నేడు గుంటూరులో హోదా భరోసా సభ | Special status barosa sabha in guntur today | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరులో హోదా భరోసా సభ

Published Sun, Jun 4 2017 1:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

నేడు గుంటూరులో హోదా భరోసా సభ - Sakshi

నేడు గుంటూరులో హోదా భరోసా సభ

హాజరుకానున్న రాహుల్‌గాంధీ
 
సాక్షి, గుంటూరు: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యూపీఏ మిత్రపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సభలో పాల్గొని ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించనున్నారు.

ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరుగనుంది. రాహుల్‌ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement