
సాకి, శ్రీకాకుళం: అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 317వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అడవిరాంపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొత్త రోడ్ జంక్షన్ మీదుగా రాగోలు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 316వ రోజు ముగిసింది. శుక్రవారం ఉదయం ఫరీదు పేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కుశాలపురం, బైపాస్ జంక్షన్, పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్, గుజరాతి పేట, నాగావళి ఓల్డ్ బ్రిడ్జ్ మీదుగా శ్రీకాకుళం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు శనివారం 8.1 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,461.1 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment