బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | Woman dies in Road accident | Sakshi

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

May 24 2015 10:20 AM | Updated on Aug 30 2018 3:58 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా,  బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాత గుంటూరుకు చెందిన కొచ్చర్లపాటి గిరిధర్ వర్మకు కేఎల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత గుంటూరు నుంచి గిరిధర్ వర్మ, అతడి తల్లి విఘ్నేశ్వరి, మేనమామ భాస్కర్‌వర్మ బైక్‌పై వడ్డేశ్వరం బయల్దేరారు. భాస్కర్ వర్మ బండి నడుపుతుండగా.. మధ్యలో గిరిధర్‌ వర్మ, వెనుక విఘ్నేశ్వరి కూర్చున్నారు. మరో 5 నిమిషాల్లో యూనివర్సిటీకి చేరుకుంటామనగా... వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విఘ్నేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, భాస్కర్, గిరిధర్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement