పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని కానిపాకం సర్కిల్ వద్ద చేపట్టిన దాడుల్లో ఓ వాహనంలో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించగా అందులో ఉన్న దుంగలను వదిలి దుండగులు పరారయ్యారు. వాహనంలో ఉన్న 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారూ రూ. 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Mon, Nov 2 2015 9:34 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement