కృష్ణానదిలో పడి ముగ్గురి గల్లంతు | Three men drown in Krishna River | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో పడి ముగ్గురి గల్లంతు

Published Sat, Nov 21 2015 5:19 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

Three men drown in Krishna River

నందిగామ (కృష్ణా జిల్లా) : బల్లకట్టు మీద ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నదిలో జారి పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న బల్లకట్టుపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ జారి నదిలో పడ్డారు. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు పోలీసుల సాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారు రామన్నపేటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement