కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు | Special Trains between Kakinada Town-Secunderabad | Sakshi
Sakshi News home page

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Aug 26 2014 2:59 AM | Updated on Sep 2 2017 12:26 PM

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా కాకినాడటౌన్-సికింద్రబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్‌వో మైఖేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  గుంటూరు మీదుగా కాకినాడటౌన్-సికింద్రబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్‌వో మైఖేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు(07102) ఆగస్టు 28, 31తేదీలలో రాత్రి 10 గంటలకు కాకినాడలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.45గంటలకు విజయవాడ వస్తుంది.

3గంటలకు బయలుదేరి  ఉదయం 9.10గంటలకు సికింద్రబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు (07101) ఆగస్టు31, సెప్టెంబర్ 1వతేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అర్ధరాత్రి 1.10గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 1.30 బయలుదేరి, ఉదయం 7.15గంటలకు కాకినాడ చేరుతుంది.

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు
 
సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య  సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు(07202) ఈ నెల 28, 31 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు సికింద్రబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.20 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 4.40కి బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(07201) ఈ నెల 29, సెప్టెంబర్ 1 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు కాకినాడలో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు, మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement