తూర్పుగోదావరి (పెద్దాపురం) : పెద్దాపురంలోని జవహర్లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయంలో శుక్రవారం కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరికి చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయి.