భక్తులకు బఫే భోజనాలా? | simhachalam temple EO fired on officials | Sakshi
Sakshi News home page

భక్తులకు బఫే భోజనాలా?

Published Mon, Oct 16 2017 10:13 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

simhachalam temple EO fired on officials - Sakshi

భక్తులను కూర్చోబెట్టి అన్నవడ్డన చేయిస్తున్న ఈవో

సింహాచలం(పెందుర్తి): ‘భక్తులకు బఫే పద్ధతిలో అన్నప్రసాదమా? కూర్చోపెట్టి వడ్డించాలని పదేపదే ఎందుకు చెప్పించుకుంటారు? పద్ధతి మార్చరా?’ అంటూ సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ నిత్యాన్నదాన పథకం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహగిరి నిత్యాన్నదాన భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. బఫే పద్ధతిలో అన్నప్రసాదం వడ్డించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పలు కారణాలను ఆయనకు తెలిపారు.

ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకోవాలని, భక్తులకు కూర్చోపెట్టే వడ్డన చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు జరుగుతున్న బఫే పద్ధతిని ఆపి భక్తులందరినీ కూర్చోపెట్టి అన్నవడ్డన చేయించారు. అన్నప్రసాదాలు తీసుకెళ్లే తోపుడు బళ్లు పనిచేయడం లేదని, సరిపడా మెన్‌ రాలేదని అధికారులు చెప్పడంతో వెంటనే వాటిని సరిదిద్దాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement