కుందూనదిలో ముగ్గురు మహిళల గల్లంతు | Three women feared drowned in Kundu river | Sakshi

కుందూనదిలో ముగ్గురు మహిళల గల్లంతు

Oct 3 2017 11:53 AM | Updated on Oct 3 2017 11:53 AM

కర్నూలు జిల్లా కుందూ నదిలో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కుందూ నదిలో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడమేగాక నదుల్లోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గడివేముల మండలం గడిగరేవుల దగ్గర కుందూనదిలో ప్రమాదవశాత్తూ ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు.

వీరిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సమాచారమందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగతా ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement