ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
మహానంది (కర్నూలు) : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం వద్ద సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. బుక్కాపురం గ్రామానికి చెందిన శివ(25) ద్విచక్రవాహనంపై మహానంది వెళ్తుండగా.. గ్రామ శివారుకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బైక్పై ఉన్న యువకుడితో పాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.