తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. కాలినడకన భక్తులకు 5 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయాధికారులు తెలిపారు.