లారీని ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి | lorry rams into bus, one died | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి

Published Sat, Dec 17 2016 8:10 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

lorry rams into bus, one died

శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం లట్టిగామ్ సమీపంలో శనివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 15 మంది గాయాలపాలయ్యారు. నందిగామ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఒక ప్రయాణికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement