
నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది.
తమిళనాడు శ్రీరంగ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆరు నూతన పట్టువస్త్రాలను ఊరే గింపుగా తీసుకొచ్చి గర్భాలయంలోని మూలమూర్తికి 4 పట్టు వస్త్రాలు, మరొకటి మలయప్పకు, ఇంకొ కటి విష్వక్సేనుల వారికి సమర్పించారు. వాటిని అలంకరించిన తర్వాత గర్భాలయంలో సంప్ర దాయ, వైదిక పూజలు నిర్వహించారు. పెద్ద జీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈవోలకు సంప్రదాయంగా జీయంగారి సీలు (మెహరు), తాళం చెవుల గుత్తి (లచ్చన) అందజేసి, తీర్థం, శఠారి మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి గమేకార్, హథీరాం మహంతు, మైసూరు, తాళ్లపాకం, తరిగొండవారి హారతులు సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్ద నుంచి రూపాయి చొప్పున వసూలు చేసి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సమక్షంలో శ్రీవారి ఖజానా (హుండీ)లో జమ చేయటంతో స్వామివారికి ఆస్థాన కార్యక్రమం ముగిసింది.