samaikyandhra
-
నేడు జిల్లా బంద్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జిల్లా బంద్ చేపట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీనికి విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు పలికాయి. విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఆళ్ల నాని, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ పార్టీల నాయకులతో బంద్ విజయవంతంపై చర్చించారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. బంద్ సందర్భంగా మంగళవారం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు చింతలపూడిలో బైక్లపై తిరిగి ఆయా వర్గాలను కలసి విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మాముడూరి మహంకాళి ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం రాత్రి ఏలూరులో రథయాత్ర ప్రారంభించారు. -
పోరు బావుటా
సమైక్యాంధ్ర కోసం నినదిస్తే గొంతు నొక్కారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మభ్యపెట్టారు. హోదా ఏదని అడిగితే.. అంతా వట్టిదేనని చేతులు దులిపేసుకున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట చెబుతూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న పాలకుల నయవంచనపై ‘పశ్చిమ’ కన్నెర్ర చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో పోరుబావుటా ఎత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి తీరాలంటూ నినదిస్తోంది. ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని తక్షణమే అమలు చేయాలంటూ జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇదే నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనింప చేసిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పార్టీ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు నిర్వహించారు. పెనుమంట్ర మండలం మార్టేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర నాయకత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తణుకులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు చీర్ల రాధయ్య పర్యవేక్షణలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. భీమవరంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ వివిధ పార్టీల నేతలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేశారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్లో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు సీపీఎం కార్యాలయంలో కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటికి సంతాపం తెలిపారు. ఉండిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. -
గల్లీనుంచి ఢిల్లీదాకా సమైక్యాంధ్ర ఉద్యమం
-
తండ్రి మాటే బాటగా.. ఆశయ సాధనే లక్ష్యంగా..
-
జోరందుకున్న నామినేషన్లు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. బుధవారం ఒక్కరోజే 33 నామినేషన్లు దాఖలయ్యూరుు. చిత్తూరు లోక్సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంధవరపు సామాన్య ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.నారాయణస్వామితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. చిత్తూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ కూడా ఒక సెట్నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట ఎంపీ స్థానానికి ఒక్కనామినేషన్ కూడా రాలేదు. మూడురోజులే గడువు ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీ ఫారం అందకపోయినా, అధికారికంగా ప్రకటించకపోయినా తిరుపతిలో వెంకటరమణ టీడీపీ తరపున నామినేషన్ వేయడం గమనార్హం. ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నామినేషన్లు వైఎస్సార్ సీపీ తరపున కుప్పం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్రెడ్డి, సత్యవేడు నుంచి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ సునీల్కుమార్, తంబళ్లపల్లె నుంచి ఏవీప్రవీణ్కుమార్రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్లు వేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు శ్రీకాళహస్తి నుంచి టీడీపీ నాయకుడు బొజ్జలగోపాలక్రిష్ణారెడ్డి,పుంగనూరునుంచి వెంకటరమణరాజు, జీడీ నెల్లూరు నుంచి కుతుహలమ్మ, పలమనేరు నుంచి ఆర్వి.చంద్రబోస్, తిరుపతి నుంచి వెంకటరమణ, పూతలపట్టు నుంచి లలితకుమారి నామినేషన్లు దాఖలు చేశారు. తంబళ్లపల్లె నుంచి సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా సీపీ సుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. మదనపల్లె నుంచి బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బి.నరేష్కుమార్రెడ్డి, బి.కవిత, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఒకరు నామినేషన్ వేశారు. చంద్రగిరి నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరు కాంగ్రెస్ తరపున, ఇద్దరు స్వతంత్రులు, ఒకరు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి. శ్రీకాళహస్తి నుంచి జైసమైక్యాంధ్ర పార్టీ తరపున సీ.ఆర్.రాజన్, సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పెనుబాల చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. చిత్తూరు, నగరికి నామినేషన్లు రాలేదు. పూతలపట్టు నుంచి కాంగ్రెస్ తరపున ఎ.ప్రవీణ్ నామినేషన్ వేశారు. పలమనేరులో టీడీపీ నుంచి జయంతి అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి పార్థసారథిరెడ్డి నామినేషన్ వేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కె.శ్రీనివాసులు నామినేషన్ వేశారు. -
స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ
ఆచంట, న్యూస్లైన్ : నియోజకర్గంలోని అన్ని మండలాల్లోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటించారు. స్థానిక కమ్మ కల్యాణ మండపంలో మంగళవారం ఆచంట, పోడూరు మండలాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర పార్టీ నిర్మాణం ఇంకా జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నాయకులను, క్యాడర్ను కోరారు. సమైక్యాంధ్ర అభ్యర్థులను ఓడిస్తామని కాంగ్రెస్కు చెందిన కొందరు ప్రకటనలు చేయడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎన్ని ఎంపీపీలు, ఎన్ని జెడ్పీటీసీలు గెలుచుకుంటుందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సమైక్య సదస్సుకు నియోజకవర్గం నుంచి తరలి రావడంతోపాటు, తనకు అండగా నిలిచినవారికి ఈ సందర్భంగా పితాని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆచంట మండల అధ్యక్షునిగా తమ్మినీడి ప్రసాదును నియమిస్తున్నట్టు ప్రకటించారు. డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ, భీమలాపురం, పెదమల్లం, కందరవల్లి, కరుగోరుమిల్లి సర్పంచ్లు చింతపర్తి సత్యనారాయణ, కె వీరాస్వామి, గుండుబోయిన సతీష్, ముత్తాబత్తుల రామచంద్రుడు నాయకులు పాల్గొన్నారు. -
'కిరణ్తో పాటు ఎంపీలను చేర్చుకునేందుకు సిద్ధం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమని సీమాంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆవేశంతో పార్టీని వీడినవారు తిరిగి కాంగ్రెస్లోకి రావచ్చని అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని రఘువీరా అన్నారు. సమైక్యాంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని రఘువీరా మండిపడ్డారు. కిరణ్ ఏం త్యాగం చేశారో చెప్పాలన్నారు. స్వలాభం కోసమే కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇస్తున్న హామీలను ప్రజల గమనించాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో రఘువీరా భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ను వీడే విషయంలో తొందరపడవద్దని, మాట్లాడుకుందాం రండి అంటూ పక్క పార్టీలవైపు చూస్తున్న పలువురు నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ విడతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకూ ఫోన్ చేసి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ వీడతారని అనుమానం ఉన్న నాయకుల జాబితా తనకు పంపాలని 13 జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. -
కమలంతో దోస్తీకి సైకిల్ సై
భీమవరం, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కమలంతో దోస్తీ కట్టేందుకు సైకిల్ సై అంటోంది. ఒక పక్క రాష్ట్ర విభజనలో కమలనాథులే ప్రధాన భూమిక పోషించారంటూ గొంతెత్తి అరిచిన తెలుగు తమ్ముళ్లు చీకటి ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్తో కలసి కుట్ర పూరితంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించిన కమలనాథులు, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించిన టీడీపీ తొలుత ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని భావించినప్పటికీ ప్రస్తుతం అవేమి తమకు అడ్డు కాదంటూ బరితెగించి మరీ కమల దండుతో కలిసి రానున్న ఎన్నికల్లో జతకడుతుండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ అనుకోని విధంగా వచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా జిల్లాలోని కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో సీట్లు సర్దుబాటు కోసం ఇరు పార్టీల నేతలు ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు అధికారికంగా వెల్లడి కానప్పటికీ నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగుస్తుండడంతో వార్డుల సర్దుబాటులో ఇరు పార్టీల నేతలు తలమునకలై ఉన్నారు. జిల్లాలో కీలకమైన భీమవరం, నర్సాపురం వంటి మునిసిపాలిటీల్లో పొత్తులు ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు వంటి మునిసిపాలిటీల్లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. భీమవరం మునిసిపాలిటీలో 10 వార్డులను బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా టీడీపీ నేతలు 5 నుంచి 6 వార్డులు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. గురువారం వీటినే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉందని టీడీపీ నియోజకవర్గ నేత ఒకరు ‘న్యూస్లైన్’ వద్ద ధృవీకరించారు. -
పదవుల మేళా
స్వల్ప వ్యవధిలోనే ఐదు ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు పండగ ఏ పదవులకైనా సై అంటున్న నేతలు ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్న పార్టీలు కొత్తవాళ్లతో నిండిపోతున్న వైనం సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలన్నీ ఒకేసారి రానే వచ్చేశాయి. రాజకీయ నిరుద్యోగుల నెత్తిన పాలుపోశాయి. ఈసారి ఏదో ఓ పదవి తప్పక వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఆశావహులకు సీట్లు సర్దుబాటు చేయడంలో అధినాయకులు తల మునకలయ్యారు. రాజకీయం అనే రొంపిలోకి వెళ్లకూడదనే అపోహల నుంచి బయటపడి కొత్తవారు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరికి చావోరేవో! ఎన్నికల్లో ఏదో ఓ పదవి సంపాదించకపోతే ఈసారి కొందరికి రాజ కీయ భవిష్యత్ ఉండని పరిస్థితి. వారిలో గల్లీ నాయకుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మం కారణంగా కొందరికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయే ప్రమా దం ఏర్పడింది. ఈ కోవకు చెందినవారే జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రి. సమైక్యాంధ్ర నినాదంతో పదవిని చేపట్టి అనంతరం అధిష్టానానికి జై కొట్టడంతో అతనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు చావోరేవోగా మారాయి. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రికీ ఇవి చివరి ఎన్నికలు కానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార చెలాయించిన పార్టీ లో ఉన్న ఈ నేతా ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారు. స్థానిక సమరంపై దృష్టి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొందరు మునిసిపల్ చైర్మన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీల అధిష్టానాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలు కూడా టికెట్ పంపకాల్లో సమస్యలు తలెత్తకుండా ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ కుదరకపోతే మునిసిపల్ చైర్మన్, అదీ కుదరకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరికి ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటున్నారంటే ప రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇవేవీ కుదరకపోతే వాటిని మించిన నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాతవారిపై వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని బరిలోకి దిం చాలని భావిస్తున్నారు. ఏదైనా పర్లే దు టికెట్ ఇస్తే చాలంటూ కొందరు నేతలు సర్దుకుంటున్నారని పలువు రు గుసగుసలాడుతున్నారు. -
'పురందేశ్వరి వెళ్లినంతమాత్రాన నష్టం లేదు'
గుంటూరు: కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన పురందేశ్వరిపై కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి వెళ్లిపోవడంతో కాంగ్రెస్కు ఎలాంటి నష్టం లేదని ఆమె సోమవారమిక్కడ అన్నారు. పురందేశ్వరి బీజేపీలోకి వెళితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందేమోనని పనబాక వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పురేందశ్వరి ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
మంత్రి బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడం, అనంతరం ఆ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో సీమాంధ్ర లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి . కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖ నగరానికి తీసుకురావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. బాలరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కార్యకర్తలు అడ్డుకుని సమైక్య ద్రోహి అయిన జైరాం రమేష్ ను విశాఖకు ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. సమైక్య ద్రోహులకు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు'
హైదరాబాద్: తాను టీడీపీలో ఉన్నానో, లేనో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని నందమూరి హరికృష్ణ వాపోయారు. ఎన్టీఆర్ భవన్లో ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందువల్లే తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యక్రమాలకు హరికృష్ణను ఆహ్వానించలేదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుంచి హరికృష్ణ, చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెరిగింది. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణకు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా ఆయనను పక్కనపెట్టారని స్పష్టమయింది. -
జై సమైక్యాంధ్ర అని అనని చంద్రబాబు
-
'తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో వ్యతిరేకత లేదు'
తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో ఎలాంటి వ్యతిరేకత లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన అధికార, ధనబలంతోనే లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కావాలనే కిరణ్ రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ ఏర్పాటును చివర వరకు అడ్డుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ కాగానే సీమాంధ్రకు చెందిన నేతలు తనకు శుభాకాంక్షలు తెలిపారన్న సంగతిని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఐక్యతకు కిరణ్ కుమార్ రెడ్డే పెద్ద అడ్డంకి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియా సాకారం చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు దేవత అని అభివర్ణించారు. -
రాజ్యసభలోనూ నిరాశే
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంపై జిల్లా ప్రజల గరం గరం కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పనబాకల తీరుపై అసంతృప్తి ఒంగోలు : రాజ్యసభలోనూ రాష్ట్ర విభజన బిల్లు పాస్ కావడంతో జిల్లా వాసులు అసంతృప్తికి లోనయ్యారు. జిల్లాకు ఏ మాత్రం అనుకూలంగా లేని బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల వైఖరిని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం రాజ్యసభ వెల్లోకి వచ్చి నినాదాలు చేస్తుంటే ఆంధ్రుల అభిమాన నటుడు చిరంజీవి, జిల్లాతో అనుబంధం ఉన్న జెడీ శీలం, నాలుగు నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పనబాక లక్ష్మి తమకు ఏమీ పట్టనట్లుగా తమ స్థానాల్లో కూర్చోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాల విభజనకు వ్యతిరేక మంటూ నిరసన గళం విప్పిన రాజ్యసభ టీడీపీ ఎంపీ సుజనాచౌదరి.. గురువారం సభలో టీడీపీ విభజనకు అనుకూలమని ప్రకటన చేయడం విస్మయానికి గురి చేసింది. విభజన వల్ల జిల్లాకు ఒరిగిందేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధికి జిల్లా ఆమడదూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడా ప్రత్యేకంగా పరిశ్రమలు లేవు. యూనివర్సీటీ, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రత్యేకత పొందిన ఆస్పత్రులూ అంతకన్నా లేవు. ఇటువంటి సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు బిల్లులో ఉంటే బాగుండేదని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. అసలు సీమాంధ్ర తరఫున మాట్లాడేందుకు రాజ్యసభలో ఒక్క నాయకుడు కూడా లేక పోవడం శోచనీయమంటున్నారు. బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. యూపీఏ మళ్లీ అధికారంలోకి రాకుంటే సీమాంధ్రకు న్యాయం చేస్తామన్న ప్రధాని మాటలు నీటి మీద రాతల్లా మారే అవకాశం లేకపోలేదని జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పడం గమనార్హం. తెలుగుదేశం బండారం గురువారం బయట పడిందన్నారు. టీడీపీ నాయకుడు సుజనాచౌదరి కూడా తాము రాష్ట్ర విభజనను ఆహ్వానిస్తున్నామని చెప్పడంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి ఏమిటో వ్యక్తమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీతో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు లాలూచీపడి రాష్ట్ర విభజన చేశాయని ఆరోపించారు. -
వీధుల్లో నుంచి విధుల్లోకి..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రభుత్వ ఉద్యోగులు వీధులను వదిలి విధులకు హాజరు కానున్నారు. 15 రోజుల నిరవధిక సమ్మె అనంతరం గురువారం నుంచి యథావిధిగా కార్యాలయాలకు చేరుకోనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గత ఏడాది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 66 రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి గజిటెడ్ ఆఫీసర్ వరకు ఉద్యోగులు సమ్మె చేశారు. అదే సమయంలో వీధుల్లోకి వచ్చి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. విద్యార్థులతో కలిసి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వస్తుండటంతో ఉద్యోగులంతా ఢిల్లీ బాట పట్టారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు వేలాదిగా ఢిల్లీ చేరుకొని అక్కడ మహా ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో ఏకపక్షంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంతో ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. రెండోమారు నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఏపీఎన్జీఓ అసోసియేషన్తోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కాన్ఫడరేషన్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో గురువారం నుంచి ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. వారి రాకతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి కళకళలాడనున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు రెండో మారు నిరవధిక సమ్మెకి దిగిన ఉద్యోగులకు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులుగా తమవంతు పోరాటం నిర్వహించామని, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా అంతే పోరాటాన్ని నిర్వహించి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. -
'రెండు కళ్ల సిద్ధాంతంతో కొంపముంచిన చంద్రబాబు'
-
సమైక్యమే ఊపిరిగా...జగన్
-
కేంద్రం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన జగన్
-
సొనియా పై మండిపడ్డ కొడాలి నాని
-
రాహుల్ ఫ్లెక్సీల ధ్వంసం
అనకాపల్లి, న్యూస్లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్ సభ ఆమోదించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న రాహుల్గాంధీ ఫ్లెక్సీలను మంగళవారం రాత్రి ఆ పార్టీ కార్యకర్తలు చించివేశారు. రాహుల్ అమర్ రహే హై అంటూ నినాదాలు చేశారు. నెహ్రూ చౌక్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీలను తగులబెట్టారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియా నియంతృత్వ పోకడలను పట్టణ కన్వీనర్ మందపాటి జానకీరామరాజు ఎండగట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్మోహన్రెడ్డి పోరాడిన సంగతిని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్లు తెలుగుజాతిని విడదీశాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రమణఅప్పారావు, వాకాడ బాబు, మాజీ కౌన్సిలర్లు కెఎం నాయుడు, పొట్ల అప్పారవు, బుద్ద రాజేశ్, బొబ్బిలి గోవింద, మడగల శ్రీను, పిళ్లా కొండయ్య నాయుడు ఎంఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
-
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడే నేతల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఆయన పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ విభజన ప్రక్రియతో రాయలసీమ ప్రజల బతుకును అంధకారంలోకి వెళ్లిందని.. రాయలసీమకు తాగు, సాగు నీరు కోసం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉన్న ఐకమత్యం సీమాంధ్ర నేతల్లో లేకపోవడం వల్లే విభజన ప్రక్రియ సాధ్యపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఏరాసు విమర్శించారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వారి వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు. -
పల్లెల్లో విభజనపై జోరుగా చర్చ
సాక్షి, కడప: జిల్లాలోని పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా విభజన చర్చ జోరందుకుంది. రెండురోజులుగా టీకొట్లు.. బస్టాండ్లు.. దుకాణాలు... ఎక్కడ నలుగురు ఒకచోట కలిసినా... అందరి నోట ఒకే చర్చ.. రాష్ట్రం విడిపోతుందా.. కలిసుంటుందా.. రాష్ట్రం విడిపోతున్నందుకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా బాధపడుతున్నారు. బిల్లు ఆమోదానికి గురైతే రాష్ట్రం విడిపోయే నోట ‘సమైక్య’మాట రాకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. విభజనబిల్లుపై 48 రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరిగినట్లు సీమ ప్రజలు పేర్కొంటున్నారు.రాష్ట్రం విడిపోతే తెలంగాణకు, కోస్తా ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే హామీలు బిల్లులో ఉన్నాయంటున్నారు. అయితే సీమ అభివృద్ధిపై ఎటువంటి హామీలు లేవని మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే సీమకు వాటిల్లే నష్టం గురించి సీఎం కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబుతో పాటు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సాకే శైలజానాథ్ ఎందుకు చర్చ లేవనెత్తలేదని ప్రశ్నిస్తున్నారు. సీమ ఒకటి ఉంది...అది వెనకబడి ఉంది...దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు బిల్లులో ఎక్కడా కనపడలేదని ఆరోపిస్తున్నారు. పార్టీకి నష్టమని తెలిసినా ‘సమైక్య’మే అజెండాగా ఉద్యమాన్ని నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీమ వాసులు అభినందిస్తున్నారు. సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని పేర్కొంటున్నారు. -
రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి కీలకం
-
రాష్ట్ర విభజనను అడ్డుకుంటే మోడీకి కూడా మద్దతిస్తాం
-
సమైక్య పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం
-
సమైక్య పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలంటూ దాఖలైన పిటీషన్లును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్లు తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడు పిటీషన్లు దాఖలైయ్యాయి. దీనిని సోమవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ప్రస్తుతం బిల్లు పార్లమెంట్ లో ఉన్నందును జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఫిబ్రవరి 7వ తేదీన విచారించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్డెలతో కూడిన ధర్మాసనం స్టే విధించడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలను ఓపెన్గానే ఉంచుతున్నాం. సరైన సమయంలో పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ
-
అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ : పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసేందుకు మిగిలింది అయిదు రోజులే. నేటి నుంచి జరుగనున్న చివరి విడత సమావేశాలే తెలంగాణ భవితవ్యాన్ని తేల్చనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఉదయం హుటా హుటీన హస్తిన వెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేందుకు అవసరమయిన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ఎప్పుడేం జరుగుతుందో... ఏ పార్టీ ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ భవితవ్యం మీద సందిగ్ధం నెలకొంది. అలాగే నేడు, రేపు ఢిల్లీలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల ప్రభావం తెలంగాణ అంశం మీద ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆందోళనల ప్రభావంతో తెలంగాణ వెనక్కి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. మంగళవారం కానీ, బుధవారంకానీ బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజులే కీలకంగా మారాయి. -
హస్తినకు సమైక్య సెగ
-
కేసీఆర్కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వారిని లోనికి వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. తాము కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సమైక్యాంధ్రకు మద్దతు కోరడానికి వచ్చామని జేఏసీ నేతలు చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. -
సమైక్య సేనాని జగన్
-
మంత్రి కమల్నాథ్ ఇంటి వద్ద విద్యార్థి జేఏసీ ఆందోళన
ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్నికేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. తొలుత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అనంతరం కేంద్ర మంత్రి కమల్ నాథ్ ఇంటి ఎదుటు కూడా విద్యార్థి జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ను విడదీయటానికి అధికారం ఎవరిచ్చారంటూ ధర్నా చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. అక్కడి పరిస్థితి శృతిమించడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
ఏఐసీసీ కార్యాలయం వద్ద విద్యార్థుల సమైక్య ఆందోళన
ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు కేంద్రాన్నిహెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర విద్యార్థులు ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విభజన అంశాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు సమైక్యావాదులు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 17న జంతర్మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య ధర్నాకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. -
అన్యాయాన్ని ఒప్పుకుంటే చెడుసంప్రదాయానికి తెరతీసినట్లే!
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి, తమ ఉద్యమానికి మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ను కలిశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కారత్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఒప్పుకోకపోయినా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టారన్నారు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు అప్రజాస్వామికం అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవ్వరూ ఎస్, నో చెప్పకపోయినా, 10 సెకన్లలో అంతాకానిచ్చేశారని విమర్శించారు. ఈ అప్రజాస్వామిక తీరును తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తమవంతు సహాయాన్ని అందిస్తామని కారత్ చెప్పినట్లు తెలిపారు. అందుకు కారత్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవాల్సిన సమయం ఇదని చెప్పారు. ఒకవేళ ఈ అన్యాయాన్ని ఒప్పుకున్నట్లైతే ఒక చెడు సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని జగన్ హెచ్చరించారు. -
దేశ సమగ్రతకే ముప్పు
విభజనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తున్న తీరు దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీలకు వివరించారు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే ఈ చర్యను విపక్షాలన్నీ ఏకమై అడ్డుకోవాలని కోరారు. జగన్ శనివారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్తో భేటీ అయ్యారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా, పార్లమెంట్ సభ్యుల ఆందోళనను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను లెక్కపెట్టకుండా రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని వారికి వివరించారు. పూర్తి నిరంకుశత్వంతో, అడ్డగోలుగా జరుగుతున్న ఈ విభజనను అడ్డుకోవడానికి జాతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గతంలోనే పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. శనివారం మరోమారు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అంతా పథకం ప్రకారమే.. జగన్ శనివారం ముందుగా బీజేపీ నేత అరుణ్ జైట్లీని కలిశారు. గురువారం లోక్సభలో జరిగిన ఘటనలను వివరించారు. కేంద్రం ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. ‘‘సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా కాంగ్రెస్ పథకరచన చేసి, దానిని అమలు చేసింది. బయటి రాష్ట్రాల నుంచి బలమైన ఎంపీలను వెల్లోకి పంపింది. సీమాంధ్ర ఎంపీలను ఇతర సభ్యులు అడ్డుకోవడమే కాకుండా చేయి చేసుకున్నారు. వెల్కు సంబంధించిన వీడియో చిత్రాలను చూస్తే ఎవరెవరు దాడిచేశారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని జగన్ వివరించారు. ‘‘సభ సజావుగా నడవాలన్న సాకుతో సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయించారు. వారు లేకుండానే బిల్లు తేవాలన్నది కాంగ్రెస్ కుతంత్రం. ఇది పార్లమెంటు సంప్రదాయాలను పూర్తిగా మంటకలపడమే. ఈరోజు ఓ రాష్ట్రాన్ని, రేపు మరో రాష్ట్రాన్ని విభజిస్తారు. ఇలా చేస్తూపోతే దేశ సమగ్రతకే ముప్పు రావడం ఖాయం. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ బిల్లును అడ్డుకోండి’’ అని కోరారు. దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘‘సభలో జరిగిన సంఘటన దురదృష్టకరం. బిల్లు ఆఖరు దశలో కాంగ్రెస్ ఇలాంటి పనులు చేయకూడదు. మీరు చెప్పిన అంశాలపై పార్టీలో మాట్లాడతా’’ అని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మంతనాలు.. ఇంటికొచ్చిన గెగాంగ్ అపాంగ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని వైఎస్ జగన్ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. శనివారం మధ్యాహ్నం జగన్ ఫోన్లో ఠాక్రేతో మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాన్ని వివరించారు. పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటెయ్యాలని కోరారు. రాష్ట్రాల విభజనకు శివసేన మొదటి నుంచీ వ్యతిరేకమని ఠాక్రే తెలిపినట్లు మైసూరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారన్నారు. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి మిత్రుడైన అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంతి గెగాంగ్ అపాంగ్ శనివారం సాయంత్రం వైఎస్ జగన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్తో తనకు ఉన్న అనుబంధాన్ని జగన్కు వివరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ అంశంపై చర్చించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ చేస్తున్న పోరాటాన్ని అపాంగ్ ప్రశంసించినట్లు తెలిసింది. అంతా కలసివస్తారని విశ్వసిస్తున్నాం: జగన్ శరద్యాదవ్తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు విభజనను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి వస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని శరద్యాదవ్కు విన్నవించాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించాలని రెండో మారు కోరాం. విభజన బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. 272 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే చాలు ఎవరినీ అడగకుండా గీతలు గీస్తారు. ఇప్పుడు ఏపీకి జరుగుతున్నదే భవిష్యత్లో తమిళనాడు, యూపీ, కర్ణాటకలకు జరగవచ్చు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి దీన్ని అడ్డుకోవాలని కోరాం. జేడీ(యూ)తో పాటు మూడో ఫ్రంట్లో ఉన్న 11 పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి ఫ్లోర్ మేనేజ్మెంట్ కార్యక్రమం చేపట్టాలని శరద్ యాదవ్ను కోరాం. ఆ 11 పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఈ పార్టీల్లో కమ్యూనిస్టులు, ఏఐడీఎంకే, సమాజ్వాదీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తూ వాటి నిర్ణయాన్ని తెలిపాయి. మిగతావారంతా కలసి వస్తారనే భావిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్లో చేరే విషయాన్ని ప్రస్తావించగా.. రాజకీయ చర్చలేవీ జరపలేదని జగన్ తెలిపారు. లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రవేశపెట్టడంలో సభా సంప్రదాయాలను పాటించలేదని, సభ అనుమతి తీసుకోకుండానే పది సెకన్లలోనే ప్రవేశపెట్టినట్లు చెప్పారని అన్నారు. ‘‘విభజనపై కేంద్రం పూర్తి అప్రజాస్వామికంగా ముందుకెళుతోంది. బిల్లు ప్రవేశపెట్టడానికి సభ అనుమతి కోరాలి. బిల్లుకు అనుకూలంగా ఎక్కువ మంది చేతులు పెకైత్తితే దానిని సభలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పాలి. వ్యతిరేకంగా ఎక్కువ మంది చేతులు ఎత్తితే ప్రవేశపెట్టలేదని చెప్పాలి. కానీ ఇక్కడ అలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. సభలో సభ్యుల ఆమోదం తెలుసుకోకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏ ప్రజాస్వామ్యంలోనూ ఇలా జరగదు. దీనిని వ్యతిరేకిస్తున్నా. బీజేపీ, ఎస్పీ సహా అన్ని పార్టీలూ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. శరద్యాదవ్, ఎస్పీ, బీజేపీ నేతలు స్పీకర్ను కలవగా ఆమె బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అనంతరం మమ్మల్ని లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభలో లేకుండా, వారిని చర్చలో పాల్గొననివ్వకుండానే విభజన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అన్యాయం’’ అని అన్నారు. బిల్లుపై ఏకాభిప్రాయం తెస్తా : శరద్యాదవ్ జగన్ శనివారం సాయంత్రం శరద్యాదవ్తో సమావేశమయ్యారు. విభజన తీరును వివరించి, బిల్లును అడ్డుకోవాలని కోరారు. దీనిపై శరద్యాదవ్ స్పందిస్తూ, థర్డ్ ఫ్రంట్లోని 11 పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే విభజనను ఏఐడీఎంకే, ఎస్పీ, సీపీఎంలు వ్యతిరేకిస్తున్న దృష్ట్యా మిగతా పార్టీల వైఖరిని కూడా తెలుసుకుని ముందుకెళతామని హామీ ఇచ్చారు. తెలంగాణకు న్యాయం చేసే సమయంలో సీమాంధ్రకు అన్యాయం చేయకూడదని తాము గట్టిగా కోరుతున్నామని చెప్పారు. అనంతరం శరద్యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫ్రంట్లో మా ఒక్క పార్టీయే లేదు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునే విషయంలో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయాన్నే జగన్కి చెప్పాను’’ అని తెలిపారు. పార్లమెంటులో జరిగిన సంఘటనలను ప్రస్తావించగా.. ‘‘దేశంలో మొదటిసారి ఇలా జరిగింది. దీన్ని సహించేది లేదు. అత్యున్నత పార్లమెంటులో జరిగిన సంఘటనను ఖండించడంతోనే వదిలిపెట్టం. దాని వెంటపడతాం’’ అని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్ను కాపాడాల్సిన బాధ్యత ఆ ఐదుగురిదే: రఘువీరా
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా), న్యూస్లైన్/సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నేతలు ఐదుగురిపై ఉందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరాడాలన్నారు. ఈ ఐదుగురు కలిసి కృషి చేస్తే రాష్ట్రం విడిపోదనే నమ్మకం తనకుందన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. లేఖను ఉపసంహరించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం పార్టీల అధినేతలు, ఆయా పార్టీల శాసనసభ, మండలి పక్ష నేతలతో మాట్లాడాలంటూ రఘువీరారెడ్డి సీఎం, పీసీసీ చీఫ్లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ పార్టీల నేతలందర్నీ సోమవారం ఢిల్లీకి తీసుకెళ్లి.. ప్రధాని, వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి విభజనను నిలిపివేయాల్సిందిగా అభ్యర్థిస్తే ఫలితముంటుందని పేర్కొన్నారు. -
ఢిల్లీకి ‘సమైక్య’ రైళ్లు
సాక్షి, నెట్వర్క్: తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ, యూపీఏ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి, వారికి కనువిప్పు కలిగేలా చేసేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. ఈ నెల 17న జంతర్మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన చేపట్టనున్న ‘సమైక్య ధర్నా’కు రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరి వెళ్లాయి. మొదటి రైలు శనివారం ఉదయం 10.15 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి బయలుదేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. మొదటి రైలుకు ఇన్చార్జిగా వైఎస్సార్ సీపీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండో రైలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45గంటలకు బయలుదేరింది. పార్టీ మహిళా కార్యకర్తలు హారతులు పట్టగా, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. రెండో రైలుకు ఇన్చార్జిగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లు 36 గంటలపాటు ప్రయాణించి 17న ఢిల్లీకి చేరనున్నాయి. వైఎస్సార్ సీపీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు: విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. విద్యార్థి జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదలచేశారు. ఆయనతో పాటే సీమాంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సైతం ధర్నాకు మద్దతు తెలిపారు. -
జగన్ను కలిసి మద్దతు తెలిపిన అరుణాచల్ మాజీ సీఎం
ఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకుకు వైఎస్ఆర్ సిపి చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. జగన్ దేశవ్యాప్తంగా పర్యటించి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని కోరిన విషయం తెలిసిందే. పలువురు నేతలు జగన్ చేపట్టిన సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు అపాంగ్ కూడా మద్దతు తెలిపారు. -
పనబాకపై భగ్గు..భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రమంత్రి పనబాక లక్ష్మిపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా..సమైక్యాంధ్రకు కూడా మద్దతు ఇవ్వలేకపోయిన ఆమె వైఖరిపై భగ్గుమంటున్నారు. జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు, ఎస్ఎన్పాడు శాసనసభా నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆమె చేపట్టకపోవడాన్ని జనం దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా.. ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. జౌళి శాఖా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజున, చీరాలలోని నేత కార్మికులు తమకు మంచి రోజులు వచ్చాయని భావించారు. అయితే చీరాల ప్రజలను పనబాక కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల సమీపంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012 బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనిపై పలుసార్లు ఇక్కడి చేనేత కార్మికులు పనబాకను కోరగా..రెండేళ్ల తరువాత శుక్రవారం (ఈనెల 14) శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అది కూడా రాష్ట్ర విభజన హోరులో కొట్టుకుపోయింది. టెక్స్టైల్ పార్కును రూ. 70 కోట్లతో ఏర్పాటు చేయదలచుకుని, దానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించినా..పనబాక లక్ష్మి అలసత్వం వల్ల కార్యరూపం దాల్చలేకపోయింది. కనీసం భూసేకరణ కూడా చేయలేదు. టెక్స్టైల్ పార్కు వల్ల కొత్తగా ఉపాధి లభించకపోయినా..జౌళి రంగంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం లభించి ఉండేదని అంటున్నారు. గతంలో జౌళి పరిశ్రమకు పుట్టినిల్లుగా ఉన్న చీరాలలోని ఈ వృత్తివారు ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. చీరాలలో ప్రస్తుతం వంద మంది కూడా జౌళి ఉత్పత్తిదారులు లేకపోవడానికి ప్రభుత్వ చిన్నచూపే కారణమని నిపుణులంటున్నారు. విభజనకు అనుకూలతపై భగ్గుమంటున్న జనం... ఇదిలా ఉండగా సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో పాఠశాల విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర కోసం రోడ్డు మీదకు వస్తుంటే, జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విభజనకు అనుకూలత తెలియజేయడంపై తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలోకి వస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తున్న పనబాక, ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఆమె స్వంత ప్రయోజనం చూసుకోవడం తప్ప, జిల్లాకు ఒరిగిందేమీలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అవసరమైతే సోనియా గాంధీ ఆశీస్సులతో రాజ్యసభలో సభ్యత్వం సంపాదించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పనబాక నియోజకవర్గంలోకి అడుగు పెడితే కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆమెను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
మంత్రి జేడీ శీలం కాన్వాయ్పై చీపుర్లు
విజయవాడ, న్యూస్లైన్: కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్యసెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ మీదకు సమైక్యవాదులు చీపుర్లు విసిసారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం విజయవాడలో రైలు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు రోడ్డు మార్గం గుండా వెళుతున్నట్టు సమాచారం తెలుసుకున్న సమైక్యవాదులు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఉద్యమకారులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సమయంలోనే మంత్రి కాన్వాయ్పైకి చీపుర్లు విసిరారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా హైదరాబాద్పై అందరి హక్కు ఉందని మంత్రి జేడీ శీలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వ్యాఖ్యా నించారు. తెలంగాణ విడిపోతే ఉద్యో గులకు, విద్యార్థులకు భద్రత కల్పిం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
సమైక్యపోరు
-
ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకం అయ్యింది: జగన్
బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తోందో ఆయనకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు విభజనను వ్యతిరేకిస్తున్నా, సొంత పార్టీ మనుషులు కూడా విభజన వద్దంటున్నా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని.. చివరకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో కూడా అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారని రాజ్నాథ్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వారి భేటీ సుమారు అరగంట పాటు సాగింది. అనంతరం జగన్, రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. జగన్ మీడియాతో మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి.. ''రాజ్నాథ్ సింగ్తో చాలా వివరంగా మాట్లాడాం. ఆయన మాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి, ఈ అన్యాయంపై స్పందిస్తాయని ఆశిస్తున్నాను. ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించాము. ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించడం మొదలైతే, అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా చేయడం మొదలైతే రేపు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని ఆయనకు చెప్పాం. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని, అందరూ కలిసి ప్రతిఘటించాలని ఆయనకు విన్నవించాం. దేవుడు కూడా వీరందరికీ మంచి చేసే ఆలోచనలు ఇస్తాడని ఆశిస్తున్నాం. అసలు నిన్న జరిగిన అన్యాయం అయితే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికుందో లేదో అర్థం కావట్లేదు. తమకు విభజన వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పేస్తారు, ఆమోదం పొందిందని కూడా చెప్పేస్తారు. మామూలుగా అయితే బిల్లు పెట్టినప్పుడు చేతులు పైకెత్తాలని మొదట అడుగుతారు. ఆమోదయోగ్యం అవునో కాదో తెలుసుకుంటారు. ఆమోదించినట్లు ఎక్కువ చేతులు పైకి లేస్తేనే బిల్లును ప్రవేశపెట్టాలి. ఇక్కడ మాత్రం ఇలా అడగలేదు, ఎవరూ చేతులు పైకెత్తలేదు. అయినా బిల్లును ప్రవేశపెట్టేశామని చెప్పడం తీవ్ర అన్యాయం. అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూశారు. పార్లమెంటులో జరిగిన విషయాలను ప్రతిపక్ష సభ్యులు కూడా తీవ్రంగా విమర్శించారు. మాతోపాటు సమాజ్ వాదీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీజేపీ.. అన్ని పార్టీలూ కూడా వాకౌట్ చేసిన సంఘటన ఇంతవరకు పార్లమెంటులో ఎప్పుడూ జరగలేదు. అందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తాయన్ననమ్మకం మాకుంది''. మేకపాటి, ఎస్పీవై రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి తదితరులు కూడా వైఎస్ఆర్సీపీ బృందంలో ఉన్నారు. గతంలో అద్వానీ, సుష్మా స్వరాజ్లతో కూడా భేటీ అయిన జగన్, ఇప్పుడు పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో ఈరోజు సమావేశమయ్యారు. -
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
తూ.గో.జిల్లాలో సమైక్య బంద్
-
ప.గో. జిల్లాలో బంద్ సంపూర్ణం
-
నెల్లూరులో నారాయణకు చేదు అనుభవం
సమైక్య ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యక్రమం నిమిత్తం నెల్లూరు వచ్చిన నారాయణను అక్కడ సమైక్యరాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న ఎన్జీవో నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదాన్ని బలపర్చాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే, ఇంతలో పోలీసులు వచ్చి, సమైక్యవాదులను అడ్డుకుని అక్కడినుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉండటంతో, దానిపై పార్టీ వర్గాలతో చర్చించేందుకు నారాయణ నెల్లూరు వచ్చారు. దాంతోపాటు స్థానికంగా పార్టీ పరిస్థితిపై కూడా చర్చించారు. -
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
-
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సీత, రమణమ్మ అనే మహిళలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
కర్నూలులో రోడ్డెక్కిన సమైక్యవాదులు
-
బంద్ విజయవంతం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్పై ముందే సమాచారం ఉండడంతో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దీంతో జిల్లా కేంద్రం బోసి పోయింది. ప్రజ లు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ఉదయానికే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాన కూడళ్లలో అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూయించా రు. బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసీ కార్యాలయాలను మూయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాణిజ్య సముదాయాలు బోసిపోయాయి. ప్రతి కూడలిలో రాస్తారోకోలు నిర్వహించి...కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం తదితర నియోజకవర్గాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలు, ఎన్జీవోలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు..... బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఖజానా, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలలో ఉద్యోగులతో పాటూ వివిధ కార్యాలయాల నుంచి జిల్లా అధికారులను సైతం బయటకు పంపించి ఎన్జీఓలు నిరసన తెలిపారు. కలెక్టరేట్లోని పలు కార్యాలయాలకు వె ళ్లాల్సిన మార్గాలను మూయించారు. దీంతో కలెక్టరేట్ బోసిపోయింది. ఉదయం నుంచే బ్యాంకులు ,పోస్టల్ కార్యాలయాలను మూసి నిరసన తెలిపారు. స్తంభించిన రవాణా వ్యవస్థ..... బంద్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరుకుల రవాణా కూడా జరగలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. మూతపడ్డ పెట్రోల్ బంకులు.. పట్టణంలోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే కొంత మంది యజమానులు మాత్రం ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. రంజినీ యాడ్ లేబ్స్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బంకుతో పాటూ పట్టణ శివారుల్లోని పలు బంకుల్లో బాటిళ్ల ద్వారా అధిక రేట్లకు పెట్రోల్ను విక్రయించారు. లీటరు పెట్రోలు రూ.100 నుంచి రూ. 140 వరకూ విక్రయించారు. దాడులు అన్యాయం.... పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయడాన్ని సమైక్యవాదులు ఖండించారు. అడ్డగోలుగా విభజన చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు స్పందించి విభజన బిల్లును అడ్డుకోవాలన్నారు. ఎటువంటి చర్చ జరగకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అంతేకాకుండా సమైక్య వాణి వినిపించినందుకు 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. మిగిలిన పక్షాలపై నేతలు ఒత్తిడి తెచ్చి బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు గంటా వెంకటరావు, ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె.శ్రీనివాసరావు, పి.పద్మనాభం, ఏపీ నాన్ టీచింగ్ సంఘ సెక్రటరీ పిడిపర్తి సాంబశివశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనలకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. -
తిరుపతి లో సమైక్య బంద్
-
రేపు సమైక్య బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నాడు సమైక్య బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య బంద్ను విజయవంతం చేయాలని పార్టీ కోరింది. బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపించేలా పార్టీ శ్రేణులన్నీ ఈ బంద్లో ముందుండాలని తన పార్టీ కేడర్ను ఆదేశించింది. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే ప్రయత్నం, ఒక జాతిని చీల్చే ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదం మీద దండెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. -
పనబాక దర్శన భాగ్యం కష్టమే!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశ రాజధాని నగరంలో ఉద్యమిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులకు కేంద్ర మంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి దర్శన భాగ్యం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కేంద్ర మంత్రిని కలవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. తమకు మద్దతు చెబుతారేమోనన్న ఆశతో ఏపీఎన్జీవో నాయకులు కొందరు ఢిల్లీలోని పనబాక లక్ష్మి నివాసానికి బుధవారం నాడు వెళ్లారు. కానీ, కలిసేందుకు మంత్రిగారి నుంచి ముందస్తు అనుమతి మీకు లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేశారు. ఒక్కసారి కలిసి మాట్లాడి వెళ్లిపోతామని చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని ఏపీఎన్జీవో నాయకులు సమైక్య నినాదాలు చేసుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
రైల్వేమంత్రి బడ్జెట్.. సహాయ మంత్రి నిరసన
పార్లమెంటులో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షాత్తు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి మాత్రం వెల్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక శాఖకు చెందిన మంత్రి ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతుంటేనే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రులు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండి, తోటి సభ్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు, అలాగే సీనియర్ మంత్రికి ఏమైనా అవసరమైతే సహాయపడుతుంటారు. కానీ బుధవారం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్సభ సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే జాబితాలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి కూడా ఉన్నారు. రైల్వే బడ్జెట్ను తన సీనియర్ మంత్రి ప్రవేశపెడుతున్నా దానికంటే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం, నిరసన తెలియజేయడమే ముఖ్యంగా భావించారు. దాంతో తోటి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో కలిసి తాను సైతం వెల్లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందినవారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో అచ్చం మన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లాగే రైల్వే బడ్జెట్ కూడా పది నిమిషాల్లోనే ముగించి, మిగిలినది కూడా చదివినట్లు భావించాలని చెప్పి వదిలేశారు. బడ్జెట్ ప్రతులను మాత్రం సభ్యులందరికీ పంచిపెట్టారు!! -
తెలుగు ప్రజల రక్తంతో విందులా?
తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ నాయకులతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విందు రాజకీయాలు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా ఆ పార్టీ అభిప్రాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల రక్తంతో మీరు విందులు చేసుకుంటారా అని నిలదీశారు. రాష్ట్రాన్ని బలిపీఠంపై పెట్టారని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లు మంటల్లో కాంగ్రెస్ నాయకులు మాడి మాసైపోతారుని జూపూడి దుయ్యబట్టారు. అసలు రైల్వే బడ్జెట్ను 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఎప్పుడైనా జరిగిందా అని ఆయన అడిగారు. ఒకవేళ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం కాంగ్రెస్కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. -
పోడియం వద్దకు దూసుకెళ్లిన వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి సమైక్యవాణి వినిపించారు. రాష్ట్ర విభజన ఆపండంటూ ఫ్లకార్డుతో ఆయన పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. స్పీకర్ పోడియం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి జగన్ నిరసన తెలిపారు. మరోవైపు తొలిసారిగా సీమాంధ్ర మంత్రులు వెల్లోకి రాగా, సీమాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు వెల్లోకి దూసుకు వచ్చి పోటా పోటీగా నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక సీమాంధ్ర సభ్యులు బిల్లు ప్రతులను చింపి ఎగురవేశారు. కాగా సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సభ్యుల ఆందోళనలతో ఖర్గే తన ప్రసంగాన్ని కేవలం పది నిమిషాల్లోనే ముగించారు. మరోవైపు ఖర్గే బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్ వద్ద నిరసన తెలియ చేయటం విశేషం. -
కొనసాగుతున్న ఎన్జీఓల దీక్షలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఒకవైపు కార్యాలయాల్లో విధులను అడ్డుకుంటూనే...దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. త్యాగాలు చేసి అయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీయాలని చూడడటం దుర్మార్గమన్నా రు. కొన్ని పార్టీల నాయకులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమైక్య వాణి విన్పించాలన్నారు. కాగా దీక్షలకు విశాలాంధ్ర మహా సభ నాయకలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
గ్రీవెన్స్సెల్కు సమైక్య సెగ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : గ్రీవెన్స్సెల్కు సమైక్య సెగ తగిలింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్సెల్ కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాలనూ మూయించారు. అలాగే మిగిలిన కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించి కార్యకలాపాలను స్తంభింపజేశారు. గ్రీవెన్స్సెల్లో హోరెత్తిన సమైక్య నినాదం నేరుగా గ్రీవెన్స్సెల్ జరగుతున్న ఆడిటోరియంలోకి ఎన్జీఓలు ప్రవేశించి సమైక్య నినాదాలు విన్పించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అధికారులను కోరారు. అలాగే బయటన అర్జీలు రాస్తున్న వారిని సైతం అడ్డుకున్నారు. కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాలని పిలుపు నిచ్చారు. దీంతో కొంతమంది ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గ్రీవెన్స్సెల్ను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. బయట అర్జీలు రాయకపోవడంతో కొంత మంది నిరాశతో వెనుదిరిగారు. దీంతో జెడ్పీ సీఈఓ మోహనరావు బయటకు వచ్చి పరిస్థితి సమీక్షించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని సమైక్యవాదులు కలెక్టర్ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీ పని మీరు చేయండి.. మా పని మేము చేస్తామం’టూ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఎన్జీఓ నాయకులు ప్రభూజీ, కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల వారూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ సేవలు బంద్
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీల సేవలు మంగళవా రం అర్ధరాత్రి నుంచి బంద్ కానున్నాయి. మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. సోమ, మంగళవారాల్లో కేవలం పెన్డౌన్ ప్రకటిస్తూ నిరసన తెలిపిన మున్సిపల్ ఉద్యోగులు, తాజా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పూర్తిగా విధులకు గైర్హాజరుకానున్నారు. దీంతో జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం, పాలకొండ మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వేతనాలు పెంచాలని, ఉద్యోగభత్ర కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పారిశద్ధ్య కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావడంతో పట్టణ ప్రజలు బెంబెలెత్తుతున్నారు. సోమవారం నుంచి విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీరు సరఫరా విభాగాల సేవలను కూడా పూర్తిగా నిలిపివేశారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కమిషనర్లు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. నిరవధిక సమ్మెలో పాల్గొనండి... జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులను నిలిపివేస్తూ నిరవధిక సమ్మెలో దిగుతున్నట్లు స్థానిక మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. సింహాచలం, ఐ.గౌరి శంకర్లు తెలిపారు. -
సమ్మెకు సై అంటున్న ఎపిఎస్ ఆర్టీసీ
-
సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్సన
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎందరు వద్దంటున్నా.. ఎంతకైనా తెగించి!
ఎంతమంది వద్దని చెబుతున్నా వినకుండా మొండిగా రాష్ట్ర విభజనపై ముందుకెళ్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజ్యసభలో సోమవారం నాడు నిరసన తీవ్రతను కళ్లారా చూశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. కాగితాలను చించేసి.. చివరకు చైర్మన్ మైకును కూడా విరగ్గొట్టారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో, ఎలాగైనా తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అధికార పక్షం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆందోళన చేస్తున్న ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసి, వారు రాకుండా చేసి అప్పుడు బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే శుక్రవారం నాడు రాజ్యసభలో పది మంది ఎంపీల పేర్లను కూడా చదివారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీని ఎలాగోలా ఒప్పించి, నచ్చజెప్పి రాజ్యసభలో తెలంగాణ బిల్లును గట్టెక్కించుకోవాలనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పెద్దలు మునిగి తేలుతున్నారు. మంగళవారం నాడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుతో ఇప్పటికే జైరాం రమేష్ తదితరులు మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు ఇవే చిట్టచివరి సమావేశాలు కావడంతో ఎలాగోలా తెలంగాణ ప్రక్రియను కొంతవరకు ముందుకు నడిపించి, తాము ప్రయత్నం చేశామని చెప్పుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 'రాహుల్ గాంధీ ఎన్నికల ఎజెండా' అని తెలంగాణ బిల్లును బీజేపీ అభివర్ణిస్తోంది. దీన్ని బట్టే కాంగ్రెస్ వ్యూహాలు అర్థమవుతాయి. ''ప్రజలు వద్దనుకుంటున్నప్పుడు, అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించినప్పుడు కూడా పార్లమెంటులో ఎలాగోలా బిల్లును ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తగదు'' అంటూ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా సైతం వ్యాఖ్యానించడంతో ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు తెలుసుకుంటారేమో!! -
రాజ్యసభలో సమైక్య నినాదాలు: రేపటికి వాయిదా
న్యూఢిల్లీ:సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో ఇరు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. కాగా ఈరోజు ఉదయం సీమాంధ్ర సభ్యుల నిరసనల హోరు మధ్యే సమావేశాన్ని నిర్వహించేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నించారు. స్పీకర్ విజ్ఞప్తిని సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే హైడ్రామా నడిచింది. సీమాంధ్ర ఎంపీలు వెల్లోకి దూసుకువచ్చి నిరసనలు తెలపడంతో తొలుత రాజ్యసభను పది నిమిషాలు వేయిదా వేశారు. అనంతరం ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా వేశారు. ఆతర్వాత సమావేశాలు ప్రారంభమైనా సభ్యులు నిరసనలు కొనసాగటంతో సభ రేపటికి వాయిదా వేశారు. -
ఆఖరి పోరాటం
సాక్షి, కాకినాడ :తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే తరుణం సమీపిస్తుండడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏపీఎన్జీఓలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలను సైతం సమ్మెలో భాగస్వాముల్ని చేస్తున్నారు. వైద్యులు కూడా సోమవారం నుంచి సమ్మెలోకి రానుండడంతో వైద్యసేవలు స్తంభించనున్నాయి. కాగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం 2కే రన్ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీఒలు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఆదివారం జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలో సమైక్య పరుగు నిర్వహించారు. కాకినాడలో ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ల ఆధ్వర్యంలో ఈ పరుగును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినికుమారి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి బాలాజీచెరువుసెంటర్ మీదుగా తిరిగి కలెక్టరేట్కు సాగిన ఈ పరుగులో ఉద్యోగులు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు అడ్డుకుని సమైక్యతను కాపాడాలని ఆశీర్వాదం కోరారు. బిల్లును అడ్డుకోని వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్ నుంచి నల్లవంతెన వద్ద గల తహశీల్దార్ కార్యాలయం వరకు సమైక్యాంధ్ర పరుగు నిర్వహించారు. పీఈటీ ల సంఘ జిల్లాఅధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి సమైక్యాంధ్ర జ్యోతితో పరుగులో పాల్గొనగా, ఏపీఆర్ఎస్ఏ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ దివాకర్, కోనసీమ జేఏసీ నాయకులు నక్కా చిట్టిబాబు నాయకత్వం వహించారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సమైక్య పరుగు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ సంఘ నగరాధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి, సీమాంధ్ర న్యాయవాదుల కో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ తెలంగాణా బిల్లును అడ్డుకోనిసమైక్యాంధ్ర ద్రోహుల భరతం పడతామని హెచ్చరించారు. జీజీహెచ్లో నేటి నుంచి వైద్యసేవలు బంద్ సోమవారం నుంచి ప్రభుత్వ వైద్యులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్లో అత్యవసర మినహా వైద్యసేవలను నిలిపి వేస్తున్నట్టు జీజీహెచ్ వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. రాజమండ్రి ఆస్పత్రిలో కూడా వైద్యసేవలు స్తంభించనున్నా యి. సోమ, మంగళవారాల్లో పెన్డౌన్ చేస్తామని, బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని మున్సిపల్ ఉద్యోగులు ప్రకటించారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఇప్పటికే ఊళ్లలో చెత్త పేరుకుపోయింది. ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టనుండడంతో పౌరసేవలు స్తంభించనున్నాయి. సహకార, ప్రభుత్వ బీమా ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు కూడా సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు ఏపీఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి.ఆశీర్వాదం వెల్లడించారు. సోమవారం ప్రారం భమయ్యే డిపార్టమెంటల్ పరీక్షలకూ హాజరుకావద్దని ఉద్యోగులకు పి లుపునిచ్చారు. మొత్తమ్మీద జిల్లాలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చనుంది. మహిళా బిల్లు గతే పడుతుంది : మాజీ ఎంపీ శ్రీహరిరావు సాక్షి, రాజమండ్రి : మహిళా బిల్లుకు పట్టిన గతే విభజన బిల్లుకూ పడుతుందని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు అన్నారు. రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణపై సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించినప్పుడే సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసి, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇస్తే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజ్యసభలో దొడ్డిదారిన ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు భావిస్తున్న విభజన బిల్లుకు మహిళా బిల్లు గతే పడుతుందని, పదేళ్లైనా కదలిక ఉండదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు గతంలో ప్రకటించిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఇది కొత్త పార్టీలపై చర్చించాల్సిన సమయం కాదని దాటవేశారు. -
రేపటి నుండి సీమాంధ్ర ప్రభుత్వ వైద్యుల సమ్మె
-
కావూరికి సమైక్య సెగ
ఢిల్లీలో మంత్రి నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం మొండిగా ముందుకు వెళుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కావూరి ఇంటిని ముట్టడించారు. విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కావూరి నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేత అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్ల నేతృత్వంలో 30 మంది విద్యార్థులు కావూరి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా కావూరి వారిని కలిసేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. ఇంటిముందు బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన కావూరి నేడు పదవి కాపాడుకునేందుకు అధిష్టానానికి సహకరిస్త్తున్నారని ఆరోపించారు. కావూరి ఇంటిముం దున్న నేమ్ప్లేట్కు ‘రాష్ట్రాన్ని కాపాడండి’ ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అన్న పోస్టర్లను అతికించారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి నేత కిశోర్తోపాటు ఇతరులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టా రు. 15 రోజుల్లో పోయే పదవి కోసం కావూరి సమైక్య నినాదాన్ని పక్కనపెట్టారని విద్యార్థి నేత కిశోర్ విమర్శించారు. -
17న ఢిల్లీలో సమైక్య ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం యూపీఏ ప్రభుత్వపు మూర్ఖపు నిర్ణయానికి నిరసన ఢిల్లీలోని తెలుగువారినీ సమీకరించి ఏడువేల మందితో ధర్నా చేస్తాం సమైక్యవాదులందరం 15న రెండు రైళ్లలో బయల్దేరి వెళ్తాం: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్రెడ్డితో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విభజన బిల్లు ఈ నెల 12న రాజ్యసభకు, 18న లోక్సభకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బిల్లు రాజ్యసభలో ముందుగా పెట్టడానికి చాలా సాంకేతిక సమస్యలున్నాయి. కనుక ముందుగా రాజ్యసభలో బిల్లు పెట్టరేమో అని భావిస్తున్నాం. బిల్లుపై లోక్సభలో పూర్తిగా చర్చించిన తర్వాతే రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది. కనుక వారు మూర్ఖంగా బిల్లును 18న లోక్సభలో పెట్టాలని భావిస్తే వారికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయడం కోసం ఈ నెల 15న ఇక్కడి నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ బయలుదేరి 17న జంతర్మంతర్ వద్ద బహిరంగసభ, ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. ఇక్కడి నుంచి వెళ్లే ప్రత్యేక రైలులో 24 బోగీలుంటాయి. రెండు రైళ్లలో కలిసి మొత్తం నాలుగువేల మంది దాకా వెళ్లే అవకాశముంది. అలాగే ఢిల్లీలోని తెలుగువారందరినీ సమీకరించి ఏడు వేల మందితో పెద్దఎత్తున ధర్నా చేపట్టి కేంద్రానికి కనువిప్పు కలిగిస్తాం’ అని అన్నారు. కాంగ్రెస్ పథకానికి.. టీడీపీ వత్తాసు.. విభజన బిల్లు కేంద్ర కేబినేట్ ఆమోదం పొందినప్పటికీ, బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆమోదం పొందడానికి అనేక ఆటంకాలున్నందున, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ఆశాభావం తమలో ఉందని ఉమ్మారెడ్డి చెప్పారు. సమైక్యాన్ని కోరుకుంటూ ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రానికి పట్టడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తయారుచేసుకుంటే దానికి టీడీపీ వత్తాసు పలుకుతున్న వైనం ప్రజానీకమంతా గమనిస్తూనే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని మొదటి నుంచి కూడా వైఎస్సార్సీపీ చెబుతూనే, సమైక్యంగా ఉంచడం కోసం ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపట్టిందని ఆయన వివరించారు. ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు.. ట్రైన్ నెం.1: తిరుపతి-కడప-గుత్తి-కర్నూలు-సికింద్రాబాద్-రామగుండం-న్యూఢిల్లీ ట్రైన్ నెం.2: రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-ఖమ్మం-ఖాజీపేట-మంచిర్యాల-న్యూఢిల్లీ ఇక్కడి నుంచి 15న బయలుదేరే ప్రత్యేక రైళ్లు, ధర్నా ముగియగానే 17వ తేదీ రాత్రికి తిరుగు ప్రయాణమవుతాయి. (రైళ్లు బయలుదేరే సమయాన్ని తర్వాత ప్రకటిస్తారు) -
17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుమారు 7వేల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల15న రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. తిరుపతి నుంచి ఒకటి, రాజమండ్రి నుంచి మరొక రైలు బయల్దేరుతుందని వివరించారు. ఒక్కొక్క రైలులో సుమారుగా 1800 మంది కార్యకర్తలు, రెండీంటిలో కలిపి మొత్తం 3600 మంది ఢిల్లీ వెళతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని విజ్ఙప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు పోరాడుతామని ఉమ్మారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మెజారిటి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పథకం ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజను మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 3ను సవరించాలని, రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో బిల్లు పెట్టడానికి సాంకేతికపరమైన అడ్డంకులున్నాయని తెలిపారు. -
17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా
-
జగన్కు సమైక్యవాదుల నుంచి ఘనస్వాగతం
-
ఉద్యమ బావుటా
తెలంగాణ బిల్లును నిరసిస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులు మద్దతుగా కదం తొక్కిన విద్యార్థులు రెండో రోజూ మూతపడిన కార్యాలయాలు స్తంభించిన పాలన ఏలూరు, న్యూస్లైన్: తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరింది. దాదాపుగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలన్నీ మూతపడ్డారుు. దీంతో పాలన స్తంభించింది. ఏలూరు సహా అన్ని పట్టణాల్లోనూ ఎన్జీవోలు, ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. పలుచోట్ల విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉద్యోగులతో కలసి కదం తొక్కార్జు. ఏలూరు ఎన్జీవోలు కళా జాతాలు, డప్పు వారుుద్యాల సందడి నడుమ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలో గల అన్ని విభాగాల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించివేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, అసోసియేషన్ ప్రతినిధులు ఆర్ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్, పి.సోమశేఖర్, రమేష్కుమార్, నర సింహమూర్తి నాయకత్వం వహించారు. ఆకివీడులో ఎన్జీవోలు రాస్తారోకో చేసి ప్రభుత్వ కార్యాలయాలను మూ రుుంచివేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వారికి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలో ఎన్జీవోలు ర్యాలీ, మానవహారం చేశారు. నరసాపురంలో ఎన్జీవోలు పంచాయతీరాజ్, ముని సిపాలిటీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలను మూరుుంచివేశారు. సమ్మెలో లేని ఆ శాఖల ఉద్యోగులను బయటకు పంపించివేశారు. నిడదవోలులో ఎన్జీవోలు మానహారం ఏర్పాటు చేశారు. అనంత రం ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ముట్టడించారు. భీమవరం జువ్వలపాలెం రోడ్డులో చైతన్య కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరి పారు. ఎన్జీవోలు ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. తణుకులో మునిసిపల్ ఉద్యోగులు పెన్డౌన్ చేసి ధర్నా నిర్వహించారు. ఎన్జీవోలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకొల్లు లాకుల సెంటర్లో ఎన్జీవోలు రాస్తారోకో చేసి నిరసన గళమెత్తారు. ఇరిగేషన్, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు ధర్నా చేశారు. తాళ్లపూడిలో నిరసన ప్రదర్శన జరిగింది. -
అదే సంకల్పం..ఆగలేదు సమరం
కడవరకూ పోరాడదాం సాక్షి, కాకినాడ : ‘కడ వరకు పోరాడదాం... రాష్ర్ట సమైక్యతను కాపాడుకుందాం’ అంటూ ఏపీఎన్జీఓలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్తో సహా వీఆర్వో కార్యాలయం వరకు పరిపాలన పూర్తిగా స్తంభించింది. సమ్మె బాటపట్టిన ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. రెండో రోజు వీరి ఆందోళనలకు పలు చోట్ల ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితులు కన్పిస్తుండడంతో సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ట్రెజరీ, హౌసింగ్, సహకార శాఖ సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మె బాటపట్టనున్నారు. మరొక పక్క తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అర్ధరాత్రి నుంచే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పారిశుద్ద్య సిబ్బంది సమ్మె బాట పట్టనుండడంతో మిగిలిన ఉద్యోగులు సోమవారం నుంచి సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మెలోకి రావాలని ఏపీ ఎన్జీఓలు పిలుపునిచ్చారు. వినూత్న నిరసనలు ఏపీఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వే శారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, జెడ్పీ, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాలను కూడా దగ్గరుండి మూయించి వేశారు. జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జెడ్పీ ఉద్యోగిని తెలుగుతల్లి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై జరిగిన ప్రదర్శనలో ‘తెలుగుప్రజలందరం ఒక్కటిగా ఉందాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం అంటూ నినదించారు. విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఏపీ ఎన్జీఓలు, ఏయూ పూర్వవిద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేయగా, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని జేఏసీ నాయకులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. 10న కేంద్ర కార్యాలయాల ముట్టడి 10వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 12వ తేదీన రహదారులను దిగ్బంధించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపు నిచ్చారు. 10వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట అధ్యక్షుడు పి. అశోక్బాబు ముఖ్యఅతిథిగా జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
-
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
తెలంగాణ బిల్లుకు తాము 10 సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలని, తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని తాము కోరామన్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే జీహెచ్ఎంసీ పరిధిని యూటీ చేయాలని శీలం అన్నారు. అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని, సీమాంధ్రలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఉండేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు భాగం కావాలని, సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయితీలు ఇవ్వాలని శీలం అన్నారు. ఉమ్మడి సదుపాయాలను అలాగే కొనసాగించాలని, ఇప్పుడున్న సంస్థల్లో రెండు ప్రాంతాలకూ అవకాశమివ్వాలని తెలిపారు. సీమాంధ్రలో కొత్త విద్యాసంస్థలు ఏర్పడేవరకు ఇప్పుడున్న విద్యాసంస్థల్లో అందరికీ అవకాశాలు కల్పించాలని, ఈ సవరణలకు ఆమోదం తెలిపితే రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. -
గందరగోళం మధ్య బిల్లులు.. లోక్సభ వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాయి. ముగ్గురు ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. సభ ముందుకు వివిధ కమిటీల నివేదికలు వచ్చాయి. పోడియం వద్దే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఉన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన కొనసాగింది. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఎంపీలు ఆందోళన చేశారు. అయితే, ఈ ఆందోళన మధ్యనే కేంద్ర మంత్రులు చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్ లాంటి కొందరు వివిధ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం తెలంగాణ బిల్లు వ్యతిరేక ఆందోళనలకు దూరంగానే ఉండిపోయారు. కేవలం ఎంపీలు మాత్రమే వీటిలో పాల్గొంటున్నారు. స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు ఇచ్చారు. దీంతో మళ్లీ లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. -
జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలుకు దక్షిణం వైపుగల జాతీయ రహదారిపై ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గురువారం రాస్తారోకో చేశారు. పది నిమిషాలకుపైగా రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు ఆర్.జగదీశ్ మాట్లాడుతూ ఆరుకోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన కోర్ కమిటీ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలని కోరారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎక్కడా రాష్ట్ర విభజన జరగలేదని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒంగోలు సెంటర్ పీడీ ఆసిఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కువ నష్టపోయేది విద్యార్థులేనన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీంద్రకుమార్, పి.వెంకటరావు, జె.అరుణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
ఆఖరి పోరు...!
రాష్ట్ర విభజన ప్రక్రియ ఆఖరి దశకు చేరుకోవడంలో సమైక్యవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఎన్జీఓలు, న్యాయవాదులు, విద్యార్థులు గురువారం విభజనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయూలను మూసివేసి, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. వైద్య ఉద్యోగులు కేంద్రాస్పత్రి వద్ద ధర్నా నిర్వహించగా.. టీడీపీ నాయకులు గంట స్తంభం వద్ద మానవహారం చేపట్టారు. విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని సమైక్య రా ష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించా రు. తొలుత కలెక్టరేట్లోని అన్ని విభాగాలను మూయించారు.అలాగే ఐసీడీ ఎస్ వీడియో కాన్ఫరెన్సును అడ్డుకుని, ఉద్యోగులను బయటకు పంపించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎన్జీఓ సంఘం జిల్లాఅధ్యక్షుడు ప్రభూజీ, రెవె న్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మాట్లాడుతూ విభజన బిల్లుపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.సమైక్యం కోసం పార్టీలకు అతీతం గా ప్రజాప్రతినిధులంతా ఒకే వాణి వినిపించాలని డిమాం డ్ చేశారు. విభజనకు సహకరించిన వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. శుక్రవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. గెజిటెడ్ అధికారుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు డివి రమణ, ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె. శ్రీని వాసరావు, రత్నం, రామరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయూల మూసివేత కలెక్టరేట్తో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలను మూసివేశారు. విజయనగరంలో కార్మిక శాఖ,తదితర కార్యాలయాలను మూయించారు. సాలూరులో ఎన్జీఓ, మున్సిపల్ అధికారులు రాస్తారోకో నిర్వహించారు. విజయనగరం మున్సిపాలిటీలో ఉద్యోగులు పెన్డౌన్ చేసి, నిరసన తెలిపారు. కొన్ని కార్యాలయూలు పూర్తిగా మూతపడగా, మరికొన్ని కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో విధులు నిర్వర్తించారు. నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన ఉద్యమంలో భాగంగా నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టనున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ నిరసనలు కొనసాగిస్తామని ఎన్జీఓ నేతలు తెలిపారు. తెలుగు జాతి ద్రోహులకు శిక్ష తప్పదు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వినూత్న నిరసన విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే తెలుగు జాతి ద్రోహులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. గురువారం విశాలాం ధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వి నూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ని లువునా చీల్చేందుకు కుట్ర పన్నుతున్న కేసీఆర్, కోదండరామ్ దిష్టిబొమ్మలను బహిరంంగా ఉరి తీసి, కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో కొట్టారు. ఈ సందర్భంగా మామిడి మాట్లాడుతూ తెలంగాణ వాదులతో కుమ్మక్కైన సీమాం ధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో కన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి ఇట్ల కిషోర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు జగన్, విద్యార్థి సంఘం నాయకుడుఅనిల్, పాల్గొన్నారు. -
ఉద్యోగుల ‘సమైక్య’ సమ్మె
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఒకటి, రెండు రోజుల తేడాతో జేఏసీలో భాగస్వామ్యం కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సమ్మె పార్లమెంట్ సమావేశాలు జరగనున్న రోజులు మాత్రమే కొనసాగనుంది. పరీక్షలు ముంచుకొస్తుండటంతో ఉపాధ్యాయులు సమ్మెలో పాల్పంచుకోవడం అనుమానమని తెలుస్తోంది. టెజరీ, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులు 66 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుతం విభజన బిల్లు పార్లెమెంటులోకి ప్రవేశించనున్న నేపథ్యంలో బిల్లును అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు మళ్లీ సమ్మె చేసేందుకు నిర్ణయించాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి పెంచి విభజన బిల్లును అడ్డుకునేలా చూడాలనేది ఉద్యోగ సంఘాల ఉద్దేశం. సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పాలనను స్తంభింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేల పరీక్ష జరిపితే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్నికల విధులను సైతం బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం.