మంత్రి బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు | seemandhra congress workers protest against minister balaraju | Sakshi
Sakshi News home page

మంత్రి బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

Mar 3 2014 12:59 PM | Updated on Sep 2 2017 4:19 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు.

విశాఖ:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడం, అనంతరం ఆ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో  సీమాంధ్ర లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి . కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖ నగరానికి తీసుకురావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మంత్రి బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. బాలరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కార్యకర్తలు అడ్డుకుని సమైక్య ద్రోహి అయిన జైరాం రమేష్ ను విశాఖకు ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. సమైక్య ద్రోహులకు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement