super fast
-
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్వర్క్ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ను కలిసి, లేఖలు సమర్పించారు. ఈ సూపర్ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వం.. అనుసంధాతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్గా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్ప్రెస్లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ & ఓవర్హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే. -
దూసుకొస్తున్న బుల్లెట్
⇒ ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏర్పాటుకు నిర్ణయం ⇒ 2018 నుంచి మొదలుకానున్న పనులు ⇒ 2024కల్లా ట్రాక్ పైకి ⇒ 8 గంటల ప్రయాణం ఇక 2 గంటల్లో ప్యాసింజర్.. ఎక్స్ప్రెస్.. సూపర్ఫాస్ట్.. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా వాటి వేగమే. అదే వాటి పేర్లను మార్చేసింది. ఈ వేగానికి కారణం టెక్నాలజీ. దీనికి ఆ రంగం.. ఈ రంగం అంటూ ఏ తేడా ఉండదు. ఇది ఏ రంగంలోనైనా వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతుంది. అలాంటిదే ఇప్పుడు మన రైల్వే రంగంలోనూ జరగబోతోంది. ఒకప్పుడు కొంత దూరానికి కూడా పొగ రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు కొన్ని గంటల్లోనే సుదూర గమ్యాలను చేరుకునే అవకాశం అందుబాటులో ఉంది. అదే ‘బుల్లెట్’ ట్రైన్. దీనిని మొదటగా ఆర్థిక రాజధాని అయిన ముంబై, ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2-3 గంటల్లోనే చేరుకోవచ్చు. బుల్లెట్ రైలు ఏర్పాటు ఆలోచన యూపీఏ ప్రభుత్వం నుంచి ఉంది. దీనిని తొలిగా 2009-10 ైరె ల్వే బడ్జెట్లో ప్రస్తావించారు.. అప్పటి యూపీఏ ప్రభుత్వం పుణే రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ వరకు ముంబై మీదుగా దాదాపు 650 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే కారిడార్ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు అనుకున్నారు. ప్రాజెక్టు అధ్యయనానికి సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య 2013లో ఒక ఎంవోయూ కూడా కుదిరింది. తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. చివరికి 2015 డిసెంబర్లో భారత్, జపాన్ మధ్య ముంబై- అహ్మదాబాద్ కారిడార్కు సంబంధించిన ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు విశేషాలు ఇవి..! ఈ బుల్లెట్ రైలు దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అహ్మదాబాద్ మధ్య సేవలందించనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇది 11 స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్కు సాధారణ రైళ్లలో వెళ్లాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు 2 నుంచి 3 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.97,636 కోట్లు. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జైకా) 81 శాతం నిధులు అంటే రూ.76,165 కోట్లను రుణంగా అందించనుంది. రుణంలో వ్యయ పరిమితి, వడ్డీ, దిగుమతి సుంకాలన్నీ కలగలిపి ఉన్నాయి. 15 ఏళ్ల మారటోరియంతో 50 ఏళ్ల పాటు 0.1 శాతం వార్షిక వడ్డీ చెల్లించేలా రుణ ఒప్పందం జరిగింది. భారత రైల్వే రూ.9,800 కోట్లను అందించనుండగా.. మిగతా మొత్తాన్ని మహారాష్ట్ర, గుజరాత్లు భరిస్తాయి. ట్రాక్ నిర్మాణానికి కిలోమీటర్కు రూ.140 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చవుతుందని జైకా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానుండగా.. పనులు 2018లో ప్రారంభమవుతాయి. 2024 నాటికి బుల్లెట్ ట్రాక్ మీదకి దూసుకొచ్చే అవకాశం ఉంది. బ్రేక్ వేయాల్సిందిక్కడే.. ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు 11 చోట్ల ఆగనుంది. ముం బై, థానే, విరార్, దహను, వల్సద్, వపి, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్/నడియాద్, అహ్మదాబాద్ స్టేషన్లు ప్రతిపాదనలో ఉన్నాయి. చార్జీలిలా..! సాధారణ రైళ్ల ఫస్ట్క్లాస్ ఏసీ టికెట్ ధరతో పోలిస్తే బుల్లెట్ రైలు టికెట్ ధర దాదాపు 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏసీ మొదటి తరగతి టికెట్ ధర రూ.2,200 ఉంటే.. అదే బుల్లెట్ రైలులో అయితే దాదాపు రూ.3,300గా ఉంటుంది. కాగా, ఈ రైలులో 10 నుంచి 16 కోచ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తద్వారా 1,300 నుంచి 1,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలులో వైఫై వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జపాన్దే తొలి బుల్లెట్.. చైనాదే వేగం ప్రపంచంలో మొట్టమొదటి హైస్పీడ్ రైల్వే వ్యవస్థను 1964లో జపాన్ నిర్మించింది. ఆ తర్వాత 1981లో ఫ్రాన్స్, 1989లో ఇటలీ, 1991లో జర్మనీ, 1992లో స్పెయిన్, 1997లో బెల్జియం దేశాలు నిర్మించగా.. 2007లో చైనాలో అందుబాటులోకి వచ్చింది. కాగా, చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా రికార్డులకెక్కింది. దీని గరిష్ట వేగం గంటకు 430కి.మీ కాగా, సగటు వేగం గంటకు 251 కి.మీ. దీనిని 2004 ఏప్రిల్లో ప్రారంభించారు. అలాగే చైనాకే చెందిన హార్మొనీ సీఆర్హెచ్ 380ఏ ఈ రైలును 2010 అక్టోబర్లో ప్రారంభించారు. దీని గరిష్ట వేగం 380 కి.మీ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రెండో రైలు. ఇదీ బీజింగ్-షాంఘై మధ్య సేవలందిస్తోంది. కాగా, జపాన్కు చెందిన జపనీస్ మాగ్లేవ్ రైలు(గంటకు 603 కి.మీ) పట్టాలెక్కితే ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డులకెక్కనుంది. అవసరమా? దాదాపు రూ.లక్ష కోట్లు వెచ్చించి రెండు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇదివరకే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్వర్క్ను పునరుద్ధరిస్తే మంచి ఫలితా లు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో నడుస్తోన్న పలు రైళ్లను వాటి శక్తిసామర్థ్యాల మేర వినియోగించుకోలేకపోతున్నామని గుర్తు చేస్తున్నారు. ధనవంతులు, వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని కాకుండా సామాన్యులను పరిగణనలోకి తీసుకొని సంస్కరణలు జరగాలంటున్నారు. సంపన్నులు విమానాల్లో కూడా ప్రయాణించగలరని, వారి కోసం ఎయిర్ కనెక్టివిటీ సౌలభ్యాన్ని మెరుగుపరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే దీని స్థాపనకు జపాన్ (50 ఏళ్లకు) రుణమిస్తోంది. ఇంత సుదీర్ఘకాలానికి అప్పుచేసి పప్పు కూడు తినడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. - గుండ్ర వెంకటేశ్ - సాక్షి, సెంట్రల్ డెస్క్ సముద్రంలోనూ బుల్లెట్.. అరేబియా సముద్రం కింద ఈ రైలు బుల్లెట్లా దూసుకుపోనుంది. దాదాపు రైలు మార్గమంతా భూ ఉపరితలంపైనే ఉంటుంది. అయితే థానే నుంచి విరార్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర మాత్రం సముద్రగర్భంలో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ఓ భారీ టన్నెల్ను నిర్మించనున్నారు. -
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా కాకినాడటౌన్-సికింద్రబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్వో మైఖేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు(07102) ఆగస్టు 28, 31తేదీలలో రాత్రి 10 గంటలకు కాకినాడలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.45గంటలకు విజయవాడ వస్తుంది. 3గంటలకు బయలుదేరి ఉదయం 9.10గంటలకు సికింద్రబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు (07101) ఆగస్టు31, సెప్టెంబర్ 1వతేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, అర్ధరాత్రి 1.10గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 1.30 బయలుదేరి, ఉదయం 7.15గంటలకు కాకినాడ చేరుతుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు(07202) ఈ నెల 28, 31 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు సికింద్రబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.20 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 4.40కి బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(07201) ఈ నెల 29, సెప్టెంబర్ 1 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు కాకినాడలో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు, మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుంది.