ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సమస్య, పింఛన్ల తొలగింపుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
దాంతో రాచర్ల ఎస్ఐ శ్రీనివాస్ గ్రామస్తులపై చేయి చేసుకున్నారు. గ్రామస్తులు వెంటనే ధర్నాకు దిగారు. 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.
**