునీటి ప్రాజెక్ట్గానే ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. -
కత్తి మహేశ్ ప్రమాదంపై విచారణలో డ్రైవర్ సురేశ్ ఏమన్నాడంటే..
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొవ్వూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. ప్రమాదం సమయంలో కత్తి మహేశ్ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో మహేశ్ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ విచారణ అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్తో మహేశ్ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం
-
నెల్లూరు: ఎస్బీఐ మేనేజర్ వికృత చేష్టలు
-
నెల్లూరు: ఎస్బీఐ మేనేజర్ వికృత చేష్టలు
నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు ఎస్బీఐ మేనేజర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. రుణాల కోసం వచ్చే మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పొదలకూరు ఎస్బీఐ మేనేజర్ నగేష్ మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రుణం కోసం వచ్చే మహిళలను మభ్యపెట్టి లోబర్చుకునేవాడు. నగేష్ వికృత చేష్టలు సీసీ కెమరాల్లో రికార్డవ్వడంతో అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. -
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
-
బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
-
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
సాక్షి, నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ''తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’డీఎస్పీ రాజగోపాల్రెడ్డి తెలిపారు. వెంకటేష్పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ ఇదిలాఉంటే తేజశ్విని కుటుంబసభ్యులను మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. 'ఇలాంటి ఘటనలను సమాజం తీవ్రంగా పరిగణించాలి. ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాది వెంకటేష్పై కఠినచర్యలు తీసుకోవాలి' అని ఆమె పేర్కొన్నారు. -
గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గూడూరు రెండో పట్టణంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తేజస్విని, వెంకటేష్ అనే యువతీ, యువకులు గూడురు రెండో పట్టణంలోని ఓ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న వీరిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తేజస్విని మరణించగా.. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ జంట ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది అన్న వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏడుగురి కోసం 700 కి.మీ. ప్రయాణం..
చిల్లకూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా, పదిలంగా అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వలంటీర్లు. తమ పరిధిలో ఉండే కుటుంబాల్లో ఒకరిగా కలిసి పోయి సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చేయూత పథకంతో పాటుగా వైఎస్సార్ బీమా యోజన పథకానికి అర్హులైన లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించాల్సి ఉంది. దీంతో వలంటీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు మిక్సెడ్ కాలనీకి చెందిన 70 కుటుంబాలను వలంటీర్ శ్రీరాం అశోక్కు కేటాయించారు. అయితే అందులోని ఏడు కుటుంబాలు బుట్టలు అల్లుకుని, వాటిని విక్రయించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస పోయాయి. కోవిడ్ కారణంగా వారంతా కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరు ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈకేవైసీ చేయించుకోవాలని వలంటీర్ వారికి సమాచారం ఇవ్వగా, వారు తాము రాలేక పోతున్నామని తెలియజేశారు. దీంతో లబ్ధిదారులు నష్ట పోకుండా చూడాలని భావించిన వలంటీర్ అశోక్ చిల్లకూరు నుంచి తుమ్ముకూరుకు సుమారు 700 కి.మీ. దూరం ఉన్నప్పటికీ వెరవకుండా బైక్పై తన సొంత ఖర్చులతో వెళ్లాడు. ఏడుగురు లబ్ధిదారుల చేత ఈకేవైసీ చేయించి, పథకాలకు సంబంధించి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేశాడు. వలంటీర్ అశోక్ను మండల అధికారులు, స్థానికులు అభినందించారు. -
నువ్వు మగాడివైతే చిటికేసి చూడు
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ నువ్వు చిటికేస్తే వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరా.. నువ్వు మగాడివైతే చిటికేసి చూడు. ఈ రాష్ట్రంలో ఏమూలకైనా వస్తా! వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైన చెయ్యి వేస్తే ఊరుకునేది లేదు. సీఎం వైఎస్ జగన్ పాలనలో మేము మంత్రులము కాదు.. అంతకన్నా ముందు మేము ఆయన అభిమానులం. ముఖ్యమంత్రిపై అవాకులు పేలితే సహించం’’ అని అన్నారు. లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక: ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం. లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు లోకేష్. మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది. -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా సి.రాధాకృష్ణ
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం సి.రాధాకృష్ణను సూపరింటెండెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో ఈ రెండు కమిటీలు విచారణ చేశాయి. అలానే డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు కూడా ఈ ఘటనపై విచారణ చేశాయి. చదవండి: నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్పై వేటు -
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణ జరిపి..సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. తప్పు చేసిన వారికి కఠిన చర్యలు:నెల్లూరు ఇంచార్జి కలెక్టర్ హరే౦దిర ప్రసాద్ నెల్లూరు : జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయి. ఒకటి డీఎంఈ తరపున ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ.. మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ. జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో , ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా)తో త్రిసభ్యులు ఉంటారు. డీఎంఈ తరపు కమిటీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తే.. డిస్ట్రిక్ట్ కమిటీ బయటనుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డీఎంఈ కమిటీ కానీ, డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుంది. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవు. -
‘యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, అమరావతి: ఇరిగేషన్ అధికారులతో సోమవారం మంత్రి అనిల్కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆర్అండ్ఆర్పై దృష్టి పెట్టి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. చదవండి: ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్ -
కోటయ్య పరిస్థితి నిలకడగానే ఉంది: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు : ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్, ఆయూష్ నివేదికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ప్రతిఒక్కరూ రాజకీయాలు పక్కనబెట్టి ప్రభుత్వానికి సహరించాలని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండ్రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందు వేసుకున్న.. రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. శనివారం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి అనిల్ పర్యటించారు. అధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అన్ని విధాలా ముందుకెళ్తున్నామన్నారు. ప్రధాన ఆస్పత్రిలో మరో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటుకు యత్నిస్తున్నామని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. -
అందుకే ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశాం: ఆనందయ్య
-
‘అందుకే ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశాం’
సాక్షి, నెల్లూరు : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్ది భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందును పంపిణీ చేశామని ఆనందయ్య తెలిపారు. తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ నిలిపివేశామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్ధాలు సేకరించడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే మందు పంపిణీ ప్రారభించాం: ఎమ్మెల్యే కాకాని ‘‘ఆనందయ్య వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. భౌతిక దూరం పాటించని అంశాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. కరోనాతో ఆక్సిజెన్ లెవల్స్ తగ్గిన వారికి కంట్లో డ్రాప్స్ వేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. అందుకే మందు పంపిణీ ప్రారభించడం జరిగింది. రద్దీ కారణంగా పంపిణీ సవ్యంగా సాగలేదు. సీఎం జగన్ కూడా దీనిపై సమీక్ష చేశారు. ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. ఐసీఎంఆర్ బృందం కూడా నెల్లూరు రానుంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరూ రావద్దు. ఆన్లైన్లో సర్వీస్ కూడా చేపట్టాలని అనుకుంటున్నా౦’’. చదవండి : పోటెత్తిన జనం.. ఆయుర్వేదం మందు పంపిణీ నిలిపివేత -
రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా: మంత్రి గౌతమ్రెడ్డి
సాక్షి, నెల్లూరు : రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో రోగులు కోలుకోవడానికి ఇచ్చే ఔషధాల సరఫరా, డిమాండ్, ఐసొలేషన్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్తో మంత్రి మేకపాటి గురువారం చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జీజీహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ప్రజల ఇబ్బందులు, కరుణ సోకిన వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాసేవకు అసలైన గుర్తింపని, మండలస్థాయిలో ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నోడల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని, ఆక్సిజన్ అత్యవసర సమయంలోనే అవసరమనుకుంటేనే వినియోగించాలని అన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా కోవిడ్ వచ్చిన వారికి అవగాహన కల్పించడం కూడా అవసరమన్నారు. -
నెల్లూరు: ఉదయగిరి కోట
ఉదయగిరి దుర్గం... రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన పయనంలో ఈ దుర్గం దాటిన మైలురాళ్లు ఒకటి కాదు రెండు కాదు. గజపతుల పాలనకు ముందు విజయనగర పాలకుల స్వాధీనంలో ఉండేది. పల్లవులు, కాకతీయులు, చోళులు, గోల్కొండ, ఆర్కాటు నవాబులతోపాటు బ్రిటిష్ పాలననూ చూసింది. ప్రతి పాలకులూ ఈ దుర్గంలో తమ ఆనవాళ్లను ప్రతిష్ఠించారు. సూర్యుడి తొలికిరణాలు కొండ మీద ప్రసరిస్తాయి కాబట్టి ఉదయగిరి అనే పేరు వచ్చింది. సుదీర్ఘ యుద్ధం చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది. సంజీవని కొండ ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం ‘ఉదయగిరి దుర్గం కథలు’లో ఉంది. సామరస్య సు‘గంధం’ ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు – ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
సాక్షి, నెల్లూరు : తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తి మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి ప్రథమ చికిత్స చేశారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఎంపీ ఆభ్యర్ధి గురుమూర్తి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్ శ్రీకాళహస్తి ప్రచారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఏర్పేడు వద్ద ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించారు. ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి మనసు చలించిపోయిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్లు వారికి సహాయం చేయటానికి పూనుకున్నారు. డా.గురుమూర్తి రంగంలోకి దిగి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్సులో వారిని దగ్గరలోని ఆసుపత్రికి పంపారు. -
‘ఏడాదిలోనే హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ది’
నెల్లూరు: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడాది కాలంలోనే అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇలా ఎన్నికల హామీలను ఏడాది కాలంలో అమలు చేసిన నేత దేశంలోనే ఎవరూ లేరని, ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. 38లక్షలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, నాడు-నేడు కార్యక్రమంలో ద్వారా స్కూళ్లకు అద్భుతమైన రూపు ఇచ్చామనన్నారు. గూడురులో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్ట్లను అవిశ్రాంతంగా పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కెల మాటలకు జనం చెల్లుచీటి ఇచ్చారన్నారు. ఇక ఈ సభలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టకతో వచ్చిన విద్య. తిరుపతిలో తండ్రీ కొడుకులు ప్రచారం చేసినా లాభం లేదు’ అని విమర్శించారు. ఇక ఎంపీ మోపీదేవి మాట్లాడుతూ.. ఎన్నికలంటే టీడీపీ భయం పట్టుకుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డా. గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
నిమ్మగడ్డకు షాకిచ్చిన కంపసముద్రం గ్రామస్తులు
సాక్షి, నెల్లూరు: మంత్రి గౌతమ్రెడ్డి ఇలాకలో పంచయతీ ఎన్నికలు సంచలనంగా మారాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై కంపసముద్రం గ్రామస్తులు తిరగుబాటు చేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మాణం తీసుకుని ఎస్ఈసీకి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎసీఈసీగా ఉన్నంతకాలం పంచాయతీ ఎన్నిక వద్దంటూ గ్రామస్తులు తీర్మాణించడంతో అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి మొదట 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వారంతా గ్రామస్తుల తీర్మాణంతో నామినేషన్ను ఉపంసహరించుకున్నారు. -
‘ఎవరు రెచ్చగొట్టినా.. రెచ్చిపోవద్దు’
సాక్షి, నెల్లూరు : ‘ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలి. వీలైతే ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకోవాలి. ఎవరు రెచ్చగొట్టినా జిల్లా నాయకులెవరూ రెచ్చిపోవద్దు. ఓటర్లందరినీ చైతన్యపరచండి’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, డబ్బుతో ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడితే అలాంటి వారిని చట్టానికి పట్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. వీలైనంత వరకు జిల్లా నాయకులు గ్రామ స్థాయిలో చర్చలు జరిపి వాళ్లంతట వాళ్లే నాయకుడ్ని ఎన్నుకునేలా ప్రోత్సహించాలని, అలా చేస్తే తొలిసారిగా ఆదర్శవంతమైన ఎన్నికలు జరుగుతాయని, గ్రామ స్వరాజ్యం సుస్థిరంగా నిలబడుతుందని అన్నారు. ( చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి ) రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అడ్రస్ లేకుండా గల్లంతవుతామనే భయంతో టీడీపీ ఎంతో మంది చేత నామినేషన్ వేయించి అదే విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేయాలన్న దుర్బుద్ధితో టీడీపీ ఉందని మండిపడ్డారు. -
ప్రేమ విఫలం: పానీపూరి బండి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాయుడుపేట టౌన్: పట్టణంలోని అమరాగార్డెన్ వీధిలో నివాసం ఉంటూ పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాకు చెందిన యువకుడు సర్వేష్కుమార్ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమ విఫలమవడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. గత కొంత కాలంగా యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ యువతితో మనస్పర్థలతో రావడంతో సర్వేష్ కుమార్ దిగాలుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులకు సైతం ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా వారు నమ్మలేదు. దీంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు సోముకుమార్తో పాటు బంధువులు అవేదన చెందారు. పోలీసులు సర్వేష్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపి సోమవారం సాయంత్రం అప్పగించారు. యువకుడి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో నాయుడుపేటలో ఉంటున్న బంధువులే దగ్గరుండి మృతుడి సోదరుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు వాట్సప్ ద్వారా కడ చూపులు చూసుకున్నారు. యవతి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత పట్టణంలోని గరిఢీ వీధిలో నివాసం ఉంటున్న మైనార్ ప్రేమ విఫలం కావడంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మైనర్ మృతదేహానికి పోలీసులు పోస్టమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు సోమవారం అప్పగించారు. వైద్యశాల వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. (చదవండి: విచారణకు వస్తానని చెప్పి..) -
పేద బిడ్డలకు పెద్ద చదువులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నింటిని నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘గత సర్కారు హయాంలో జూన్లో బడులు తెరిస్తే అక్టోబర్లో పుస్తకాలు ఇచ్చే దుస్థితి. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ లేకపోగా బిల్లులు, ఆయాల జీతాలు 8 నెలలు పెండింగ్లో పెట్టేవారు. ఇంగ్లిష్ మీడియం కేవలం ప్రైవేట్ బడుల్లోనే ఉండేది. అక్కడ ఫీజులు ఎక్కువ కావడంతో చదివించాలంటే స్థోమత లేని పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. బాత్రూమ్లు దారుణంగా ఉండేవి. వీటన్నింటితో ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న దుస్థితి. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెంచేందుకు అనుమతులిచ్చి పేద పిల్లలను చదువుకు దూరమయ్యే పరిస్థితి కల్పించారు. ఈ రోజు ఆ పరిస్థితిని మార్చే పనిచేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకుండా వారి మేనమామ పరిపాలన చేస్తున్నాడని సగర్వంగా చెబుతున్నా’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా మొత్తం బడుల రూపురేఖలు మార్చేస్తున్నామని దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తొలిదశలో 15,715 బడుల రూపు రేఖలు మార్చే పనులు ఇప్పటికే మొదలై చకాచకా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి అక్కా, చెల్లి తనను నమ్మారని, తమ బిడ్డలను వారి మేనమామ చూసుకుంటాడనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని, అందుకే గతంలో 38 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ రోజు 42 లక్షలకు చేరిందన్నారు. . రాష్ట్ర మహిళలు గర్వించేలా... జగనన్న అమ్మఒడి దాదాపు 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అందుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రెండు వారాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. విద్యా దీవెన కింద 18.52 లక్షల మందికి రూ.4,101 కోట్లు, వసతి దీవెన కింద 15.56 లక్షల మందికి రూ.1,221 కోట్లు, ఆసరా తొలి విడత కింద 87.74 లక్షల మందికి, రూ.6,792 కోట్లు, చేయూత కింద 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు, పొదుపు సంఘాలకు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లు, కాపు నేస్తం కింద 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.491 కోట్లు ఇచ్చాం. ఇలా ఏ కార్యక్రమం చూసినా వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇంటి స్థలమైనా, ఇంటి నిర్మాణమైనా అక్క చెల్లెమ్మల పేరుతోనే చేపడుతున్నాం. మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా అన్ని నామినేట్ పనులు, పదవుల్లో 50 శాతం వారికే ఇస్తున్నాం. ఇందు కోసం చట్టాలు చేశాం. భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్లో తిరగరాస్తున్నామని గట్టిగా చెబుతున్నా. 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు 19 నెలల ప్రభుత్వ పాలనలో పిల్లల చదువుల కోసం అక్షరాల రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారానే రూ.13 వేల కోట్లు, విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది పిల్లలకు రూ.4,101 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.1,221 కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.1,863 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద దాదాపు రూ.648 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,456 కోట్లు ఖర్చు చేస్తున్నా. పాఠశాలల్లో నాడు-నేడు కింద మొదటి దశలో రూ.2,600 కోట్లు ఖర్చు చేసి మొత్తంగా రూ.24,600 కోట్లు ఖర్చు చేశాం. పేదింటి పిల్లలంతా చదువుల బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలని అమ్మఒడికి శ్రీకారం చుట్టాం. పేద పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ల తలరాతలు మారాలి. చదువుల రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా చెబుతున్నా. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రెండో విడత ఇస్తున్నాం. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయంగా అందిస్తున్నాం. ప్రతి పిల్లవాడిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కాన్వెంట్ బడులకు వెళ్తున్నప్పుడు ఉండే ఆత్మ స్థైరం మాదిరిగా విద్యాకానుక ఇచ్చాం. పౌష్టికాహారం.. ఇంగ్లీషు మీడియం.. ప్రతి పిల్లవాడికి ఆరో సంవత్సరం వచ్చే సరికి 85 శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి సమయంలోనే గట్టి పునాదులు పడతాయని, అందుకే మంచి పౌష్టికాహారంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో పునాదులు కూడా పడాలని ఖర్చుకు వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. విద్యాకానుక ద్వారా ఇచ్చే స్కూల్ కిట్ల నాణ్యతను నేను స్వయంగా బూట్లు పట్టుకుని పరిశీలించా. ఈసారి మరింత నాణ్యతతో ఉండాలని అధికారులకు చెప్పా. నాడు-నేడుతో స్కూళ్లను సమూలంగా మారుస్తున్నాం. మధ్యాహ్న భోజనం మెనూ మార్చి రోజుకో వెరైటీతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తెచ్చాం. కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయిస్తున్నాం. ఇంటర్ తర్వాత పిల్లల చదువులు ఆగి పోకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యాదీవెన, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన ద్వారా ఏటా ప్రతి పిల్ల వాడికి రూ.20 వేలు ఇస్తున్నాం. కరిక్యుకులమ్లో మార్పులు చేసి చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చేలా అప్రెంటీస్షిప్ను అమలు చేస్తున్నాం. 8వ తరగతి నుంచే కంప్యూటర్ లిటరసీ కోర్సు కూడా ప్రవేశ పెడుతున్నాం. డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితి కల్పిస్తున్నాం. చీకటి పనులు చేసేవారు.. చీకటి పనులు చేసేవారు, వెన్నుపోట్లు తెలిసిన వారు, దొంగ దెబ్బతీసే వారు, వ్యవస్థలో కోవర్టులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు... మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆరాట పడుతున్న రాజకీయ శక్తులను గమనించమని ప్రజలను కోరుతున్నా. ఇలాంటి రాజకీయ శక్తులతో మనం ఇవాళ పోరాటం చేస్తున్నాం. -
11న నెల్లూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు పయనం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్ధేశించి మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు. -
భూ కబ్జాలు బట్టబయలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక సర్వేతో కబ్జా కోరల్లో ఉన్న భూముల బండారం బట్టబయలు కానుంది. భవిష్యత్లో భూ ఆక్రమణలకు శాశ్వతంగా చెక్ పడనుంది. జిల్లాలో ఒకటిన్నర దశాబ్ద కాలంలో భూముల విలువలు అపారంగా పెరిగాయి. ఈ పరిణామాలతో రాజకీయ అండతో రెవెన్యూ అధికారులను లోబర్చుకుని బడాబాబులు భూకబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు జిల్లాలో వేలాది ఎకరాలను కబ్జా చేశారు. రీ సర్వేతో ఆక్రమణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో టీడీపీ హయాంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా భూ కబ్జాలకు తెరతీశారు. గ్రామ స్థాయి నేత నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ భూములు ఆక్రమించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వందల ఎకరాల భూములు అప్పటి అధికార పార్టీ నేతల కోరల్లోకి వెళ్లాయి. సముద్ర తీర ప్రాంతం మొదలుకుని పెన్నా నది పొరంబోకు వరకు దేన్నీ వదలకుండా శక్తి మేరకు భూములను ఆక్రమించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కలిపి రియల్ వెంచర్లుగా మార్చి విక్రయాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో వందేళ్ల చరిత్రకు నాంది పలుకుతూ భూ హక్కులను పదిలం చేస్తూ వైఎస్సార్, జగనన్న శాశ్వత భూహక్కు– భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి సెంటు భూమిని సమగ్రంగా రీ సర్వే చేసి శాశ్వత హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైంది. ► జిల్లాలో అపారంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటు జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ► గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధులు కొందరు, తెలుగు తమ్ముళ్లు పట్టణాలు, నగరం మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భూములను చెరపట్టారు. ► ఐదేళ్ల కాలంలో ప్రతి నియోజకవర్గంలో సగటున వెయ్యి ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం. ► కొన్ని చోట్ల సాగు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల రొయ్యల గుంతలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని చోట్ల విక్రయాలు చేశారు. ► జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 400 గ్రామాల్లో సర్వే ప్రారంభం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో 400 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో సర్వే పూర్తి చేయనునున్నారు. నెల్లూరు డివిజన్లో 104, కావలి డివిజన్లో 56, గూడూరు డివిజన్లో 113, ఆత్మకూరు డివిజన్లో 61, నాయుడుపేట డివిజన్లో 66 గ్రామాల్లో తొలి విడతగా ఈ నెల 23న గూడూరు రూరల్ మండలంలోని రెడ్డిగుంట నుంచి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ప్రారంభించారు. అన్ని రకాల భూములను రీ సర్వే చేసి యజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి భూమిని డ్రోన్ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని కంప్యూటర్లో చెక్ చేసి రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి కచ్చితమైన కొలతలు వేసి ఉచితంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ప్రత్యేక మ్యాప్ ఆధార్ తరహాలో యూనిక్ నంబర్ ఇచ్చి వివరాలు నమోదు చేయనున్నారు. భూ యజమానికి యూనిక్ నంబర్, క్యూఆర్ కోడ్ను కేటాయించనున్నారు. భవిష్యత్లో భూ ఆక్రమణలకు చెక్ పడనుంది. సాగర తీరం నుంచి సాగుభూమి వరకు.. జిల్లాలో సముద్ర తీరం నుంచి సాగు భూమి వరకు కబ్జా కోరల్లో ఉంది. ప్రధానంగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూములను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఆక్రమించి పట్టాలు కూడా సృష్టించుకోవడం గమనార్హం. ► కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం, దగదర్తి మండలంలో సగటున 150 ఎకరాలకు పైగా భూములు టీడీపీ నేతల అధీనంలో ఉన్నాయి. కావలి పట్టణానికి సమీపంలోని సుమారు 50 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ► ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం రాగిపాడులో 70 ఎకరాల భూమి టీడీపీ నేత ఆక్రమించగా కొంత స్వాధీనం చేసుకున్నారు. వరికుంటపాడు మండలం బొంగరాలపాడులో 50 ఎకరాల వరకు స్థానిక టీడీపీ నేతలు భూమిని ఆక్రమించారు. ► గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం కడివేడులో 150 ఎకరాలు, కోట మండలం కేశవరం, రాఘవవారిపాళెంలో 25 ఎకరాలు ఆక్రమణల పర్వంలో ఉంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని మర్రిపాడు, చేజర్లలోనూ ఇదే తరహాలో ఆక్రమణలు ఉన్నాయి. ► కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా సముద్ర తీర ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఈ మండలంలోని కొరటూరు, మైపాడులో దాదాపు 11 సర్వే నంబర్లలో 150 ఎకరాలు, రామడుగుపాళెంలో 5 సర్వే నంబర్లలో 318 ఎకరాలు, కొరుటూరు ఒకే సర్వే నంబర్లో 23.50 ఎకరాలు, జగదేవిపేటలో 6 సర్వే నంబర్లలో 60 ఎకరాలు ఆక్రమణలో ఉంది. వీటిలో మైపాడు, కొరుటూరులో ఆక్రమిత స్థలాల్లోనే హేచరీలు ఉండడం గమనార్హం. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా భూ ఆక్రమణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. భూ రక్ష పథకంతో ఇవన్నీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రానున్నాయి. -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదు
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయ పరిపాలన అధికారులను హెచ్చరించారు. జిల్లా నగరపాలక సంస్థ సచివాలయం పరిపాలన అధికారులతో బుధవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అన్ని పార్టీలతో అఖీల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నగర అభివృద్దికి అందరి అభిప్రాయాలు కొతామని, ప్లెక్సిల ఏర్పాటు అంశంపై అందరి సలహాలు తీసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ఫ్లెక్సీలు ఏర్పాటుపై కూడా నియంత్రణ చేస్తామని, అవసరమైతే పెనాల్టీ వేసే అంశం ఆలోచిస్తామని చెప్పారు. ఆ నిబంధనలు తన ఫ్లెక్సీల విషయంలోనూ వర్తిస్తాయన్నారు. వరదల ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడేందుకు అఖిలపక్షం సలహాలు కొరతామని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లేదన్నారు. నాలుగు సార్లు గెలుచిన కొడాలి నాని గురించి రెండు చోట్ల ఓడిన పెద్ద మనిషి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మీరు ఏ లింగమో ప్రజలెప్పుడో తేల్చారని, రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయను మీరే చెప్పారు కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తే ప్రభుత్వం ఊరికే కూర్చోదని, చట్టం పని చట్టం చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. -
పేలిన గ్యాస్ సిలిండర్, ఫ్రిజ్
సాక్షి, సూళ్లూరుపేట: అందరూ గాఢనిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని కాపువీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కాపువీధిలో నివాసం ఉంటున్న వంకా శ్రీనివాసులు (49), భార్య వంకా మునిసుబ్బమ్మ (40) కుమార్తె జాహ్నవి (10) కుమారుడు చరణ్సాయి (4) ఆదివారం రాత్రి భోజనాల అనంతరం అందరూ నిద్రిస్తున్నారు. సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో గ్యాస్ వాసన వస్తుండడంతో అప్రమత్తమైన శ్రీనివాసులు లేచి లైట్ వేయగానే ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. లీకైన గ్యాస్ ఫ్రిజ్ కిందకు కూడా వ్యాపించడంతో మంటలు అధికమై ఫ్రిజ్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. లీకైన గ్యాస్ బెడ్రూంలోకి కూడా వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు మంచాల కింద నుంచి మంటలు రేగి అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేస్తే ఓజిలిలో ఉన్నట్లు సమాధానం చెప్పారు. ఆగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయడం లేదు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు స్పందించి స్థానికులతో కలిసి క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాసులు, కుమార్తె జాహ్నవి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మునిసుబ్బమ్మ, చరణ్సాయి పరిస్థితి మెరుగ్గా ఉందని బాధిత బంధువుల ద్వారా తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. -
‘సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు’
సాక్షి, నెల్లూరు : ఈ రోజు(శుక్రవారం) ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజని, ఒకే రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. శుక్రవారం నెల్లూరు నగర జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్లో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 లక్షల ఇళ్లు ప్రారంభించింది.. వాటిని పూర్తి చేయలేదు. ఇంటి స్థలాల కేటాయింపులో కులం, మతం చూడలేదు. సిపార్సులు అసలు లేవు, అర్హులైన అందరికి ఇళ్లు ఇస్తున్నాము. టీడీపీ కుట్ర రాజకీయాల వల్లే ఇంటి పట్టాల పంపిణీ జాప్యం అయింది. ( నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) మాట ఇస్తే తప్పని గొప్ప నేత.. మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మహిళలు నీరాజనం పలుకుతున్నారు. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ పేదలను దోచుకోవాలని చూసింది. కానీ, ముఖ్యమంత్రి ఉచితంగా అదే టిడ్కో ఇళ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం 14 వేల ఇళ్లు ఇవాళ ఒక రూపాయకే ఇస్తోంది. ఇంటి స్థలాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. నగర పరిధిలో 14 వేల ఇంటి పట్టాలు ఇస్తున్నాం. 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాం. 70 కోట్లతో పెన్నా బ్యారేజీకి అటు ఇటుగా బండ్ కడతాం.. వరద వచ్చినా కాలనీలకు ప్రమాదం లేకుండా చేస్తా’’మని అన్నారు. -
అయ్యో.. ఆటోకెంత కష్టం వచ్చింది
సాక్షి, నెల్లూరు : పరిమితికి మించి ప్రయాణికులు, సరుకులతో ఆటోలు రాకపోకలు సాగించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారుతోంది. ఫలితంగా రోడ్డుపై రాకపోకలు సాగించే వారు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకోవాల్సి వస్తోంది. వెంకటేశ్వరపురంలోని ఓ మినరల్ వాటర్ ప్లాంట్కు చెందిన ఆటోలో వాటర్ ప్యాకెట్ల బస్తాలను పరిమితికి మించి శనివారం తరలిస్తుండగా, ఇలా అదుపుతప్పింది. బరువు కారణంగా ముందు టైరు పైకి లేచింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
వీర్లగుడిపాడుపై శాశ్వత బ్రిడ్జి నిర్మిస్తాం : మేకపాటి
సాక్షి, నెల్లూరు : నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోయకవర్గం లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వరద ముంపు గ్రామాలలో పర్యటించారు. చేజార్ల ,సంగం ,అనంతసాగరం మండలాల్లో పలు గ్రామాలతో పాటు వీర్లగుడిపాడు గ్రామాన్ని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మేకపాటి తానే స్వయంగా పడవను నడుపుతూ గ్రామస్తులను పలకరించారు. నీట మునిగిన గ్రామాన్ని చూసిన మంత్రి మేకపాటి చలించిపోయారు. వీర్లగుడిపాడుకు బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం అంశమై పరిశీలించారు. ఇక భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా గ్రామస్తుల రాకపోకలకు అంతారయం కలగకుండా బ్రిడ్జి కట్టిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు భోజన సదుపాయాలు, ఇతర అత్యవసరాలపై అధికారులతో కలిసి చర్చించారు. వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్డీవోకు మంత్రి ఆదేశించారు. కాగా తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ గ్రామస్తులు మంత్రి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అంతకు ముందు పెన్నా నది ప్రవాహాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదేనని పేర్కొన్నారు. డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలివ్వనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో పెన్నానదిపై 50 కి.మీ వద్ద సంగం ఆనకట్ట, 81 కి.మీ వద్ద నెల్లూరు ఆనకట్ట అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాలను తాకుతూ పెన్నా ప్రవాహం కొనసాగుతుంది. -
‘నివర్’ బీభత్సం
సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ సాక్షి నెట్వర్క్ : నివర్ తుపాను అతి తీవ్రంగా ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటిన తుపాన్ ► బుధవారం అర్థరాత్రి 11.30 గంటలకు సముద్రంలో కల్లోలం సృష్టిస్తూ.. ‘నివర్’ తుపాన్ తీరం వైపు కదిలింది. రాత్రి 2.30 గంటల సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులతో భూమిని తాకి.. వాయవ్య దిశగా పయనమైంది. ► అయినా సముద్రంలో కల్లోలం కొనసాగుతుండటంతో ఆశ్చర్యపోయిన వాతావరణ కేంద్రం అధికారులు.. ఇంకా నివర్లోని కొంత భాగం అక్కడ ఉందని గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకు మిగిలిన భాగం కూడా తీరం వైపు కదిలి, ముందు భాగంలో విలీనమై అతి తీవ్ర తుపాన్గా తీరం దాటింది. ► తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, వాడరేవు పోర్టుల్లో లోకల్ సిగ్నల్ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక సూచీని ఎగరేశారు. ► శుక్రవారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా అతలాకుతలం ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. కోట మండలంలో ఒక్క రాత్రికే 25 సెం.మీ.వర్షం కురిసింది. 30 మండలాల్లో 10 సెం.మీ. నుంచి 24 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ► లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. గూడూరు వద్ద ఏషియన్ హైవే పైకి వరద నీరు రావడంతో రెండు మార్గాల్లో పూర్తి స్థాయిలో వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ► నాయుడుపేట–తిరుపతి మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ను మళ్లించారు. వెంకటగిరి–రాపూరు మార్గంలోని నేషనల్ హైవేలో లింగసముద్రం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఆత్మకూరు–సోమశిల ప్రధాన రహదారిపై దేపూరు వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ► జిల్లాలోని పెన్నానదితో పాటు కాళంగి, స్వర్ణముఖి, ఉపనదులైన బొగ్గేరు, కేతామన్నేరు, పంబలేరు, చిప్పలేరు, కైవల్యా, గొడ్డేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని చెరువులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. లింగాలపాడు చెరువుకు గండిపడడంతో నీరంతా గ్రామాన్ని చుట్టుముట్టింది. బొప్పాయి, మిరప, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ► ఈదురు గాలులకు 89 పెద్ద చెట్లు, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 3,365 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. ► వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. దీంతో సోమశిల అన్ని గేట్లు ఎత్తేసి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నానది ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో పెన్నా పరీవాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. కలెక్టర్ చక్రధర్బాబు, జేసీలు ప్రభాకర్రెడ్డి, హరేందర ప్రసాద్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గూడూరు నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు తిప్పవరప్పాడు వద్ద కాజ్వేను దాటుకుని సైదాపురం కైవల్యా బ్రిడ్జి సమీపానికి వెళ్లే సరికి అక్కడ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆగిపోయింది. వెనక్కు మళ్లించే సరికి కాజేవేపై ఐదు అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో బస్సు సహా, ఇతర వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ చొచ్చుకు వచ్చిన సాగరతీరం ► కృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు మీటర్లు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ మేర నీరు ముందుకు చొచ్చుకువచ్చింది. మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి. ► కృష్ణా జిల్లాలో 27,769 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. గన్నవరం విమానాశ్రయంలో 10 సర్వీసులకు గాను మూడు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 7 సర్వీసులు విజిబిలిటీ లేక రద్దయ్యాయి. చిత్తూరు జిల్లా గజగజ ► చిత్తూరు జిల్లాను నివర్ తుపాను చిగురుటాకులా వణికించింది. ► సదు మండలం జాండ్రపేట పొట్టెంవారిపల్లెకు వెళ్లే రహదారి పక్కనున్న చెరువులో గుర్తుతెలియని మహిళ గల్లంతయ్యారు. సోమల మండలం సీతమ్మ చెరువు పొంగి ప్రవహించడంతో అటుగా వాహనంలో వెళ్తున్న నలుగురు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. ► పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద పాపిరెడ్డి చెరువు మొరవ ఉధృతంగా పోతోంది. దాన్ని దాటే క్రమంలో పాల వ్యాన్ కొట్టుకుపోగా అందులో ఉన్న ఇద్దరు దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ► కాణిపాకం సమీపంలోని పుణ్యసముద్రం వద్ద ఒకరు వరదలో చిక్కుకోగా అతన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తిరుమల ఘాట్ రోడ్లలో బండరాళ్లు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. మాడ వీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. పాపవినాశనం, గోగర్భం గేట్లను ఎత్తిని నీటి విడుదల చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కడపలో భయపెడుతున్న బుగ్గవంక ► కడప నగరంలో 19,000 క్యూసెక్కులతో బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగరాజుపేట, రవీంద్రనగర్, ద్వారకానగర్, బాలాజీనగర్, మోచంపేట, పాతబస్టాండ్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ హరికిరణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ► కడప–తిరుపతి రహదారిలోని ఊటుకూరు, బాలుపల్లెల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో రాయచోటి వైపు ›ట్రాఫిక్ మళ్లించారు. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. ► గుంటూరు జిల్లాలోని పశ్చిమ డెల్టా, పల్నాడు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల వాలింది. పత్తి, మిరప పంటలపై తుపాన్ ప్రభావం చూపింది. ► ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో నీరు చేరింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 131 పునరావాస కేంద్రాలు, 93 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. ఇదీ వర్షపాతం.. రైల్వేకోడూరులో 25 సెం.మీ, వెంకటగిరిలో 24 సెం.మీ, గూడూరులో 19, రాపూరులో 16, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో 15, నెల్లూరు, కావలి, సత్యవేడు, సంబెపల్లెలో 14, రాజంపేట, తిరుపతిలో 13, తొట్టెంబేడు, పుత్తూరులో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనాల కాలం.. హిమాలయాల్లో ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో కొనసాగిన ఇంట్రా ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే ప్రాంతం) ప్రస్తుతం అరేబియా, బంగాళాఖాతాల్లో కొనసాగుతోంది. దీని వల్ల ఈ రెండు సముద్రాల్లో అల్పపీడనాలు వరుసగా ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ నిపుణుడు, ఏయూ వాతావరణ విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ భాను కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 29న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించారు. డిసెంబర్ నెలలోనూ వరుసగా తమిళనాడు సమీప సముద్ర తీరాల్లో అల్పపీడనాలు ఏర్పడతాయని చెప్పారు. తమిళనాడుకు తప్పిన భారీ ముప్పు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీయకుండా తమిళనాడులో నివర్ తుపాన్ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. కేవలం రెండు జిల్లాలపై మాత్రమే ప్రభావం చూపడంతో భారీ నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు భయానక పరిస్థితులు కొనసాగాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, వేలూరు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తుపాన్ తీరందాటిన ప్రభావం కొనసాగింది. పుదుచ్చేరి–మరక్కానం మధ్య విల్లుపురం జిల్లా అళగన్కుప్పం ప్రాంతాన్ని ఎన్నడూ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు కుదిపేశాయి. దీంతో వేలాది వృక్షాలు కూలిపోయాయి. ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపి వేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోలేదు. కడలూరు, విల్లుపురం జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం సంభవించింది. ► 2015 డిసెంబర్ స్థాయిలో కాకున్నా నివర్ తుపాన్ ధాటికి చెన్నై మరోసారి నీట మునిగింది. మొత్తం 5 లక్షల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించగా ప్రజలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయారు. ► చెన్నై శివార్లలోని తాంబరం–ముడిచ్చూరులలో గత 24 గంటల్లో 31.4 సెంటీమీటర్ల వర్షం పడడంతో 10 వేలకు పైగా ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి. ► ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను రబ్బర్ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో 267 వృక్షాలు కూలిపోయాయి. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక చర్యల కోసం కడపలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద పడవను సిద్ధం చేసిన యంత్రాంగం నెల్లూరు జిల్లా లింగ సముద్రం వద్ద వరద ఉధృతికి కూలిన బ్రిడ్జి చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తున్న సహాయక సిబ్బంది నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నీట మునిగిన సవారి గుంట ప్రాంతం తిరుమలలోని ప్రధాన ఆలయం వద్ద వరద నీరు భారీ వర్షాలకు కొండపై నుంచి పడుతున్న నీటితో నిండుగా కపిలతీర్థం తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న పోలీసులు ఈదురు గాలుల ధాటికి పుదుచ్చేరిలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు నివర్ తుపాన్కు జలమయమైన చెన్నైలోని ముడిచ్చూరు ప్రాంతం -
నెల్లూరు: కత్తులతో యువకుల హల్చల్!
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో ఓ షార్ట్ ఫిల్మ్ ట్రూప్ హల్చల్ చేసింది. కొంతమంది యువకులు కత్తులతో బైక్పై చక్కర్లు కొడుతూ స్థానికులను బెంబేలెత్తించారు. షూటింగ్ను నిజమైన గొడవేమోనని భావించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ముత్తుకూరు గేటు వద్దకు చేరుకున్నారు. షార్ట్ఫిల్మ్ షూట్కు అనుమతి లేదంటూ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము కార్పొరేషన్ వద్ద పర్మిషన్ తీసుకున్నామని చెప్పడంతో మందలించి వదిలేశారు. -
20 నిమిషాల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
సాక్షి, తిరుమల: తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు 20 నిమిషాల్లో ఛేదించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దుండగలను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ ముని రామయ్య సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లాకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు తిరుమలలో కిడ్నాప్ చేశారని చెప్పారు. భర్త కిడ్నాప్కు గురి కావడంతో హనుమంతరావు భార్య 100కు డయల్ చేసి సమాచారం అందించారని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రక్షక సిబ్బంది ఇన్నోవా వాహనాన్ని వెంబడించి అలిపిరి వద్ద కిడ్నాపర్స్ను 20 నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక లావాదేవిల కారణంగానే హనుమంత రావును కిడ్నాప్ చేసిన ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులైన కుమార్, సురేష్, మూర్తినలు అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశామన్నారన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేసిన రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. దుండగుల ఇన్నోవా వాహనాన్ని వేగవంతంగా వెంబడించి కేసును 20 నిమిషాల్లో ఛేదించిన రక్షక టీం కానిస్టేబుల్స్ మణికంఠ, శేఖర్ హోంగార్డు వెంకటేష్లకు ప్రశంస్తూ వారికి ఏఎస్పీ రివార్డు అందజేశారు. -
నెల్లూరు జిల్లాలో పెను విషాదం
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరెంట్ వైర్ ఆ ఇంటి యమపాశంగా మారి ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. వివరాలు.. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఒక ఇంటి ప్రధాన గేటుపై 11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించకుండా గేటు తీసిన ఇంటి యజమాని టీచర్ వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే భర్తను రక్షిద్దామని ఏం ఆలోచించకుండా వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బజ్జమ్మ(70) వేణుగోపాల్ చేయి పట్టుకోవడంతో షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
అప్పుడు మిల్లర్లతో కుమ్మకై.. ఇప్పుడు మొసలి కన్నీరు
సాక్షి, నెల్లూరు: ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో నెల్లూరు జిల్లాలో రైతులు రెండు పంటలు పండించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కోకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లా చరిత్రలొనే మొదటిసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం రూ. 793 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. రెండో పంటకు సంబంధించి ఇప్పటికే 2 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, వర్షాల వల్ల తేమ శాతం నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నా.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. మిల్లర్లతో సంప్రదించి రైతులకు న్యాయం చేస్తున్నామని, పక్క జిల్లాలలోని గోదాముల్లో కూడా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో ఎంత కొనుగోలు చేశారో రికార్డులు చూడాలని, లెక్కలు తెలియకుండా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మిల్లర్లతో కుమ్మకై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతుల కంటే మిల్లర్లకే లబ్ది కలిగిందని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పెండింగ్లో పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలన్ని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చి ‘వైఎస్సార్ జల కల’ పేరుతో పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలో రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సంగంలో రైతులు ధర్నా చేశారు. రైతులపై పోలీసులు కోవిడ్(కరోనా) నిబంధన ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం సీఎం జగన్ దృష్టికి రైతుల కేసుల వ్యవహారం రావడంతో, తక్షణం స్పందించిన సీఎం జగన్ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి సీఎం జగన్ పరామర్శ
నెల్లూరు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసుకున్న సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నెల్లూరులో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీధర్రెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు. -
మహిళను చంపి.. రోడ్డుపై పడేసి..
-
మహిళను చంపి.. రోడ్డుపై పడేసి..
సాక్షి, నెల్లూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కావలిలోని పుచ్చలపల్లి వారి వీధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షకీల(25) అనే వివాహిత ఏడాది క్రితం భర్తతో విడిపోయి ఇస్లాం పేటలోని తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కావలిలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో షకీల పని చేస్తోంది. అయితే ఆమె తరచూ పుచ్చలపల్లి వారి వీధిలోని ఓ మహిళ ఇంటి వద్దకు వస్తుండేది. ( దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు ) ఈ క్రమంలోనే గురువారం కూడా షకీల ఆ మహిళ ఇంటికి వచ్చింది. అక్కడ గుర్తు తెలియని కొందరు వ్యక్తులతో ఆమెకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వారు షకీలను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దారుణం : కన్నకూతురుపై తండ్రి లైంగిక దాడి
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. తుఫాన్నగర్కు చెందిన కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. కొద్ది రోజులుగా చిన్న కూతురుపై కన్నేసిన కాసాయి తండ్రి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలానే పెద్ద కూతురుపై అత్యాచారం చేసి కటకటాలు పాలైనా బుద్ది మారలేదని స్థానికులు పేర్కొన్నారు. కన్న కూతురిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన కోటేశ్వరరావు ను కఠినంగా శిక్షించాలని బందువులు కోరారు. ఇలాంటి వ్యక్తులను సమాజం నుంచి తరిమేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కరోనా: నెల్లూరులో లాక్డౌన్ విధింపు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సంగం, సూళ్లూరుపేటలో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. ఇప్పుడు నెల్లూరు పట్టణంలోనూ ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపులు ఉంటాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి అధికారులు కోరారు. -
డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!
-
డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్ కలకలం రేపుతోంది. రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంటూ వీడియో రికార్డ్ చేసింది. తెల్లారిన తరువాత తమ బిడ్డ గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులకొట్టి చూడగా రమ్య ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. తోటి విద్యార్థుల వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, ఫోన్ మెస్సేజ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని లైవ్ సూసైడ్ నెల్లూరులో సంచలనంగా మారింది. (చదవండి: అత్యాశకు పోతే 5 కిలోల నకిలీ బంగారం!!) -
ఆఫీస్లో అమానుషం
-
మాస్క్ ధరించాలని చెప్పినందుకు..
-
మాస్క్ ధరించాలని చెప్పినందుకు..
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం హోటల్లో దారుణం చోటు చేసుకుంది. మాస్క్ ధరించాలని సూచించిన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేశారు. గత శనివారం ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులంతా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులంతా మాస్కులు ధరించగా, డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని మహిళా ఉద్యోగి ఉషారాణి సూచించగా, తనకే సలహాలు ఇస్తావా అంటూ ఆమెపై దాడి చేశారు. సహచర ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించేశారు. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీని కూడా పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మహిళలుపై దాడులు చేస్తే సహించేది లేదు : వాసిరెడ్డి పద్మ మహిళా ఉద్యోగి ఉషారాణిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె నెల్లూరుకి వెళ్లి ఉషారాణిని పరామర్శించారు. అనంతరం పద్మ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషం అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భాస్కర్ ప్రవర్తించారని మండిపడ్డారు. మాస్క్ ధరించమన్నందుకు ఇష్టానుసారంగా దాడి చేయడం దారుణమన్నారు. మహిళలపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేసిందని ఆమె వెల్లడించారు. మహిళలపై దాడులు చేసిన, లైంగిక నేరాలకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. -
‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ
సాక్షి, నెల్లూరు (టౌన్) : అడ్మిషన్లు చేయించని ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని నెల్లూరు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫళంగా తమను ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితేంటని వాపోతున్నారు. కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయంలో ఆన్లైన్ పాఠాలు చెప్పించారు. ఏప్రిల్ నెలకు సగం జీతమే ఇచ్చి, మే నెల వేతనాన్ని పూర్తిగా నిలిపేశారు. అదేమని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు 7 నుంచి 10 అడ్మిషన్లు చేయిస్తేనే ఇస్తామని లేకుంటే ఆసలు స్కూలుకే రావొద్దని నారాయణ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు ప్రజలు ఎవరినీ ఇళ్ల దరిదాపులకు రానీయని పరిస్థితిలో అడ్మిషన్లు ఎలా చేస్తామని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. (‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష) ► నెల్లూరు నగరంలోని స్టోన్హోస్పేట అరుణాచలం వీధిలో ఉన్న నారాయణ స్కూల్లో ఐదుగురు టీచర్లను ఈ కారణంతో తొలగించడంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ► మినీబైపాస్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న మరో ఏడుగురు టీచర్లకూ స్కూల్కు రావొద్దని చెప్పారు. ► ఈ విధంగా జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల్లోంచి 40 నుంచి 50 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు చెబుతున్నారు. వీరిలో కొంత మంది ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఊర్లకు వెళితే.. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ► స్టోన్హోస్పేటలోని ‘నారాయణ’ బ్రాంచిలో పనిచేసిన తెలుగు టీచర్ పట్టెం వెంకటసుబ్బయ్య ఇప్పుడు తోపుడు బండిపై అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఈడీ చదివిన వెంకటసుబ్బయ్య రెండేళ్లుగా నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. ► అడ్మిషన్లు చేయలేదన్న కారణంతో తమను ఉద్యోగాల్లోంచి తొలగించడం దారుణమని మరో టీచర్ కాటుబోయిన శ్రీనివాసులు చెబుతున్నారు. -
మత్స్య సంపద పెంచేందుకే వీటి ఏర్పాటు: మంత్రి
సాక్షి, నెల్లూరు: కేంద్రం సహకారంతో జువ్వలదిన్నె వద్ద రూ. 280 కోట్లతో ఫిషింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి) తీరంలోని 9 జిల్లాల్లో మత్స్య సంసపదను పెంచేందుకే ఈ సెంటర్లను ఏర్పాటు అని ఆయన తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. మత్స్య, ఆక్వా రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఫిషింగ్ హర్భర్కు అనుబంధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. -
రబీకి 2 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు బ్యారేజీ కింద 99,525 ఎకరాలు, సంగం బ్యారేజీ కింద 3.85 లక్షల ఎకరాలు వెరసి 4,84,525 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్దేశించుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పనులు చేయలేనని, నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగేందుకు అనుమతించాలంటూ కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. మిగిలిన రూ.113.36 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. సంగం బ్యారేజీ పనులను సెప్టెంబరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ప్రాధాన్యతగా నెల్లూరు బ్యారేజీ.. ► నెల్లూరు కొత్త బ్యారేజీ పనుల్లో 8 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 8.36 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. ► బ్యారేజీకి 57 గేట్లను బిగించాల్సి ఉండగా తయారీ పనులు 75% పూర్తయ్యాయి. మిగిలిన రూ. 113.36 కోట్ల పనులను ప్రాధాన్యతగా పరిగణించి కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి అక్టోబర్ నాటికి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు. శరవేగంగా సంగం బ్యారేజీ ► కొత్తగా నిర్మిస్తున్న సంగం బ్యారేజీలో మిగిలిపోయిన పది వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. మిగిలిన 2.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పురోగతిలో ఉన్నాయి. ► బ్యారేజీకి గేట్ల తయారీ పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం రూ.145.51 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ► సంగం బ్యారేజీని సెప్టెంబరు నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులెత్తేసిన చంద్రబాబు.. ► వందేళ్ల క్రితం నిర్మించిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. వీటి స్థానంలో కొత్త బ్యారేజీల నిర్మాణాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2004లో చేపట్టారు. 2009 నాటికి సింహభాగం పనులు పూర్తయినా తర్వాత గ్రహణం పట్టుకుంది. ► 2018 ఖరీఫ్ నాటికి రెండు బ్యారేజీలను పూర్తి చేస్తామని నాడు అధికారంలో ఉండగా శాసనసభ సాక్షిగా పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు చేతులెత్తేశారు. -
కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోతో సేవలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోలతో సేవలు అందించనున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రోబోల సేవలను తొలిసారిగా నెల్లూరులోనే ప్రేవేశపెట్టామన్నారు. కాగా రీజనల్ కోవిడ్ సెంటర్లలో ఇకపై రోబోలు సేవలు అందించనున్నాయని చెప్పారు. నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను జిల్లా అధికారులకు అందించి దీని పనితీరుపై ఆ సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ డెమో ఇచ్చారు. (లాక్డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!) కాగా డెమోలో రోబో పనిదీరుపై కోవిడ్-19 ప్రత్యేక ఐఏఎస్ అధికారి రామ్ గోపాల్, కలెక్టర్ శేషగిరి బాబు, జేసీ డాక్టర్ వినోద్ కుమార్లు పరీశిలించి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ రోబో ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని పాజిటివ్ వ్యక్తులకు సరఫరా చేస్తుందని అధికారులతో పేర్కొన్నారు. అంతేగాక జిల్లాకు మరో రెండు రోబోలను కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ అధికారులకు తెలిపారు. (న్యూయార్క్లో లాక్డౌన్ పొడగింపు!) -
టీడీపీ ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు