విశాఖ : కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. మంగళశారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలంటే పదవులు అవసరమని కిల్లి కృపారాణి తెలిపారు. అయితే సమైక్యవాదులు మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని కిల్లి కృపారాణిని విమానాశ్రయం లోపలికి తీసుకు వెళ్లారు.