విశాఖపట్టణం జిల్లా చోడవరంలో భూమి తగాదా కారణంగా అన్నదమ్ములు గొడవపడ్డారు. సత్తిబాబు అనే వ్యక్తి తన తమ్ముడు బాబూరావును గురువారం ఉదయం కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబూరావును చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చోడవరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.