21 మంది ఎర్ర కూలీల అరెస్ట్
Published Sat, Feb 20 2016 1:33 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి తమిళనాడుకు వెళుతుండగా 21 మంది కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం వారు ఆటోలో జిల్లా సరిహద్దుకు వెళుతుండగా రామచంద్రాపురం పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఎర్రచందనం దుంగలు నరికి వెళుతున్నామని కూలీలు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement