ఆటోలు ఢీ: ఒకరి మృతి | two autos collided in Jangaon one died | Sakshi

ఆటోలు ఢీ: ఒకరి మృతి

Published Fri, Oct 21 2016 5:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

ఆటోలు ఢీ: ఒకరి మృతి - Sakshi

ఆటోలు ఢీ: ఒకరి మృతి

జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి.

జనగామ : జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చంపక్‌హిల్స్ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద శుక్రవారం రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కార్మికులు ఆటోలో సీతాఫలం పండ్లను తీసుకొస్తున్న క్రమంలో జనగామ వైపు వెళ్తున్న మరో ప్రయాణికుల ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో కొన్నెకు చెందిన తేలు రాజు(25) అనే కార్మికుడు మృతిచెందాడు. శంకరయ్య, రాకేష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 12మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement