One died
-
నాలుగు రోజులు మృత్యువుతో పోరాడిన దీక్షిత..
పెందుర్తి: రాజమండ్రిలో బుధవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత(22) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి ఇంటర్వ్యూ నిమి త్తం విశాఖ నుంచి హైదరాబాద్కు కావేరి ట్రావెల్స్ బస్లో ఈ నెల 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్ బోల్తా పడడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి చికిత్స నిమి త్తం తీసుకువచ్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మరోవైపు ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోవడం పట్ల బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
అక్కా.. వెళ్లిపోయావా..
అనకాపల్లి: మరికొద్ది సేపట్లో ఆనందం పంచుకోవాల్సిన ఆ ఇంట్లో దుర్వార్త వినడంతో కశింకోట మండలం వెదురుపర్తి గ్రామం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. తమ్ముడు భార్య గర్భిణి కావడంతో శనివారం సాయంత్రం ఆమెను పుట్టింటికి పంపించేందుకు కావాల్సిన సరంజామా అంతా తెచ్చేందుకు అతడితో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్క వి. విజయలక్ష్మి(40) దుర్మరణం చెందగా, తమ్ముడు మళ్ల గిరిబాబు (35)కు గాయాలయ్యాయి. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు తమ ద్విచక్ర వాహనంపై కశింకోట నుంచి అనకాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి బైక్ సైడ్ మిర్రర్ను స్పీడ్గా తాకడంతో ఒక్కసారిగా పడిపోయారు. దాంతో లారీ వెనుక చక్రం విజయలక్ష్మి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, గిరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే తన అక్క చనిపోవడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గాయపడిన అతడిని హైవే అంబులెన్స్లో ఎన్టీఆర్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. గిరిబాబు భార్య ఝాన్సీలక్ష్మి గర్భిణి కావడంతో పుట్టింటికి పంపించేందుకు పూలు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయలు దేరిన సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ అశోక్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి తన భర్త, కుమారుడుతో విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఉంటున్నట్టు తెలిసింది. -
ఆసరా అవుతాడనుకుంటే ఆగం చేసిండు!
లింగాలఘణపురం: చేతికందిన కొడుకు ఆసరా అవుతాడని అనుకుంటే ఆగం చేసిండంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన గండి అంజయ్య, రేణుక దంపతుల కుమారుడు కల్యాణ్ (22) గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు దేవరాయ కరుణాకర్తో కలిసి గత నెల 25న భువనగిరి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంగపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కల్యాణ్కు తీవ్ర, కరుణాకర్కు స్వల్ప గాయాలు కాగా పోలీసులు హై దరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్ కోమాలోకి వెళ్లాడు. ఐదు రోజులు చికిత్స పొందినా ఫలితం లేదు. శనివారం రాత్రి మృతి చెందాడు. ఫ్యాషన్ షోలపై మక్కువకల్యాణ్కు ఫ్యాషన్ షోలపై మక్కువ. 2023లో సడఫ్ ప్యాషన్ షో అడిషన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్యాణ్ భువనగిరికి ఎందుకు వెళ్లాడో ఏమో తెలియదు. ప్రమాదంలో గాయపడ్డాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లారు. ఏదైనా పని చేసి తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి. తాము ఇష్టంగా కొనిచి్చన బైక్తో ప్రమాదం జరిగి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మణిపూర్లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
దూసుకొచ్చిన మృత్యువు
మేడ్చల్ రూరల్: కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రయాణం పడకపోవడంతో వాంతులు రాగా రోడ్డుకు ఎడమ వైపు కారు ఆపి..వాంతి చేసుకుంటుండగా డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచి్చంది. ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన మేడ్చల్ ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది.ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కూకట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యాసాగర్ శనివారం ఉదయం తన భార్య రమాదేవి, కుమారుడు రామ్, తల్లి రమమ్మ, వరంగల్కు చెందిన అక్క దీప్తి, అల్లుడు పూజిత్ రామ్(13), కోడలు వేదశ్రీలతో కలిసి బీబీనగర్ వెళ్లేందుకు శనివారం ఉదయం తమ కారులో బయలుదేరి ఓఆర్ఆర్ గుండా వెళ్తున్నారు. మార్గమధ్యలో మేడ్చల్ సమీపంలోకి చేరుకోగానే కారులో ఉన్న అల్లుడు పూజిత్రామ్, భార్య రమాదేవి, వేదశ్రీలకు వాంతులు కావడంతో కారును ఎడమవైపు ఆపారు. రమాదేవి, వేదశ్రీలు కారు దిగి పక్కకు వెళ్లగా..పూజిత్రామ్ తిరిగి కారు ఎక్కే సమయంలో అదే మార్గంలో వెనుకనుండి వేగంగా వచి్చన డీసీఎం వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో పూజిత్రామ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించగా కారులో ఉన్న విద్యాసాగర్, కుమారుడు రామ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూజిత్రామ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ప్రమాద భయం వెంటాడింది.. ప్రాణాలను బలిగొంది
హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ నుంచి ఎన్టీఆర్ నగర్ లోని ఆద్య ఆస్పత్రికి వచ్చి కారును పార్కింగ్ చేశాడు. భయాందోళనతో ఉన్న అతను ఆస్పత్రి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా..నగరంలో పని నిమిత్తం వెళ్లిన అతను మూసారాంబాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో రితీష్రెడ్డిని బైకుపై ఇద్దరు వ్యక్తులు వెంబడించడంతో భయాందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. రితీష్ రెడ్డి కారును ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. అతను కారు ప్రమాదం చేసి వచ్చాడని అక్కడివారికి చెబుతున్న క్రమంలోనే.. రితీష్రెడ్డి భవనంపై నుంచి దూకడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. రితీష్ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రితీష్ రెడ్డిని వెంబడించినవారి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్: ఒకరు మృతి
కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
కూతురిని కాలేజీకి పంపించేందుకు వెళ్తూ..
వరంగల్: కన్నబిడ్డను కాలేజీకి పంపుదామని బయలుదేరిన ఆ తండ్రిని విధి కబలించింది. కళ్లముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తె గుండెలవిసేలా రోదించింది. తనను సాగనంపడానికి వచ్చి కానరానిలోకాలకు పోతివా.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్ సమీపంలోని 163 జాతీయ రహదారిపై మంగళవారం కంటైనర్ లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న రైతు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపురం(కె) చెందిన పోలిన శ్రీనివాసరావు (58) తన కుమార్తె పోలిన శృతిని హైదరాబాద్లోని కాలేజీకి పంపించేందుకు తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఇదే క్రమంలో 163 జాతీయ రహదారిపై ఇసార్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా ఛత్తీస్గఢ్కు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె శృతికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో ములుగు వెళ్తున్న వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన శృతిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తన వాహనంలో తీసుకువచ్చి చికిత్స అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఇందయ్య పరిశీలించి కారులో ఇరుక్కుపోయి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె హైదరాబాద్లో బీటెక్ చదువుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. -
సత్యవతితో సహజీవనం.. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడంతో..
నరసన్నపేట: స్థానిక బజారువీధిలో నివాసముంటున్న పాయకరావుపేటకు చెందిన దక్కుబల్లి శివ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడం వలన శివ మృతి చెందాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి నరసన్నపేటకు 15 ఏళ్ల క్రితం వలస వచ్చిన శివ తునికి చెందిన బంగారి సత్యవతితో సహజీవనం చేస్తూ బజారు వీధిలో నివాసముంటున్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న తీవ్ర గాయాలతో ఇంటికి రాగా సత్యవతి స్థానికుల సహాయంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. కాగా, శివ స్నేహితులు మాత్రం ఇది హత్యేనని, కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరుతున్నారు. శివ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామ ని ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
సికింద్రాబాద్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. చదవండి: Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
ప్రేమ జంటను విడదీసిన విధిరాత
తూర్పు గోదావరి (పిఠాపురం): డిగ్రీ పూర్తి చేసుకున్న యువకుడు, ఇంటర్ చదివిన యువతి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న అనుమానంతో తామే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో విధి వారిని విడదీసింది. పిఠాపురం సమీపంలో రాపర్తి సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్ర గాయాల పాలవ్వగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ ఎస్సై శంఖరరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు. మోటారుసైకిల్పై గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్కు వచ్చే సరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్ను వీరి వాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బిడ్డకు కొత్త బట్టలు కొనాలని వెళ్లాడు.. అంతలోనే
సాక్షి, తిరుమల: కుమారుడు చైతన్య పుట్టిన రోజున కొత్త బట్టలు కొనేందుకు.. ఫొటోల వ్యాపారం చేసి డబ్బు తెస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా డని తిరుమల అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన తుమ్మల మల్లిరెడ్డి(45) భార్య శోభ కన్నీరుమున్నీరయ్యారు. తిరుచానూరుకు చెందిన మల్లిరెడ్డి ఇక లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాథాలు మిన్నంటాయి. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా భర్త సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లాడు. బయలుదేరే మందు బాబు పుట్టినరోజుకు బట్టలు కొనడానికి డబ్బులు లేవన్నాడు. వ్యాపారం చేసి.. వచ్చిన డబ్బుతో బాబు పుట్టినరోజు ఘనంగా చేద్దామన్నాడు. కొండ మీద జనం లేరు కదా..? ఎందుకులే అని చెప్పినా వినలేదు. తిరుమలకు ప్రయాణమయ్యాడు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఫోన్ చేశాడు. ఇక మంగళవారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. పక్క షాప్ అతనికి ఫోన్ చేసి..ఒక్కసారి చూడన్నా అని∙అడిగాను.. ఆ తర్వాత కొద్దిసేపటికే మా ఆయన అగ్నికి ఆహుతయ్యాడని తెలిసింది’’ అంటూ రోదించారు. ఇలాంటి ఘటన బాధాకరం: భూమన తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు పైగా కాలిపోవడం, అందులో 12 షాపులు పూర్తిగా దగ్ధం కావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుచానూరుకు చెంది న మల్లిరెడ్డి మంటల్లో ఆహుతైపోవడం కలిచి వేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. దగ్ధమైన షాపుల నిర్వాహకులు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని.. టీటీడీ చైర్మన్తో సంప్రదించి వీరికి పరిహారం ఇచ్చే విధంగా చూస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథ మికంగా నిర్ధారించామన్నారు. కో–ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ చిన్నముని ఎమ్మెల్యే వెంట ఉన్నారు. చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హైటెక్ సిటీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోవాటెల్ వద్ద కారు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మాదాపూర్ సమీపంలో అతివేగంగా దూసుకువస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ను ఢీకొంది.. ఈ ఘటనలో అభిషేక్ ఆనంద్(26) అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి.. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కె. అశ్విన్ గా గుర్తించిన పోలీసులు డ్రైవర్ మద్యం సేవించి, తప్పు మార్గంలో నడపుతుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బీబీనగర్ (భువనగిరి) : బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లాకు చెందిన మునెసూల అరుణ(21) హైదరాబాద్ నాంపల్లిలోని ఓహస్టల్లో ఉంటూ ఎస్ఎన్ వనిత మహావిద్యాలయ్ డిగ్రీ కళాశాలలో బీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా యాదాద్రి(గుట్ట)లోని తమ అక్క కూతురి జన్మదినం కావడంతో అరుణ తన బంధువు ముషీరాబాద్కు చెందిన శ్రీకాంత్తో కలిసి స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. బీబీనగర్లోని చెరువు కట్ట సమీంపలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న బ్రీజా కారు స్కూటీని ఢీకొట్టి వెళ్లిపొయింది. దీంతో రోడ్డుపై ఎగిరి పడ్డ అరుణపై నుంచి అదే సమయంలో వెనుక నుంచి మరోకారు దూసుకుపోయింది. ఈసంఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కన పడ్డ శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. మొదట ప్రమాదానికి కారణమైన బ్రీజా కారు అక్కడి నుంచి తప్పించుకు పోగా అరుణ మృతికి కారణమైన హైదరాబాద్కు చెందిన కారును, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణతో కలిసి వచ్చిన శ్రీకాంత్ అరుణ తన స్నేహితురాలు అంటూ స్థానికులతో చెప్పుకొచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గరివిడి: చీపురుపల్లి నుంచి రాజాం వెðళ్లే ప్రధాన రహదారిలో బీజే పాలెం దాటిన తర్వాత ఎఫ్సీ గోడౌన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ముషిడివలస పంచాయతీ మధుర గ్రామమైన కొప్పలపేటకు చెందిన కొప్పల అప్పలస్వామి (32), రాగోలు సత్యం ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో రాజాం వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బైక్ బోల్తా పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చీపురుపల్లి సీహెచ్సీకి తరలించగా.. అప్పలస్వామి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాగోలు సత్యంనకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పలస్వామి భవానీ మాల ధరించి విజయవాడ మొక్కు చెల్లించుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను దుమ్మెద గ్రామానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య రూపావతి, కుమార్తె రేణుక, కుమారుడు మణి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
-
ఫ్యూజు వేయబోయి...
యాడికి : వీరారెడ్డిపల్లెకు చెందిన పేరం శిరీష్రెడ్డి (25) పాలిటెక్నిక్ చదివాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందాక తల్లి రాజేశ్వరికి చేదోడువాదోడుగా నిలిచాడు. తమకున్న పది ఎకరాల పొలంలో పత్తి, వేరుశనగ, మిరప, జొన్న సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం ఉదయం పత్తికి నీరు కట్టాలని తోటకు వెళ్లాడు. చుట్టుపక్కల మోటార్లు ఆడుతున్నా తమ పొలంలో ఆడకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకెళ్లి చూడగా ఫ్యూజు పోయినట్లు గుర్తించాడు. ఫ్యూజు వేసేక్రమంలో విద్యుదాఘాతానికి గురవడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. పక్కతోటలోని రైతులు గమనించి శిరీష్రెడ్డి చిన్నాన్న కమలపాడు తాజా మాజీ సర్పంచ్ భీమేశ్వరరెడ్డికి సమాచారమందించారు. అనంతరం ఆటోలో యాడికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శిరీష్రెడ్డి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, నాయకులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, రమేష్రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణ అద్యక్షుడు మనోజ్ తదితరులు వచ్చి శిరీష్రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయంత్రం శిరీష్రెడ్డి మృతదేహం వీరారెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, నాయకులు యాడికి మాజీ ఉపసర్పంచు కాసా చంద్రమోహన్, మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి, సేవాదళ్ కన్వీనర్ అవుకు నాగరాజు, సేవాదళ్ ఉపాధ్యక్షుడు రామ్మోహన్, బీసీసెల్ కన్వీనర్ మధురాజు, కోటి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితురాలితో బైక్పై వెళుతుండగా..
రాజమహేంద్రవరం క్రైం: లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీనివాసనగర్, రామగిరి ప్రాంతానికి చెందిన ఉత్తమ రాజు నిఖిల్ కుమార్(35) హైదరాబాద్లో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితురాలు హైదరాబాద్, శారదా నగర్ రోడ్డు, సరూర్ నగర్కు చెందిన నివేదితతో కలసి హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్పై విశాఖపట్నం వెళుతుండగా దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద రోడ్డుపై గుంత ఉండడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టి, నిఖిల్కుమార్పై నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో నిఖిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న నివేదితకు కుడి కాలు, కుడి చేయి విరిగాయి. గాయాలు పాలైన ఇద్దరినీ రోడ్డు సేఫ్టీ కానిస్టేబుళ్లు ఎన్. లక్ష్మణరావు, నర్సయ్యలు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివేదిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు నిఖిల్ కుమార్, నివేదితకు వేరు వేరుగా వివాహాలైనట్టు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా వారు స్నేహంగా ఉంటున్నారన్నారు. సోమవారం హైదరాబాద్లో బయల్దేరి ఉంటారని, మార్గం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలో చర్చిని సందర్శించుకొని రోడ్డు మార్గంలో గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా వైజాగ్ వెళుతుండగా వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్నారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. బొమ్మూరు సీఐ నాగమోహన్ రెడ్డి, ఎస్సైలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం
సాలూరు విజయనగరం : పట్టణంలోని బంగారమ్మకాలనీకి చెందిన మరిపి కృష్ణ (50), అతని సహజీవని సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు కృష్ణ కుమారుడు శివ తెలియజేసిన వివరాల మేరకు... రెండేళ్ల కిందటి వరకు స్థానిక బెల్లం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసిన కృష్ణ తొలి భార్య మరణించడంతో సుజాతకు ఆశ్రయమిచ్చి సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే కృష్ణకు ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. ఇదిలా ఉంటే కంటిచూపు కోల్పోయిన కృష్ణ ఇంటికే పరిమితం కావడంతో కృష్ణ, సుజాతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో, గురువారం వేకువజామున సుజాత ఇంటిలో ఉన్న చీమల మందు తాగింది. వెంటనే శివ గమనించి ఆమెను పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు సుజాత ఏమి తాగిందో ఆ సీసాను తీసుకురావాలని కోరడంతో.. శివ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఇంటి దూలానికి వేలాడుతున్న కృష్ణను చూసి అవాక్కయ్యాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రిని దించి ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రాణాలొదిలాడు. సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ పోలీసులు కేసున మోదుచేసి విచారణ చేపడుతున్నారు. -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మదనపల్లె క్రైం: మదనపల్లె మండలంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టలో నివాసముంటున్న బండ కార్మికుడు తిరుమలకొండ వెంకటరమణ పెద్ద కుమారుడు పెద్దరామాంజులు (ఆంజి) (31) బండపని చేసి భార్య వెంకటలక్ష్మి, పిల్లలు నాగేశ్వరి, అజయ్, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. నీరుగట్టువారిపల్లె బాబుకాలనీ సమీపంలో సూరి ఇటుకల బట్టీలో ఇటుకలు వేస్తున్న పీటీఎం మండలం బురుజుపల్లెకు చెందిన జరిపిటి రామచంద్రయ్య కుమారుడు రామకృష్ణ (28)తో కలిసి సొంత పనిమీద ఆంజి ద్విచక్రవాహనంలో సీటీఎం బయలుదేరారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మలుపు వద్ద తిరుపతి నుంచి మదనపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఏఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెద్దరామాంజులు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ వెస్లి ఆదేశాల మేరకు ఏఎంసీ అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. ఆంజి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐలు సునీల్కుమార్, కేవీహెచ్.నాయుడు తెలిపారు. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాల నేపథ్యంలో గురజాల మండలం మాడుగుల గ్రామంలో సోమవారం రాత్రి హత్య జరిగింది. తన తమ్ముడు గనిపల్లి అమ్మోసు, అతని భార్య ఏసమ్మ గొడవపడుతుండగా గనిపల్లి శ్యామేలు (35) సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఏసమ్మ కుటుంబ సభ్యులు కర్రతో మోదడంతో శ్యామేలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గుంటూరు జిల్లా /గురజాల : కుటుంబంలో చేలరేగిన కలహాలు వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ ఘటన గురజాల మండలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. మాడుగుల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న గనిపల్లి శ్యాయ్మేలు (35)హత్యకు గురయ్యాడు. తమ్ముడు గనిపల్లి అమ్మోసు అతని భార్య ఏసమ్మలు సోమవారం రాత్రి భోజనం సమయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో అమ్మోసు ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అన్న శ్యాయ్మేలు తమ్ముడు, మరదల గొడవను చూసి సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఏసమ్మ భర్తతో పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగుతోంది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు టి.బాబు, రమేష్, యోహాన్, ఏసోబు, రాజేష్, సీతారావమ్మ, సీతమ్మ, ఆదాంలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే భార్యభర్తలకు సర్థి చెబుతున్న శ్యాయ్మేలును వస్తూ వస్తూనే తలపై కర్రతో గట్టిగా కొట్టారు. తీవ్ర గాయం కావడంతో క్షతగాత్రుడిని స్థానికులు ఆటోలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్యాయ్మేలు మృతి చెందాడు. మృతుడు కుమారుడు చిన్నరాజు ఫిర్యాదు మేరకు సీఐ వై.రామారావు ఏసమ్మతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎప్పుడూ గొడవలే.. మృతుడు శ్యామేలు తమ్ముడు అమ్మోసు అదే గ్రామానికి చెందిన ఏసమ్మను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. తమ్ముడు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు వస్తుండేవి. మృతుడు శ్యాయ్మేలు సర్థి చెప్పేవాడు. గతంలో కూడా అమ్మోసుపై భార్య ఏసమ్మ రెండు సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్లకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నన్ను చంపేందుకు భర్త అమ్మోసు ప్రయత్నించాడని కేసు పెట్టింది. పెద్దలు రాజీ కుదర్చడంతో విషయం చల్లారింది. తర్వాత మరికొద్ది రోజులకు ఏసమ్మ కుటుంబ సభ్యులు బంగారు అభరణాలు దొంగతనం కేసును కూడా అమ్మోసుపై పెట్టారు. తన భార్య రెండు నెలల కిందటే పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చిందని మృతుడు తమ్ముడు అమ్మోసు తెలిపారు. పలువురి పరామర్శ.. శ్యాయ్యేలు మృతదేహన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకుడు ఎనుముల మురళీధర్రెడ్డి, మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె.అన్నారావులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్) : హాజీపూర్ మండలం దొనబండ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హాజీపూర్ ఎస్సై ముత్తన్న తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రాజీవ్నగర్కు చెందిన శెట్పల్లి నిఖిల్సాయి, రాజ్కుమార్, సాయిపవన్, వెంకటరమణ, సిద్దులు కారులో మందమర్రి నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శెట్పల్లి నిఖిల్సాయి(19) తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్కుమార్, సాయిపవన్, వెంకటరమనణ, సిద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నిఖిల్సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మిగతా నలుగురు యువకులు పట్టణలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. కాగా మృతుడు నిఖిల్సాయికి తండ్రి రాజేశం, తల్లి విజయ ఉన్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నిఖిల్సాయి బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రంగారెడ్డి జిల్లాలో విషాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం నాన్దార్ఖన్పేట్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం టీ పెడుతుండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ఆఫ్జల్గంజ్లో విషాదం
-
పెళ్లి బృందం డీసీఎం బోల్తా
మరికొన్ని గంటల్లో ‘నిఖా’ (వివాహ వేడుక).. ఎంతో సంతోషంగా బంధుమిత్రులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఎంతో సందడిగా వెళ్తున్న ఆ పెళ్లి బృందం క్షణాల్లోనే క్షతగాత్రులుగా మారారు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో అప్పటి వరకు పెళ్లి వేడుకల సంబురంలో ఉన్న వారంతా ఆహాకారాలు.. రోదనలతో మృత్యు భయంతో వణికిపోయారు. మహబూబాబాద్ రూరల్: ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి బోల్తా కొట్టిన పెళ్లిబృందం డీసీఎంను అటుగా వెళ్తున్న మరో గూడ్స్వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా సమీపంలో సోమవారం జరిగిన ఘటన వివరాలు బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎండీ. హుస్సేన్షరీఫ్–నూర్జహాన్ కుమారుడు ఆరీఫ్షరీఫ్ వివాహం నెల్లికుదురు మండంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన అక్బర్–రజీయా కుమార్తె రిజ్వానాతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ పెళ్లి బృందం మొత్తం ఒక డీసీఎం వాహనంలో జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా మీదుగా మధ్యాహ్నం సమయంలో వెళ్తోంది. అదే సమయంలో కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ శివారు పెద్దతండాకు చెందిన కొర్ర వీరన్న తన ద్విచక్ర వాహనంపై ఏ క్యాబిన్ రైల్వేగేట్ నుంచి ఎదురుగా వేగంగా వచ్చాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ను డీసీఎం వాహన డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కంకర కుప్ప పైకి వెళ్లి పల్టీకొట్టింది. అదే సమయంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లికి చెందిన చాక్పీస్ల వ్యాపారి కూర పాటి బాబురావు, డ్రైవర్ గోసిక రాఘవేంద్ర గూడ్స్వ్యాన్లో అటువైపుగా వస్తున్నారు. ఒక్కసారిగా ముందు పడిన పెళ్లిబృందం డీసీఎంను వారు బలంగా ఢీకొట్టారు. క్షతగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు ఆరీఫ్ షరీఫ్ తండ్రి హుస్సేన్షరీఫ్ తలకు, గూడ్స్వ్యాన్ డ్రైవర్ గోసిక రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న ఎస్కే.సమీర్, ఎండీ.అజీమ్కు చేతులు విరిగాయి. పసునూరి కరుణాకర్, ఉమేష్, పెండ్లి కొడుకు అన్న ఆసీఫ్, సాయి, శ్రావణ్, ఇమామ్ పాషా, యాకుబ్ పాషాకు స్వల్ప గాయలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక డీసీఎం డ్రైవర్ తప్పించిన ద్విచక్రవాహనదారుడు కొర్ర వీరన్న వ్యాన్ వెనుకవైపు ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందాడు. హాహాకారాలు..రోదనలు... పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన స్థలంలో ఆహాకారాలు.. రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరుగగానే రోడ్డు అడ్డంగా వాహనం పడిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పెళ్లి బృందం వారికి ప్రమాదం జరిగిందని వార్త తెలియగానే ఘటన స్థలానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్వ్యాన్ డ్రైవర్ రాఘవేంద్ర అందులోనే ఇరుక్కుపోగా పోలీసులు, స్థానికులు అతడిని అతి కష్టం మీద బయటకి లాగి ఆస్పత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమయ స్ఫూర్తితో డ్రైవర్ అందులో నుంచి బయటకు వచ్చాడు. టౌన్ ఎస్సై అరుణ్కుమార్, ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మండల మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫక్రూద్దీన్, సర్పంచ్ షఫీయుద్దీన్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని మురళీ క్షతగాత్రులను పరామర్శించారు. -
ప్రాణం తీసిన అతివేగం
-
లాడ్జిపై షీ టీమ్స్ దాడులు, మహిళ మృతి
కర్నూలు : షీ టీమ్స్ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ కిందపడి మృతి చెందిన ఘటన ఆదివారం నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన లక్ష్మి(40) భర్త చనిపోవడంతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. లక్ష్మి రోజూ కర్నూలుకు వచ్చి మహిళలను ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలోని లాడ్జికి తరలించి పడుపు వృత్తి చేయించేది. ఇందులో భాగంగా హసీనా అనే మహిళతో పాటు మరో మహిళను లాడ్జీలోకి పంపించి బయటే వేచి ఉంది. సమాచారం అందుకున్న షీటీమ్స్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. మహిళా పోలీసులను చూసిన లక్ష్మి పారిపోయేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిందపడడంతో ముక్కు నుంచి రక్తస్రావమైంది. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐ మహేశ్వరరెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
ఫుడ్ పాయిజన్
నిజామాబాద్అర్బన్: పురుగు లు పట్టిన బియ్యం, ము క్కిన పప్పులు, పాడైన కారం, మసాలాలు, కు ళ్లిన కూరగాయలు.. వెరసి జిల్లా కేంద్రంలో ని మాలపల్లిలో గల సో ఫియా నిస్వాన్ మద ర్సా మెనూ. ఏంటి ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజ మే. మదర్సాలో గురువారం రాత్రి విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అయింది. దీంతో ఒకరు మృతిచెందగా, 13 మంది అస్వస్థతకు గురయ్యారు. మదర్సాలోని సుమారు 20 మంది విద్యార్థులు మూడు రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. మదర్సా నిర్వాహకులు తాత్కాలికంగా మాత్రలను వేశారు. అయితే వారి ఆ రోగ్యం మెరుగుపడలేదు. గురువారం రాత్రి ఓ విద్యార్థిని జ నరల్ ఆస్పత్రికి తెచ్చారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా ఇక్కడికే తెచ్చా రు. చికిత్స పొందుతుం డగా నస్రుల్లాబాద్కు చెందిన సుమాయఫిర్దొస్ అనే వి ద్యార్థిని మృతి చెందింది. మరో 13 మంది అలీషామెహర్(కామారెడ్డి), సానియబేగం (చించోలి), సమ్రిన్సుల్తానా(సంగారెడ్డి), సీమ్రాన్(హీంగోలి), అస్మాఫాతిమా(బోధన్), రుక్యఫిర్దొస్(పెర్కిట్), రీనాఫిర్దొస్,నాబిహా(కోటగిరి), జుమేరాబేగం(కోటగిరి), సలీమబేగ్(కోటగిరి), జక్రినస్రా(హైదరాబాద్), అయేషా, సారాసుల్తానా (సం గారెడ్డి) ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉం దని వైద్యులు అన్నారు. అయితే బాధిత విద్యా ర్థుల బంధువులు నిర్వాహకులపై దాడికి యత్నించారు. సుమాయఫిర్ధొస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కాకుండానే తరలించారు. వైద్యాధికారులు, పోలీసులు పరిశీలించి మళ్లీ రాత్రి పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని తెప్పించారు. వస్తువులు మార్చేసిన నిర్వాహకులు మదర్సాలో తనిఖీలు చేసిన ఫుడ్ఇన్స్పెక్టర్ నివేదిక సిద్ధం చేస్తుండగానే నిర్వాహకులు పాత సామగ్రి స్థానంలో కొత్తవి తెచ్చారు. నివేదికను తమకు అనుకూలంగా ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి అధికారిణిపై ఒత్తిడి తెచ్చారు. అనుకూలమైన నివేదిక రాయలంటూ పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలంలో హంగామా చేశారు. ఇదిలా ఉండగా మదర్సాకు ఏసీపీ సుదర్శన్ వచ్చి వివరాలు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. మదర్సాలో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి నిత్యం అప్రశుభ్ర ఆహారాన్నే అందిస్తున్నారు. ఈ సంఘటనతో ఫుడ్ఇన్స్పెక్టర్ అమృతశ్రీ తనిఖీ చేశారు. అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. బియ్యంలో పురుగులు, కుళ్లిన టమాటాలు, ముక్కిన పప్పులు, మసాలాలతో ఆహారం అందిస్తున్నట్లు వెలుగు చూసింది. శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్కు తరలించారు. ఆహార పదార్థాలు ఏమాత్రం తినేందుకు వీలు లేవని ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్నారు. అన్ని వస్తువులు పాడయ్యాయి.. మదర్సాలో ఆహార పదార్థాలు సక్రమంగా లేవు. కుళ్లిన టమాటలు, పురుగులు పట్టిన బియ్యం, పప్పులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్నాం. 200 మంది విద్యార్థులకు సరిపోయేంత ఆహారం లేదు. వంటగది అపరిశుభ్రంగా ఉంది. పరీక్షల నిమిత్తం శాంపుల్స్ను హైదరాబాద్కు పంపుతున్నాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. –అమృతశ్రీ, ఫుడ్ఇన్స్పెక్టర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : డీసీఎం బోల్తాపడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంకు సమీపంలో జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బొమ్మలరామారం మండలం లక్ష్మీతండాకు చెందిన ఇంద్రావత్ పాండు(36) మోత్కూరు నుంచి తన సొంత డీసీఎం ద్వార బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారు. డ్రైవర్, యజమాని అయిన పాండుతో పాటు కూలీలు స్వామి, లక్ష్మణ్, దారవత్ భిక్షం ప్రయాణిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో మెయిన్ రోడ్డు పక్క చెట్టును ఢీకొట్టడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ సంఘటనలో పాండు అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న స్వామి, లక్ష్మణ్, భిక్షలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య ఇంద్రావత్ శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కనకటి యాదగిరి తెలిపారు. -
డీసీఎం, కారు ఢీ.. ఒకరి మృతి
మహేశ్వరం: ముందు వెళ్తున్న డీసీఎం వాహానాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇం జినీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తుక్కుగూడ ఔ టర్ రింగ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం చో టు చేసుకుంది. పహాడీషరీఫ్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ ప్రా ంతానికి చెందిన కిరణ్(35) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. మైసిగండిలో ఓ ఫంక్షన్కు హజరయ్యేందుకు తన సాంత్రో కారులో భార్య, బంధువులతో కలిసి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తుక్కుగూడ ఔటర్పై ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య అనురాధ, బంధువు జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఔటర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తర లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటకి తీస్తున్న దృశ్యం -
పాతబస్తీలో ఘర్షణ..ఒకరి మృతి
హైదరాబాద్: హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని తారీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో గొడవ పడ్డారు. కోపంలో ఓ వ్యక్తి , అన్వర్ అనే మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన సోహైల్ అనే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అన్వర్ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై హస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటోను ఢీకొట్టిన కారు
హుజూరాబాద్రూరల్: అతివేగం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మండలంలోని శాలపల్లి ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మికుంట– హుజూరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నలుగురు గాయపడ్డారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వీణవంకకు చెందిన పులాల మల్లయ్య(53), పులాల లచ్చవ్వ, సిర్సపల్లికి చెందిన తూనికి అంజయ్య ఆటోలో జమ్మికుంట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మల్లయ్య, లచ్చవ్వ, అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ అంకూస్, మరో వ్యక్తి రాజేష్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. మల్లయ్యను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఏనుగుల దాడిలో యువకుడి మృతి
-
విషాదం మిగిల్చిన పెళ్లి
మెదక్రూరల్: సంతోషంగా బంధువుల పెళ్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరిన తండ్రి, కొడుకులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఆటో భైక్ను ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ మండలం పాతూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మానగర్ గ్రామానికి చెందిన చింతకింది సిద్దిరాములు(60) ఆయన కొడుకు అంజనేయులుతో కలిసి సమీప బంధువుల వివాహానికి వెళ్తుండగా మార్గమధ్యలో మెదక్–రామాయంపేట రహదారి వద్ద వెనకాల నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో వారి ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ, కొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిద్దయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం గాంధీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆంజనేయులుకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పోచమ్మ, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
సైకో వీరంగం: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో మంగళవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మండలంలోని జాకారం గ్రామంలో వృద్ధుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అంతే కాకుండా సమీపంలోని బాలికల వసతిగృహంపైనా దాడికి దిగాడు. ఈ దాడిలో కాపలాగా ఉన్న వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతి చెందిన వృద్ధుడిని అబ్బాపూర్ గ్రామస్తుడు కొంగొండ నర్సయ్య(75) గా గుర్తించారు. గాయపడిన వాచ్మెన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గ్రానైట్ రాయిపడి కూలీ దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): పొట్ట కూటికోసం వలస వెళ్లి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి మీదపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని లోకుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్(30) గత మూడేళ్లుగా ఉపాధి కోసం షాద్నగర్లోని మహి గ్రానైట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ప్రమాదవశాత్తు యంత్రంలో నుంచి గ్రానైట్ రాయి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు రాచప్ప, రాష్ట్ర సీపీఎం నాయకులు భూపాల్తోపాటు 40 మంది గ్రామస్తులు కంపెనీ ఎదుట బైటాయించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అదనపు సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.13 లక్షలు ఆర్థికసాయం చేయాలని కోరగా అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు చెప్పారు. అశోక్కు భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
ఇంటికి చేరుకునేలోపే...
పరిగి : పండగపూట విషాదం చోటు చేసుకుంది. అందరూ ఉపవాస దీక్షల్లో మునిగిపోతే..ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎదురురెదుగా వస్తున్న డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఖుదావంద్గేట్ సమీపంలో పరిగి–షాద్నగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గాలిగూడెం అనుబంధ గ్రామం ఇస్రాన్గడ్డతండాకు చెందిన విక్రమ్(19), అదే తండాకు చెందిన హన్ము(13) స్నేహితులు. విక్రమ్ అన్న బతుకుదెరువు కోసం బొంబాయి వెళుతుండటంతో సాగనంపేందుకు వికారాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. వారిని రైలెక్కించి తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా మండల పరిధిలోని ఖుదావంద్పూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న విక్రం (19) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్ము(13)కు తీవ్ర గాయాలవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ షాద్నగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. హన్ము గాలిగూడెం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ మృతదేహాన్ని పరిగి మార్చురీలో ఉంచారు. -
ద్విచక్ర వాహనాలు ఢీ
కారేపల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయిన ఘటన కారేపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన బాణోతు సంతోష్ పెట్రోల్ బంక్ పక్కనే భవన నిర్మాణ పనులను సూపర్వైజింగ్ చేస్తున్నాడు. కామేపల్లి గ్రామానికి చెందిన తేజావత్ రాము, దుబ్బతండా గ్రామానికి చెందిన తమ బంధువులు మౌనిక, అచ్చమ్మను ద్విచక్రవాహనంపై తీసుకొని కారేపల్లి వైపు వస్తున్నాడు. ఇదే క్రమంలో ఖమ్మం–కారేపల్లి ప్రధాన రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బాణోతు సంతోష్, తేజావత్ రాములు, మౌనిక, అచ్చమ్మలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్థానిక యువకులు ఆటోలో కారేపల్లి పీహెచ్సీకి తరలించారు. కాగా, వారిలో బాణోతు సంతోష్ తలకు తీవ్రగాయాలు కావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్కు ఫోన్ చేసినా.. ఎంతకు రాకపోవటంతో స్థానికులు కారులో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్(22) మృతి చెందాడు. -
కళ్లెదుటే కాటేసిన మృత్యువు
కన్ను తెరిస్తే జననం.. కనుమూస్తే మరణం... రెప్పపాటే మనిషి జీవితం అన్న కవి మాటలు అక్షర సత్యాలని నిరూపితమయ్యాయి. బతుకు తెరువు కోసం వలస వచ్చిన ఓ కార్మికుడు అందరూ చూస్తుండగానే అకాల మృత్యువాత పడ్డాడు. అప్పటి వరకూ తమ మధ్య చలోక్తులు విసురుతూ నవ్వుతూ.. నవ్వి స్తూ పనిచేసిన అభాగ్యుడిని మృత్యుపాశం నుంచి కాపాడేందుకు సహ కార్మికులు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదు. విద్యుత్ షాక్ నుంచి తప్పించుకున్నా.. విధి విసిరిన పాచిక బలీయమై.. ఇనుప చువ్వ రూపంలో మృత్యువు కబళించింది. నెత్తురోడుతున్న విగత శరీరమే చివరకు మిగిలింది. గుంతకల్లు టౌన్: ఉపాధి కోసం వచ్చిన యువకుడిని మృత్యువు కబళించింది. గుంతకల్లులో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా పైకానమ్ గ్రామానికి చెందిన సిద్దయ్య కుమారుడు గవిసిద్ద (19) బళ్లారి భరత్ సప్లయర్స్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గుంతకల్లు పట్టణంలోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపం ఆవరణలో రెండు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకల్లో షామియానా వేసి, ఇతర డెకరేషన్లు చేసేందుకు తోటి కూలీలతో కలిసి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కల్యాణ మండపం మెయిన్ గేట్ దిమ్మెపైకి ఎక్కి షామియానా పోల్(స్తంభాల)ను తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో షామియానా పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో పట్టుతప్పి నేరుగా గేట్ మీదకు పడ్డాడు. గేట్కు అమర్చిన ఇనుప చువ్వ ఛాతీభాగంలో గుచ్చుకుంది. రక్తస్రావంతో విలవిలలాడుతున్న గవిసిద్దను కాపాడటానికి తోటి కూలీలు శతవిధాలుగా ప్రయత్నించారు. బయటకు తీసేలోపే ఆ యువకుడు మరణించాడు. ఘటనా స్థలాన్ని అర్బన్ సీఐ రాజా, ఒన్టౌన్ ఎస్ఐ యు.వి.ప్రసాద్లు పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
తణుకు: డ్రైవింగ్లో అలసట.. కంటి మీ ద కునుకు లేకుండా చేసిన డ్రైవింగ్ ఒకరి ప్రాణాలను తీసింది.. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. తణుకు పట్టణ పరిధిలోని శర్మిష్ట సెంటర్లో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వాహనం తణుకు శర్మిష్ట సెంటర్ వద్ద రెండు వేర్వేరు మోటారు సైకిళ్లపై వెళుతున్న ముగ్గుర్ని ఢీకొట్టింది. పైడిపర్రు గ్రామానికి చెందిన బెల్లం కమీషన్ వ్యాపారులు పోతుల శ్రీను (54), పంగం సాంబశివరావు మోటారు సైకిల్పై బెల్లం మార్కెట్ నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. ఇదే సమయంలో పాతూరుకు చెందిన చలమలశెట్టి శ్రీనివాస్ మరో వాహనంపై తణుకు వైపు వెళుతున్నాడు. రెండు వాహనాలు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే వెళుతుండగా కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలను సుమారు 100 మీటర్లు మేర ఈడ్చుకెళ్లిపోవడంతో శరీరాలు నుజ్జయ్యాయి. పోతుల శ్రీను అక్కడిక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన సాంబశివరావు, శ్రీనివాసును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెల్లం కమీషన్ వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పో తుల శ్రీను, తీవ్ర గాయాలపాలైన పంగం సాంబశివరావు స్నేహితులు. పైడిపర్రు గ్రామానికి చెందిన వీరు వ్యాపారంలోనే కాకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరు బెల్లం కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు ఒకే మోటారుసైకిల్పై బెల్లం మార్కెట్ నుంచి ఇంటికి వెళుతుండగా అనుకోని రీతిలో దూసుకొచ్చిన బొలేరో ట్రక్కు వాహనం వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడిక్కడే మృతి చెందగా సాంబశివరావు రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తలకు కూడా బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రెండు కాళ్లు నుజ్జుకావడంతోపాటు ఎముకలు బయటకు రావడం చూపరులను కలచివేసింది. మృతుడు శ్రీనుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాంబశివరావుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో శ్రీనివాస్ తలకు బలమైన గాయాలు కావడంతోపాటు పక్కటెముకలు విరిగి పోయినట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వారంటున్నారు. పోలీసుల అదుపులో డ్రైవర్ గుంటూరు నుంచి కాకినాడకు బొలేరో ట్రక్కు వాహనంలో కూరగాయలు ఎగుమతి చేసి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కూరగాయల లోడుతో కాకినాడకు వెళ్లిన డ్రైవర్ పోపూరి మరియదాసు విశ్రాంతి లేకుండా తిరిగి గుంటూరు వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. నిద్ర వచ్చి రెప్ప వాల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ మరియదాసు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ తణుకు పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు. -
బైక్ బోల్తా...ఒకరి మృతి
సాక్షి, రామాపురం: వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం పొత్తుకూరిపల్లి సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో సంబేపల్లి మండలం పొట్టిరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నపరెడ్డి (60) మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన మహేష్కుమార్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
జల్లికట్టు పోటీల్లో విషాదం ఒకరు మృతి
-
కొత్తగూడెంలో లవ్ ట్రాజెడీ..
ఖమ్మం అర్బన్: ప్రేమికులు ముందు కారులో వెళ్తుండగా.. వెనుక అమ్మాయి తరఫున బంధువులు వెంటాడటం.. చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమే. ఇలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు– కొత్తగూడెం రోడ్డులో శనివారం చోటు చేసుకోగా.. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొని కారు డ్రైవర్ మృతి చెందాడు. ప్రేమికులతో పాటు స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని ఇల్లెందుకు చెందిన శ్రీపతి సుమన్ గాంధీ వాటర్ సప్లయ్ వ్యాపారం చేస్తున్నాడు. డిగ్రీ చదివే ఎండీ శహనా.. సుమన్ గాంధీ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో స్నేహితుల సహాయంతో వీరిద్దరు మహబూబాబాద్ జిల్లా అనంతారంలో వివాహం చేసుకున్నారు. శనివారం ఇల్లెందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబసభ్యుల నుంచి హాని ఉందని భావించిన వీరు అద్దెకారులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్నేహితులు తరుణ్, రవితో కలసి కొత్తగూడెం వైపు బయలు దేరారు. గమనించిన çశహనా కుటుంబ సభ్యులు మరో కారులో వీరి కారును వెంబడించారు. సినిమాల్లో ఛేజింగ్ సీన్ను తలపించేలా రెండు కార్లు వేగంగా కొత్తగూడెం వైపు దూసుకువెళ్లాయి. ఈ క్రమంలో వెనుక నుంచి ప్రేమికులు వెళ్తున్న కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. దీంతో డ్రైవర్ టేకులపల్లికి చెందిన ఎం. రాజు(23) కారును పక్కకు మళ్లించగా, వేగంగా వెళ్తూ చెట్టును ఢీ కొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో సుమన్ గాంధీ, శహనా, తరుణ్, ముత్యాల రవిలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో తరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమాను తలపించే ఛేజింగ్..విషాదం
-
ఖాజీపేట వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, ఖాజీపేట : అయ్యప్పస్వామి దీక్ష అనంతరం శబరిమల వెళ్ళి అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట హైవేపై పెట్రోలు బంకు సమీపంలో ఆదివారం తుఫాన్ వాహనం గేదెలను తప్పించబోయి పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా... వీరందరూ శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
రైలు పట్టాల పక్కనే మొండెం.. తల ఎక్కడ?
గూడూరు: గూడూరు–తిరుపతి మార్గంలో గాంధీనగర్ సమీపంలో తల లేని మొండెం రైలు పట్టాల పక్కనే పడి ఉంది. ఈ మేరకు స్థానికులు ఆదివారం గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరకుని మృత దేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కానీ రైలు పట్టాలను ఆనుకుని మొండెం పడి ఉండటం, ఆ ప్రాంతంలో ఎక్కడా తల కన్పించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్లలోపు ఉంటుందని, బులుగు రంగు నిక్కరు, గళ్ల లుంగీ, లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ మేరకు స్థానికులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మృతుడి తల కన్పిస్తుందేమోనని వెతికినా ఫలించలేదు. ఎవరైనా హత్య చేసి, అనుమానం రాకుండా రైలు పట్టాల వద్దకు తీసుకొచ్చి పడేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా! ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి ఇలా మృతి చెందాడా అన్న పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతికిగల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అజిత్సింగ్నగర్ హత్య కేసులో అరెస్టులు
విజయవాడ : నగరంలోని అజిత్సింగ్ నగర్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. షేక్ బాజి,కన్నా, శశికుమార్, మరో జువైనల్ను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ మద్యం మత్తులో కొంతమంది జులాయిల వల్ల ఈ హత్య సంఘటన జరిగిందని చెప్పారు. ఇందులో బ్లేడ్ బ్యాచ్ల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బహిర్భూమికి వెళ్లిన వెంకటేశ్వరరాజుపై నిందితులు దాడికి పాల్పడ్డారని, దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. నగరం పోలీస్ నిఘా నీడలో ఉందని, నగరంలో ఉన్న రౌడీ షీటర్స్, అనుమానితులకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వివరించారు. పిల్లల నడవడిక పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. -
అప్పులధికమై.. బతుకు భారమై..
జీవితంలో స్థిరపడేందుకు ఓ యువకుడు వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు... అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు.. కొన్నాళ్లు సాఫిగానే సాగిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి...వాటిని పూడ్చుకునేందుకు మళ్లీ అప్పులు చేశాడు.. ఇటు వ్యాపారంలో నష్టాలు.. అటు తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోతుండడంతో కలత చెందాడు. అధికమవుతున్న అప్పులు.. భారంగా మారుతున్న బతుకును ముందుకు సాగించలేక.. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మునుగోడులో శనివారం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు : నియోజకవర్గ కేంద్రానికి చెందిన మేడం వెంకన్న, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు చొప్పున కుమారులు, కుమార్తెలు సంతానం. వీరిలో చిన్నకుమారుడు మేడం నవీన్ (38) డిగ్రీ వరకు చదివాడు. కంప్యూటర్ విద్యను నేర్చుకుని ప్రైవేట్ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తునే మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ప్రైవేట్గాచాలీచాలని వేతనాలు ఇస్తుండడంతో కుటుంబ పోషణ నిమిత్తం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల క్రితం మండల కేంద్రంలోని కూల్డ్రింక్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఏజెన్సీకి రూ.10 లక్షలు, పెట్టుబడికి మరో రూ. 5 లక్షలు అప్పు చేశాడు. తల్లిదండ్రిని పడుకోమని చెప్పి.. సదరు కంపెనీ రద్దుచేసుకున్న ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలో తాత్సారం చేయడం.. ఇటు అప్పుల వారి ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు స్నేహితులతో గడిపిన నవీన్ అనంతరం తల్లిదండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటలకు వరకు వారితో ముచ్చటించి ఇక పడుకొండని చెప్పి బయటికి వెళ్లాడు. అనంతరం ఇంటిపైకి ఎక్కి ఎరువుల దుకాణంలో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. రాత్రి 10 గంటలైనా భర్త ఇంటికి రాకపొవడంతో పలుమార్లు అతనికి భార్య మహేశ్వరి పోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయం వరకు కన్పించకపొవడంతో చుట్టు పక్కలవారు గమనించగా ఇంటిపైనే మృతిచెంది ఉ న్నాడు. సమాచారం మేరకు ఎస్ఐ రాములు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పులబాధతో యువ వ్యాపారి మృతిచెందడంతో మునుగోడులో విషాదం అలుముకుం ది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఏజెన్సీని రద్దు చేసుకుని.. కొన్నాళ్లుగా బాగానే సాగిన వ్యాపారంలో క్రమ క్రమంగా నష్టాలు వచ్చాయి. బిజినెస్ను వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మళ్లీ అప్పు చేశాడు. అయినా వ్యాపారం బాగా సాగలేదు. తీసుకున్న అప్పుల భారం సుమారు రూ.20 లక్షలు దాటడడంతో తీవ్ర మనోవేదనచెందాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఏజెన్సీని రద్దు చేసుకుని వచ్చే రూ. 10 లక్షలతో కొంతైనా అప్పు తీర్చాలని అనుకున్నాడు. -
ఆంజనేయా.. ! ఆపలేదేమయ్యా..?
ఆ యువకుడికి ఆంజనేయ స్వామిపై అమిత భక్తి. రోజూ ఉదయమే గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటాడు. తన భార్యపై అమిత ప్రేమ. గర్భవతైన ఆమెను బంగారంలాగా చూసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ గుడిలోని ఆంజనేయుడిని దర్శించుకుని బయటికి రాగానే మదిలో భార్య మెదిలింది. ఆమెకు పండ్లు కొనుక్కుని వెళదామనుకున్నాడు. బైక్పై బయల్దేరాడు. లారీ ఢీకొంది. ప్రాణాలు కోల్పోయాడు. సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో శుక్రవారం ఉదయం యాష్ లారీ ఢీకొనడంతో యువకుడు రేవంత్ కుమార్ మృతిచెందాడు. పట్టణంలోని బొల్లేరుగూడేనికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భూక్యా శంకర్ కుమారుడు రేవంత్ కుమార్(27)కు ఆంజనేయ స్వామిపై అమిత భక్తి. బాపూజీ నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయానికి రోజూ వెళుతుంటాడు. శుక్రవారం ఉదయమే స్నానం చేసి 7.30 గంటలకు బైక్పై గుడికి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని బయటికొచ్చాడు. ఇతడికి ఎనిమిది నెలల కిందటే లావణ్యతో వివాహమైంది. ఆమె ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. ఆమెపై అతడికి ఎంత ప్రేమో! ఆమె కోసం పండ్లు తీసుకుని ఇంటికి వెళదామనుకున్నాడు. అంబేద్కర్ సెంటర్ నుంచి కేఎస్పీ రోడ్ వైపు 8.20 గంటల సమయంలో వెళుతున్నాడు. సబ్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి, కేటీపీఎస్ యాష్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొంది. తల పైనుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్పృహ కోల్పోయిన భార్య గతంలో కేటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుడిగా, ప్రయివేట్ కంపెనీ ఉద్యోగిగా పనిచేసిన రేవంత్.. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ప్రమాద స్థలంలో తండ్రి శంకర్ గుండె పగిలేలా రోదించాడు. రేవంత్ భార్య ఇంటి వద్దే స్పృహ కోల్పోయింది. ఎస్ఐ బి.రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తగూడ(ములుగు): అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్నెబోయిన దుర్గయ్య(32) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బీడీల కోసమని బయటకు వెళ్లాడు. బీడీలు తీసుకుని అత్తగారింటి వద్ద ఉంటున్న కుమారులను చూసేందుకని వెళుతున్నట్లు ఇరుగు,పొరుగు వారితో చెప్పుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దుర్గ య్య ఆచూకీ కోసం బంధువులు అన్ని చోట్లా వెతికారు. రోజులు గడుస్తున్నా ఏ సమాచారం తెలియకపోవడంతో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీ సులు విచారిస్తుండగానే సోమవారం జంగవానిగూడెం, ఎర్రవరం గ్రామాల మధ్య ఉన్న పాడుబడ్డ బావిలో కుళ్లిపోయిన శవం ఉండడాన్ని గమనించి స్థానికులు తెలిపింది. దుస్తుల ఆధారంగామృతుడు దుర్గయ్యగా గుర్తించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..? కన్నెబోయిన దుర్గయ్య(32)కు అదే గ్రామానికి చెందినమహిళతో14ఏళ్ల క్రితం వివాహం జరిగిం ది. ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళుగా దుర్గ య్య అతడి భార్య కు మధ్య గొడవలు జరుగుతున్నా యి. భార్య వివాహేత సంబంధం కలిగి ఉందని దుర్గయ్య ఫిర్యాదు చేయడంతో పలు సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా దుర్గయ్య నుంచి విడిపోయి పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉం టోంది. పిల్లలను చూసేందుకు రాత్రి వెళ్లిన దుర్గయ్యతో ఆమె గొడవపడి ఉంటుందని, మరి కొందరితో కలిసి దుర్గయ్యను హత్య చేసి బావిలో పడేసి ఉంటుందనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. లేక గొడవలతో విసిగిపోయిన దుర్గయ్యే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
ప్రాణం తీసిన అడ్డదారి
సోంపేట: జాతీయ రహదారిపై ఉన్న అడ్డదారి తమ జీవనాధారాన్ని దూరం చేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించుకోలేకపోయారు. ఒక్క నిమిషంలో ఇంటికి చేరుకోబోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కళ్లముందు జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబానికి తీవ్ర శోకం మిగిల్చింది. జాతీయ రహదారిపై కొర్లాం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రత్నాల మోహనరావు(45) మృతి చెందగా, బెహరా చరణ్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బారువ పోలీసులు, కొర్లాం గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కొర్లాం గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని రత్నాల మోహనరావు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. వారి ఇంటి నుంచి పలాస వైపు వెళ్లడానికి జాతీయ రహదారి మధ్యలో చిన్న తోవ ఉంది. ఆ తోవే అతని పాలిట మృత్యుదారి అయింది. రత్నాల మోహనరావుకు చెందిన షెడ్లో గొల్లవూరు గ్రామానికి చెందిన బెహరా చరణ్(20) మెకానిక్ షాపు పెట్టుకుని జీవనాధారం పొందుతున్నాడు. మోహనరావు, చరణ్ ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై పనులు నిమిత్తం శుక్రవారం ఉదయం పలాస వెళ్లారు. పలాస నుంచి తిరిగి వస్తూ, వారు జాతీయ రహదారిపై ఉన్న అడ్డదారిలో రత్నాల మోహనరావు ఇంటికి చేరుకోబోతుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళుతున్న కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మోహనరావుకు, చరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటీన 108లో బారువ సామాజిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మోహనరావును బరంపురం, చరణ్ను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మోహనరావు బరంపురం వెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కొర్లాం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మోహనరావుకు భార్య అరుణ, కుమారుడు మధు(22), కుమార్తె హారిత(19) ఉన్నారు. మోహనరావు మృతితో వారు తీవ్రంగా రోదిస్తున్నారు. చరణ్కు తీవ్ర గాయాలయ్యాయని తెలియడంతో అతని తల్లి ఊర్మిల తీవ్రంగా రోదిస్తుంది. చరణ్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నట్టు గొల్లవూరు గ్రామస్తులు తెలిపారు. -
టీ స్టాల్ పోర్టికో కూలి యజమాని మృతి
గుంటూరు రూరల్: ప్రమాదవశాత్తూ టీస్టాల్ వెల్లుడు (పోర్టికో) కూలి యజమాని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు...గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడికట్టు గ్రామానికి చెందిన పాలడుకు రామకృష్ణ(28) తండ్రి రామదాసుతో కలసి ఐదేళ్ల కిందట గుంటూరుకు కుటుంబంతో సహా వలస వచ్చారు. గోరంట్ల గ్రామంలో అద్దెకు ఇంటిని తీసుకుని మిర్చి యార్డు సమీపంలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతడికి మూడేళ్ల కిందట ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కుందనపల్లికి చెందిన ఆదిలక్ష్మితో వివాహమైంది. ఏడాదిన్నర వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భార్య గర్భిణి. రెండు సంవత్సరాల కిందట మిర్చి యార్డు విస్తరణలో భాగంగా హోటల్ తీసేయాల్సి రావడంతో గోరంట్ల శివారుల్లోని సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని శ్రీమహాబోధి పేరుతో టీస్టాల్ను నిర్వహిస్తున్నాడు. గత రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదవశాత్తూ హోటల్ వెల్లుడు ఒక్కసారిగా కూలి రామకృష్ణపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి రోడ్డుపాలయ్యామని, ఇక తామెందుకు బతకాలంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరుల్ని కంటతడి పెట్టించింది. -
సొంతూరికి వెళ్లి వస్తుండగా..
నందిపాడు(దుత్తలూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనచోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని నందిపాడు వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు..వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి కి చెందిన వీరాంజనేయులు(24) నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. మోటారుసైకిల్పై సొంతూరికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నందిపాడు వద్ద బద్వేల్ నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొనడంతో వీరాంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడ్ని ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దుత్తలూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక) : రోడ్డు దాటుతున్న వృద్ధ దంపతులను లారీ ఢీ కొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా వృద్ధురాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి సుమారు 9.30 గంటల ప్రాంతంలో నేరెళ్ల కృష్ణయ్య (70), నర్సయమ్మ (60) తుంగ్లాంలో ఉంటున్న కుమారుడు సోంబాబు, నాతయ్యపాలెంలో ఉంటున్న కుమార్తె రమణమ్మ, అక్కిరెడ్డిపాలెంలో ఉంటున్న మంగమ్మలను చూడటానికి వారి స్వస్థలం తగరపువలస సమీపంలోని గ్రామం నుంచి వచ్చారు. అక్కిరెడ్డిపాలెంలో ఉన్న కుమార్తె వద్దకు సాయంత్రం వచ్చి నాతయ్యపాలెంలో ఉన్న కుమార్తెను చూడటానికి అక్కిరెడ్డిపాలెం బస్టాప్ ఎదురుగా నాతయ్యపాలెం వైపు గ్రీనరీ కోసం నిర్మిస్తున్న రెండు గోడలను దాటి రోడ్డు దాటుతున్నారు. గ్రీనరీ దాటిన ఇద్దరు వృద్ధులు ఒక్కసారిగా రోడ్డు మధ్యలోకి వచ్చిన తర్వాత గాజువాక నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న లారీ వీరిరువురిపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు మాసం ముద్దగా మారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వృద్ధురాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కుమార్తె రమణమ్మ తల్లిదండ్రుల మరణవార్త విని కన్నీరుమున్నీరుగా విలపించింది. గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దామరచర్ల (మిర్యాలగూడ) : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్ఐ రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం రాగడప గ్రామపంచాయతీ పరిధిలోని కుంకుడు చెట్టు తండా కు చెందిన పర్శా్య(38) కొంతకాలంగా మండలంలో ని బొత్తలపాలెంలోని ఓ రైతుకు చెందిన బత్తాయితోటలో పని చేస్తున్నాడు. మంగవారం రాత్రి వ్యక్తిగత పనిమీద దామరచర్లకు వచ్ -
అతి వేగం.. అతి నిర్లక్ష్యం!
♦ గుంతలో పడి ద్విచక్రవాహనదారుడి మృతి ♦ మరో ఇద్దరికి తీవ్రగాయాలు.. ♦ గుంత వద్ద ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భూగర్భ రహదారి (సబ్ వే) గుంతలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పడి ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్ల వారుజామున 2.30 గంటల సమయంలో హయత్నగర్ వైపు నుంచి ఎల్బీనగర్ సాగర్ రింగ్రోడ్డువైపు సీబీజెడ్ మోటారుసైకిల్ (ఏపీ 29 ఏపీ 5910)పై వెళుతున్న బడంగ్పేట గాంధీనగర్కు చెందిన యువకులు కే.రాఘవేందర్ (23), ఈ.అశోక్ (23), ఎల్.సాయికిరణ్ (22)లు చింతలకుంట చెక్పోస్ట్ సమీపంలో ఓపెన్ హౌజ్ బార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న సబ్ వే 20 అడుగుల గుంతలో ప్రమాదవశాత్తు వాహనంతో సహా పడిపోయారు. దీంతో వాహనం నడుపుతున్న రాఘవేందర్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, అశోక్, సాయికిరణ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అశోక్, సాయికిరణ్లను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన రాఘవేందర్ ప్రైవేటు ఉద్యోగి. అతనికి వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద సబ్ వే నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో భారీగా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపినమేర బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరువైపులా వాహనాలు వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు మధ్యలో రాత్రివేళ పనులు జరుగుతుండడంతో వారి వాహనాలు రావడానికి కొంతమేర బారికేడ్లను తొలగించారు. అయితే, దీనికి సంబంధించి ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రివేళ బైక్పై వేగంగా వచ్చిన రాఘవేందర్, అతని స్నేహితులు రోడ్డు మధ్యలో బారికేడ్ల సందు నుంచి నేరుగా వెళ్లి గుంతలో పడిపోయారు. యువకుల అతివేగం, నిర్మాణం పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇంటికి వెళ్తూ మృత్యువాత
– లారీ ఢీకొని ఒకరు మృతి– మరొకరికి గాయాలు ఎమ్మిగనూరురూరల్: పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఒకరు మృత్యువాత పడగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని రైస్ మిల్లు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె భీమక్క, వడ్డె వెంకటేశ్వర్లు కుమారుడు వడ్డె శివకుమార్(16) పట్టణంలో స్కూటర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం పనులు ముగించుకొని సెల్షాప్లో పనిచేసే తమ గ్రామానికి చెందిన జిలాన్బాషాతో కలిసి స్కూటర్పై గ్రామానికి బయలుదేరారు. పట్టణం దాటిన తరువాత రైస్ మిల్లు దగ్గర స్కూటర్ను నిలిపి మూత్ర విసర్జన చేసి స్కూటర్ను స్టార్ట్ చేస్తుండగా కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటర్ పక్కన నిల్చున్న జిలాన్బాషాకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని చూసి.. అటుగా వెళ్తున్న వారు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో రక్తపు మడుగులో పడివున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మృతదేహన్ని పోస్టుమార్టుం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
-
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
పశ్చిమగోదావరి: జిల్లాలోని పెంటపాడు మండలంలోని ఆలంపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
ఎయిర్పోర్టులో ఆత్మాహుతి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధానిలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒకరు మృతి చెందారు. ఢాకా అధికారుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని దుండగుడు ఆత్మాహుతి దాడికి సిద్ధమై ఎయిర్పోర్టు వద్దకు వచ్చాడు. విమాశాశ్రయంలోని ఓ చెక్ పాయింట్ వద్ద భద్రతా బలగాలు ఓ అనుమానితుడిని గుర్తించాయి. దాదాపు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ దుండగుడు పోలీసుల చెక్ పాయింట్ సమీపంలో ఓ బాంబు అమర్చాడు. ఆ బాంబు పేల్చుకుని ఆ వ్యక్తి చనిపోయాడని రుహుల్ అమిన్ అనే అధికారి వెల్లడించారు. వారం రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ లో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల ఓ మిలిటెంట్ బైక్పై ఎయిర్పోర్టు చెక్ పాయింట్ సమీపానికి రాగానే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. ఢాకాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔటర్ రింగ్రోడ్డుపై మరో ప్రమాదం
-
ట్రాక్టర్-బైక్ ఢీ: ఒకరు మృతి
కృష్ణా: జిల్లాలోని చాట్రాయి మండలం మంకొల్లు వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
ఆటో బోల్తా: ఒకరు మృతి
గుంటూరు: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లి దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామం నుంచి దుర్గి బయల్దేరిన ఆటో గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
నెల్లూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలకలం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని మనుబోలులో స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. షేక్ ఇమామ్బాషా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ లక్షణాలతో ఈరోజు ఉదయం మృతి చెందాడు. -
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
-
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
హైదరాబాద్: హయత్నగర్లో దారుణం చోటుచేసుకుంది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా షాపతను వినియోగదారుడు రాజేష్కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో షాపు ఓనర్తో రాజేష్కు వివాదం తలెత్తింది. షాపు యాజమని, అతని స్నేహితులు కలిసి రాజేష్పై దాడిచేసి అతడిని విపరీతంగా కొట్టారు. దెబ్బలు తాళలేక రాజేష్ రోడ్డుమీదకు పరుగుతీశాడు. రోడ్డు దాటే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వైన్ఫ్లూతో మరొకరు మృతి
చిలకలగూడ: గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్ఫ్లూ మృతి నమోదయింది. బేగంపేటకు చెందిన అరుషి అనే రెండేళ్ల చిన్నారి ఈ నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా, ఈ నెలలో స్వైన్ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది. -
కేసీఆర్ టూర్లో పోలీసుల అత్యుత్సాహం
-
కేసీఆర్ టూర్లో పోలీసుల అత్యుత్సాహం
సూర్యాపేట: సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఖమ్మం పర్యటనకు వెళ్తూ మార్గం మధ్యలో సూర్యాపేటలోని మంత్రి జగదీష్ ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఆ ఇంటి పక్కనే ఉన్న ఆస్పత్రికి స్థానిక శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన సోమా లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని మధ్యాహ్నం 12 గంటల సమయంలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. సీఎం వచ్చారంటూ ఆస్పత్రిలోకి వెళ్లడానికి తమను పోలీసులు అనుమతించకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని లక్ష్మమ్మ భర్త ఆరోపిస్తున్నారు. ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా ఆమె గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. -
ఇద్దరు విద్యార్థుల ఘర్షణ: ఒకరి మృతి
చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక చుండ్రుగొండ జడ్పీ పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందారు. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో తంబళ్ల భానుప్రకాశ్(15) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో భానుప్రకాశ్, మరో విద్యార్థి ఘర్షణ పడ్డారని తరగతికి వెళ్లిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టుకున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణలో మర్మావయవాలపై తీవ్రంగా దెబ్బ తగలడంతో భానుప్రకాశ్ తరగతిలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. -
గాంధీలో స్వైన్ఫ్లూ లక్షణాలతో ఒకరి మృతి
హైదరాబాద్: స్వైన్ఫ్లూ లక్షణాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురు స్వైన్ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(32) చలిజ్వరంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. స్వైన్ఫ్లూ లక్షణాలతో పీఐసీయు వార్డులో ముగ్గురు చిన్నారు లు, డిజాస్టర్వార్డులో మరో ముగ్గురి నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షల కు పంపి, వైద్యం అందిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ జేవీరెడ్డి తెలిపారు. గాంధీలో భయాందోళనలు...: స్వైన్ఫ్లూ విజృభించడం, గడిచిన 23 రోజుల్లో గాంధీలో ఐదుగురు మృతిచెందడంతో రోగులు, రోగి సహాయకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలున్న వారితోపాటు స్వైన్ఫ్లూ రోగుల వార్డులో విధులు నిర్వహించేందుకు సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవాలని వైద్యులు, సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, సిబ్బంది, వైద్యులు, వైద్య విద్యార్థులు మాస్క్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. -
మేడ్చల్లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఆర్టీసీ డిపో వద్ద 44 వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ టిప్పర్ అదుపుతప్పి రెండు ఆటోలను, ఓ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ శ్మశాన వాటిక ప్రహరీగోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
హైదరాబాద్: ఎల్బీనగర్లోని డీమార్ట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న సతీష్(22) అనే యువకుడిని ఏలూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ భయంతో బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి డ్రైవర్ను హయత్నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన కారు.. ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా): కంచికచర్ల మండలం పరిటాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిని కారు ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బహిర్భూమికి వెళ్లిన ఉప్పులూరి ప్రసాద్(37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..కారులో ఉన్న నలుగురికి కూడా గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదసమయంలో కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. -
లారీని ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి
శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం లట్టిగామ్ సమీపంలో శనివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 15 మంది గాయాలపాలయ్యారు. నందిగామ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఒక ప్రయాణికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హైదరాబాద్: బైక్ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హయత్నగర్ మండలం కొహెడలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, బైక్ను ఢీకొనగా సిద్ధయ్య అనే వ్యక్తి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లి: టీడీపీ నేత వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని దేవతానగర్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. టీడీపీ ఎమ్మెల్సీ నరేష్కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్ని ఢీకొట్టిన లారీ : ఒకరి మృతి
-
బైక్ను ఢీకొన్న లారీ: యువకుడి మృతి
బూర్గంపాడు(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న రాయల దుర్గ(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కలవారు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు విజయనగర్ కాలనీ వాసిగా గుర్తించారు.